Pages

Labels

Popular Posts

Thursday 18 July 2013

పరుగు--ఆహారము , Food for running exercise


  •  







  •  


పండ్లు , కాయగూరలు ,గింజలు, పప్పులు , కందమూలాలు ,సుగంధద్రవ్యాలు మానవుడికి ప్రక్రుతి ప్రసాదించిన అపురూపమైన వరము .ఆయా సీజన్లలో పండే పండ్లను ఆరగించడం మనకు తరతరాలు గా తెలుసును . అన్నం తో కూడా ప్రకృతిసిద్ధమైన పండ్లు , కూరగాయలు ఇతర త్రునధన్యాలను ఆహారం గా ఆహారముగా తీసుకుని జీవించినట్లయితే శరీరానికి కావససిన అన్నిరకాల పోషకాలు లభిస్తాయి ... ఇదే అసలు ఉత్తమమైన జీవన విధానమని పకృతి వైద్యుల నమ్మకం.....ఆహారం జీవం ఉన్న ప్రతి జీవికి అత్యవసరమైనది. పిండిపదార్ధాలు, మాంసకృత్తులు, కొవ్వుపదార్ధాలు, ఖనిజలవణాలు, పీచుపదార్ధాలు, రోగనిరోధక శక్తికి కావలసిన విటమిన్లు మరియు శరీర పోషణకు రక్షణకు కావలసిన పదార్ధాలను కలిగిన పదార్దాలను ఆహారంగా పేర్కొనవచ్చు. ఇవి కాక శరీరానికి నూతన ఉత్సాహాన్నిచ్చే కాఫీ, టీ లాంటి వాటిని కూడా ఆహారపదార్ధాల కోవలోకి వస్తాయి. ఆహారం ఘన, ద్రవ రూపాలలో లభ్యం అవుతుంది.





పరుగుకి సరితూగే వ్యాయామం మరొకటి లేదు. రోజూ కొద్ది నిమిషాల పరుగుతో ఎన్నో రకాల రోగాల్ని దూరం చేసుకోవచ్చు. అయితే రన్నర్లు ఆహారంలో కింది వాటిని తప్పనిసరిగా

ఉండేలా చూసుకోవాలి .


  •  బాదం: వీటిలో యాంటీ ఆక్సిడెంట్‌ అయిన విటమిన్‌ 'ఇ' ఉంటుంది. ఇది కీళ్ల నొప్పుల్ని దూరం చేస్తుంది. బాదంలో ఉండే ప్రొటీన్‌, ఫైబర్లు పరుగు సమయంలో ఆకలి తెలియకుండా

    సాయపడతాయి. రోజూ పిడికెడు చొప్పున వారంలో అయిదు రోజులపాటు బాదం తినాలి. 



  • ఆరెంజ్‌: పరుగుతీసేవారు రోజూ ఒక కమలా లేదా 200మి.లీ. రసం తాగడం మరిచిపోకూడదు. కమలాలో ఉండే 'సి' విటమిన్‌ కండరాల అరుగుదలను నివారిస్తుంది. అంతేకాదు దీన్లోని

    ఇనుము నిల్వలవల్ల అలసట, నీరసం దూరమవుతాయి. 





  • చిలగడ దుంపలు: పరుగెత్తేటపుడు చెమటతో పాటు పొటాషియం, మెగ్నీషియం వంటి ఖనిజలవణాలు కూడా శరీరంనుంచి బయటకుపోతాయి. చిలగడ దుంపల్లో ఈ ఖనిజలవణాల

    నిల్వలు అధికస్థాయిలో ఉంటాయి. వారంలో మూడురోజులు ఈ దుంపల్ని తీసుకోవాలి.





  •  చేపలు: మిగతా వ్యాయామాలు చేసేవారితో పోల్చితే రన్నర్లకి(రోజూ 60-90 గ్రాములు) రెట్టింపు ప్రొటీన్లు అవసరమవుతాయి. వారంలో రెండ్రోజులు చేపల్ని ఆహారంలో తీసుకోవడంద్వారా

    వీరు తమకు అవసరమయ్యే ప్రొటీన్లను పొందొచ్చు. చేపలోని ఒమేగా-3 ఫ్యాటీ ఆమ్లాలు గుండె ఆరోగ్యాన్ని పెంచుతాయి కూడా.

