Pages

Labels

Popular Posts

Monday 30 April 2012

వృద్ధాప్యం లో ఆహారం , Food habits in Old age.



పండ్లు , కాయగూరలు ,గింజలు, పప్పులు , కందమూలాలు ,సుగంధద్రవ్యాలు మానవుడికి ప్రక్రుతి ప్రసాదించిన అపురూపమైన వరము .ఆయా సీజన్లలో పండే పండ్లను ఆరగించడం మనకు తరతరాలు గా తెలుసును . అన్నం తో కూడా ప్రకృతిసిద్ధమైన పండ్లు , కూరగాయలు ఇతర త్రునధన్యాలను ఆహారం గా ఆహారముగా తీసుకుని జీవించినట్లయితే శరీరానికి కావససిన అన్నిరకాల పోషకాలు లభిస్తాయి ... ఇదే అసలు ఉత్తమమైన జీవన విధానమని పకృతి వైద్యుల నమ్మకం.....ఆహారం జీవం ఉన్న ప్రతి జీవికి అత్యవసరమైనది. పిండిపదార్ధాలు, మాంసకృత్తులు, కొవ్వుపదార్ధాలు, ఖనిజలవణాలు, పీచుపదార్ధాలు, రోగనిరోధక శక్తికి కావలసిన విటమిన్లు మరియు శరీర పోషణకు రక్షణకు కావలసిన పదార్ధాలను కలిగిన పదార్దాలను ఆహారంగా పేర్కొనవచ్చు. ఇవి కాక శరీరానికి నూతన ఉత్సాహాన్నిచ్చే కాఫీ, టీ లాంటి వాటిని కూడా ఆహారపదార్ధాల కోవలోకి వస్తాయి. ఆహారం ఘన, ద్రవ రూపాలలో లభ్యం అవుతుంది.



మనందరం ఎంత వైవిధ్యభరితమైన పోషకాహారం తీసుకుంటే ఆరోగ్యానికి అంత మంచిది. ఇది వృద్ధులకు మరింత అత్యావశ్యకం . ఎందుకంటే వృద్ధుల్లో విటమిన్‌ డి, క్యాల్షియం, విటమిన్‌ బీ12, పీచు, పొటాషియం వంటి ప్రత్యేకమైన పోషకాల అవసరం చాలా ఎక్కువ.

* వృద్ధులు నిత్యం తక్కువ కొవ్వు పాల పదార్థాలు, ఆకు కూరలు, చేపలు తగినంతగా తీసుకోవటం ద్వారా విటమిన్‌ డి, క్యాల్షియం లభిస్తుంది. ఇవి ఎముక పుష్టికి దోహదం చేస్తాయి.
* చేపలు, సముద్ర ఆహారం, తేలికైన మాసం నుంచి విటమిన్‌ బీ 12 అందుతుంది.

* సాధారణంగా వృద్ధాప్యంలో తప్పనిసరిగా వేధించే సమస్య మలబద్ధకం. రోజువారీ ఆహారంలో పండ్లు, కూరగాయలు, ముడి బియ్యం లేదా దంపుడు బియ్యం వంటి పొట్టు తీయని ధాన్యం దండిగా తీసుకుంటే ఈ బాధ నుంచి తేలికగా బయటపడొచ్చు. వీటన్నింటిలో పీచు సమృద్ధిగా ఉంటుంది.

* పండ్లు, కూరగాయలు, తక్కువ కొవ్వు పాల పదార్థాల్లో వృద్ధులకు అవసరమైన పొటాషియం కూడా ఉంటుంది.

* అందరిలాగే వృద్ధులు కూడా నూనె పదార్ధాలు, వేపుళ్లు తగ్గించటం శ్రేయస్కరం. ముఖ్యంగా నెయ్యి, డాల్డా వంటి సంతృప్త కొవ్వులు తగ్గించి పొద్దుతిరుగుడు నూనె వంటివి, అదీ మితంగా తీసుకుంటే మంచిది.
  • =========================
Visit my Website - Dr.Seshagirirao...

Saturday 28 April 2012

Love expressing flowers and health,ప్రేమను తెలియచేసే పూలు మన ఆరోగ్యము


  • Image : courtesy with Visalandhra News paper.


