Pages

Labels

Blog Archive

Popular Posts

Sunday, 19 May 2013

Vitamin B9-folic acid , విటమిన్ B9 (ఫోలిక్ ఆమ్లం)



  •  





  •  




పండ్లు , కాయగూరలు ,గింజలు, పప్పులు , కందమూలాలు ,సుగంధద్రవ్యాలు మానవుడికి ప్రక్రుతి ప్రసాదించిన అపురూపమైన వరము .ఆయా సీజన్లలో పండే పండ్లను ఆరగించడం మనకు తరతరాలు గా తెలుసును . అన్నం తో కూడా ప్రకృతిసిద్ధమైన పండ్లు , కూరగాయలు ఇతర త్రునధన్యాలను ఆహారం గా ఆహారముగా తీసుకుని జీవించినట్లయితే శరీరానికి కావససిన అన్నిరకాల పోషకాలు లభిస్తాయి ... ఇదే అసలు ఉత్తమమైన జీవన విధానమని పకృతి వైద్యుల నమ్మకం.....ఆహారం జీవం ఉన్న ప్రతి జీవికి అత్యవసరమైనది. పిండిపదార్ధాలు, మాంసకృత్తులు, కొవ్వుపదార్ధాలు, ఖనిజలవణాలు, పీచుపదార్ధాలు, రోగనిరోధక శక్తికి కావలసిన విటమిన్లు మరియు శరీర పోషణకు రక్షణకు కావలసిన పదార్ధాలను కలిగిన పదార్దాలను ఆహారంగా పేర్కొనవచ్చు. ఇవి కాక శరీరానికి నూతన ఉత్సాహాన్నిచ్చే కాఫీ, టీ లాంటి వాటిని కూడా ఆహారపదార్ధాల కోవలోకి వస్తాయి. ఆహారం ఘన, ద్రవ రూపాలలో లభ్యం అవుతుంది.



విటమిన్ B9 (ఫోలిక్ ఆమ్లం)--



అమ్మకే కాదు... అందరికీ! 'బి' కాంప్లెక్స్‌ విటమిన్ల సమూహానికి చెందిన ఫోలిక్‌ యాసిడ్‌ మహిళలకు జీవితంలోని ప్రతి దశలో అవసరమే.



రక్త హీనతను తగ్గించడానికి ఇనుము అవసరం. ఎముక పుష్టికి క్యాల్షియం కావాలి. మరి పుట్టినప్పటి నుంచి ఎదిగే ప్రతి దశలో కణ నిర్మాణానికీ, ఎర్ర రక్తకణాల తయారీకి ఏ పోషకం అవసరం అంటే, అదే ఫోలిక్‌ యాసిడ్‌. ఇది శరీరంలో తనంతట తానుగా తయారవదు. మాత్రల రూపంలో తీసుకోవాలి. లేదంటే ఫొలేట్‌ కారకాలున్న ఆహార పదార్థాలను తినడం ద్వారా పొందాల్సిందే. నెలసరులు రావడం, గర్భం దాల్చడం, ఓ బిడ్డకు జన్మనివ్వడం, పిల్లలకు పాలివ్వడం... వంటి మార్పులు చోటుచేసుకునే సమయంలో శక్తి సన్నగిల్లకుండా చూడటంలో, ఉదర సంబంధ కణ నిర్మాణంలో ఫొలేట్‌ ఉపయోగపడుతుంది. వెన్నెముక దృఢంగా మారి, ఏ సమస్యలు రాకుండా ఉండటానికీ ఎంతగానో తోడ్పడుతుంది. పిల్లల్లో ఫోలిక్‌ లోపం ఉంటే రక్తహీనత సమస్య బాధిస్తుంది. శారీరక ఎదుగుదల మందగిస్తుంది. దీనినే 'మెగాలో బ్లాస్టిక్‌ ఎనీమియా' అంటారు. నెలసరులు ఆరంభమయ్యాక, టీనేజీలో ఫోలిక్‌ యాసిడ్‌ శాతం తగ్గితే, అదలాగే కొనసాగి భవిష్యత్తులో గర్భధారణ సమస్యలు తలెత్తే అవకాశాలు ఎక్కువ. బాలింతలూ, ముప్ఫై ఏళ్లు దాటిన వాళ్లలో ఈ లోపం తలెత్తితే ఎముకలు గుల్లబారడం, గుండె జబ్బులూ, జుట్టు రాలిపోవడం వంటి సమస్యలు ఏర్పడతాయి.



లోపము వలన కలిగే అనర్ధాలు :



రక్తహీనత, అతిసారము, తెల్ల రక్త కణాలు నష్ట పోవటము--ఫోలిక్‌ యాసిడ్‌ లోపం ఉన్నవాళ్లకు ఆకలి వేయదు. ముఖం పాలిపోయి, బరువు తగ్గిపోతుంటారు. త్వరగా అలసిపోవడం, బాగా నీరసంగా అనిపించడం, మగత వంటి లక్షణాలు కనిపిస్తాయి. పాసివ్‌ స్మోకింగ్‌ ప్రభావానికి లోనయ్యే మహిళల్లో కూడా ఫోలిక్‌ యాసిడ్‌ లోపం ఎక్కువగా ఉన్నట్టు అధ్యయనాలు చెబుతున్నాయి.



తల్లికీ, బిడ్డకూ రక్షణ...



నెల తప్పిన శుభవార్త తెలిసినప్పటి నుంచీ ఫోలిక్‌ యాసిడ్‌ మాత్రలని వాడమని డాక్టర్లు కచ్చితంగా చెబుతారు. చాలామంది వాడతారు. ఎందుకంటే? గర్భం ధరించిన తొలి రోజుల్లో గర్భస్థ శిశువు ఎదుగుదలలో కొన్ని కీలకమైన మార్పులు జరుగుతాయి. వెన్నెముక, నరాలు ఏర్పడే ఆ దశలో తగినంత ఫొలేట్‌ అందకపోతే వెన్నెముకకు సంబంధించిన 'న్యూరల్‌ ట్యూబ్‌ డిఫెక్ట్‌' వచ్చే ఆస్కారం ఉంది. అంటే బిడ్డ వెన్ను సరిగ్గా అభివృద్ధి చెందదన్న మాట. అంతేకాదు, పాపాయి డీఎన్‌ఏ, ఆర్‌ఎన్‌ఏల రూపకల్పనలో... పిల్లల్లో 'ఆటిజం' వంటి సమస్యలు రాకుండా చూడటంలో ఫొలేట్‌లు ఎంతో కీలకం. అందుకే గర్భం ధరించాలన్న ఆలోచన వచ్చింది మొదలు ఫోలేట్‌ యాసిడ్‌ ఉన్న ఆహార పదార్థాలను ఎక్కువగా తినాలి. వైద్యుల సలహా ప్రకారం సప్లిమెంట్లు తీసుకోవాలి. తొలి పన్నెండు వారాల్లో మరింత జాగ్రత్తగా ఉండాలి. తగినంత ఫోలిక్‌ యాసిడ్‌ లేకపోతే నెలలు నిండకుండానే ప్రసవమయ్యే అవకాశముంది. కొన్నిసార్లు అవాంఛిత గర్భస్రావాలు జరగడానికీ ఆస్కారముంది. ఒకవేళ ఏ సమస్యల్లేకుండా ప్రసవమైనా పిల్లలు తగినంత బరువుతో పుట్టరు.



పెద్ద వయసు వారిలో వచ్చే సమస్యలనగానే మతిమరుపూ, కంటి చూపు తగ్గడం వంటివి గుర్తుకొస్తాయి. ఈ రెంటినీ అదుపు చేయడానికి ఫొలేట్‌ ఎంతగానో ఉపయోగపడుతుంది. వృద్ధాప్య లక్షణాలు త్వరగా దరిచేరవు. ముఖ్యంగా మహిళలని వేధించే సర్వైకల్‌ క్యాన్సర్‌ రాకుండా నియంత్రించడంలో ఇది బాగా ఉపయోగపడుతుంది. ఎముకలు గుల్లబారడం (ఆస్టియోపొరోసిస్‌), నిద్రలేమి, ఆరు పదులు దాటిన వారికి గుండె జబ్బులు రాకుండా ఉండేందుకు నిపుణులు ఇప్పుడు ఫోలిక్‌ మాత్రలు వాడమని సూచిస్తున్నారు.



