Pages

Labels

Popular Posts

Monday 24 December 2012

Pain killers with our food , ఆహారము తో పెయిన్ కిల్లర్లు


  •  







పండ్లు , కాయగూరలు ,గింజలు, పప్పులు , కందమూలాలు ,సుగంధద్రవ్యాలు మానవుడికి ప్రక్రుతి ప్రసాదించిన అపురూపమైన వరము .ఆయా సీజన్లలో పండే పండ్లను ఆరగించడం మనకు తరతరాలు గా తెలుసును . అన్నం తో కూడా ప్రకృతిసిద్ధమైన పండ్లు , కూరగాయలు ఇతర త్రునధన్యాలను ఆహారం గా ఆహారముగా తీసుకుని జీవించినట్లయితే శరీరానికి కావససిన అన్నిరకాల పోషకాలు లభిస్తాయి ... ఇదే అసలు ఉత్తమమైన జీవన విధానమని పకృతి వైద్యుల నమ్మకం.....ఆహారం జీవం ఉన్న ప్రతి జీవికి అత్యవసరమైనది. పిండిపదార్ధాలు, మాంసకృత్తులు, కొవ్వుపదార్ధాలు, ఖనిజలవణాలు, పీచుపదార్ధాలు, రోగనిరోధక శక్తికి కావలసిన విటమిన్లు మరియు శరీర పోషణకు రక్షణకు కావలసిన పదార్ధాలను కలిగిన పదార్దాలను ఆహారంగా పేర్కొనవచ్చు. ఇవి కాక శరీరానికి నూతన ఉత్సాహాన్నిచ్చే కాఫీ, టీ లాంటి వాటిని కూడా ఆహారపదార్ధాల కోవలోకి వస్తాయి. ఆహారం ఘన, ద్రవ రూపాలలో లభ్యం అవుతుంది.


జబ్బుల నుంచి బయటపడటానికి టాబ్లెట్లే వేసుకోవాల్సిన అవసరం లేదు. ప్రకృతి అందించిన ఆహార పదార్థాలే మంచి ఔషధాలుగా పనిచేస్తాయన్నది ప్రకృతి వైద్య నిపుణులు ఎప్పటినుంచో చెబుతూనే ఉన్నారు. అదే నిజమని మరిన్ని పరిశోధనలు రుజువు చేస్తున్నాయి. ఇరిటిబుల్ బొవెల్ సిండ్రోమ్ లాంటి జీర్ణకోశ సమస్యల వల్ల కలిగే కడుపునొప్పి, నడుంనొప్పి, కీళ్లనొప్పులు.. ఇలా నొప్పి ఏదైనా సరే.. నొప్పిని తెలియజేసే నాడుల మార్గాలను ఆపేయడం ద్వారా గానీ, ఇన్‌ఫ్లమేషన్‌ను తగ్గించడం ద్వారా మాత్రమే కాకుండా నొప్పిని మూలాల్లోంచి తీసేయగల శక్తి ఆహారపదార్థాలకు ఉంది. తలనొప్పిగా ఉందంటే ఏ జండూబామో రాసుకుంటాం..

ఒళ్లంతా నొప్పులంటే ఏ పెయిన్ కిల్లర్ టాబ్లెట్టో వేసుకోమంటాం. కానీ ఈ పెయిన్ కిల్లర్ మాత్రలు ఎంత ఎక్కువగా వాడితే అంతటి దుష్ప్రభావం ఉంటుందనీ తెలుసు. కానీ ఒక్కోసారి నొప్పి తగ్గాలంటే వాటిని వాడక తప్పని పరిస్థితి ఎదురవుతుంది. ఇలాంటి పరిస్థితుల్లో పెయిన్ కిల్లర్స్ కోసం పరుగులు తీయకుండా మనం తినే ఆహారం వైపు ఓ లుక్కేయమంటున్నారు పరిశోధకులు. మనం తీసుకునే ఆహారంలోనే చాలా రకాల నొప్పులను తగ్గించగలిగిన సుగుణాలు ఉన్నాయని ఇటీవలి అధ్యయనాలు వెల్లడిచేశాయి. నొప్పి తగ్గించడంలో మందులు చేసే పనే ఇవీ చేస్తాయనీ అదీ ఎటువంటి సైడ్ ఎఫెక్టులు లేకుండా.. అనీ చెబుతున్నారు అధ్యయనకారులు.