పండ్లు , కాయగూరలు ,గింజలు, పప్పులు , కందమూలాలు ,సుగంధద్రవ్యాలు మానవుడికి ప్రక్రుతి ప్రసాదించిన అపురూపమైన వరము .ఆయా సీజన్లలో పండే పండ్లను ఆరగించడం మనకు తరతరాలు గా తెలుసును . అన్నం తో కూడా ప్రకృతిసిద్ధమైన పండ్లు , కూరగాయలు ఇతర త్రునధన్యాలను ఆహారం గా ఆహారముగా తీసుకుని జీవించినట్లయితే శరీరానికి కావససిన అన్నిరకాల పోషకాలు లభిస్తాయి ... ఇదే అసలు ఉత్తమమైన జీవన విధానమని పకృతి వైద్యుల నమ్మకం.....ఆహారం జీవం ఉన్న ప్రతి జీవికి అత్యవసరమైనది. పిండిపదార్ధాలు, మాంసకృత్తులు, కొవ్వుపదార్ధాలు, ఖనిజలవణాలు, పీచుపదార్ధాలు, రోగనిరోధక శక్తికి కావలసిన విటమిన్లు మరియు శరీర పోషణకు రక్షణకు కావలసిన పదార్ధాలను కలిగిన పదార్దాలను ఆహారంగా పేర్కొనవచ్చు. ఇవి కాక శరీరానికి నూతన ఉత్సాహాన్నిచ్చే కాఫీ, టీ లాంటి వాటిని కూడా ఆహారపదార్ధాల కోవలోకి వస్తాయి. ఆహారం ఘన, ద్రవ రూపాలలో లభ్యం అవుతుంది.


  • సౌందర్య సాధనంగా ఉపయోగించే పూలు ఆరోగ్యానికి కూడా ఎంతో మేలు చేస్తాయి. పూలు ప్రేమను, ఆకర్షణను కలిగించి మనస్సుకి ఆహ్లాదాన్నిస్తాయి. అలసిన శరీరానికి మనసుకు చక్కటి పూలమొక్కలు ఆహ్లాదాన్నిస్తాయి. అందమైన గార్డెన్ మనస్సుకు ఎంతో ఉల్లాసాన్నిస్తుంది. అదే విధంగా, మంచి సువాసననిచ్చే పూలు లేదా మొక్కలు జీవితంలో రొమాన్స్ కలిగిస్తాయి. మీ భావాలు తెలుపాలంటే మంచి అందమైన, వాసనలు కల పూలు మంచి సాధనం. కనుక ఇంటి వద్ద మంచి రొమాంటిక్ మూడ్ తెచ్చుకోవాలంటే మీ గార్డెన్ లో లేదా ఇంటిలోపలి భాగంలో పెంచగల కొన్ని పూల మొక్కలు చూడండి. బిజీ జీవితం నుంచి విశ్రాంతి పొందాలంటే మంచి మార్గం ప్రకృతితో స్నేహం చేయడం. కాసేపు పూలతో, చెట్లతో ముచ్చట్లాడి వాటి బాగోగులు చూసుకుంటే చాలు ఎంతటి ఒత్తిడి అయినా ఇట్టే మటుమాయం అవుతుంది. వాటికి కాస్త సేవ చేస్తే ఇటు వ్యాయామమూ అవుతుంది. ఇలా తోటపని ఇష్టపడేవారు రైతులే కానవసరం లేదని పలువురు ప్రముఖులు, సెలబ్రిటీలు రుజువు చేశారు. తామెంత గొప్పవారమైనా ప్రకృతితో చెలిమి తమకెంతో ఇష్టమంటుంటారు. తాము పెంచుకునే మొక్కల మధ్యలో సమయం గడిపి సేదతీరుతారు. ఇలా పూల మొక్కల మధ్య తిరిగి, వాటి పెంపకం ద్వారా ఒత్తిడిని తగ్గించుకునేందుకు ప్రయత్నిస్తున్నారు పలువురు సెలబ్రిటీలు, ప్రముఖులు. గార్డెనింగ్‌ వారికి ఓ హాబీగా మారుతుండడం విశేషం. పూలు కళ్లకు అందంగా కనిపిస్తాయి. పూలను చూస్తుంటే ఏదో తెలియని ఆనందం, ప్రశాంతత కలుగుతుంది. ఒక్కొక్క పూవుది ఒక్కో సువాసన. పూల రంగు, సువాసనల ప్రభావం మనిషి మీద ఉంటుంది. ఈ పూల రేకులలో, మొక్కలలోని హార్మోన్లు ఉంటాయి. ఇవి మనిషికి మేలు చేసేవి. అందుకే ఔషధాల తయారీలో పూలను వాడుతారు.


ప్రేమను తెలియచేసే 5 రకాల ఆకర్షణీయ పూలు:
  • 1.ఎర్ర గులాబి - ఎర్రటి గులాబి పువ్వు, చూసే వారికి ఎంతో ఆనందం కలిగిస్తుంది. ఎవరికైనా వెంటనే ఇవ్వాలనిపిస్తుంది. ప్రేమను తెలుపాలంటే ఎర్ర గులాబి మంచి సాధనం .వీటిలో అనేక రంగులుంటాయి. ఈ మొక్కను కుండీలలో లేదా బయట కూడా పెంచవచ్చు. ముళ్ళను ఎప్పటికపుడు తీసేస్తూ ప్రతిరోజూ ఒకసారి నీరు పెట్టి, కొద్దిపాటి సూర్యరశ్మి తగిలితే చాలు మొక్క బాగా ఎదిగి పూలనిస్తుంది.గులాబీపూలు మనిషి మూడ్‌ను మారుస్తాయి. ఎంతో విచారంలో ఉన్న వారికి గులాబీలు అందించినట్లయితే వారి మనసులో ఆనందం మొదలవుతుంది. గులాబీల నుండి తీసిన రసాయనాలు మానవ కాలేయం, పిత్తాశయాల పనితీరును మెరుగుపరుస్తాయి.