పెళ్లయ్యాక మరింత శ్రద్ధగా: పురుషులతో పోలిస్తే మహిళలకిది ఎంతో అవసరమైన పోషకం. అందుకే పదకొండేళ్లు దాటిన అమ్మాయిలు పెళ్లయ్యేంత వరకూ రోజూ ఫొలేట్‌ ఉండే పదార్థాలను ఎక్కువగా తినాలి. ఇక పెళ్లయిన వారు, వీరినే పొటెన్షియల్‌ మదర్స్‌ అంటారు. గర్భం ధరించడానికి సిద్ధంగా ఉండే వీళ్లు సప్లిమెంట్లూ, ఆహార పదార్థాల రూపంలో 400 మైక్రో గ్రాముల వరకూ ఫొలేట్‌ తీసుకోవాలి. గర్భం ధరించిన తొలి పన్నెండు వారాల్లో 500 మైక్రో గ్రాములూ, పాలిచ్చే సమయంలో 300 మైక్రో గ్రాములు తీసుకోవాలి. గర్భిణులు తప్పించి, మిగిలిన వారంతా మాత్రల రూపంలో కాక నేరుగా ఆహార పదార్థాల నుంచి ఫొలేట్‌ కారకాలను పొందడం మంచిది.



ఏ పదార్ధాలలో దొరుకుతుంది?.



కాలేయము, మాంసము, గుడ్లు, పాలు, ఫలాలు, ధాన్యాలు, ఆకు కూరలు     --- పాలకూరలో పుష్కలం: ముదురాకుపచ్చని ఆకు కూరలు ఫొలేట్‌కి పెట్టింది పేరు. ముఖ్యంగా పాలకూర గురించి చెప్పుకోవాలి. ఒక కప్పు పాలకూర నుంచి అత్యధికంగా 260 మైక్రో గ్రాములని పొందవచ్చు. పాలకూరతో పాటు తోటకూర, చుక్కకూరల్లోనూ ఈ విటమిన్‌ పుష్కలంగా ఉంటుంది. వీటిని మరీ ఎక్కువ మంట మీద వండితే అవి ఫోలేట్‌లని కోల్పోయే ప్రమాదం ఉంది. అందుకే కుక్కర్‌లో ఉడికించాలి. బీన్స్‌, చిక్కుడు జాతి గింజలూ, పప్పు ధాన్యాలూ ఫొలేట్‌ని ఎక్కువగా అందిస్తాయి. ఒక కప్పు బీన్స్‌ నుంచి 180 మైక్రో గ్రాముల ఫొలేట్‌ అందుతుంది. ఇది నీటిలో కరిగే 'బి' కాంప్లెక్స్‌ విటమిన్‌. చిక్కుడు వంటి గింజలని కూడా వేయించడం కాకుండా ఉడికించడం ద్వారా ఎక్కువ పోషకాలని పొందవచ్చు.



నారింజ రసం తాగితే: నిమ్మజాతి పండ్లలో సహజంగానే ఫొలేట్‌ పోషకాలు ఎక్కువ. అలాగే కప్పు నారింజ రసాన్ని తాగితే, ఒక రోజుకి అవసరమైన దానిలో ఐదో వంతు అందుతుంది. టొమాటో రసం నుంచీ పొందవచ్చు. మాంసాహారం తినేవారు లివర్‌ని తినడం వల్ల బి9 రూపంలో ఫోలిక్‌ యాసిడ్‌ లభిస్తుంది. బజారులో దొరికే హోల్‌వీట్‌ బ్రెడ్‌, వైట్‌ బ్రెడ్‌ తిన్నా మంచిదే.



బీట్‌రూట్‌తో ప్రయోజనాలు : వేయించి తినే పొద్దు తిరుగుడు విత్తనాల వల్ల బోలెడు ప్రయోజనాలున్నాయి. వీటి నుంచి రోజువారీ అవసరాలకు కావాల్సిన ఫోలిక్‌ యాసిడ్‌ అరవై శాతం దొరుకుతుంది. వేరుసెనగ పప్పు, పుట్ట గొడుగులూ, బొప్పాయీ, క్యారెట్‌, బీట్‌రూట్‌, పచ్చి బఠాణీ, చేపలూ, పాలూ, అన్నం, అరటిపండు, అనాస, మొక్కజొన్న, క్యాబేజీ టోఫులు కూడా ఫోలిక్‌ యాసిడ్‌ను అందించేవే. బంగాళాదుంపలూ, చిలగడదుంపలూ, గోధుమపిండితో చేసిన పదార్థాల నుంచి ఫొలేట్‌ని పొందవచ్చు.






  • =======================


Visit my Website - Dr.Seshagirirao...

Thursday, 16 May 2013

Nutritional Food , పౌష్టిక ఆహారం



  •  





  •  




పండ్లు , కాయగూరలు ,గింజలు, పప్పులు , కందమూలాలు ,సుగంధద్రవ్యాలు మానవుడికి ప్రక్రుతి ప్రసాదించిన అపురూపమైన వరము .ఆయా సీజన్లలో పండే పండ్లను ఆరగించడం మనకు తరతరాలు గా తెలుసును . అన్నం తో కూడా ప్రకృతిసిద్ధమైన పండ్లు , కూరగాయలు ఇతర త్రునధన్యాలను ఆహారం గా ఆహారముగా తీసుకుని జీవించినట్లయితే శరీరానికి కావససిన అన్నిరకాల పోషకాలు లభిస్తాయి ... ఇదే అసలు ఉత్తమమైన జీవన విధానమని పకృతి వైద్యుల నమ్మకం.....ఆహారం జీవం ఉన్న ప్రతి జీవికి అత్యవసరమైనది. పిండిపదార్ధాలు, మాంసకృత్తులు, కొవ్వుపదార్ధాలు, ఖనిజలవణాలు, పీచుపదార్ధాలు, రోగనిరోధక శక్తికి కావలసిన విటమిన్లు మరియు శరీర పోషణకు రక్షణకు కావలసిన పదార్ధాలను కలిగిన పదార్దాలను ఆహారంగా పేర్కొనవచ్చు. ఇవి కాక శరీరానికి నూతన ఉత్సాహాన్నిచ్చే కాఫీ, టీ లాంటి వాటిని కూడా ఆహారపదార్ధాల కోవలోకి వస్తాయి. ఆహారం ఘన, ద్రవ రూపాలలో లభ్యం అవుతుంది.



 Nutritional Food , పౌష్టిక ఆహారం



ఏ ఆహారమైతే మనము తీసుకుంటే మన ఆరోగ్యము పెంపొందించి , అనారోగ్యపాలుకాకుండా శక్తివంతముగా ఉంచి  జీవనపరిమాణము మెరుగవుతుందో దానినే పౌష్టికాహారము అంటాము . పౌష్టికాహారములో ముఖ్యము గా 7 రకాలైన పోషకాలు అనగా 1.మాంసకృత్తులు(proteins) , 2.పిండిపదార్ధాలు(carbohydrates) , 3.కొవ్వుపదార్ధాలు(fats) , 4.పీచుపదార్ధము(fiber) , 5.విటమిన్లు(vitamins) , 6.ఖనిజలవణాలు(minerals) , 7.నీరు(water) ఉండాలి.



 ఆహారం తీసుకోవడంలో సమతుల్యతా, వైవిధ్యం, పరిమితంగా ఉండగలగడం అనేవి, ఆరోగ్యంగా ఆహారం తీసుకునే పద్ధతులు అని వైద్యులు చిరకాలంగా చెబుతున్నారు. అంటే, శృతిమించిన స్థాయిలో కేలరీలు లేదా ఒకే తరహా పోషకాన్ని అతిగా తీసుకోకుండా.... వైవిధ్య భరితం అయిన ఆహారాన్ని తీసుకోవాలనేది వారి సలహా. మరి ఈ క్రింది సూచనలు మీ ఆరోగ్యానికి శ్రీరామరక్ష కాగలవు. ఆహారం విషయంలో నిర్దిష్ట గమ్యాలు-ఆహార సంబంధమైన మార్గదర్శక సూత్రాలు




  • వివిధ ఆహారపదార్థాల నుండి పోషణ రీత్యా తగిన ఆహారాన్ని వివేకంతో ఎన్నుకొని వినియోగించుకోవాలి.