  • curd-పెరుగుతో పొట్ట క్షేమం


మనలో 40 శాతం మంది ఇరిటబుల్ బొవెల్ సిండ్రోమ్‌తో బాధితులున్నారని అంచనా. దీనివల్ల విపరీతమైన కడుపునొప్పితో బాధపడుతుంటారు. దీనికి మంచి పరిష్కారాన్ని చూపేవి అతి చిన్న సూక్ష్మజీవులైన బాక్టీరియా అంటున్నారు నిపుణులు. లాక్టోబాసిల్లస్ అసిడోఫిలస్, లాక్టోకోకస్ లాక్టిస్ లాంటి మేలు చేసే ఈ బాక్టీరియా పెరుగులో పుష్కలంగా ఉంటాయి. పొట్ట ఉబ్బరాన్ని, కడుపు నొప్పిని తగ్గించడంలో ఇవి కీలకపాత్ర వహిస్తాయి. ప్రతిరోజూ ఒకటి లేదా రెండు కప్పుల పెరుగు తీసుకుంటూ ఉంటే ఐబిఎస్ నుంచి ఉపశమనం కలుగుతుంది.


  • Herbal Tea - హెర్బల్ టీ


తలనొప్పిగా ఉంది.. టీ తాగాలి అని చాలా సార్లు అనుకుంటూనే ఉంటాం. ఆ తాగే టీ ఏదో హెర్బల్ టీ తాగండి.. తలనొప్పి ఉండదు అంటున్నారు పరిశోధకులు. గ్రీన్ టీలో యాంటి ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. కెఫీన్ చాలా తక్కువగా ఉంటుంది. 150 మిల్లీలీటర్ల కప్పు గ్రీన్ టీలో pandu నుంచి 36 మిల్లీక్షిగాముల కెఫీన్ మాత్రమే ఉంటుంది. అదే ఫిల్టర్ కాఫీలో అయితే 106 నుంచి 164 మిల్లీక్షిగాముల కెఫీన్ ఉంటుంది. గ్రీన్ టీలో ఉన్న కెఫీన్ రక్తనాళాలు వ్యాకోచం చెందేలా (వాసో డైలేషన్) చేస్తుంది. ముడుచుకుపోయిన రక్తనాళాలు రిలాక్స్ కావడం వల్ల తలనొప్పి నుంచి ఉపశమనం కలుగుతుంది. అయితే గర్భిణులు, రక్తహీనత ఉన్నవారు డాక్టర్ సూచనల మేరకే ఈ టీ తీసుకోవాలి. ఎందుకంటే టీలో ఉంటే టానిన్లు కొన్ని రకాల పోషకాలను శరీరం గ్రహించకుండా అడ్డుకుంటాయి.


  • cherries -చెర్రీతో కీళ్లు భద్రం


చెర్రీ పండ్లలో ఆంథోసయనిన్లు అనే శక్తివంతమైన యాంటి ఆక్సిడెంట్లు ఉంటాయి. నొప్పిని తగ్గించడానికి ఇవి రెండు రకాలుగా పనిచేస్తాయి. యాస్ప్రిన్, నాప్రోక్సెన్ లాంటి ఇతర నాన్ స్టిరాయిడల్ యాంటి ఇన్‌ఫ్లమేటరీ మందుల మాదిరిగానే ఇవీ పనిచేస్తాయి. ఇన్‌ఫ్లమేషన్ ప్రక్రియను బ్లాక్ చేయడమే కాకుండా నొప్పికి కారణమయ్యే ఎంజైమ్‌లను కూడా అడ్డుకుంటాయి. ఒక కప్పు చెర్రీపండ్లను ప్రతిరోజూ తీసుకుంటే కీళ్లవాపు 25 శాతం వరకూ తగ్గిపోతుందంటున్నారు పరిశోధకులు. రోజూ రెండు సార్లు 360 మిల్లీలీటర్ల చెర్రీ పండ్లరసాన్ని తీసుకుంటూ ఉండటం వల్లనే చాలామంది అథ్లెట్లలో ముఖ్యంగా రన్నింగ్‌లో పాల్గొనేవారిలో కండరాల నొప్పి చాలా తక్కువగా ఉన్నట్టు అధ్యయనాల్లో తేలింది. అందుకే రోజూ చెర్రీలు తీసుకోండి పిక్క(కండర)బలం పెంచుకోండి అంటున్నారు అధ్యయనకారులు.