    శాఖాహారులు మీల్ మేకర్ వంటి సోయాపోటీన్‌ ఉన్న పదార్ధాలు , అటువంటి ఆహారము తీసుకుంటే సరిపోతుంది . పప్పులు , చిక్కుడు గింజలు తో కూడిన ఆహారము తినాలి .



  • ============================================


Visit my Website - Dr.Seshagirirao

అడ్డసరము , Adhatoda vasica or Justicia adhatoda


  •  





  •  




పండ్లు , కాయగూరలు ,గింజలు, పప్పులు , కందమూలాలు ,సుగంధద్రవ్యాలు మానవుడికి ప్రక్రుతి ప్రసాదించిన అపురూపమైన వరము .ఆయా సీజన్లలో పండే పండ్లను ఆరగించడం మనకు తరతరాలు గా తెలుసును . అన్నం తో కూడా ప్రకృతిసిద్ధమైన పండ్లు , కూరగాయలు ఇతర త్రునధన్యాలను ఆహారం గా ఆహారముగా తీసుకుని జీవించినట్లయితే శరీరానికి కావససిన అన్నిరకాల పోషకాలు లభిస్తాయి ... ఇదే అసలు ఉత్తమమైన జీవన విధానమని పకృతి వైద్యుల నమ్మకం.....ఆహారం జీవం ఉన్న ప్రతి జీవికి అత్యవసరమైనది. పిండిపదార్ధాలు, మాంసకృత్తులు, కొవ్వుపదార్ధాలు, ఖనిజలవణాలు, పీచుపదార్ధాలు, రోగనిరోధక శక్తికి కావలసిన విటమిన్లు మరియు శరీర పోషణకు రక్షణకు కావలసిన పదార్ధాలను కలిగిన పదార్దాలను ఆహారంగా పేర్కొనవచ్చు. ఇవి కాక శరీరానికి నూతన ఉత్సాహాన్నిచ్చే కాఫీ, టీ లాంటి వాటిని కూడా ఆహారపదార్ధాల కోవలోకి వస్తాయి. ఆహారం ఘన, ద్రవ రూపాలలో లభ్యం అవుతుంది.




  •  అడ్డసరము ,


 ఈ మొక్కను మలబార్ నట్ ట్రీ, అడూస అని కూడా పిలుస్తారు. దీని శాస్ర్తీయ నామం అడహతోడ వాసికా నీస్. అడ్డసరం పొలం గట్ల మీద 1-4 మీటర్ల ఎత్తువరకు పెరిగే బహువార్షిక పొద.

ఈ మొక్కు సామాన్య పత్రాలు కణుపునకు రెండు చొప్పున అభిముఖంగా అమరివుండి పొడవుగా, దీర్ఘవృత్తాకారంలో దళసరిగా, పెళుసుగా ఉంటాయి. ఆకర్షనీయమైన తెల్లని పూలు

గుత్తులు గుత్తులుగా పూస్తాయి. .



దీని ఆకులు, పుష్పాలు, వేర్లు, బెరడును ఔషధాల్లో విరివిగా వాడతారు. అడ్డసరం మొక్కలో వాసిసిన్, అఢతోడిక్ ఆమ్లం, సుగంధ తైలం ఉంటాయి.

దగ్గు, ఆయాసం నివారణకు అడ్డసరం ఆకులు, వేర్లు అత్యంత ఉపయుక్తమయినవి. దీర్ఘకాలంగా దగ్గుతో బాధపడే వారు, ఊపిరి అందక ఆయాస పడేవారు వేరు కషాయంలో కొద్ది పంచారం

చేర్చి 15 మి.లీ చొప్పున రోజుకు మూడుసార్లు తీసుకుంటే ఉపశమనం కలుగుతుంది.



 అడ్డసరం పుష్పాలను సుఖవ్యాధుల నివారణ కు వాడతారు.



ఈ మొక్కలోని అన్నిభాగాలు నులి పురుగులను నివారిస్తాయి.
ఉబ్బసం ఉపశమానికి కూడా ఇది ఉపయోగపడుతుంది.



అడ్డసరం ఆకుల కషాయం రోజుకు మూడుసార్లు సేవిస్తే రక్త విరేచనాలు, వాంతిలో రక్తం పడడటం, మొండి జ్వరాలు తగ్గుతాయి.



