Pages

Labels

Popular Posts

Tuesday 11 September 2012

ఫాస్ట్ ఫుడ్-మన ఆరోగ్యము అవగాహన , Fast foods and health awareness


పండ్లు , కాయగూరలు ,గింజలు, పప్పులు , కందమూలాలు ,సుగంధద్రవ్యాలు మానవుడికి ప్రక్రుతి ప్రసాదించిన అపురూపమైన వరము .ఆయా సీజన్లలో పండే పండ్లను ఆరగించడం మనకు తరతరాలు గా తెలుసును . అన్నం తో కూడా ప్రకృతిసిద్ధమైన పండ్లు , కూరగాయలు ఇతర త్రునధన్యాలను ఆహారం గా ఆహారముగా తీసుకుని జీవించినట్లయితే శరీరానికి కావససిన అన్నిరకాల పోషకాలు లభిస్తాయి ... ఇదే అసలు ఉత్తమమైన జీవన విధానమని పకృతి వైద్యుల నమ్మకం.....ఆహారం జీవం ఉన్న ప్రతి జీవికి అత్యవసరమైనది. పిండిపదార్ధాలు, మాంసకృత్తులు, కొవ్వుపదార్ధాలు, ఖనిజలవణాలు, పీచుపదార్ధాలు, రోగనిరోధక శక్తికి కావలసిన విటమిన్లు మరియు శరీర పోషణకు రక్షణకు కావలసిన పదార్ధాలను కలిగిన పదార్దాలను ఆహారంగా పేర్కొనవచ్చు. ఇవి కాక శరీరానికి నూతన ఉత్సాహాన్నిచ్చే కాఫీ, టీ లాంటి వాటిని కూడా ఆహారపదార్ధాల కోవలోకి వస్తాయి. ఆహారం ఘన, ద్రవ రూపాలలో లభ్యం అవుతుంది.



సృష్టిలోని అన్ని సంపదలకన్నా ఆరోగ్యంగా జీవించడమే అసలైన సంపద. ఆర్ధికంగా ఎంత ఉన్నత స్థితిలో ఉన్నా ఆరోగ్యం ఉన్నతంగా

లేనప్పుడు ఆ సంపద ఉన్నా లేనట్లే. ఉన్నవారికీ, లేనివారికీ కావలసిన ఏకైక సంపద ఆరోగ్యం మాత్రమే. అందుకే ఆరోగ్యమే మహాభాగ్యం

అన్నారు. ఆహారం విషయంలో మనం ఉండాల్సినంత జాగ్రత్తగా ఉంటున్నామో లేదో ఎప్పటికప్పుడు చెక్ చేసుకోవాలి. ఎత్తుకు తగ్గ

బరువుతో బలంగా, శక్తిగా ఉన్నామో లేదో చూసుకోవాలి. బరువు ఎక్కువై, ఊబకాయం తెచ్చుకుంటే ఎంత కష్టమో, తక్కువై బలహీనంగా

ఉన్నా అంతే కష్టం. కనుక సమతుల్యతను కాపాడుకోవాలి. ఆహారంలో ఉండే పోషకాలు శక్తిని విడుదల చేస్తాయి. ఏదైనా అనారోగ్యంతో

బాధపడుతుంటేనో, లేక హార్మోన్ల అపసవ్యత చోటుచేసుకుంటేనో తప్పించి సాధారణంగా మనం తీసుకున్న ఆహారాన్ని బట్టి బరువులో

హెచ్చుతగ్గులు ఉంటాయి.