  • గర్భంతో ఉన్నప్పుడు, తల్లి బిడ్డకు పాలిస్తున్నప్పుడు, అదనపు ఆహారం, మరింత జాగ్రత్త అవసరం,

  • బిడ్డకు 4 నుండి 6 నెలల వయస్సు వచ్చేదాకా తల్లిపాలు మాత్రమే ఇవ్వాలి. తల్లి పాలను రెండేళ్ళ వరకు ఇవ్వవచ్చు,

  • శిశువులకు 4-6 నెలల వయస్సులో అదనపు ఆహార పదార్థాలను ఇవ్వాలి,

  • ఆరోగ్యంగా వున్నా, జబ్బున పడినా, పిల్లలు, కౌమార దశలో వున్న వాళ్ళు తగిన ఆహారాన్ని సరిపడినంత తీసుకోవాలి,

  • ఆకుకూరలు, ఇతర కూరగాయలు, పళ్ళు సమృద్ధిగా వాడాలి.

  • వంటనూనెలు, జంతు సంబంధ ఆహారపదార్థాలను పరిమితంగా వాడాలి. వనస్పతి, నెయ్యి, వెన్నలను అరుదుగా మాత్రమే వాడాలి.

  • అతిగా ఆహారాన్ని తినకుండ, ఎక్కవు బరువు, స్థూలకాయాన్ని నిరోధించాలి,

  • ఉప్పును పరిమితంగా వాడండి,

  • శుభ్రమైన, సురక్షితమైన ఆహారాన్ని తీసుకోవాలి.

  • ఆరోగ్యకరమైన ఆహారపు అలవాట్లను, వంట పద్ధతులను అనుసరించాలి.

  • నీళ్ళను తగిన పరిమానాలలో త్రాగాలి, పానీయాలను పరిమితంగా సేవించాలి.

  • తినడానికి తయారుగా ఉన్న ఆహార పదార్థాలు, ప్రోసెస్ చేయబడ్డ పదార్థాలను ఔచిత్యంతో వాడాలి. చక్కెరను పరమితంగా వాడాలి.

  • వయసు మళ్ళినవారు చురుకుగా ఆరోగ్యంగా వుండడానికి పుష్టికరమైన ఆహారాన్ని తినాలి.


మాంసకృత్తులు




    మాంసకృత్తులు (ప్రోటీన్స్) శరీర అవయవాల నిర్మాణ కార్యక్రమాన్ని, శక్తిని వినియోగించుటకు చాలా అవసరమైనవి. మాంసకృత్తులు శరీర నిర్మాణానికి, పెరుగుదలకు ముఖ్యంగా పిల్లలలోను కౌమారదశలోను చాలా ఉపయోగకరం. పెద్దవయస్సు లేక వృద్ధులలో మాంసకృత్తుల సహాయం చాలా  అవసరం . పెద్దగా దెబ్బలు తగిలినా అవి మానిపోవడానికి సహాయపడుతుంది.

    గ్ర్భవతులు, బాలింతలు మాంసకృత్తులను అధికంగా తీసుకోవటం చాలా అవసరం. ఇవి బిడ్డ పెరుగుదలకు ఎంతో తోడ్పడుతాయి .

    ఆహారంలో మాంసకృత్తులు ఎంతవరకు తీసుకోవాలి :



        మాంసాహారులకు లభించే మాంసకృత్తులు, అధిక శాతం మరియు నాణ్యమైన అవసరమైన అమైనో ఆమ్లాలను తయారుచేస్తుంది.



        శాఖాహారం తీసుకొనే వాళ్ళు తమకు సరిపడా మాంసకృత్తులను  పప్పు ధాన్యాలు, పాలు, గుడ్డు నుంచి  పొందవచ్చు.

        ఎక్కువ శాతం మాంసకృత్తులు నూనె గింజలు, పప్పులు ,పందిరి చిక్కుళ్ళు, పాలు, పాలతో తయారైన పదార్ధాలు ,జంతు మాంసము, చేపలు, కోడిమాంసము ద్వారా లభిస్తాయి.

        వృక్షాల ద్వారా లంభించే ఆహారంలో సొయాబీన్స్ లో చాలా ఎక్కువ శాతంలో అంటే 40% కన్నా ఎక్కువగా మాంసకృత్తులు ఉంటాయి.

        16–18 సంవత్సరాల మధ్య వయస్సు గల 57 కే.జీల బరువు బాలురకు రోజుకు 78 గ్రాముల  మాంసకృత్తులు అవసరం. అదే విధంగా 16 - 18 సంవత్సరాల మధ్య వయస్సు గల 50 కే.జిల బరువు బాలికలకు రోజుకు 63 గ్రాములు అవసరం.

        గర్బవతికి రోజుకు 65 గ్రాములు ఒక  రోజుకు,  పాలిచ్చే తల్లులకు/బాలింతలకు  6 నెలల వరకు   75 గ్రాములు 1 రోజుకు అవసరం.



    ఆహార పదార్ధాలు--     ప్రతి 100 గ్రాములకు లభించే మాంసక్రత్తులు /గ్రాముల్లో

    సోయాబీన్స్            ---       43.2,

    శెనగ పప్పు, పప్పు, మినపప్పు, పెసరపప్పు ఎర్ర పప్పు, కందిపప్పు--    22,

    వేరుశెనగపప్పు, బాదం పప్పు,జీడిపప్పు---        23,

    చేపలు         ---       20,

    మాంసము    ---            22,

    ఆవు పాలు    ---         3.2,

    గేదె పాలు             ---          4.3,

    కోడిగుడ్డు  ( సుమారు 44 గ్రాములు)    ---         13.3     (ఒక గుడ్డుకు)



పిండిపదార్ధాలు(carbohydrates) ---



తిండి గింజలతో తయారు చేసిన ఆహారపదార్ధాలలో సంక్లిష్ట పిండిపదార్ధాలు పుష్కలంగా లభిస్తాయి. పిండి పదార్థాలను ఆంగ్లంలో carbohydrates అంటారు. నిజానికి పిండి పదార్ధం - అంటే starchy substance - ఒక రకం కర్బనోదకం. పిండి పదార్ధాలు, చక్కెరలు, పిప్పి పదార్ధాలు, మొదలైనవన్నీ కర్బనోదకాలకి ఉదాహరణలే.

రసాయనులు కర్బనోదకాలని నాలుగు ప్రధాన వర్గాలుగా విభజించారు.



    ఏక చక్కెరలు లేదా మోనోసేకరైడ్లు (monosaccharides): వీటిని సామాన్య చక్కెరలు అంటారు. ఉదాహరణ: గ్లూకోజు, గేలక్టోజు, ఫ్రూక్టోజు-వీటిని జల విశ్లేషణ (hydrolysis) చేయలేము. ఏక చక్కెరలని ఇంకా చిరు వర్గాలుగా విడగొట్టవచ్చు. చక్కెర బణువులో ఉన్న కార్బన్ అణువుల సంఖ్యనుబట్టి కాని, కార్బనిల్‌ గుంపు (group) ఉన్న స్థానాన్ని బట్టి గాని, బణువుయొక్క కరత్వం (handedness) కాని ఈ విభజన చేస్తారు. కార్బనిల్‌ గుంపు ఆల్డిహైడ్‌ (aldehyde) అయిన యెడల ఆ ఏక చక్కెరని ఆల్‌డోజు (aldose) అంటారు; కార్బనిల్‌ గుంపు కీటోన్‌ అయిన యెడల ఆ ఏక చక్కెరని కీటోజు (ketose) అంటారు. అదే పద్ధతిలో - ఏక చక్కెర బణువులో మూడు కర్బనపుటణువులు ఉంటే అది త్రయోజు (triose), నాలుగుంటే చతుర్ధోజు (tetrose), అయిదు ఉంటే పంచోజు (pentose), ఆరు ఉంటే షడోజు (hexose). ఈ పద్ధతిలో గ్లూకోజు ఆల్డోషడోజు (aldohexose) అవుతుంది (అంటే ఆరు కర్బనపు అణువులు ఉన్న ఆల్డిహైడ్‌), రైబోజు (ribose) ఆల్డోపంచోజు (aldopentose) అవుతుంది (అంటే, అయిదు కర్బనపు అణువులు ఉన్న ఆల్డిహైడ్‌), ఫ్రూక్టోజు (fructose) కీటోహెక్సోజు (ketohexose) అవుతుంది (అంటే ఆరు కర్బనపు అణువులు ఉన్న కీటోను). జీవ రసాయనికంగా పెంటోజు లు, హెక్సోజు లు ప్రధానమైనవి. పెంటోజ్ లో రైబోజ్, హెక్సోజ్ లో గ్లూకోజ్, ఫ్రూక్టోజు లు చాలా ముఖ్యమైనవి.