గోరువెచ్చని ఆకు కషాయం చర్మానికి పూస్తే తామర, దురద, గజ్జి, దద్దుర్లు తదితర చర్మవ్యాధులు, చర్మదోషములందు అడ్డసరము(వైద్యమాత)కషాయము ను త్రాగించిన తగ్గుతాయి.



నరముల రోగహరములు, పట్లు, నొప్పులు హరించును .
నీళ్ళవిరేచనములు కట్టును .
నేత్రరోగహరము గా పనిచేయును .

అడ్డసరము ఆకులను దగ్గుకు,ఉబ్బసానికి, రక్త శ్రావ లోపాలకు, చర్మ వ్యాధులకు మందుగా వాడతారు. 


  • =================================


Visit my Website - Dr.Seshagirirao

Wednesday 3 July 2013

Brown rice , ముడి బియ్యము


  •  












పండ్లు , కాయగూరలు ,గింజలు, పప్పులు , కందమూలాలు ,సుగంధద్రవ్యాలు మానవుడికి ప్రక్రుతి ప్రసాదించిన అపురూపమైన వరము .ఆయా సీజన్లలో పండే పండ్లను ఆరగించడం మనకు తరతరాలు గా తెలుసును . అన్నం తో కూడా ప్రకృతిసిద్ధమైన పండ్లు , కూరగాయలు ఇతర త్రునధన్యాలను ఆహారం గా ఆహారముగా తీసుకుని జీవించినట్లయితే శరీరానికి కావససిన అన్నిరకాల పోషకాలు లభిస్తాయి ... ఇదే అసలు ఉత్తమమైన జీవన విధానమని పకృతి వైద్యుల నమ్మకం.....ఆహారం జీవం ఉన్న ప్రతి జీవికి అత్యవసరమైనది. పిండిపదార్ధాలు, మాంసకృత్తులు, కొవ్వుపదార్ధాలు, ఖనిజలవణాలు, పీచుపదార్ధాలు, రోగనిరోధక శక్తికి కావలసిన విటమిన్లు మరియు శరీర పోషణకు రక్షణకు కావలసిన పదార్ధాలను కలిగిన పదార్దాలను ఆహారంగా పేర్కొనవచ్చు. ఇవి కాక శరీరానికి నూతన ఉత్సాహాన్నిచ్చే కాఫీ, టీ లాంటి వాటిని కూడా ఆహారపదార్ధాల కోవలోకి వస్తాయి. ఆహారం ఘన, ద్రవ రూపాలలో లభ్యం అవుతుంది.




  • Brown rice , ముడి బియ్యము


 దక్షిణ భారతదేశంలో ప్రధానంగా ఆంధ్రదేశంలో సాధారణంగా అందరూ తినే ముఖ్యమైన ఆహారం అన్నం. ప్రతి రోజూ తినే అన్నం గురించి, దానికోసం వాడే బియ్యం గురించి ఆలోచించం మనం. అంటే దానిలోని పోషక విలువల గురించీ ఆలోచించం. సాధారనంగా అందరూ ఆలోచించేది అన్నం అందంగా, తెల్లగా, విడివిడిలాడుతూ కనబడుతోందా లేదా అని మాత్రమే. అయితే కంటికి ఇంపుగా అన్నాన్ని తయారుచేస్తే అందులో ఉన్న పోషక విలువలు పోతున్నాయి. బ్రౌన్ రైస్ (దంపుడు బియ్యం)తో వండిన అన్నం కంటికి ఇంపుగా ఉండదు.కానీ ఒంటికి మాత్రం ఖచ్చితంగా మంచిది. బియ్యాన్ని పాలిష్ చేసి, ఆకర్షణీయంగా చేసే పద్ధతిలో అందులోని జీవ పదార్ధం, ఆరోగ్య రక్షణకి ఎంతగానో అవసరమైన బీ-కాంప్లెక్స్ విటమిన్లు పోతున్నాయి. అయితే కావాలని కోరుకున్నా, ఇప్పుడు పట్టణాలలో దంపుడు బియ్యం కనపడ్డం కష్టం. పాలిష్ చెయ్యని గోధుమలతో తయారైన బ్రౌన్ బ్రెడ్ మాత్రం దొరుకుతోంది. దాని విలువని ప్రజలు గుర్తిస్తున్నారు.