ఆరోగ్య పరిరక్షణలో భాగంగా ఆహార నియమాలను పాటించాలి. తీసుకున్న ఆహారం సవ్యంగా జీర్ణమయ్యేందుకు కొంత వ్యాయామం

తప్పనిసరి. లేకుంటే బరువు విపరీతంగా పెరిగిపోతుంటుంది. కొవ్వు నిల్వలు చేరతాయి. శరీరానికి అవసరమైన శక్తి సరిగా విడుదల

కాదు. దాంతో బరువు తగ్గించుకోడానికి నానా యాతనా పడాలి. అవసరమైన కంటే ఎక్కువ ఆహారం ఎలా మంచిది కాదో, తక్కువ

తినడమూ శ్రేయస్కరం కాదు. శరీరం శుష్కించుకు పోయి, నీరసం ముంచుకొస్తుంటుంది. ఏ పనిమీదా శ్రద్ధాసక్తులు ఉండవు. ఈ దశ

ముదిరితే అసలు జీవితం మీదే ఆసక్తి నశిస్తుంది. కనుక ఏవిధంగా చూసినా ఆరోగ్యకరమైన ఆహారాన్ని తీసుకునేందుకు ప్రణాళిక

వేసుకోవాలి.
మనలో చాలామంది చేసే తప్పు ఏమిటంటే, ఆహారం రుచిగా ఉంటె సరిపోతుంది అనుకుంటాం. కానీ ఆహారం శుచిగా ఉండటం అంతకంటే

ముఖ్యం. పరిశుభ్రంగా లేని పదార్ధాల వల్ల లేనిపోని జబ్బులొస్తాయి. అలాగే నిలవున్న పదార్ధాలు విషతుల్యం అయ్యి, ఫుడ్ పాయిజన్

గా మారే ప్రమాదం ఉంది. ఇక ముఖ్యమైన అంశం ఆహారంలో పోషక విలువలు ఉండాలి. కింది కనీస జాగ్రత్తలు పాటించాలి.
1. ప్రోటీన్లు ఉండే ఆహారం తీసుకోవడంవల్ల శరీరానికి అవసరమైన విటమిన్లు, మినరల్సు అందుతాయి.
2. వీలైనంతవరకు ఫాస్ట్ ఫుడ్స్ తీసుకోకపోవడం మంచిది.
3. రుచికి, చూపులకు బాగుంటుంది కదాని పోలిష్ పట్టిన తెల్లటి బియ్యాన్ని వాడతాం. కానీ దంపుడు బియ్యపు అన్నం ఎంతో శ్రేష్టం.
4. అన్నం కంటే ఎక్కువగా కూరలను తినడం మంచిది.
5.ఆయా సీజన్లలో దొరికే పండ్లను సేవిస్తుండాలి.
6. నీళ్ళు బాగా తాగాలి. రోజుకు నాలుగు లీటర్లకు తక్కువ కాకుండా తాగితే మంచిది.
7. ఎక్కువ నీళ్ళు తాగి, తరచుగా యూరిన్ పాస్ చేయడంవల్ల శరీరంలో చోటు చేసుకున్న మలినాలు చాలావరకూ వెళ్ళిపోతాయి.


ఫాస్ట్ ఫుడ్ అనేది చాలా త్వరగా తయారు చేసి వడ్డించగల ఆహారానికి పేరు. తక్కువ తయారీ సమయం తీసుకునే ఎలాంటి భోజనమైనా

ఫాస్ట్ ఫుడ్ అనుకోవచ్చు, కానీ సామాన్యంగా ఈ పదాన్ని ఒక రెస్టారెంట్ లేదా మునుపే వేడిచేసిన లేదా వండిన పదార్థాల దుకాణంలో

అమ్మబడే ఆహారాన్ని సూచిస్తుంది, మరియు ఇది వినియోగదారుడికి టేక్-అవుట్/టేక్-అవే గా ప్యాక్ చేసి ఇవ్వబడుతుంది. ఈ పదం

"ఫాస్ట్ ఫుడ్" అనేది ఒక నిఘంటువులో మెరియం–వెబ్‌స్టెర్‌చే 1951లో గుర్తింపబడింది.