    జంట చక్కెరలు లేదా డైసేకరైడ్లు (disaccharides): ఉదాహరణ: సుక్రోజు, లేక్టోజు, మాల్టోజు--వీటిని జల విశ్లేషణం చేసి రెండు ఏక చక్కెరలుగా విడగొట్టవచ్చు. జీవులలో జల విశ్లేషణం చేయడానికి ప్రత్యేకమైన ఎంజైములు ఉంటాయి.



    స్వల్ప చక్కెరలు లేదా ఒలిగోసేకరైడ్లు (oligosaccharides): మూడు నుండి తొమ్మిది వరకు ఏకసేకరైడులు కలిసి ఏర్పడిన చక్కెరలను స్వల్పచక్కెరలు అంటారు.

    బహు చక్కెరలు లేదా పోలిసేకరైడ్లు (polysaccharides): అనేక (తొమ్మిది దాటి) ఏకసేకరైడులు కలిసి ఏర్పడిన చక్కెరలను బహుచక్కెరలు అంటారు. ఉదాహరణ: పిండి పదార్ధం, కణోజు (లేదా సెల్యులోజు).



శాస్త్రం ప్రకారం స్వల్ప, బహు అని రెండు వర్గాలుగా విడగొట్టవలసిన అవసరం పెద్దగా లేదు. బహు చక్కెరల జాతిలో ముఖ్యమైనది కణోజు (cellulose). వృక్ష సంపద లోని జీవ కణాల గోడలలో ఉంటుంది కనుక దీనికి ఇంగ్లీషులో సెల్యులోజు అనీ, తెలుగులో కణోజు అనీ పేర్లు. ఈ భూలోకంలో అతి విస్తారంగా ఉన్న ప్రాణి చెట్లు, చేమలు, గడ్డి, మొదలైన వృక్ష సంపద కనుక 'ఈ భూలోకంలో అత్యంత సమృద్ధిగా దొరికే ఆంగిక బణువులు (organic molecules) ఏవి?' అన్న ప్రశ్న కి నిర్ద్వందంగా 'కణోజు' అని సమాధానం చెప్పొచ్చు. కాగితాలు, సెల్యులాయిడ్‌, నైట్రోసెల్యులోజు, రేయాన్‌ మొదలైన పదార్ధాల తయారీకి కణోజు ముడి పదార్ధం.



జీవ ప్రాముఖ్యం---    చక్కెరలు జీవులకు నిత్యం అవసరమయ్యే శక్తిని ప్రసాదిస్తాయి.    పోలీసేకరైడ్లు శక్తిని నిల్వ ఉంచే పదార్ధాలుగా పనిచేస్తాయి.    జీవకణాల గోడలు మరియు ఇతర నిర్మాణాలలో ఉపయోగపడతాయి.    కైటిన్ పాలిసేకరైడ్లు కీటకాలకు, కొన్ని అకశేరుకాలకు రక్షణ కవచాన్ని ఏర్పరుస్తాయి.    హైల్యురానిక్ ఆమ్లం కణజాలాలలో సిమెంట్ పదార్ధంగా ఉపయోగపడుతుంది.    హెపరిన్ జీవులలో రక్తం గడ్డ కట్టకుండా చేస్తుంది.    మానవులలో రక్త వర్గాలు కూడా వీటితో తయారు అవుతాయి.    ఇవి జీవ పదార్థానికి జిగార్ధ (కొల్లాయిడల్ , colloidal) ధర్మాన్ని ఇస్తాయి.



పోషక సామర్ధ్యం



కర్బనోదకాలు జీవికి శక్తిని ఇచ్చే పోషక పదార్ధాలు. వీటిని తక్కువ నీటితో జీర్ణం చేసుకోవచ్చు. ప్రాణ్యము (protein) లని, కొవ్వు (fat) లని జీర్ణించుకుందుకి ఎక్కవ నీరు కావాలి. ప్రాణ్యములు, కొవ్వులు ఆవం (oven) నిర్మించటానికి వాడే ఇటికలు, సున్నం అనుకుంటే కర్బనోదకాలు ఆవంలో కాలే ఇంధనం (fuel) అవుతుంది. అంటే శరీరంలో జీవకణాల నిర్మాణానికి కణజాల (tissue) నిర్మాణానికి ప్రాణ్యములు, కొవ్వులు అవసరం, శక్తిని ఇవ్వటానికి కర్బనోదకాలు అవసరం.



కర్బనోదకాలు జీవి మనుగడకి తప్పనిసరి కాదు. కర్బనోదకాల సరఫరా లేకపోతే జీవి కొవ్వుల నుండి, ప్రాణ్యాల నుండి కర్బనోదకాలని తయారుచేసుకో కలదు.



స్థూలకాయంతో (obese) కాని, డయబెటీస్ (diabetes)తో కాని బాధ పడే ప్రజలు ప్రపంచ వ్యాప్తంగా పెరిగిపోతూన్న ఈ రోజులలో పోషకాహారం (diet) ఎటువంటిది తినాలన్నది ఒక జటిలమైన ప్రశ్నగా పరిణమించింది. ఐశ్వర్యవంతమైన దేశాలలో ఎదిగిన వ్యక్తులు తమకి కావలసిన శక్తిలో 40 నుండి 65 శాతం మేరకి కర్బనోదకాల నుండి లభించేలా చూసుకోవాలని ఒక మార్గదర్శిక సూచిక (guideline)ఉంది. ప్రపంచ ఆరోగ్య సంస్థ (World Health Organization) వారు మనకి లభించే శక్తిలో 55 నుండి 75 శాతం మేరకి కర్బనోదకాల నుండి పొందాలని వక్కాణించేరు. ఈ రెండింటిలో ఏ మార్గదర్శిక సూచిని వాడినా అందులో 10 శాతం మాత్రమే సాధారణ కర్బనోదకాలు (simple carbohydrates, అంటే, చక్కెర, గ్లూకోజు వగైరాలు) నుండి ఉండాలి అని, మిగిలినవి సంక్లిష్ట కర్బనోదకాలు (complex carbohydrates, అంటే, ధాన్యాలు, పళ్ళు, రొట్టెలు, మొదలైన పిండి పదార్ధాలు) అయి ఉండాలని సిఫారుసు చేశారు. ఆరోగ్య సూత్రాలు పాటించే వారు ఈ సంక్లిష్ట కర్బనోదకాలనే మంచి కర్బనోదకాలు (good carbs) అనిన్నీ, సాధారణ కర్బనోదకాలని చెడ్డ కర్బనోదకాలనిన్నీ (bad carbs) అంటూ ఉంటారు. రసాయన పరిభాషలో చెప్పాలంటే ఏక చక్కెరలు, జంట చక్కెరలు సాధారణ కర్బనోదకాలు. స్వల్ప చక్కెరలు, బహు చక్కెరలు సంక్లిష్ట కర్బనోదకాలు. ఇవి కాయగూరలు, ధాన్యాలు, పండ్లు, మొదలైన వాటిల్లో ఉంటాయి.



ఆరోగ్య పరిరక్షణకి మన అసలు గమ్యం రక్తంలో ఉన్న గ్లూకోజు మట్టాన్ని అదుపులో పెట్టగలగటం. కనుక ఏయే పదార్ధాలు తింటే రక్తంలో గ్లూకోజు మట్టం ఎంతెంత పెరుగుతుందో తెలిస్తే అప్పుడు ఏయే వస్తువులు తింటే మంచిదో తేల్చి చెప్పొచ్చు. ఈ కోణంలో ఆలోచించి కొందరు గ్లయిసీమిక్‌ సూచిక (glycemic index) అని ఒక కొత్త సూచిక ని ప్రవేశ పెట్టేరు. ఈ పద్ధతి ప్రకారం ఏయే కర్బనోదకాలని తింటే రక్తంలో గ్లూకోజు మట్టం ఎంతెంత పెరుగుతుందో లెక్క కట్టి, ఆ లెక్క ప్రకారం కర్బనోదకాలని వర్గీకరిస్తారు. మరొక పద్దతిలో ఇన్సులిన్‌ సూచిక (insulin) అనే మరొక కొత్త సూచిక వాడతారు. గ్లయిసీమిక్‌, ఇన్సులిన్‌ సూచికలు శాస్త్రవేత్తలకి అర్ధమయినంత తేలికగా సామాన్యులకి అర్ధం కావు. కనుక ప్రస్తుతం బాగా పలుకుబడిలో ఉన్న పద్దతి 'మంచి, చెడ్డ' అని కర్బనోదకాలని వర్గీకరించటమే.