  • Turmeric - పసుపు.. యాంటి ఇన్‌ఫ్లమేటరీ..


ఎక్కడైనా చర్మం కోసుకుని రక్తం కారుతుంటే వెంటనే వంటగదిలో నుంచి పసుపు తెచ్చి అక్కడ రాయడం పరిపాటే. నిజానికి ఆయుర్వేద వైద్యం పుట్టినప్పటి నుంచీ వైద్యంలో పసుపుకి విశిష్ట స్థానమే ఉంది. నొప్పి తగ్గించేందుకు, జీర్ణవ్యవస్థ చురుకుదనానికి, యాంటి బాక్టీరియల్ ప్రభావానికి పసుపును ఇప్పటికీ ఒక ఔషధంగా వాడుతున్నారు. చర్మ సౌందర్యం పెంచడంలో కూడా పసుపుకే పెద్దపీట. వీటన్నిటికి తోడు పసుపులో యాంటి ఇన్‌ఫ్లమేటరీ ప్రభావాన్ని చూపగల గుణం కూడా ఉందంటున్నారు పరిశోధకులు. దీనిలో ఉంటే కర్క్యుమిన్ వల్లనే పసుపు ఎన్నో రకాల సమస్యలకు పరిష్కారాన్ని చూపుతోంది. కణాలు దెబ్బతినకుండా నివారించగలిగే పసుపు కీళ్లలో వాపును కూడా అరికట్టగలదు. అంతేకాదు.. నాడీకణాల పనితీరును మెరుగుపరుస్తుంది. రోజుకి 1 నుంచి 2 గ్రాముల పసుపును తీసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. మన భారతీయ వంటకాల్లో ఈ మోతాదు పసుపును చేర్చడం పెద్ద విషయమేమీ కాదు. అయితే ఇంతకన్నా కాస్త ఎక్కువైనా పరవాలేదంటారు అధ్యయనకారులు. కూరల్లోనే కాదు.. చపాతీ పిండిలో, ఇడ్లీ, దోసె పిండిలో కూడా పసుపును వాడవచ్చంటున్నారు. పసుపును ఉపయోగించినప్పుడల్లా కాస్త మిరియాల పొడి కూడా వాడటం వల్ల మంచి ఫలితాలుంటాయి. ఎందుకంటే మిరియాలు పసుపులోని కర్క్యుమిన్ వినియోగానికి ఉపయోగపడతాయి.


  • Ginger - ఆర్థరైటిస్‌కి అల్లం


జీర్ణశక్తిని పెంచే అల్లం వాంతులు, వికారానికి కూడా మందుగా పనిచేస్తుంది. వాంతులను ప్రేరేపించే రీసెప్టర్లను బ్లాక్ చేయడం ద్వారా ఇది సహాయపడుతుంది. పేగుల్లో ఏర్పడే గ్యాస్‌ను పోగొట్టే ఔషధం కూడా. వీటికి తోడు అల్లంలో మరో సుగుణం కూడా ఉంది. అదే యాంటి ఇన్‌ఫ్లమేటరీ ప్రభావం. సాధారణ కండరాల నొప్పి దగ్గరి నుంచి మైగ్రేన్ తలనొప్పి, ఆర్థరైటిస్ లాంటి దీర్ఘకాలిక వ్యాధులకు కూడా ఇది దివ్యౌషధం. కూరల్లో వాడటమే కాకుండా బార్లీతో కలిపి అల్లం రసాన్ని తీసుకుంటే మంచి ఫలితం ఉంటుంది. అల్లం ముక్కలను నిమ్మరసం, తేనెతో కలిపి తీసుకున్నా రుచికి రుచి.. ఆరోగ్యానికి ఆరోగ్యం.