2.ప్లుమేరియా - గులాబి తర్వాత ప్రేమను తెలుపాలంటే ప్లుమేరియా పువ్వు బాగుంటుంది. మంచి సువాసనలతో రూమంతా ఆహ్లాదాన్నిస్తుంది. ఈ పూలు వివిధ రంగుల్లో వుంటాయి. పెంచటం తేలికే. చలి అధికంగా వుంటే, ఇంటి లోపల కుండీలలో పెంచటం, కొద్దిపాటి నీరు పెడితే చాలు.


3.జాస్మిన్ -
మల్లె పూలు
  • ఈపువ్వు ఘాటైన సువాసనలనిచ్చే ప్రేమికుల పువ్వు. ఇవి అలంకరణకే కాదు ప్రేమికులు మంచి మూడ్ రావటానికి కూడా ఉపయోగిస్తారు. ఇవి వికసించాలంటే ఎండ బాగా వుండాలి. నీరు ఎక్కువ పోస్తే మొక్క బాగా ఎదుగుతుంది.
తలలో చుండ్రు సమస్య అధికంగా ఉంటే మెంతులతోపాటు కాసిన్ని ఎండుమల్లె పూలు కలిపి నూరి తయారైన చూర్ణాన్ని తలకు పట్టిస్తే చుండ్రు సమస్య తగ్గడమే కాక జుట్టుకూడా పట్టుకుచ్చులా మెరిసిపోతుంది. కొబ్బరి నూనెలో మల్లెపూలు వేసి ఓ రాత్రంతా బాగా నానబెట్టి ఆ తర్వాత బాగా మరగబెట్టి తలకు పట్టిస్తే కేశాలు ఆరోగ్యవంతమవడమేకాక మాడుకు చల్లదనాన్నిస్తుంది.
మల్లెపువ్వులను ఫేస్‌ప్యాక్‌గా కూడా వాడుకోవచ్చు. మల్లెల్ని పేస్టుగా చేసి కొద్దిగా పాలు కలిపి, నెమ్మదిగా మసాజ్‌ చేసుకోవాలి. ఆ తర్వాత ముల్తానామట్టి, గంధం, తేనె అరస్పూన్‌ చొప్పున కలిపి ప్యాక్‌ వేసుకోవాలి.

  • 4.జాంక్విల్స్ - ప్రేమకు, సాను భూతికి ఈ పువ్వు సంకేతం. ఈ మొక్క పెంచటం తేలికే. పూలు వచ్చే సమయంలో మొక్కకు నీరు బాగా పెట్టాలి. ప్రతి రోజూ 2 నుండి 5 గంటలుకొద్దిపాటి సూర్య రశ్మి వుంటే చాలు.

5.తులిప్ - ఈ పూలు వివిధ రంగుల్లో వుంటాయి. ఎరుపు, పసుపు ప్రేమికులకు ఆకర్షణీయంగా వుంటాయి. వీటిని ఇంటిలో ఫ్లవర్ వేజ్ లో పెడితే కనీసం ఒక వారం రోజులు వాడకుండా వుంటాయి.

ఈ 5 రకాల పూలు ప్రేమను, ఆకర్షణను కలిగించి మనస్సుకి ఆహ్లాదాన్నిస్తాయి.

  • మందారం పూలు : ఇవి కేవలం చూడటానికి అందంగానే కాకుండా మనిషి ఆరోగ్యానికి కూడా ఉపయోగపుడుతుంది. దీనిని హైబిస్కస్ అని కూడా అంటారు. దీనిని ఆహార పదార్థాలతో కలిపి తీసుకుంటారు. అలాగే మందులుగా కూడా ఉపయోగించొచ్చు, దీంతో మనిషి ఆరోగ్యంగా వుంటాడంటున్నారు ఆయుర్వేద ఆరోగ్య నిపుణులు. ముఖ్యంగా యూనాని మందులలో దీనిని ఎక్కువగా ఉపయోగిస్తుంటారు. దీంతో శరీరంలోని కొలెస్ట్రాల్, మధుమేహం, రక్తపోటు, మూత్రపిండాలకు సంబంధించిన వ్యాధి, గొంతుకు సంబంధించిన వ్యాధులు తదితర జబ్బులకు మంచి ఔషధంలా పనిచేస్తుందంటున్నారు వైద్యులు.