కొవ్వుపదార్ధాలు - మనిషి ఆరోగ్యం--   కొవ్వు సంబంధ ఆహారం నుండి, మన శరీరానికి కొవ్వు అందుతుంది ఇవి చాలా రకాలుగా శరీరానికి ఉపయోగపడతాయి. ఇది శక్తివంతమైన, శరీరానికి ఇంధనము ఇచ్చే పదార్ధము

    1 gram కొవ్వు = 9 cal ఇంధనము శరీరానికి అందిస్తుంది.

    vit A, B, E & K అను విటమినులు, రక్తంలో కొవ్వుపదార్ధాము ఇమడడానికి చాలా అవసరం.



    కొవ్వు అనేది – ఆహారంలో, చెట్ల నుండి జంతువుల నుండి లభిస్తుంది.  veg-ఆయిల్ - మనము  తీసుకొనే  ఆహారంలొ  చాలా  ముఖ్యమైనది.   దీనిలోఅవసరమైన కొవ్వు ఆమ్లములు,

      1. ఆన్ సాచ్యురేటడ్ (మొనో ఆన్ సాచ్యురేటడ్)

      2. పాలీ ఆన్ సాచ్యురేటడ్

       ఉదా :అన్ సాచ్యురేటడ్ కొవ్వుఆమ్లాలు-వెజిటబుల్ oils    సాచ్యురేటడ్ కొవ్వు అనగా - వెన్న, నెయ్యి .  పెద్దవయస్సువారు - కొవ్వుపదార్ధాలు ఉండే, వెన్న, నెయ్యి హైడ్రొజినేటడ్ కొవ్వుపదార్ధాలు చాలా తక్కువగా తీసుకొవాలి కొబ్బరినూనెవాడరాదు.



    హైడ్రోజినేటడ్ కొవ్వు తీసుకొంటే రక్తంలో కోలెస్ట్రాల్ పెరుగుతుంది, తద్వారా గుండెకు, రక్తనాళాలకు సంబంధించిన వ్యాధులకు గురి అవుతారు.  వంటలకు వాడే నూనెలు, వెజిటబుల్ నూనె, వనస్పతి, నెయ్యి, వెన్నలలో కొ్వ్వును చూడగలము.

    తినుబండారాలలో వుండె కొవ్వు, కరగగలిగే మాంసము కొవ్వు, లేక ఇతర జంతువులకు సంబంధించిన కొవ్వు ఎక్కువ శాతం సాచ్యురేటడ్ కొవ్వులు -



    ప్రతిరోజు ఆహారంలో ఉండాల్సిన కొవ్వుశాతం -    యుక్త వయస్సు పిల్లలో రోజుకు, 25గ్రా- వరకు  సాచ్యురేటడ్ ఫాట్స్ ఉండాలి.    పెద్దవాళ్ళకు - 20గ్రా రోజుకు.

    గర్బవతులకు/ పాలిచ్చే తల్లులకు - 30 గ్రా రోజుకు.



    గుర్తుంచుకోవలసినవి -

    1. తగినంతగా సరిపడగలిగే కొవ్వు పధార్ధాలు తీసుకోవాలి.

    2. వంటలో ఒకటి కన్నాఎక్కువ రకాల నూనెలువాడాలి.

    3. నెయ్యి, వెన్న, వనస్పతి నూనెలు తగ్గించాలి.

    4. ఆకుకూరలు, మెంతులు, ఆవాలు ప్రతి రోజూ వాడాలి.

    5. జంతు అవయవాలు తినరాదు మాంసము/కోడి కన్నా ఎక్కువగా చేపలు తినవచ్చు



పీచుపదార్ధము(fiber)--మనం తీసుకునే ఆహారంలో పీచు పదార్థాలు ఎక్కువుండాలి. పీచు పదార్థాలు ఎక్కువ తీసుకుంటే నీళ్లు కూడా అధికంగా తాగుతాం. దీని వల్ల శరీరంలోని విషపదార్థాలు శరీరం నుంచి బయటికి వెళ్లిపోతాయి. భోజనానికి, భోజనానికి మధ్యలో అధిక పీచు పదార్థాలను (క్యారెట్‌, బీట్‌రూట్‌, దోసకాయ, ఇతర పళ్లు) తీసుకుంటే కడుపు నిండుతుంది. వెంటనే ఆకలి వేయదు. దీని వల్ల జంక్‌ ఫుడ్‌ను నివారించినట్లవుతుంది

fiber rich foods are five basic categories:




  • * కాయకూరలు --Vegetables.

  • * గింజ దాన్యాలు --Whole grains.

  • * నట్స్ మరియు సీడ్స్ --Nuts and seeds.

  • * బీన్స్ మరియు లెగూమ్స్ -- Beans & legumes.

  • * తాజా & ఎండిన పండ్లు Fresh & dried fruits.


పదార్ధాలలో ఉన్న ఫైబర్ రెండు రకాలు :

కరిగే ఫైబర్(soluble fiber) :
ఇది బ్లడ్ కొలెస్టిరాల్ ను తగ్గిస్తుంది ..తద్వారా గుండె జబ్బులు వచ్చే
అవకాశము తక్కువ చేయును .ఇవి గ్లూకోజ్ అబ్సార్ప్షన్‌(glucose
absorption)నెమ్మది చేయుటచేత రక్తము లో సుగరు లెవల్ తగ్గును .




  • ఓట్స్ ,

  • ఓట్స్ తవుడు ,

  • బార్లీ ,

  • బ్రౌన్‌ రైస్ ,

  • చిక్కుడు ,

  • పండ్లు , కాయకూరలు ఉదా: యాపిల్ , ఆరెంజ్ ,కారెట్స్ మున్నగునవి .


కరగని పీచు పదార్ధము (insoluble fiber): దీనినే రఫేజ్ అని అంటాము . కడుపు నిండేందుకు ఉపయోగపడుతుంది . విరోచనము సాఫీ గా జరుగును .




  • తొక్కతీయని దాన్యాలు ,

  • అన్ని రకాల అపరాలు (చోళు, పెసలు , ఉలవలు)

  • గోధుమ పొట్టు ,జొన్న పొట్టు ,

  • పండ్లు తొక్కలు (outer peels) , కాయల తొక్కలు ,


Here is presented a high fiber food list, so check out:

* Grain Products:
o Whole grain breads
o Buns
o Bagels
o Muffins

* Bran Flakes:
o All Bran.
o Red River cereal.
o Corn bran cereal.
o Whole wheat.

* Shreddies:
o Whole-wheat pastas.
o Whole grains such as barley, popcorn, corn and brown rice.

* Fruits:
o Dried fruits such as apricots, dates, prunes and raisins
o Berries such as blackberries, blueberries, raspberries and strawberries
o Oranges, apple with skin and pear.

* Vegetables:
o Broccoli, spinach, Swiss chard and green peas.
o Dried peas and beans such as kidney beans, lima beans, black-eyed beans, chick peas and lentils.
o Nuts and seeds such as almonds, whole flaxseed and soynuts.



రోజు ౩౦ గ్రాముల పీచు అవసరమని వైద్యులు అంటున్నారు .అందులో కరిగే పీచు ఉంటె మంచిది .సాదారణంగా ప్రతి ఒక్కరు పీచు ఉండే పదార్థాలు  తినడం మంచిది.మధుమేహం ,గుండె జబ్బులు ,మలబద్దకం బాధ పడేవారు  ఎక్కువగా పీచు పదార్థాలు తీసుకుంటారు .