అమ్మే దుకాణాలు నీడ లేదా కూర్చునే సదుపాయం లేని స్టాండ్లు లేదా బట్టీలు ఇంగ్లీష్ లో ఫాస్ట్ ఫుడ్ రెస్టారెంట్లు అని పిలుస్తారు.
బర్గర్‌, పిజ్జా, వేపుడు దినుసులు, కోలా పానీయాలు, మనిషి శరీరానికి ఎక్కువ కేలరీలు కొవ్వును అందించి ప్రమాదం

తెచ్చిపెడుతున్నాయి. హామ్‌బర్గ్‌ర్‌లో 300 కేలరీలు, కొవ్వు 10 గ్రాములు వుంటుంది.మిరియం కలిపిన పిజ్జాలో 180 కేలరీలు, 7

గ్రాముల కొవ్వు వుంటుంది. 340 మిల్లీలీటర్ల కోకోకోలాలో 158 కేలరీలు, మేక్‌ డోనాల్డ్‌ సారాలో 210 కేలరీలు వుంటాయి. ఇది

ప్రమాదకరం. మిరపకాయ బజ్జీలు, పానీపూరీ, చాట్ ,ఇడ్లీ, దోసె, సమోసా, పకోడా, వంటివి అంతగా హానికారకాలుకాని ఫాస్ట్‌ఫుడ్స్‌

క్రిందలెక్క.

భారత దేశానికి వచ్చినట్లైతే ఒక టిఫెన్‌లో 1 ఇడ్లీకి 70 కేలరీలు, 0.2 గ్రాముల కొవ్వు, 1 దోశలో 140 కేలరీలు 5 గ్రాముల కొవ్వు,

సమోసా పేకెట్‌లో 370 కేలరీలు, 18 గ్రాముల కొవ్వు వుంటుంది. ఒక గ్లాసు లస్సీలో 140 కేలరీలు 2 గ్రాముల కొవ్వు వుంటుంది.

ఇలా ఎన్నయినా ఉదాహరణలు ఇవ్వవచ్చు.

ఆరోగ్య సమస్యలు
మెడికల్ సొసైటీ కమిటీ ఆన్ న్యూట్రిషన్ ప్రకారం, ప్రత్యేకంగా ఫాస్ట్ ఫుడ్ క్రొవ్వు పరిమాణం ఎక్కువగా కలిగి ఉంటుంది, ఫాస్ట్ ఫుడ్

తీసుకోవడానికీ - శరీర ద్రవ్యరాశి సూచిక (BMI) మరియు బరువు పెరగడానికీ దగ్గరి సంబంధం ఉంది. "ఫాస్ట్ ఫుడ్ తీసుకోవడం

వలన కెలొరీ గ్రహణం పెరుగుతుంది, బరువు పెరగడం ఎక్కువవుతుంది, మరియు మధుమేహం వచ్చే అవకాశం పెరుగుతుంది".


క్రొవ్వు ఆమ్లాలు, ఎక్కువ కెలోరీలు మరియు తక్కువ పీచుపదార్థం , మరొక ఆరోగ్యపరమైన హాని, ఆహారం కలుషితం కావడం. ఆహారం

కలుషితమయ్యే హాని జరగడానికి అవకాశం ఎక్కువ. మాంసంతో ఎరువులు కలవడం వలన, అది సాల్మొనెల్ల మరియు ఎస్కేరిచియా కోలి

0157:H7 లతో కలుషితమవుతుంది. E. కోలి 0157:H7 అనేది అతి హీనమైన ఆహార కాలుష్యాల్లో ఒకటి. సామాన్యంగా వండని

హాంబర్గర్ల ద్వారా వ్యాప్తి చెందుతుంది, మరియు దీనికి చికిత్స కష్టం. వ్యాధినిరోధకాలు సూక్ష్మక్రిములను నిర్మూలించినప్పటికీ, అవి

హానికర క్లిష్టతలను ఉత్పన్నం చేసే విషపూరిత పదార్థాన్ని విడుదల చేస్తాయి. E. కోలి 0157:H7 కలిగిన వారిలో సుమారు 4%

హేమోలిటిక్ యూరెమిక్ సిండ్రోం లక్షణాలు చూపుతారు, మరియు ఈ సిండ్రోం వృద్ది అయిన వారిలో 5% పిల్లలు మరణిస్తారు. E. కోలి

0157:H7 అనేది అమెరికన్ పిల్లలలో మూత్రపిండాల వైఫల్యానికి ప్రధాన కారణం అయింది.