మోదుగు పూలు : FIRE OF FOREST గా పేరుగాంచిన మోదుగు పూలు పేరుకు తగ్గట్టుగానే అడవి లో ఎక్కడున్నా ఎర్రని పూలతో అట్టే తెలిసిపోతాయి. గుత్తులు గుత్తులు గా ఎంతో బాగా ఆకట్టుకుంటాయి. వీటిని సేకరించి ఎందబెట్టుకుని తరువాత పొడిగా మార్చుకుని చాలా మంది టీ పొడిగా వాడతారు. ఆరోగ్యానికి మంచిది.
  • మేరీగోల్డ్ పూలు : బంతి పూలు -- ఇవి యాంటీసెప్టిక్‌గా పనిచేస్తాయి. గాయాలకు రాసే ఆయింట్‌మెంట్లలో ఈ పూలు ఉపయోగిస్తారు.

చమేలీ పుష్పాలు : ఇవి పేగు పనితీరును ఎంతగానో మెరుగుపరుస్తాయి. రోగనిరోధక వ్యవస్థను ఉత్తేజపరుస్తుంది. కడుపునొప్పి, నోటిలో నంజు పొక్కు నుండి ఉపశమనం కలిగిస్తుంది.

  • డాంజిలియన్ పూలు : ఇవి రక్తలేమి, కామెర్ల చికిత్సలో వాడుతున్నారు.

పింక్ కలర్ పూలు :
  • ప్రకృతి మనకు ఎన్నో అందమైన, సువాసనలతో కూడిన పుష్పాలను ఇచ్చింది. ఈ పువ్వుల్లో ఒక్కో పువ్వుకు ఒక్కో ప్రత్యేక గుణం ఉంటుంది. మానవుని జీవితంలో సగం దాంపత్యానికే కేటాయించబడుతుంది. ఈ దాంపత్య జీవితం సుఖమయంగా, సాఫీగా సాగేందుకు కొన్ని రకాల, రంగుల పుష్పాలు ఎంతగానో దోహదపడతాయి. పింక్ పూలతో శృంగార శక్తి డబుల్. పింక్ కలర్ పూలకు పడకగదిలో చోటిస్తే దంపతుల్లో శృంగారం రెట్టింపవుతుందట. ఊదా రంగు పూలకు హృదయాలను స్పందింపజేసే శక్తి, రొమాంటిక్ ఆలోచనలు రేపే లక్షణం ఉంది. కనుక బెడ్రూంలో ఈ పూలకు స్థానం కల్పిస్తే సుఖసాంసారం సొంతం.

నైట్‌ క్వీన్‌ పూలు :
  • తెలుపురంగు గల ఈరకం పువ్వులన్నీ సువాసనలతో రాత్రి పూట వికసించి సువాసనలు వెదజల్లుతూ మనకి కూడా మత్తు కలిగేటట్లు చేయగలవు. ఇవి పగటిఉష్ణోగ్రతను తట్టుకోలేవు. పగటి వెలుతురుని భరించలేవు .

మూన్ ఫ్లవర్ పూలు :
  • మూన్ ఫ్లవర్ - రాత్రి వికసించే ఈ పూవును మూన్ ఫ్లవర్ అని పిలుస్తారు. మూన్ వలే గుండ్రంగా వుండటం వలన దీనిని మూన్ ఫ్లవర్ అంటారు. ఈ పూవు కూడా తెల్లగా వుంటుంది. ఇది పాకే మొక్క, బలంగా వుంటుంది.ఈ పూలు రాత్రి పూట వికసించి సువాసనలు వెదజల్లుతూ మనకి కూడా మత్తు కలిగేటట్లు చేయగలవు. ఉదాహరణ--కొలంబైన్, ఈవెనింగ్ ప్రిమ్ రోజ్.


  • ============================

Visit my Website - Dr.Seshagirirao...

Friday 27 April 2012

నాజూకు గా ఉండడానికి కొన్ని ఆహారపదార్ధాలు , Some diet suppliments for good looking.

  •  

  •  image : courtesy with Eenadu vasundhara News paper

  •  

పండ్లు , కాయగూరలు ,గింజలు, పప్పులు , కందమూలాలు ,సుగంధద్రవ్యాలు మానవుడికి ప్రక్రుతి ప్రసాదించిన అపురూపమైన వరము .ఆయా సీజన్లలో పండే పండ్లను ఆరగించడం మనకు తరతరాలు గా తెలుసును . అన్నం తో కూడా ప్రకృతిసిద్ధమైన పండ్లు , కూరగాయలు ఇతర త్రునధన్యాలను ఆహారం గా ఆహారముగా తీసుకుని జీవించినట్లయితే శరీరానికి కావససిన అన్నిరకాల పోషకాలు లభిస్తాయి ... ఇదే అసలు ఉత్తమమైన జీవన విధానమని పకృతి వైద్యుల నమ్మకం.....ఆహారం జీవం ఉన్న ప్రతి జీవికి అత్యవసరమైనది. పిండిపదార్ధాలు, మాంసకృత్తులు, కొవ్వుపదార్ధాలు, ఖనిజలవణాలు, పీచుపదార్ధాలు, రోగనిరోధక శక్తికి కావలసిన విటమిన్లు మరియు శరీర పోషణకు రక్షణకు కావలసిన పదార్ధాలను కలిగిన పదార్దాలను ఆహారంగా పేర్కొనవచ్చు. ఇవి కాక శరీరానికి నూతన ఉత్సాహాన్నిచ్చే కాఫీ, టీ లాంటి వాటిని కూడా ఆహారపదార్ధాల కోవలోకి వస్తాయి. ఆహారం ఘన, ద్రవ రూపాలలో లభ్యం అవుతుంది.