పెద్ద ప్రేగు క్యాన్సర్ నుండి రక్షణ కల్పిస్తుంది గోధుమరంగు బియ్యంలో ఉన్న సెలీనియం పెద్ద ప్రేగు క్యాన్సర్ వచ్చే అవకాశాలను తగ్గిస్తుందని తెలుస్తుంది. బియ్యంలో పెద్ద మొత్తంలో ఉన్న పీచు జీర్ణవాహికలో క్యాన్సర్ కారక రసాయనాల బయటకు పంపుతుంది, ఈ రకంగా పెద్ద ప్రేగు క్యాన్సర్ నుండి కాపాడుతుంది.

రొమ్ము క్యాన్సర్ వచ్చే అవకాశాలను తగ్గిస్తుంది గోధుమ రంగు బియ్యంలో ఉండే ఫైటోన్యూట్రిఎంట్ లిగ్నాన్ రొమ్ము క్యాన్సర్, గుండెజబ్బులను అడ్డుకోవడంలో సహయపడుతుంది. వయసు మళ్ళిన మహిళలపై జరిపిన అధ్యయనంలో బ్రౌన్ రైస్ వంటి ధాన్యాహారాన్ని తినడం వలన ఎంటరోల్యాక్టోన్ స్థాయిని పెంచుతుందని, దీని వలన రొమ్ము క్యాన్సర్ వచ్చే అవకాశాలు తక్కువని తెలుస్తుంది.

కొలెస్ట్రాల్ ను తగ్గిస్తుంది బ్రౌన్ రైస్ ఊకలో లభ్యమయ్యే నూనె కొలెస్ట్రాల్ ను తగ్గిస్తుందని పేరు పొందింది. బ్రౌన్ రైస్ లో ఉండే పీచు కూడా ఎల్ డి ఎల్ కొలెస్ట్రాల్ ను తగ్గిస్తుంది.

గుండె జబ్బుల నుండి రక్షిస్తుంది పీచు సమృద్ధిగా ఉండటం వలన బ్రౌన్ రైస్ గుండె జబ్బులు వచ్చే అవకాశాలను తగ్గిస్తుంది. టె౦పుల్ విశ్వవిద్యాలయంలోని పరిశోధకులు బ్రౌన్ రైస్ తిన్నందున రక్తపోటును తగ్గించటంతో పాటుగా ధమనులలో ఫలకం చేరే స్థాయిని తగ్గించి, గుండె జబ్బులు వృద్ది చెందకుండా కాపాడుతుందని కనుగొన్నారు.

శరీర బరువును సాధారణంగా ఉంచుతుంది బ్రౌన్ రైస్ లో పీచు సమృద్ధిగా ఉన్నందున, మీరు అదనపు క్యాలరీలు తీసుకోకుండా చూడటమే కాక ఎక్కువసేపు నిండుగా ఉన్నట్లుగా అనిపించేట్టుగా చేసి ఎక్కువగా తినే అవకాశాలను తగ్గిస్తుంది. హార్వర్డ్ పరిశోధకుల అధ్యయనాలలో తేలిందేమిటంటే పీచు ఎక్కువగా ఉండే బియ్యం తినే మహిళల శరీర బరువు దాదాపుగా సాధారణంగా ఉంటుంది.

మలబద్దకాన్ని నివారిస్తుంది పీచు సమృద్ధిగా ఉన్నందున జీర్ణవ్యవస్థకు బ్రౌన్ రైస్ ఎంతో ప్రయోజనకారి. ఇది ప్రేగులలో ఆరోగ్యకర కదలికలను ప్రోత్సహించి మలబద్దకాన్ని నివారిస్తుంది.

రక్తంలో చక్కరను నియంత్రిస్తుంది బ్రౌన్ రైస్ లో ఉన్న పీచు రక్తంలో చక్కర స్థాయిని నియంత్రించి టైపు 2 రకం డయాబెటిస్ ను నిర్వహించడంలో సహాయం చేస్తుంది.