మొత్తం జనాభాలో రోజుకు సుమారు 30.3% మంది ఫాస్ట్ ఫుడ్ తిన్నట్టూ తెలిసింది. ఫాస్ట్-ఫుడ్ తీసుకోవడం పురుషులు మరియు

స్త్రీలు, అన్ని జాతులు/తెగల సమూహాలు, మరియు దేశంలోని అన్ని ప్రాంతాల్లోనూ ఉంది. ఫాస్ట్ ఫుడ్ తీసుకున్న పిల్లలు, తీసుకోని

వారితో పోల్చినపుడు, మరింత మొత్తం క్రొవ్వు, కార్బోహైడ్రేట్లు, మరియు పంచదారచే-తియ్యనైన పానీయాలు తీసుకుంటున్నారని

తెలిసింది. ఫాస్ట్ ఫుడ్ తిన్న పిల్లలు పీచు పదార్ధం, పాలు, పళ్ళు, మరియు స్టార్చ్ లేని కూరగాయలను తక్కువగా తీసుకుంటారని కూడా

తెలిసింది. పరిశోధకులు ఈ పరీక్షా ఫలితాలను సమీక్షించిన తరువాత, పిల్లలు ఫాస్ట్ ఫుడ్ తింటే, అది వ్యక్తిగత ఆహారంపై చెడు ప్రభావం

చూపి, ఊబకాయం యొక్క అపాయాన్ని గణనీయంగా పెంచుతుందని నిశ్చయించారు.

పాస్ట్ ఫుడ్స్ చేసేవారు వాటి పోషక విలువల సమాచారం తెలియజేయడంలో బాధ్యతా రహితమైనవి మరియు మోసం చేస్తున్నాయని

మనము తెలుసుకోవాలి. ఇది ఒక వ్యసనమంగా మారినది.

పిల్లలు-ఫాస్ట్‌ ఫుడ్స్‌

సాధారణంగా రోజూ ఒకేరకమైన ఆహార పదార్థాలు తినీ, తినీ విసుగుచెంది, ఫాస్ట్‌ ఫుడ్స్‌పై మక్కువ చూపిస్తుంటారు పిల్లలు. ఫాస్ట్‌ ఫుడ్స్‌

తినేటప్పుడు బాగానే ఉంటాయి కానీ, పిల్లలు వీటికి అలవాటు పడ్డారంటే భవిష్యత్తులో ఎన్నో సమస్యలను ఎదుర్కో వాల్సి వస్తుంది . .

బేకరీలు, ఫాస్ట్‌ ఫుడ్స్‌ సెంటర్లలో లభించే చిప్స్‌, సమోసాలు ,పేస్ట్రీలు లాంటి పధార్థాలు పిల్లల నోటికి రుచిగా అన్పించి పదే పదే వాటిని

తినేందుకు ఇష్టపడతారు. ఇలా వారు రోజూ ఫాస్ట్‌ ఫుడ్స్‌ తీసుకోవడం వల్ల, అవి వారి జీర్ణ వ్యవస్థపై ప్రతికూల ప్రభావాన్ని కలుగజేసి,

అనేక అనర్థాలకు దారి తీస్తాయి . ఈ ఫాస్ట్‌ ఫుడ్స్‌కు అలవాటు పడిన పిల్లలు తరచూ అనారోగ్య సమస్యలకు గుర వడమే కాక, వారిలో

క్రమేణా ఊబకాయం వచ్చే అవకాశం కూడా ఉంటుంది . డీప్‌ ఫ్రై చేసే పదార్థాలలో ట్రాన్స్‌ ఫ్యాటీ యాసిడ్లు అధికంగా ఉంటాయనీ, వాటి

శాతం శరీరంలో అధి కమైతే భవిష్యత్తులో గుండెపోటు రావడం కూడా ఖాయం. ఫాస్ట్‌ ఫుడ్స్‌ అప్పుడప్పుడు తీసుకుంటే ఫర్వాలేదు కానీ

అదేపనిగా రోజూ తినకూడదు .ఫాస్ట్‌ ఫుడ్స్‌ కంటే పిల్ల లకు సీజనల్‌గా వచ్చే పండ్లనన్నింటినీ పిల్లలకు పెడితే మంచి పోషకవిలు వలు

చేకూరి, అన్నిట్లో చురుకుగా ఉంటారని పేర్కొంటున్నారు వారు. రోజూ క్రమం తప్పక లంచ్‌, డిన్నర్‌ తర్వాత ఒక అరటిపండును

తీసుకోవడం ఎంతో మంచిదని, ఫాస్ట్‌ ఫుడ్స్‌ కంటే పండ్లే మంచి ఆహారము .