    ఆహారంలో ఎన్ని వర్ణాలుంటే అంత మంచిదంటారు! ముదురు రంగు ఆహారం, ముఖ్యంగా నలుపు వర్ణంలో ఉండే పదార్థాల్లో పోషకాలు అధికమనీ.. అవి బరువు తగ్గి, నాజూగ్గా మారడానికి ఉపయోగపడతాయని అంటున్నారు నిపుణులు.



1.బ్లాక్‌ టీ: శరీరానికి తగిన పోషకాలు అందిస్తూనే, 'సన్న'జాజిలా మారేందుకు దోహదం చేస్తుంది. వ్యాధి నిరోధక శక్తిని పెంచే ఐసోఫ్లవనాల్స్‌, ఖనిజాలు, యాంటీ ఆక్సిడెంట్లు దీనిలో పుష్కలం. తేయాకులని పులియబెట్టి ప్రత్యేక పద్ధతుల్లో తయారుచేసే దీనివల్ల గుండె ఆరోగ్యానికి ఎంతో మేలు. శరీరంలోని ఒత్తిడి కలిగించే హార్మోన్లని నియంత్రించడంలో కీలక పాత్ర పోషిస్తుంది. ఉదయాన్నే ఓ కప్పు బ్లాక్‌టీ తాగితే ఈ సత్ఫలితాలు పొందవచ్చు.



2.నువ్వులు, 3.మిరియాలు: మాంసకృత్తులు, ఇనుము అధికంగా ఉండే నల్ల నువ్వులు అల్సర్లలని నివారించి, అతిసారాన్ని అదుపులో ఉంచుతాయి. క్యాల్షియం అధికంగా ఉండే నువ్వులని ఆరోగ్యం కోసం ఉదయాన్నే వేడి నీటితో కలిపి తీసుకోవడం చైనీయుల సంప్రదాయం. ఇక, నల్ల మిరియాల పొడి ప్రయోజనం చెప్పాలంటే... చర్మ, శిరోజ ఆరోగ్యాలకు పెట్టింది పేరు. చారు, ఫ్రైడ్‌రైస్‌, సలాడ్ల రూపంలో మిరియాల పొడిని తీసుకొంటే జీర్ణశక్తి పెరుగుతుంది. గుండె జబ్బులు, దంత సమస్యలు, కాలేయ ఇబ్బందుల నుంచి మిరియాలు సాంత్వననందిస్తాయి. వీటి నుంచి తీసిన నూనెను చర్మానికి, శిరోజాలకు వాడితే మంచిది.



4.నల్ల ద్రాక్ష: క్యాన్సర్‌తో పోరాడే శక్తి ఉంది. వీటిని దీర్ఘకాలం ఆహారంగా తీసుకుంటే, క్యాన్సర్‌ కణాలు తగ్గుముఖం పడతాయని అధ్యయనాలు చెబుతున్నాయి. శరీరంలోని వ్యర్థాలను తొలగించి, చర్మానికి కొత్త నిగారింపునివ్వడంలోనూ నల్ల ద్రాక్షలు ఉపయోగపడతాయి. గింజలు లేని ద్రాక్షలో కన్నా గింజలున్న వాటిని తీసుకోవడం వల్ల ఎక్కువ యాంటీ ఆక్సిండెంట్లు అందుతాయి. నల్ల ద్రాక్ష, మిరియాల పొడి, నల్ల నువ్వుల కారం.. వీటిని తరచూ తీసుకునే వారిలో దాంపత్య జీవితానికి సంబంధించిన సమస్యలు పెద్దగా ఉండవని, లైంగిక సామర్థ్యం పెరుగుతుందని తాజా అధ్యయనాలు చెబుతున్నాయి.



5.నల్లుప్పు: పచ్చళ్లలో వాడే నల్ల ఉప్పుకి శరీర జీవక్రియలని వేగవంతం చేసే శక్తి ఉంది. సైనస్‌తో బాధపడుతున్నప్పుడు ఇది మంచి సాంత్వన. అలాగే కీళ్లనొప్పులతో బాధపడేవారు ఓ వస్త్రంలో వేడి చేసిన ఈ ఉప్పుని ఉంచి సమస్య ఉన్న చోట పెడితే కాసేపటికి సాంత్వన లభిస్తుంది. గొంతు నొప్పితో బాధపడుతున్నప్పుడు గోరువెచ్చని నీటిలో వేసి పుక్కిలిస్తే తక్షణ ఉపశమనం కలుగుతుంది.