    పీచు లభించే పదార్థాలు     గోధుమలు ,రాగులు, జొన్నలు,సజ్జలు,కొర్రలు ..వీటిలో కరిగేరకం పీచు ఎక్కువగా ఉంటుంది .మనమే గోదుమలు తెచ్చుకొని పిండి పట్టిచడం మంచిది.మిగతా ధాన్యాలతో పోలిస్తే ఓట్స్ లో పీచు ఎక్కోవగా ఉంటుంది.పప్పుల్లో ముడి సెనగలు ,పెసలు ,మినుమలు ,అలసందలు బతనిలు..వీటిలో ఎక్కోవ పీచు ఉంటుంది.





విటమిన్లు (Vitamins)
--- సూక్ష్మమైన పోషక పదార్దములు .ఇవి శక్తినిచ్చే పదార్ధములు కావు .
శరీరములొని వివిధ జీవక్రియలను పరోక్షముగా నియంత్రిస్తాయి . వీటి లోపము వలన
అనేక వ్యాధులు కలుగుతాయి . ఎ,బి,సి,డి,ఇ,కె అనే ఆరు విటమిన్లు ఉన్నాయి.
విటమిన్ల అధ్యయనం చేసే శాస్తాన్ని " విటమినాలజీ " అని అంటారు . జీవి
పెరుగుదలకు, ఆరోగ్యవంతంగా ఉండడానికి అత్యంత అవసరమైన అనుబంధ ఆహార కారకాలు.
ముందుగా వీటిని వైటల్ - అతిముఖ్యమైన; అమైన్ - అమినో సమ్మేళనాలు అని ఫంక్
మొదటి సారిగా 1912లో ప్రతిపాదించాడు. ఇతనిని " విటమిన్ల పితామహుడు " అంటారు
. తరువాత కాలంలో విటమిన్లన్నీ అమైన్లు కాదని గుర్తించారు. కాబట్టి
'vitamines' అనే పదంలోని 'e' ని తొలగించి ప్రస్తుతం వాటిని 'vitamins' అని
పేర్కొంటున్నారు. ఇవి స్వయంగా శక్తిని ఉత్పత్తి చేయడంలోగానీ
దేహనిర్మాణంలోగానీ తోడ్పడవు. కానీ శక్తిప్రసరణ, జీవక్రియల నియంత్రణలో
ముఖ్యపాత్ర వహిస్తాయి. కొన్ని విటమిన్లు సహ ఎంజైము (Coenzymes) లుగా
పనిచేస్తాయి.




  • మానవులలో ముఖ్యమైనవి 6 విటమిన్లు గుర్తించారు. వీటిని రెండు రకాలుగా వర్గీకరించారు.




ఎ. కొవ్వులలో కరిగే విటమిన్లు:

1.విటమిన్A,

2.విటమిన్D,

3.విటమిన్E,

4.విటమిన్K

విటమిన్లు కొవ్వులలో కరిగేవి. ఇవి శోషణం చెందడానికి పైత్యరసం అవసరం. ఇవి శోషరసం ద్వారా వివిధ భాగాలకు అందుతాయి.

బి. నీటిలో కరిగే విటమిన్లు:

1.విటమిన్ B-complex,విటమిన్ H(Biotin)

2.విటమిన్ C ,




ఖనిజలవణాలు(minerals)


దేహానికి అవసరమైన ఖనిజలవణాలు పుష్కలంగా ఉండేది ఆకుకూరల్లోనే. ఎందుకంటే సున్నం, భాస్వరం, ఉప్పు, ఇనుము తదితర ఖనిజలవణాలను సరాసరి స్వీకరించి, జీర్ణించుకునే శక్తి మనకు లేదు. ప్రకృతి ఆ శక్తిని వృక్షాలు, మొక్కలకు ఇచ్చింది. ఖనిజ లవణాలను అవి స్వీకరించి, సేంద్రియ లవణాల రూపంలో కాండాలలోను, ఆకులలోను, కాయలలోను, పండ్లలోను, పూలు, దుంపలతోను పదిలపరచుకుంటాయి. వాటిని మనం ఆధారంగా తీసుకుంటే ఆరోగ్యానికి ఎంతో మంచిది.

 ఆకుకూరలలో ఇనుము విశేషంగా ఉంటుంది. ఎ,బి,సి,డి విటమిన్లు కూడా సమృద్ధిగా ఉంటాయి. అందువలన ఆకుకూరలను దేహ రక్షక పదార్థాలుగా పరిగణిస్తుంటారు. ఆకుకూరలలో గల మాంసకృత్తులు పదార్థము సులభంగా జీర్ణమై, త్వరగా శరీర థాతువులలో కలిసిపోవు స్వభావాన్ని కలిగి ఉంటుంది. ప్రతి మనిషికి సగటున రోజుకు రెండు మొదలు నాలుగు ఔన్సుల వరకు ఆకుకూరలను తీసుకొనుట అవసరమని వైద్యులు అంటున్నారు.

ప్రయోజనాలు

- బలవర్థకమైన ఆహారం కావలసిన వారికి ఆకుకూరలు సహాయపడవు.

- వ్యాధి ఉధృతిని తగ్గించటానికి, తిండి ఎక్కువై వ్యాధులు వచ్చిన వారికి ఆకుకూరలు సహాయపడతాయి.

- ఆకుకూరలు కన్నా కాయగూరలే మంచివి.

- ఎండలో కాయకష్టం చేసే వారికి ఆకుకూరలు అనవసరం. అనగా సూర్యరశ్మి సూటిగా తగలని వారిలో (కార్యాలయాల్లో పనిచేసేవారికి) సేంద్రియ లవణాల కొరతను ఆకుకూరలు పూరిస్తాయి. అటువంటి వారికి ఆకుకూరలు అవసరం.

- మధుమేహము, పక్షవాతము, స్థూలకాయము తదితర వ్యాధులకు పిండిపదార్థాలు ఎక్కువగా తినుక ఒక కారణం. ఇట్టివారికి అన్నానికి బదులుగా ఆకుకూరలు మేలు చేస్తాయి.

- చక్రవర్తి కూర, పెరుగు తోటకూర, బచ్చలి మొదలైనవి వేడిని తగ్గిస్తాయి. మిగిలిన ఆకుకూరలకు వేడిని ప్రకోపింపచేయు గుణము ఉన్నది.

- ఆకుకూరలను తరగకముందే నీటిలో కడగాలి. కడిగిన తర్వాత తరగకూడదు. ఆకుకూరలను తక్కువ మంటమీద తక్కువనీటిలో ఉడికించాలి. ఉడికించగా మిగిలిన నీటిని పారబోయకూడదు. వీలైతే తాగాలి. లేకపోతే ఇగురులోకాని, పప్పులోగాని, చారులో గాని కలుపుకుంటే ఆరోగ్యానికి ఎంతో మంచిది. పిల్లలకు నేరుగా ఆకుకూరలు తిననప్పుడు ఈవిధంగా పప్పులో కలిపి పెడుతుంటే అన్ని పోషకాలు సమగ్రంగా అందుతాయి.


 


  • ========================


Visit my Website - Dr.Seshagirirao...

Monday, 6 May 2013

Citron,దబ్బ పండు



  •  





  •  


పండ్లు , కాయగూరలు ,గింజలు, పప్పులు , కందమూలాలు ,సుగంధద్రవ్యాలు మానవుడికి ప్రక్రుతి ప్రసాదించిన అపురూపమైన వరము .ఆయా సీజన్లలో పండే పండ్లను ఆరగించడం మనకు తరతరాలు గా తెలుసును . అన్నం తో కూడా ప్రకృతిసిద్ధమైన పండ్లు , కూరగాయలు  ఇతర త్రునధన్యాలను ఆహారం గా ఆహారముగా తీసుకుని జీవించినట్లయితే శరీరానికి కావససిన అన్నిరకాల పోషకాలు లభిస్తాయి ... ఇదే అసలు ఉత్తమమైన జీవన విధానమని పకృతి వైద్యుల నమ్మకం.....ఆహారం జీవం ఉన్న ప్రతి జీవికి అత్యవసరమైనది. పిండిపదార్ధాలు, మాంసకృత్తులు, కొవ్వుపదార్ధాలు, ఖనిజలవణాలు, పీచుపదార్ధాలు, రోగనిరోధక శక్తికి కావలసిన విటమిన్లు మరియు శరీర పోషణకు రక్షణకు కావలసిన పదార్ధాలను కలిగిన పదార్దాలను ఆహారంగా పేర్కొనవచ్చు. ఇవి కాక శరీరానికి నూతన ఉత్సాహాన్నిచ్చే కాఫీ, టీ లాంటి వాటిని కూడా ఆహారపదార్ధాల కోవలోకి వస్తాయి. ఆహారం ఘన, ద్రవ రూపాలలో లభ్యం అవుతుంది.