ఈ లెక్కల్ని పరిశీలించి ప్రజలు ఇకనైనా ముతక ధాన్యాల పదార్థాల్ని సజ్జ, రాగి, పొట్టు గోధుమలు, దంపుడు బియ్యం, మొలకెత్తిన

పెసలు, శనగలు, తినడం నేర్చుకుంటే శరీర ఆరోగ్యానికి ఏ ఢోకా వుండదు. ''ఫాస్ట్‌ఫుడ్స్‌కు వీడ్కోలు, దేశీయ ముతక ధాన్యాల

పదార్థాలకు స్వాగతం''
  • ======================
Visit my Website - Dr.Seshagirirao...


కోలా పానీయాలు-మన ఆరోగ్యము ,Cola drinks and our health



పండ్లు , కాయగూరలు ,గింజలు, పప్పులు , కందమూలాలు ,సుగంధద్రవ్యాలు మానవుడికి ప్రక్రుతి ప్రసాదించిన అపురూపమైన వరము .ఆయా సీజన్లలో పండే పండ్లను ఆరగించడం మనకు తరతరాలు గా తెలుసును . అన్నం తో కూడా ప్రకృతిసిద్ధమైన పండ్లు , కూరగాయలు ఇతర త్రునధన్యాలను ఆహారం గా ఆహారముగా తీసుకుని జీవించినట్లయితే శరీరానికి కావససిన అన్నిరకాల పోషకాలు లభిస్తాయి ... ఇదే అసలు ఉత్తమమైన జీవన విధానమని పకృతి వైద్యుల నమ్మకం.....ఆహారం జీవం ఉన్న ప్రతి జీవికి అత్యవసరమైనది. పిండిపదార్ధాలు, మాంసకృత్తులు, కొవ్వుపదార్ధాలు, ఖనిజలవణాలు, పీచుపదార్ధాలు, రోగనిరోధక శక్తికి కావలసిన విటమిన్లు మరియు శరీర పోషణకు రక్షణకు కావలసిన పదార్ధాలను కలిగిన పదార్దాలను ఆహారంగా పేర్కొనవచ్చు. ఇవి కాక శరీరానికి నూతన ఉత్సాహాన్నిచ్చే కాఫీ, టీ లాంటి వాటిని కూడా ఆహారపదార్ధాల కోవలోకి వస్తాయి. ఆహారం ఘన, ద్రవ రూపాలలో లభ్యం అవుతుంది.
  • సుప్రసిద్ధ కూల్ డ్రింక్ బ్రాండ్ కోకొ-కోలా తన 125 వ ఏడాదిలోకి అడుగుపెట్టింది.మొదట శక్తినిచ్చే పానీయంగా. తర్వాత కాలక్రమంలో కూల్ డ్రింక్ గా విశేష ప్రాచుర్యం పొందిన కోక్............కోక ఆకులూ కోక గింజలతో తయారు చెయ్యడం వల్ల ఈ పేరు వచ్చింది.అట్లాంటాకు చెందిన వ్యాపారవేత్త ఆసా గ్రిగ్స్ 1888 లో షుమారు లక్ష రూపాయలు వెచ్చించి కోకో కోలా బ్రాండ్ ను కొనుగోలు చేసాడు. ప్రారంబంలో రూపొందించిన రేసిపీతో నే ఇప్పటికీ కోక్ తాయారు చేస్తున్నారు.ఈ ఫార్ములాను కంపెని అత్యంత రహస్యంగా కాపాడుతుంది.రెసిపి ఫార్ములాను మొత్తం కంపెనీలో ఇద్దరికీ మాత్రమే తెలుపుతుంది.వారిద్దరూ ఏకకాలంలో విమాన ప్రయాణాలు,కలిసితిరగడం పూర్తిగా నిషిద్దం ఏదైనా ప్రమాదం జరిగినా కనీసం ఒక్కరైన బతికి బట్టకట్టాలని కంపెని ఉద్దేశ్యం.ఫార్ములా రహస్య పత్రాల ఒకేఒక కాపీని అట్లాంటా లోని ఓ బ్యాంకు లో భద్రపరిచారు.

ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా 1200 కోక్ బాట్లింగ్ కేంద్రాలు పనిచేస్తున్నాయి.కోక్ ప్రారంబమైన ఏడు దశాబ్దాల తర్వాత కాని కొత్త ఫ్లేవర్ డ్రింకులు ప్రారంభం కాలేదు.కంపెని తొలిరోజుల్లో రోజుకు తొమ్మిది గ్లాసుల పానీయం అమ్ముడు పోతే ఇప్పుడు రోజుకు 170 కోట్ల డ్రింకులు అమ్ముడుపోతున్నాయి.ప్రస్తతం కంపెని నుంచి 500 బ్రాండ్ లతో 3300 రకాల పానీయాలు తయారు ఆవుతున్నాయి.చైనా బాషలో కోకో అంటే "నోటిని ఆనందంగా ఉంచేది"అని అర్ధం.ప్రపంచంలో ఉన్న మొత్తం కోక్ బాటిళ్ళను ఒక దాని తర్వాత ఒకటిగా పేర్చుకుంటూ వెళితే 1677 సార్లు భూమికి చంద్రుడికి మద్య తిరిగినంత దూరం ఉంటుంది.. ప్రపంచం మొత్తం మీద ఓ కే అనే పదం తర్వాత కోక కోలా నే ఎక్కువమందికి పరిచయం ఉన్న పేరు.ఇప్పటివరకు కోక్ నాలుగు లక్షల కోట్లు బాటిళ్ళు తాయారు చేసింది.కంపెని కేవలం సిరప్ మాత్రమే తాయారు చేస్తుంది.దాన్నిబాట్లర్స్ కు పంపితే వాళ్ళు మిగతా పదార్ధాలను కలిపి విక్రయిస్తారు.

  • కోక్, పెప్సి, 7 అప్, మిరిండా, ఫాంటా, తమ్స్ అప్, లిమ్కా, మరియు స్ప్రైట్. భారతదేశములో తయారయిన పెప్సి యొక్క సీతాల పానీయాలు.
భారతేదేశములో శీతల పానీయాల మార్కెట్ కు ఎటువంటి నియంత్రణ లేదు. 1954 నాటి ఆహార కల్తి చట్టంలో శీతల పానీయాలు చేర్చబడిలేదు. ఆగుస్ట్ 2003కు ముందు అమలులో ఉన్న BIS నియమాలలో శీతల పానీయాలలో పురుగుమందు ఎంత మేరకు ఉండవచ్చో అని ఎటువంటి నియమాలు లేవు. అయితే పురుగుమను ఎంత మేరకు ఉండవచ్చని వివిధ సంస్థలు కొన్ని నియమాలను రూపొందించాయి. తాగే నీళ్ళలో గరిష్టంగా 0.1 పార్ట్స్ పెర్ బిలియన్ వరకు పురుగుమందులు ఉండవచ్చని, అలగైతేనే అవి మనుషులకు హాని ఉండదని స్పష్టం చేసాయి. ఆల్డ్రిన్, డయల్డిన్, హేప్టాక్లోర్ ఎపోక్సైడ్ వంటి పురుగుమందులకు ఇంకా తక్కువగా అనగా గరిష్టంగా 0.1 పార్ట్స్ పెర్ బిలియన్ వరకు మాత్రమె ఉండవచ్చు.