ఎముకల ఆరోగ్యాన్ని వృద్ధి చేస్తుంది ఎముకల ఆరోగ్యాన్ని నిర్వహించడానికి అవసరమైన మెగ్నీషియం బ్రౌన్ రైస్ లో సమృద్ధిగా ఉంది. ఒక కప్పు బ్రౌన్ రైస్ లో దాదాపు 21% మెగ్నీషియం దొరుకుతుంది. మెగ్నీషియం ఎముకల ఆరోగ్యానికి, వేరొక అత్యవసర పోషకం కాల్షియంను గ్రహించడానికి కూడా అవసరం.

ఉబ్బసం లక్షణాలను తగ్గిస్తుంది బ్రౌన్ రైస్ లో మెగ్నీషియం సమృద్ధిగా ఉన్నందున, ఉబ్బసం వచ్చే లక్షణాలను తగ్గించడంలో సహాయం చేస్తుంది. అనేక అధ్యయనాలలో తేలిందేమిటంటే బ్రౌన్ రైస్ లోని మెగ్నీషియం ఉబ్బసంతో బాధపడే వారిలో దాని తీవ్రతను తగ్గిస్తుంది. బ్రౌన్ రైస్ లోని సెలీనియం కూడా ఉబ్బసానికి వ్యతిరేకంగా పనిచేస్తుంది.

పిత్తాశయంలో రాళ్ళు ఏర్పడే అవకాశాలను తగ్గిస్తుంది ఒక అమెరికా పత్రికలో జీర్ణాశయాంతర వైద్య శాస్త్రంపై ప్రచురించిన అధ్యయనం ప్రకారం బ్రౌన్ రైస్ వంటి కరగని పీచు ఎక్కువగా ఉండే ఆహారపదార్థాలు స్త్రీలలో పిత్తాశయంలో రాళ్ళు ఏర్పడే అవకాశాలను తగ్గించడంలో సహాయం చేస్తాయని తేలింది.

ఆరోగ్యకరమైన నాడీవ్యవస్థను నిర్వహిస్తుంది బ్రౌన్ రైస్ లో ఆరోగ్యకరమైన నాడీవ్యవస్థ కు అవసరమైన మాంగనీసు సమృద్ధిగా ఉంది. ఈ పోషకం కొవ్వు ఆమ్లాలు సంశ్లేషణ, కొలెస్ట్రాల్ ఉత్పత్తి చేయడం ద్వారా సెక్స్ హార్మోనుల ఉత్పత్తికి కూడా సహాయ పడుతుంది.

ఆహార అవసరాలు ఒక రోజుకు 3 సార్లు ధాన్యాహారం తీసుకోనవలసినదిగా సిఫార్సు చేయబడింది. ప్రతి ½ కప్పు బ్రౌన్ రైస్ ఈ మూడు కప్పులకు సమానం, కాబట్టి బ్రౌన్ రైస్ తినడం మీ రోజువారీ పోషకాహార అవసరాలను తీర్చేందుకు మంచి మార్గమౌతుంది.

Brown rice or also known as ‘hulled rice' is the least processed form of rice. It has only the outermost layer or hull removed, but still retains its outer, brown-colored bran layer that gives it a light brown color, nutty flavor, and chewy texture.



  • ===================


Visit my Website - Dr.Seshagirirao...

Tuesday 2 July 2013

Nuts good for health,గింజపప్పులు ఆరోగ్యానికి ఎంతో మంచిది


  •  







  •  


పండ్లు , కాయగూరలు ,గింజలు, పప్పులు , కందమూలాలు ,సుగంధద్రవ్యాలు మానవుడికి ప్రక్రుతి ప్రసాదించిన అపురూపమైన వరము .ఆయా సీజన్లలో పండే పండ్లను ఆరగించడం మనకు తరతరాలు గా తెలుసును . అన్నం తో కూడా ప్రకృతిసిద్ధమైన పండ్లు , కూరగాయలు ఇతర త్రునధన్యాలను ఆహారం గా ఆహారముగా తీసుకుని జీవించినట్లయితే శరీరానికి కావససిన అన్నిరకాల పోషకాలు లభిస్తాయి ... ఇదే అసలు ఉత్తమమైన జీవన విధానమని పకృతి వైద్యుల నమ్మకం.....ఆహారం జీవం ఉన్న ప్రతి జీవికి అత్యవసరమైనది. పిండిపదార్ధాలు, మాంసకృత్తులు, కొవ్వుపదార్ధాలు, ఖనిజలవణాలు, పీచుపదార్ధాలు, రోగనిరోధక శక్తికి కావలసిన విటమిన్లు మరియు శరీర పోషణకు రక్షణకు కావలసిన పదార్ధాలను కలిగిన పదార్దాలను ఆహారంగా పేర్కొనవచ్చు. ఇవి కాక శరీరానికి నూతన ఉత్సాహాన్నిచ్చే కాఫీ, టీ లాంటి వాటిని కూడా ఆహారపదార్ధాల కోవలోకి వస్తాయి. ఆహారం ఘన, ద్రవ రూపాలలో లభ్యం అవుతుంది.