 దబ్బపండుని చూడక్కరలేదు... ఆ పేరు వింటేనే నాలుక పులుపెక్కుతుంది. అందుకే దాన్ని మనం పచ్చడికే పరిమితం చేసేశాం. లేదంటే పులిహోర చేస్తాం.
పంపర పనస, నారింజ పండ్ల మధ్య సహజంగా జరిగిన సంకరీకరణ ద్వారా పుట్టినదే దబ్బపండు. అందుకేనేమో... ఇది ఒకలాంటి వగరుతో కూడిన తీపీ పులుపూ రుచులతో ఉంటుంది. మనదగ్గర దొరికే దబ్బపండు మన నారింజలోని పులుపుతోనూ పంపరపనస పరిమాణంలోనూ ఉంటుంది. కానీ ఐరోపా, అమెరికా దేశాల్లో దొరికేవి మాత్రం అక్కడి నారింజ అంటే కమలాపండ్ల మాదిరిగానే పులుపుతో కూడిన తియ్యని రుచితో ఎరుపు, గులాబీరంగు గుజ్జుతో ఉంటాయి. తియ్యని నారింజతో పోలిస్తే గ్రేప్‌ ఫ్రూట్‌ రుచే వేరు అంటుంటారు అక్కడివాళ్లు. గుజ్జు రంగుల్లో తేడా ఉన్నప్పటికీ తొక్క రంగు మాత్రం ఎక్కువగా పసుపురంగులోనే ఉంటుంది. నిజానికి నారింజ, నిమ్మ, పంపరపనసల్లోని గుణాలన్నింటినీ పుణికి పుచ్చుకున్నదే దబ్బపండు.

లాభాలు :
ఇందులో యాంటీ ఆక్సిడెంట్లు చాలా ఎక్కువ. అందుకే ఇది ఆరోగ్యానికి ఎంతో మంచిదని నిపుణుల అంటారు .
* వందగ్రాముల గుజ్జులో 42 క్యాలరీలు మాత్రమే ఉంటాయి. కానీ పీచు శాతం మాత్రం చాలా ఎక్కువ. ఈ పీచు క్యాన్సర్‌కు కారణమైన రసాయనాల్ని పీల్చేస్తుంది. ఇంకా కొలెస్ట్రాల్‌ తగ్గేందుకూ సహకరిస్తుంది.

* ఇందులో విటమిన్‌-ఎ సమృద్ధిగా దొరుకుతుంది. ముఖ్యంగా ఇందులో ఉండే నారింజనిన్‌, నారింజిన్‌ అనే యాంటీ ఆక్సిడెంట్లు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. ఇవి వూపిరితిత్తుల క్యాన్సర్‌, నోటి క్యాన్సర్లు రాకుండా కాపాడతాయి. వీటితోపాటు, లైకోపిన్‌, బీటా కెరోటిన్‌, క్సాంథిన్‌, ల్యూటిన్‌... వంటి ఫ్లేవొనాయిడ్‌లూ ఎక్కువే. అందుకే దీన్ని క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల కంటిచూపూ మెరుగుపడుతుంది.

*సి-విటమిన్‌ కూడా పుష్కలంగా ఉంటుంది. సహజమైన ఈ యాంటీ ఆక్సిడెంట్‌ వల్ల రోగనిరోధక శక్తి పెరుగుతుంది.

* 100 గ్రా. తాజా పండులో 135 మి.గ్రా. పొటాషియం ఉంటుంది. గుండె వేగాన్ని నియంత్రించేందుకూ రక్తపోటు అదుపునకూ ఇది ఎంతో ఉపయోగం.

* ఎరుపురంగులో ఉండే గ్రేప్‌ ఫ్రూట్‌లో లైకోపిన్‌ ఉండటంవల్ల ఇది చర్మాన్ని అతినీలలోహిత కిరణాల నుంచి కాపాడటంతోబాటు ప్రొస్టేట్‌ క్యాన్సర్‌ నుంచీ రక్షిస్తుంది. ఇతర కెరోటినాయిడ్లతో పోలిస్తే క్యాన్సర్‌ కారక ఫ్రీ రాడికల్స్‌తో పోరాడే శక్తి లైకోపీన్‌కే ఎక్కువ.

* లిమోనాయిడ్లూ గ్లూకారేట్లూ కూడా ఇందులో ఎక్కువ. ఇవి రొమ్ముక్యాన్సర్లూ ట్యూమర్లూ రాకుండా కాపాడతాయి.

* ఇందులోని నారింజనిన్‌ అనే ఫ్లేవొనాయిడ్‌ దెబ్బతిన్న డి.ఎన్‌.ఎ.ను సైతం బాగుచేస్తుందట.

* ఇందులో కాల్షియం, ఐరన్‌, కాపర్‌, ఫాస్ఫరస్‌ వంటి ఖనిజాలతోపాటు కొద్దిపాళ్లలో బి-కాంప్లెక్స్‌ విటమిన్లు కూడా ఉంటాయి. ఇది వూబకాయాన్ని నివారించేందుకు దోహదపడుతుందని పరిశోధకులు నిర్ధరించారు.

ఇది సహజమైన క్లీన్సర్‌ కూడా. దీని గుజ్జుని చర్మంమీద నెమ్మదిగా రుద్దితే మృతకణాలన్నీ తొలగి నిగారింపుని తీసుకొస్తుంది. ఖరీదైన క్లీన్సర్లూ ఫేస్‌క్రీముల్ని గమనిస్తే వాటిల్లో ఆల్ఫా హైడ్రాక్సీ ఆమ్లాలు ఉంటాయి. అవన్నీ సహజంగానే ఈ దబ్బపండులో ఉంటాయి. ఇంటిని శుభ్రపరిచేందుకూ అద్భుతంగా పనికొస్తుంది. మూడొంతుల వేడినీళ్లలో ఒక వంతు వినెగర్‌నీ, ఒక వంతు దబ్బపండు రసాన్నీ కలిపితే చాలు... బాత్‌రూమ్‌ టబ్‌లూ సింక్‌లూ, కిచెన్‌ టైల్సూ అన్నీ శుభ్రం చేసుకోవచ్చు.
అన్నింటికన్నా ముఖ్యంగా వయసును పైబడనివ్వనివ్వదని పరిశోధనల్లో తేలింది... అందుకే అక్కడివాళ్లు గ్రేప్‌ ప్రూట్‌ జ్యూస్‌ తెగ తాగేస్తుంటారు. కానీ దీన్ని భోజనం తరవాతే తీసుకోవాలిగానీ పరగడుపునే వద్దని అదీ నిత్యం మందులు వాడేవాళ్లు వాటితో కలిపి తీసుకోకూడదనీ నిపుణులు హెచ్చరిస్తున్నారు. నిజానికి ఏ సిట్రస్‌ పండయినా భోజనానికీ భోజనానికీ మధ్యలో తీసుకోవడమే మంచిది!



courtesy with : Dr.peddi ramadevi BAMS@Eeandu sunday news paper


  • ==================


Visit my Website - Dr.Seshagirirao...

Friday, 3 May 2013

Our health is in our hands,మన చేతుల్లోనే ఆరోగ్యం


  •  








పండ్లు , కాయగూరలు ,గింజలు, పప్పులు , కందమూలాలు ,సుగంధద్రవ్యాలు మానవుడికి ప్రక్రుతి ప్రసాదించిన అపురూపమైన వరము .ఆయా సీజన్లలో పండే పండ్లను ఆరగించడం మనకు తరతరాలు గా తెలుసును . అన్నం తో కూడా ప్రకృతిసిద్ధమైన పండ్లు , కూరగాయలు ఇతర త్రునధన్యాలను ఆహారం గా ఆహారముగా తీసుకుని జీవించినట్లయితే శరీరానికి కావససిన అన్నిరకాల పోషకాలు లభిస్తాయి ... ఇదే అసలు ఉత్తమమైన జీవన విధానమని పకృతి వైద్యుల నమ్మకం.....ఆహారం జీవం ఉన్న ప్రతి జీవికి అత్యవసరమైనది. పిండిపదార్ధాలు, మాంసకృత్తులు, కొవ్వుపదార్ధాలు, ఖనిజలవణాలు, పీచుపదార్ధాలు, రోగనిరోధక శక్తికి కావలసిన విటమిన్లు మరియు శరీర పోషణకు రక్షణకు కావలసిన పదార్ధాలను కలిగిన పదార్దాలను ఆహారంగా పేర్కొనవచ్చు. ఇవి కాక శరీరానికి నూతన ఉత్సాహాన్నిచ్చే కాఫీ, టీ లాంటి వాటిని కూడా ఆహారపదార్ధాల కోవలోకి వస్తాయి. ఆహారం ఘన, ద్రవ రూపాలలో లభ్యం అవుతుంది.