  • జాగ్రత్తలు :
శీతల పానీయాలు విషపూరితమనీ, వాటిని తాగడం వల్ల ఆరోగ్యాలు పూర్తిగా దెబ్బతింటాయని మనము తెలుసుకోవాలి ,దానివల్ల కేన్సర్‌, కాలేయం, మూత్రపిండాలు, జీర్ణాశయానికి సంబంధించిన వ్యాధులు సంభవిస్తాయని గుర్తించాలి .

విదేశీ కంపెనీలచే తయారై మన దేశ ప్రజల ఆర్థిక, ఆరోగ్య నష్టాలు, కష్టాలకు శీతల పానీయాలు కారణమవుతున్నాయని జెవివి రాష్ట్ర వ్యవస్థాపక సభ్యులు డా.వి.బ్రహ్మారెడ్డి ఆందోళన వ్యక్తం చేశారు. డా.బ్రహ్మారెడ్డి మాట్లాడుతూ కూల్‌డ్రింక్స్‌ తాగడం వలన ఎవరికి లాభమని ప్రశ్నించారు. విదేశీ శీతల పానీయాలు ఎందుకు తాగకూడదో అనే అంశానికి బలమైన శాస్ర్తీయ ఆధారాలు మనముందు ఉన్నాయన్నారు. కాగా సినీతారలు, క్రీడాకారులు కోట్ల రూపాయలు పారితోషకంగా తీసుకుంటూ కూల్‌డ్రింక్స్‌ను తాగమని ప్రచారం నిర్వహించడం స్వార్థపూరితమేగాక బాధ్యతారాహిత్యమన్నారు.


రాష్ట్ర ప్రభుత్వ సంస్థ అయిన ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ప్రివెంటీవ్‌ మెడిసిన్‌(ఐపిఎం) వారు థమ్స్‌అప్‌, లిమ్కా, పానీయాల నమూనాలను సేకరించి మైక్రో బయోలజి పరీక్షలు జరిపి అందులో రకరకాల రోగాలు తెచ్చే బ్యాక్టీరియా మోతాదుకు మించి చాలా ఎక్కువగా ఉందని తేల్చి చెప్పారన్నారు. శీతల పానీయాలు తయారు చేసే సంస్థలు వాటిని రవాణా చేసే విషయంలో, నెలల తరబడి నిల్వ చేసే సమయంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో పట్టించుకోవడం లేదన్నారు. దీని వల్ల బ్యాక్టీరియా సులువుగా వృద్ధి చెందుతుందన్నారు. శీతల పానీయాలకు వాడే రంగులు కూడా మోతాదు పరిమితులకు లోబడి వాడాలని, లేనిపక్షంలో అనారోగ్య కారకాలు వృద్ధి చెందుతాయన్నారు. కేరళలోని పాలక్కాడ్‌ జిల్లాలో ప్లాచిమడలో ఉన్న కోకో కోలా కంపెనీ విసిరి పారేస్తున్న వ్యర్థ పదార్థాలలో క్యాన్సర్‌ కారకమైన కాడ్మియం అనే లోహ అవశేషాలు అధిక మొత్తంలో అంటే 201.8 మిల్లీ గ్రాములు ఉన్నట్లు తేలిందన్నారు.


జెవివి జిల్లా ప్రధానకార్యదర్శి సి.యాగంటీశ్వరప్ప మాట్లాడుతూ పిహెచ్‌ విలువ ప్రకారం కూల్‌డ్రింక్స్‌ టాయిలెట్‌ క్లీనింగ్‌ యాసిడ్స్‌ కన్నా గాఢమైనవన్నారు. మన పార్లమెంటులో వీటిని నిషేధించారని, కొన్ని యూనివర్శిటీలలో వాడడం లేదన్నారు. ప్రకటనల ద్వారా పెప్సీ, కోక్‌ కంపెనీలు ప్రజలకు తప్పుడు సంకేతాలను అందిస్తున్నాయని ఆరోపించారు. శీతల పానీయాల వల్ల మధుమేహం, ఊబకాయం, ఎముకలు గుల్లబారడం వంటి జబ్బులు రావచ్చని నిపులైన వైద్యులు చెబుతున్నారన్నారు.