Nuts are good for health,గింజపప్పులు ఆరోగ్యానికి ఎంతో మంచిది

గింజపప్పులను (నట్స్‌) తరచుగా తినటం ఆరోగ్యానికి ఎంతో మంచిది. వీటిల్లో యాంటీఆక్సిడెంట్లు, విటమిన్లు, ఖనిజాలు దండిగా ఉంటాయి. బాదం, జీడిపప్పు, పిస్తా, అక్రోటు (వాల్‌నట్‌), వేరుశనగపప్పుల్లోని అసంతృప్తకొవ్వులు గుండె ఆరోగ్యానికి దోహదం చేస్తాయి. చేపలతో లభించే ఒమేగా 3 కొవ్వు ఆమ్లాలు కూడా వీటిల్లో ఉంటాయి. కొలెస్ట్రాల్‌ ఉండదు. గింజపప్పులు ఎంత ఆరోగ్యకరమైనవైనా మితంగానే తినాలి. రోజుకి ఆరేడు కన్నా (వారానికి 30 గ్రాములు) మించకుండా చూసుకోవాలి. అప్పుడే వీటితో కలిగే ప్రయోజనాలు అందుతాయి. గింజపప్పుల్లో ఖనిజాలతో ఏయే పోషకాలుంటాయో, వాటితో ఎలాంటి లాభాలున్నాయో, ఎలా తినాలో చూద్దాం.

* అసంతృప్త కొవ్వులు: ఇవి చెడ్డ కొలెస్ట్రాల్‌ (ఎల్‌డీఎల్‌) స్థాయులను తగ్గిస్తాయి.

* ఒమేగా 3 కొవ్వులు: రక్తనాళాలు ఆరోగ్యంగా ఉండేందుకు ఇవి దోహదం చేస్తాయి. గుండె లయ తప్పటాన్ని నిరోధించి గుండెపోటు రాకుండా కాపాడతాయి.

* పీచు: ఇది కొలెస్ట్రాల్‌ తగ్గటానికే కాదు కడుపు నిండిన భావనా కలిగిస్తుంది. దీంతో త్వరగా ఆకలి వేయదు. జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది. మధుమేహం బారినపడకుండా నివారిస్తుంది.

* విటమిన్‌ ఇ: ఇదేమో రక్తనాళాల్లో పూడికలను నివారిస్తుంది. అందువల్ల గుండెపోటు, పక్షవాతం వంటి జబ్బులు రాకుండా కాపాడుతుంది.

* వృక్ష సంబంధ స్టెరాల్స్‌: ఇవి కొలెస్ట్రాల్‌ స్థాయులు తగ్గటానికి తోడ్పడతాయి.

* ఎల్‌-ఆర్గినైన్‌: ఈ ప్రోటీన్‌ రక్తనాళాలు సాగేలా, వదులుగా ఉండేలా చేసి లోపల అడ్డకుంలు ఏర్పడకుండా కాపాడుతుంది.

ఎలా తినాలి?
* బాదంపప్పును రాత్రిపూట నీటిలో గానీ పాలల్లో గానీ నానబెట్టి పరగడుపున తింటే శరీరం బాగా గ్రహిస్తుంది. వీటిల్లో విటమిన్‌- ఇ దండిగా ఉండటం వల్ల మెదడు పనితీరును, జ్ఞాపకశక్తిని పెంపొదిస్తాయి.