6.వెనిగర్‌: బియ్యం, గోధుమలు, జొన్నలు మేళవించి చేసిన బ్లాక్‌ వెనిగర్‌ని ఉపయోగించడం వల్ల రక్తప్రసరణ అదుపులో ఉంటుంది. కొలెస్ట్రాల్‌ తగ్గుతుంది. వ్యాధి నిరోధక శక్తి పెరగడంతో పాటు కాలేయం పనితీరు మెరుగుపడుతుంది.

7. నీరు : రోజువారీ తగినంత మంచినీరు సుమారుగా 3 లీటర్లు త్రగాలి .

8. పాలు : రోజూ పడుకునేటప్పుడు ఒక గ్లాసు వెన్నతీసిన పాలు త్రగితే శరీరము గాజూకుగా తయార్గును.

9.తేనె : రొజూ రెండు స్పూనుల తేనె ఉదయానే ఒక స్పూను అల్లం రసములో కలిపి తీసుకుంటే చర్మానికి మంచి రంగు వస్తుంది. ఆంబపైత్యము పోయి, విరోచనము సాఫీగా అవుతుంది.

  • ====================

Visit my Website - Dr.Seshagirirao...

Thursday 26 April 2012

మందారం పూలు ఆరోగ్య ఉపయోగలు ,Medicinal uses of Hibiscus flowers

  •  

  •  

పండ్లు , కాయగూరలు ,గింజలు, పప్పులు , కందమూలాలు ,సుగంధద్రవ్యాలు మానవుడికి ప్రక్రుతి ప్రసాదించిన అపురూపమైన వరము .ఆయా సీజన్లలో పండే పండ్లను ఆరగించడం మనకు తరతరాలు గా తెలుసును . అన్నం తో కూడా ప్రకృతిసిద్ధమైన పండ్లు , కూరగాయలు ఇతర త్రునధన్యాలను ఆహారం గా ఆహారముగా తీసుకుని జీవించినట్లయితే శరీరానికి కావససిన అన్నిరకాల పోషకాలు లభిస్తాయి ... ఇదే అసలు ఉత్తమమైన జీవన విధానమని పకృతి వైద్యుల నమ్మకం.....ఆహారం జీవం ఉన్న ప్రతి జీవికి అత్యవసరమైనది. పిండిపదార్ధాలు, మాంసకృత్తులు, కొవ్వుపదార్ధాలు, ఖనిజలవణాలు, పీచుపదార్ధాలు, రోగనిరోధక శక్తికి కావలసిన విటమిన్లు మరియు శరీర పోషణకు రక్షణకు కావలసిన పదార్ధాలను కలిగిన పదార్దాలను ఆహారంగా పేర్కొనవచ్చు. ఇవి కాక శరీరానికి నూతన ఉత్సాహాన్నిచ్చే కాఫీ, టీ లాంటి వాటిని కూడా ఆహారపదార్ధాల కోవలోకి వస్తాయి. ఆహారం ఘన, ద్రవ రూపాలలో లభ్యం అవుతుంది.





  •  మందారాలు రకరకాలు

మందార పూల చెట్టు ఎప్పుడూ పువ్వులనిస్తూనే వుంటుంది. పెద్దగా పోషణ కూడా చేయాల్సిన పనిలేదు. ప్రతి సీజన్ లోను పచ్చగానే కనపడుతుంది. పూలు రంగురంగులుగా వుండి తోటకంతకూ నిండుదనాన్నిస్తాయి. మందారాలు రకరకాలుంటాయి, పూలకుండీలలో కూడా పెంచవచ్చు.



1. చైనా మందారం - సాధారణంగా మనం చూసే ఎర్రని మందారం ఇది. దీనికి సారవంతమైన భూమి కూడా అవసరం లేదు. సాధారణ నేలలో పెరుగుతుంది. ఆకులు చిన్నవిగా వుండి దట్టంగా ఎదుగుతుంది. రోజూ నీరు పెట్టాలి. వర్షాకాలంలో రోజు మార్చి రోజు పెడితే చాలు. పురుగు పట్టకుండా వేపనీరు చల్లండి.



2. హిబిస్కస్ రోసా- తక్కువ ఎరుపు పూలు, గాఢమైన ఆకుపచ్చ ఆకులు. నీరు అధికంగా అవసరంలేదు. ఏ నేల అయినా పరవాలేదు. దానికదే పోషణ చేసుకుంటుంది.



3. పసుపు మందారం - పూవు రేకలు పెద్దవి. పువ్వు తేలికగా సున్నితంగా వుంటుంది. అన్ని వెరైటీలలో కంటే ఈ వెరైటీ మందారం ఎక్కువకాలం జీవిస్తుంది. పూలు పెద్దవి అయినప్పటికి మొక్క చిన్నదిగా వుంటుంది. పూలకుండీలలో పెంచవచ్చు. కాండం గోడల సపోర్టు తీసుకుంటుంది.