కొన్ని కోలా పానీయాలు, మరియు చాక్ లెట్లు ఈ ఎసిడిటీని ఇంకా ఎక్కువ చేస్తాయని మరచిపోవద్దు. కనుక కూల్ డ్రింక్స్ ఇతర చిరుతిళ్ళు తగ్గించండి.

కోలా పానీయాలు, రసాయనపూరితాలు, అయినా అందరి దృష్టి ఎక్కువ వీటిపైనే వుంటుంది. స్లో పాయిజన్‌ లాంటి ఈ తరహా పదార్థాలు పానీయాలు, ఎక్కువగా తీసుకుంటే కోరి అనారోగ్యాన్ని కొని తెచ్చుకోవడమే అవుతుంది.

బీర్, కోలా వంటి కార్బోనేటేడ్ పానీయాలు కూడా గ్యాస్ కి కారణం.

  • కోలాతో క్లీనింగ్ :
కూల్‌డ్రింక్ అనగానే కోలా సీసాలు కళ్ల ముందు కదలాడుతుంటాయి. కోలా బాటిల్ దొరగ్గానే తాగేయడం కాకుండా దాంతో బోలెడు పనులు చేసుకోవచ్చు. మొండి మరకల్ని వదలగొట్టడంలో కోలా తనకు తానే సాటి అంటోంది.

వంటింట్లో మాడిన వంటసామాన్లు త్వరగా శుభ్రం కావు. అలాంటి పాత్రలో అర కప్పు కోలా వేసి ఓ పదినిమిషాల తర్వాత కడిగితే పాత్రకి పట్టుకున్న మాడు వెంటనే వదిలిపోతుంది. అలాగే స్టీలు సామాన్లపై పేరుకుపోయిన తుప్పు మరకల్ని కూడా కోలా ఇట్టే తొలగిస్తుంది. ఎక్కడైతే తుప్పు మరకలు ఉంటాయో...అక్కడ ఐదారు చుక్కల కోలా పోసి ఓ పావుగంట తర్వాత స్పాంజ్‌తో గట్టిగా తుడిస్తే వెంటనే తుప్పు మరకలు పోతాయి. అలాగే బాత్‌రూమ్‌లలో వాడే టబ్బులు సున్నం మరకలతో ఉంటాయి.

అలాంటి మరకల్ని కూడా కోలా ఇట్టే పోగొడుతుంది. టబ్బులపై కోలా నీళ్లు చల్లి పదినిమిషాల తర్వాత బ్రష్‌తో రుద్దితే కొత్త టబ్బుల్లా తయారవుతాయి. సన్నటి దుమ్ము పట్టిన గాజు అద్దాలను కూడా కోలాతో శుభ్రం చేసుకోవచ్చు. ఒక మగ్గులో ఒక కప్పు కోలా, రెండు కప్పుల నీళ్లు పోసి అందులో బట్టని ముంచి గట్టిగా పిండి ఆ బట్టతో అద్దాలను తుడిస్తే తళతళలాడుతాయి. ఇవన్నీ ఒకెత్తయితే...బట్టలపై ఉండే మరకలు మరింత ఇబ్బంది పెడుతుంటాయి. ముఖ్యంగా నూనె మరకలు.

కొన్నిసార్లు రక్తపు మరకలు కూడా పోవు. ఈ రెంటికీ కోలా మంచి డిటర్జెంట్‌గా ఉపయోగపడుతుంది. బట్టల్ని నానబెట్టేముందు డిజర్జెంట్ నీళ్లలో రెండు కప్పుల కోలా కూడా పోయాలి. లేదంటే వాషింగ్ మిషన్‌లో వేసినా పరవాలేదు. నూనె, రక్తపు మరకలు త్వరగా వదిలిపోతాయి. కేవలం తాగడం కోసమే అనుకునే కోకో కోలా వల్ల ఇన్ని ప్రయోజనాలు ఉన్నాయని తెలియక చాలామంది బాటిల్ దొరగ్గానే పూర్తిగా తాగేస్తారు. ఈసారి కొద్దిగా కోలాని మిగిల్చి క్లీనింగ్‌కి వాడి చూడండి.
  • ======================
Visit my Website - Dr.Seshagirirao...