* జీడిపప్పును వేయించి తింటే బాగా జీర్ణమవుతుంది. వెంట్రుకలను ఆరోగ్యంగా ఉంచే జింక్‌ వీటిల్లో దండిగా ఉంటుంది. జీడిపప్పును ఇతర పప్పులతో కలిపి వంటలో ఉపయోగిస్తే మాంసకృత్తులన్నీ తీసుకున్నట్టవుతుంది.

* పిస్తాలో విటమిన్‌ ఎ, సి, బి6 ఉంటాయి కాబట్టి రోగనిరోధకశక్తినీ పెంపొదిస్తాయి. వీటిని రుచికోసం సలాడ్లు, ఐస్‌క్రీములు, తీపి పదార్థాలపై చల్లుకున్నా బాగుంటాయి.

* శరీరంలో వాపు ఉన్నప్పుడు, ఒత్తిడి ఎక్కువగా ఉన్నప్పుడు పెరిగే సి-రియాక్టివ్‌ ప్రోటీన్‌ స్థాయులనూ అక్రోట్లు తగ్గిస్తాయి. వీటిల్లో మిగతా గింజపప్పుల్లో కన్నా ఒమేగా 3 కొవ్వు ఆమ్లాలు ఎక్కువ. అందుకే గాలికి, వెలుతురుకు గురైతే త్వరగా రంగు, రుచి మారిపోతాయి.

* వేరుశనగల్లో ఒలియెక్‌ కొవ్వు ఉంటుంది. మోనో అసంతృప్తకొవ్వు ఆమ్లాలూ ఎక్కువే. అందువల్ల వీటిని తరచుగా తీసుకుంటే గుండె జబ్బుల బారినపడకుండా కాపాడతాయి.


  • ========================


Visit my Website - Dr.Seshagirirao...

Food Tips for controling Blood pressure,రక్తపోటు అదుపులో ఉండేందుకు కొన్ని ఆహారపు చిట్కాలు





  •  




పండ్లు , కాయగూరలు ,గింజలు, పప్పులు , కందమూలాలు ,సుగంధద్రవ్యాలు మానవుడికి ప్రక్రుతి ప్రసాదించిన అపురూపమైన వరము .ఆయా సీజన్లలో పండే పండ్లను ఆరగించడం మనకు తరతరాలు గా తెలుసును . అన్నం తో కూడా ప్రకృతిసిద్ధమైన పండ్లు , కూరగాయలు ఇతర త్రునధన్యాలను ఆహారం గా ఆహారముగా తీసుకుని జీవించినట్లయితే శరీరానికి కావససిన అన్నిరకాల పోషకాలు లభిస్తాయి ... ఇదే అసలు ఉత్తమమైన జీవన విధానమని పకృతి వైద్యుల నమ్మకం.....ఆహారం జీవం ఉన్న ప్రతి జీవికి అత్యవసరమైనది. పిండిపదార్ధాలు, మాంసకృత్తులు, కొవ్వుపదార్ధాలు, ఖనిజలవణాలు, పీచుపదార్ధాలు, రోగనిరోధక శక్తికి కావలసిన విటమిన్లు మరియు శరీర పోషణకు రక్షణకు కావలసిన పదార్ధాలను కలిగిన పదార్దాలను ఆహారంగా పేర్కొనవచ్చు. ఇవి కాక శరీరానికి నూతన ఉత్సాహాన్నిచ్చే కాఫీ, టీ లాంటి వాటిని కూడా ఆహారపదార్ధాల కోవలోకి వస్తాయి. ఆహారం ఘన, ద్రవ రూపాలలో లభ్యం అవుతుంది.



 Food Tips for controling Blood pressure,రక్తపోటు అదుపులో ఉండేందుకు కొన్ని ఆహారపు  చిట్కాలు --


అధిక రక్తపోటుతో రక్తనాళాలు దెబ్బతినటం, పక్షవాతం, కిడ్నీజబ్బు వంటి ఇబ్బందులు పొంచి ఉంటాయి. అందువల్ల రక్తపోటును అదుపులో ఉంచుకోవటం ఎంతో అవసరం. క్రమం తప్పకుండా మాత్రలు వేసుకోవటం మానరాదు. ఇవే కాదు కొన్ని చిట్కాలూ రక్తపోటు అదుపులో ఉండేందుకు తోడ్పడతాయి.