.

4. మలేషియా మందారం - ఇది మలేషియాలోపుట్టటం చేత ఈ పేరు వచ్చింది. మొక్క సున్నితం. ఇంటి గార్డెన్ లో పెరగటం కష్టం. నర్సరీలు అనుకూలం. పూలు పెద్దవిగా కిచెన్ ప్లేట్ వలే వుంటాయి.



5.హవాయి మందారం - ఇది ఎంతో ప్రత్యేకత కలిగినది. కొద్దిపాటి జాగ్రత్త వుంటే చాలు బాగా పెరుగుతుంది. దీనికి మంచి సారవంతమైన నేల వుండాలి. మొక్కకు ఆహారం సరి లేకపోతే పూలు వచ్చే ముందే మొగ్గలు ఎండిపోతాయి

  •   ఆరోగ్య ఉపయోగలు

మందారం పూలు గురించి పాఠశాల పుస్తకాల్లో చదివే ఉంటారు. ఇది కేవలం చూడటానికి అందంగానే కాకుండా మనిషి ఆరోగ్యానికి కూడా ఉపయోగపుడుతుంది. దీనిని హైబిస్కస్ అని కూడా అంటారు. దీనిని ఆహార పదార్థాలతో కలిపి తీసుకుంటారు. అలాగే మందులుగా కూడా ఉపయోగించొచ్చు, దీంతో మనిషి ఆరోగ్యంగా వుంటాడంటున్నారు ఆయుర్వేద ఆరోగ్య నిపుణులు.



ముఖ్యంగా యూనాని మందులలో దీనిని ఎక్కువగా ఉపయోగిస్తుంటారు. దీంతో శరీరంలోని కొలెస్ట్రాల్, మధుమేహం, రక్తపోటు, మూత్రపిండాలకు సంబంధించిన వ్యాధి, గొంతుకు సంబంధించిన వ్యాధులు తదితర జబ్బులకు మంచి ఔషధంలా పనిచేస్తుందంటున్నారు ఆయుర్వేదవైద్యులు.



ఇందులో విటమిన్ సి, క్యాల్షియం, పీచుపదార్థం (ఫైబర్), ఐరన్, నైట్రోజన్, ఫాస్ఫరస్, టెటరిక్, ఆక్సీలిక్ యాసిడ్, ఫ్లేవోనైడ్ గ్లైకోసైడ్స్ తగు మోతాదులో లభిస్తాయి. వీటివలన శరీరం ఆరోగ్యంగా ఉంటుందంటున్నారు ఆయుర్వేద వైద్యులు.



మందారపువ్వును హెర్బల్ టీ, కాక్టేల్ రూపాలలోను సేవించవచ్చు. పూలను ఎండబెట్టి హెర్బల్ టీగా తీసుకోవచ్చు. దీనిని ఎలా తయారు చేయాలంటే...



నీటిని ఉడకబెట్టిన తర్వాత ఎండిన మందార పువ్వులను అందులో వేయండి. అందులో చక్కెర, కాస్త టీపొడి కలుపుకుని టీలాగా తయారు చేసుకోండి. దీంతో హైబిస్కస్ హెర్బల్ టీ తయారవుతుంది. ప్రతి రోజు దీనిని సేవిస్తుంటే ఆరోగ్యానికి చాలా మంచిదంటున్నారు వైద్యులు.



అలాగే కాక్టేల్ టీ కొరకు దీనిని చల్లగా చేసి అందులో కొన్ని ఐసు ముక్కలు వేసుకుని తాగితే అదే కాక్టేల్ టీ. ఇలా ప్రతి రోజు తీసుకుటుంటే ఆరోగ్యంగా ఉంటారంటున్నారు ఆయుర్వేద ఆరోగ్య నిపుణులు.



  • ==========================

Visit my Website - Dr.Seshagirirao...