మనం ఆరోగ్యంగా ఉండడం అనేది మనచేతుల్లోనే ఉంది. ఒంట్లో కొద్దిగా నలత గా ఉన్నా పట్టించుకోకుండా అలాగే పనిచేస్తుంటాం. పరిస్థితి ఆందోళనకరంగా మారినప్పుడు వైద్యుల వద్దకు పరుగులు తీస్తుంటాం. ఆరోగ్యం విషయంలో కాస్త శ్రద్ద తీసుకుంటే ఎలాంటి ఆరోగ్య సమస్యలు లేకుండా ఉండొచ్చని వైద్యులు వివరిస్తున్నారు. రోజూ తగిన మోతాదులో పౌష్టికాహారం తీసుకుంటే నిండు నూరేళ్లు ఆరోగ్యంగా ఉండొచ్చంటున్నారు. ఆరోగ్యం దెబ్బతిన్న తరువాత మందులకు ఖర్చు చేయడం కంటే ముందునుంచే పండ్లు, కూరగాయాలు, పాలు, మాంసం కోసం కేటాయించడం మంచిదని న్యూట్రిఫిట్ డైరక్టర్, కన్సలెంట్ న్యూట్రీనిస్టు డాక్టర్ జానకీ శ్రీనాథ్ తెలిపారు.



ఆహారపు అలవాట్లు, వ్యాయమం లేక అనేకమంది వ్యాధుల బారిన పడుతున్నారని వివరించారు. ఆహారంలో ఎక్కువగా కొవ్వు పదార్థాలు తీసుకోవడం, సమయాలు పాటించకపోవడం, కల్తీ పదార్థాలను తీసుకోవడం వల్ల కూడా వ్యాధుల బారిన పడుతున్నారని తెలిపారు. మన ఆరోగ్యం మన చేతుల్లో ఉంటుందన్నారు. ప్రతి రోజూ 45 నిమిషాలను నడకకు కేటాయించాలని సూచిస్తున్నారు. ప్రపంచ ఆరోగ్య దినోత్సవం సందర్భంగా మనం ఆరోగ్యంగా ఉండడానికి ఏమేమి చేయాలో తెలుసుకుందాం.



ఎలాంటి ఆహారం తీసుకోవాలంటే..



- ఆహారాన్ని ఒకేసారి ఎక్కువగా కాకుండా మూడు గంటలకొక సారి కొంచెం కొంచెం తీసుకోవడం ఉత్తమం.

- ఆహారంగా తీసుకునే పదార్థాలను ఎక్కువ సేపు ఉడకపెట్టకూడదు.

- ఆహారంలో తాజా ఆకుకూరలు, కూరగాయలు, పండ్లు ఉండేలా చూసుకోవాలి. కూరగాయలు, పళ్లలో ఉండే సూక్ష్మ పోషక పదార్థాలు, ఫైబర్‌లు శరీరానికి ఎంతో మేలు చేస్తాయి. పసుపు, నారింజరంగులో ఉండే పళ్లు కొన్ని దీర్ఘకాల జబ్బులనూ నిరోధిస్తాయి. తాజాగా ఉండే పచ్చికూరగాయలను, పళ్లను సలాడ్ల రూపంలో కూడా తీసుకోవచ్చు.

- ఆహారంలో 'ఎ' విటమిన్ ఎక్కువగా ఉండేలా చూసుకోవాలి. 'ఎ' విటమిన్ అంధత్వంతోపాటు పిల్లల్లో వాంతులు, విరేచనాలు, తట్టు, శ్వాసకోశ సంబంధ వ్యా«ధులు తదితరమైన వాటిని నివారిస్తాయి. కెరోటిన్ ఉన్న మునగ ఆకులు, తోటకూర, మెంతికూర, పాలకూర, క్యారట్, మంచి గుమ్మడి, మామిడి, బొప్పాయిలను తీసుకుంటే అవి శరీరంలో ఎ విటమిన్‌గా మారతాయి. డి విటమిన్ కూడా అవసరమైన మేరకు ఉండేలా జాగ్రత్తలు తీసుకోవాలి.



మంచి ఆరోగ్యం కోసం...

- ద్యానం, యోగాభ్యాసం వంటి వాటితో ఒత్తిడి తగ్గించుకోవాలి.

- రోజూ తప్పని సరిగ్గా వ్యాయామం చేయాలి.

- పొగతాగడం, పొగాకు నమలడం, గుట్కా, మద్యం వంటి వాటికి దూరంగా ఉండాలి.

- ముప్పై ఏళ్లు పైబడిన వాళ్లు రక్తంలో గ్లూకోజ్, లైపిడ్ల స్థాయి పరీక్షలతోపాటు బీపీ పరీక్షల్లాంటివి చేయించుకోవాలి.

- 30 ఏళ్లు దాటిన మహిళలు క్యాన్సర్ స్క్రీనింగ్ పరీక్షలు చేయించుకోవాలి.

- పిల్లలకు, గర్భిణులకు రోగ నిరోధక మందులు, టీకాలు వంటివి ఇప్పించాలి.

- వినియోగానికి ముందు కూరగాయలను, పండ్లను శుభ్రంగా కడగాలి.



నీళ్లు, పాల ప్రాధాన్యం :

- పరిశుభ్రమైన నీటినే తాగాలి. మంచినీళ్లు తాగితే 50 శాతం రుగ్మతలకు దూరంగా ఉండవచ్చు.

- నీళ్లు కలిషితమైందని అనుమానం కలిగితే కాచి వడపోసి తాగాలి.

- నీటితోపాటు పాలు కూడా ఆరోగ్యానికి ఎంతో అవసరం.

- రోజుకు 250 మిల్లీలీటర్ల కాచి, చల్లార్చిన లేదా పాశ్చరైజ్డ్ పాలను వాడితే మంచిది.

- టీ, కాఫీ అలవాటుంటే... కాఫీ కంటే టీ తీసుకుంటే మంచిది. అది కూడా ఒకటి రెండుసార్ల కంటే ఎక్కువ వద్దు.



వీటి విషయంలో జరభద్రం



- వంటనూనెలు, నెయ్యి, వెన్న, వనస్పతి వంటివి చాలా తక్కువగా వినియోగించాలి. ఎక్కువగా తీసుకుంటే కొవ్వు పెరిగి స్థూలకాయం తద్వారా గుండెజబ్బులు, క్యాన్సర్ లాంటివి వచ్చే ప్రమాదం ఉంది. మాంసాహారులు మేక మాంసం, కోడి మాంసం బదులు చేపలు తీసుకోవడం మేలు. మాంసాహారంలోనూ లివర్, కిడ్నీ, బ్రెయిన్ వంటి పదార్థాలను మానుకోవడం మంచిది.



- ఫ్రై చేసిన ఆహార పదార్థాలకు సాధ్యమైనంత వరకు దూరం గా ఉండాలి.

- రెండు మూడు రోజులు ఫ్రిజ్‌లో నిల్వ ఉంచిన ఆహారం తీసుకోవద్దు.

- విపరీతమైన ఉపవాసాలు మంచిది కాదు.

- ఎక్కువ కొవ్వు కలిగిన పాలను తీసుకోవద్దు.

- ఊరగాయలు, ఉప్పు, బిస్కెట్లు, చిప్స్, వెన్న, పిజ్జా, శీతలపానీయాలు, ప్రాసెస్ చేసిన పదార్థాలను వీలైనంత తక్కువగా తీసుకోవాలి.

- బరువు పెరగకుండా చూసుకోవాలి.



Courtesy with ఆంధ్రజ్యోతి, హైదరాబాద్ సిటీ,ఏప్రిల్ 6-2013.




  • =====================


Visit my Website - Dr.Seshagirirao...