కొబ్బరినీళ్లు: దాహం తీరటానికే కాదు. రక్తపోటు తగ్గటానికీ కొబ్బరినీరు ఉపయోగపడుతుంది. ఇందులో కేంద్ర నాడీవ్యవస్థను ప్రశాంతంగా ఉంచేందుకు, రక్తనాళాలు దెబ్బతినకుండా కాపాడేందుకు తోడ్పడే పొటాషియం దండిగా ఉంటుంది. సుమారు 600 మిల్లీలీటర్ల కొబ్బరినీరుతో 1,500 మి.గ్రా. పొటాషియం లభిస్తుంది.

* నువ్వులనూనె: ఇందులో ఆరోగ్యకరమైన బహుళ అంసతృప్త కొవ్వు ఆమ్లాలతో పాటు సిసమిన్‌ అనే రసాయనమూ ఉంటుంది. ఇవి రక్తనాళాల గోడలు వదులుగా ఉండేలా చేస్తూ హఠాత్తుగా రక్తపోటు పెరగకుండా చూస్తాయి. ఈ నూనెను అన్నం, సలాడ్ల మీద కొద్దిగా వేసుకొనీ తినొచ్చు.

* దాల్చినచెక్క: మసాలా దినుసుల్లో ఒకటైన దాల్చినచెక్కలోని వృక్ష రసాయనాలు గుండె కండరాలు, రక్తనాళాలు వదులుగా ఉండేందుకు దోహదం చేస్తాయి. ఇలా రక్తపోటు అదుపులో ఉండేందుకు తోడ్పడతాయి.

* ప్రకృతి దృశ్యాలు: పచ్చని ప్రకృతి దృశ్యాలను చూసినప్పుడు మెదడులో హాయిని కలిగించే అల్ఫా తరంగాలు పుట్టుకొస్తాయి. ఇవి కేంద్ర నాడీ వ్యవస్థను ప్రశాంతంగా ఉంచుతాయి. రక్తపోటును పెంచే కార్టిజోల్‌ హార్మోన్‌ ఉత్పత్తినీ తగ్గిస్తాయి. కాబట్టి గోడ మీద ప్రకృతి దృశ్యాల చిత్రాలను అలంకరించుకోవటం మంచిది.

* నిటారుగా కూచోవటం: ముందుకు వంగి కూచున్నప్పుడు రక్తపోటు 16% వరకు పెరుగుతుంది. మన మెడలో ప్రశాంతతకు సంబంధించిన సందేశాలను మెదడుకు చేరవేసే నాడులుంటాయి. ముందుకు వంగటం వల్ల మెడలోని వెన్నుపాము, డిస్కుల మీదా ఒత్తిడి పడుతుంది. దీంతో ఆ భాగంలోని సున్నితమైన నాడులు నొక్కుకుపోయి వాటి పనితీరు మందగిస్తుంది. అందువల్ల వీలైనంతవరకు నిటారుగా కూచుంటే మంచిది.

* బంగాళాదుంపలు: బంగాళాదుంపలను తింటే రక్తపోటు అదుపులో ఉండేందుకు తోడ్పడుతున్నట్టు ఒక అధ్యయనంలో తేలింది. దుంపల్లో పొటాషియం, క్లోరోజెనిక్‌ ఆమ్లం, ట్రీప్టోఫాన్‌ దండిగా ఉంటాయి. ఇవి రక్తనాళాలు వదులుగా ఉండేందుకు దోహదం చేస్తాయి. అయితే బంగాళాదుంపలోని పోషకాలు చాలావరకు పొట్టులోనే ఉంటాయి కాబట్టి వీటిని పొట్టు తీయకుండా తినటం మంచిది.

* నెమ్మదిగా శ్వాస: నెమ్మదిగా, దీర్ఘంగా శ్వాస తీసుకోవటం వల్ల మహిళల్లో రక్తపోటు 14 పాయింట్లు తగ్గుతున్నట్టు బయటపడింది. ఈ ప్రక్రియ ఒత్తిడి హార్మోన్ల ఉత్పత్తిని తగ్గిస్తుంది. దీంతో రక్తనాళాలు వదులుగా అవుతాయి, రక్తపోటు అదుపులో ఉంటుంది.


  • =====================


Visit my Website - Dr.Seshagirirao...