Wednesday 18 April 2012

సుగంధ దినుసులు ఔషధ గుణాలు , Species and medicinal properties of use

  •  

  •  



పండ్లు , కాయగూరలు ,గింజలు, పప్పులు , కందమూలాలు ,సుగంధద్రవ్యాలు మానవుడికి ప్రక్రుతి ప్రసాదించిన అపురూపమైన వరము .ఆయా సీజన్లలో పండే పండ్లను ఆరగించడం మనకు తరతరాలు గా తెలుసును . అన్నం తో కూడా ప్రకృతిసిద్ధమైన పండ్లు , కూరగాయలు ఇతర త్రునధన్యాలను ఆహారం గా ఆహారముగా తీసుకుని జీవించినట్లయితే శరీరానికి కావససిన అన్నిరకాల పోషకాలు లభిస్తాయి ... ఇదే అసలు ఉత్తమమైన జీవన విధానమని పకృతి వైద్యుల నమ్మకం.....ఆహారం జీవం ఉన్న ప్రతి జీవికి అత్యవసరమైనది. పిండిపదార్ధాలు, మాంసకృత్తులు, కొవ్వుపదార్ధాలు, ఖనిజలవణాలు, పీచుపదార్ధాలు, రోగనిరోధక శక్తికి కావలసిన విటమిన్లు మరియు శరీర పోషణకు రక్షణకు కావలసిన పదార్ధాలను కలిగిన పదార్దాలను ఆహారంగా పేర్కొనవచ్చు. ఇవి కాక శరీరానికి నూతన ఉత్సాహాన్నిచ్చే కాఫీ, టీ లాంటి వాటిని కూడా ఆహారపదార్ధాల కోవలోకి వస్తాయి. ఆహారం ఘన, ద్రవ రూపాలలో లభ్యం అవుతుంది.



వంటగదిలో సుగంధ దినుసులను పదార్ధముల రుచి , వాసన పెరగడానికి ఉపయోగిస్తారు . కాని వీటిలో ఎన్నో ఔషధ గుణాలు ఉంటాయి.  మానవుల చేత ఆహరమునకు అధిక హంగులు చేర్చడము కొరకు వాడబడే అనేక మూలికలు మరియు సుగంధ ద్రవ్యములు వంటివి కూడా చాలా ఔషధ విలువలు కలిగి ఉంటాయి. అలాగే డాక్టర్ చేత సూచించబడిన మందుల కంటే, పెద్ద సంఖ్యలో మూలికలు అవాంఛనీయ  ఫలితములను కలిగిస్తాయి అనేది తప్పుడు అభిప్రాయము .  మొక్కలు లేదా మొక్కల నుంచి సేకరించిన పదార్ధములను వాడి చేసే ఒక సంప్రదాయ వైద్య విధానము లేదా గ్రామీణ వైద్య విధానము...నే హెర్బలిజం , బొటానికల్ ఔషదము , మెడికల్ హెర్బలిజం , మూలికా వైద్యము , హెర్బాలజీ మరియు ఫైటోథెరపీ అని కూడా అంటారు. మూలికా వైద్యములో ఒక్కోసారి శిలీంద్ర సంబంధ పదార్దములు మరియు తేనే టీగల ఉత్పత్తులు ఇంకా ఖనిజ లవణములు, గుల్లలు మరియు కొన్ని జంతువుల ప్రత్యేక భాగములు వంటివి కూడా వాడబడతాయి. ఔషధ వృక్ష శాస్త్రం అనేది  సహజవనరుల నుంచి తయారు చేయబడిన ఔషధాల గురించి చేసే ఒక అధ్యయనము.



పసుపు ,మిరియాలు, జీలకర్ర, యాలుకలు, లవంగాలు, పిప్పళ్ళు , దాల్చిన చెక్క ,జీలకర్ర  మొదలగునవి మనము రోజూ వాడే సుగంధ ద్రవ్యాలు . ఉదాహరనకు పసుపును తీసుకుంటే పపంచము అంతాసుగుణాలను గుర్తిస్తున్నది .పసుపు లో యాంటిసెప్టిక్ , యాంటి ఇంఫ్లమేటరీ లక్షణాలున్నాయి. ముఖానికి రాసుకుంటే మొటిమలు తగ్గుతాయి. గాయాలు మానడానికి పసుపు వాడుతారు. పాలలో కొద్దిగ పసుపు కలుపుకొని తాగుతుంటే జలుబు , దగ్గు తగ్గుముఖము పడతాయి. పసుపులో ఉండే " కర్ కర్మిన్‌" అనే పదార్ధము క్యాన్‌సర్ నుండి కాపాడుతుంది అని తాజా పరిశోధనలలో గుర్తించారు .



సుగంధ ద్రవ్యాలలో రారాణి అయిన యాలకుల్ని తినడము వల్ల నోటిదుర్వాసన తగ్గిపోతుంది . కాలేయ , జీర్ణసంబంధిత రుగ్మతలకు మంచి చికిత్స . దృఢమైన డిటాక్షిఫికేషన్‌ కారకము గా గుర్తింపు పొందినది .



లవంగాలు చప్పరించడము వల్ల గొంతు మంట తగ్గుగుంది . దీనిలో Antispasmodic గుణాలు ఉన్నాయి. కండరాలు పట్టేసినప్పుడు లవంగ తైలము రాస్తే ఉపశమనము గా ఉంటుంది . రక్తప్రసరణ మెరుగుపడుతుంది .



మిరియాలు సుగంధ ద్రవ్యాలలో రారాజు . శ్వాస సంబంధిత ఇంఫెక్షన్‌ లకు మంచి మందు . పదార్ధాలపై కొంచం మిరియాలపొడి వేసి తింటుంటే జ్ఞాపక శక్తి మెరుగు పడుతుంది . 

  • ==========================

Visit my Website - Dr.Seshagirirao...