  • fish - నడుంనొప్పికి చేప


మెర్క్యురీ లేకుండా ఒమేగా-3 ఫ్యాటీ ఆమ్లాలు ఉన్న చేపలు ఆరోగ్యకరమైన వెన్నుపాముకు దోహదం చేస్తాయి. వెన్నుపాము డిస్కుల చివర్లలో ఉండే రక్తనాళాలు అన్ని ముఖ్యమైన పోషకాలను డిస్కులకు సరఫరా చేస్తాయి. ఈ రక్తసరఫరా తక్కువ అయితే డిస్కులకు తగినంత ఆక్సిజన్, పోషకాలు అందక అవి వదులయిపోతాయి. తద్వారా నెమ్మదిగా దెబ్బతినడం ఆరంభమవుతాయి. ఒమేగా-3 ఫ్యాటీ ఆమ్లాలు ఈ రక్తసరఫరా బావుండేందుకు సహాయపడతాయి. అంతేకాదు... రక్తనాళాలు, నాడుల్లో ఇన్‌ఫ్లమేషన్ రాకుండా నివారిస్తాయి. ఒమేగా-3తో పాటు రోజుకి ఒకవూటెండు గ్రాముల ఇహెచ్‌ఎ, డిపిఎ తీసుకుంటే మెడ, వెన్ను, నడుము నొప్పుల నుంచి మరింత త్వరగా ఉపశమనం దొరుకుతుందంటారు నిపుణులు. నిజానికి చేపనూనెలు గుండె, రక్తనాళాల ఆరోగ్యానికి చాలా మంచివి. శాకాహారులకు అవిసె గింజల్లో కావలసినంత ఒమేగా-3 ఫాటీఆమ్లాలు లభిస్తాయి. దీనితో పాటు రోజూ పావు కప్పు వాల్‌నట్స్ తీసుకుంటే మంచి ఫలితం ఉంటుంది.

Courtesy with Sakala@Namste Telangana news paper.



  • =====================


Visit my Website - Dr.Seshagirirao...

Tuesday 18 December 2012

Pure water and Water purifiers-శుద్ధజలం మరియు నీటి శుద్ధి పరికరాలు


  •  





  •  image : courtesy with Eenadu news paper



  •  


పండ్లు , కాయగూరలు ,గింజలు, పప్పులు , కందమూలాలు ,సుగంధద్రవ్యాలు మానవుడికి ప్రక్రుతి ప్రసాదించిన అపురూపమైన వరము .ఆయా సీజన్లలో పండే పండ్లను ఆరగించడం మనకు తరతరాలు గా తెలుసును . అన్నం తో కూడా ప్రకృతిసిద్ధమైన పండ్లు , కూరగాయలు ఇతర త్రునధన్యాలను ఆహారం గా ఆహారముగా తీసుకుని జీవించినట్లయితే శరీరానికి కావససిన అన్నిరకాల పోషకాలు లభిస్తాయి ... ఇదే అసలు ఉత్తమమైన జీవన విధానమని పకృతి వైద్యుల నమ్మకం.....ఆహారం జీవం ఉన్న ప్రతి జీవికి అత్యవసరమైనది. పిండిపదార్ధాలు, మాంసకృత్తులు, కొవ్వుపదార్ధాలు, ఖనిజలవణాలు, పీచుపదార్ధాలు, రోగనిరోధక శక్తికి కావలసిన విటమిన్లు మరియు శరీర పోషణకు రక్షణకు కావలసిన పదార్ధాలను కలిగిన పదార్దాలను ఆహారంగా పేర్కొనవచ్చు. ఇవి కాక శరీరానికి నూతన ఉత్సాహాన్నిచ్చే కాఫీ, టీ లాంటి వాటిని కూడా ఆహారపదార్ధాల కోవలోకి వస్తాయి. ఆహారం ఘన, ద్రవ రూపాలలో లభ్యం అవుతుంది.



 
నీరు :
రోజుకు ఎనిమిది గ్లాసుల నీళ్లు తాగడం వల్ల.. చక్కటి ఆరోగ్యం సొంతమవుతుంది, శరీరంలోని వ్యర్థాలు దూరమవుతాయి. అవి మంచి నీళ్లయితే అంతా మంచిదే! కానప్పుడు! కాలుష్య కారకాలతో నిండినవైనప్పుడు? అనారోగ్యాలు కమ్ముకొంటాయి. ప్రాణాంతక వ్యాధుల్లో అధిక శాతం అపరిశుభ్రమైన జలాల కారణంగానే వ్యాపిస్తాయని ఇప్పటికే ఎన్నో అధ్యయనాలు తెలిపాయి. మరి ఈ సమస్యని నియంత్రణలో ఉంచడానికి మార్గమేదీ అంటే.. అత్యధిక మందికి అందుబాటులో ఉన్నవి నీటి శుద్ధి పరికరాలు (వాటర్‌ ప్యూరిఫైయర్లు). వీటి పనితీరుపై చక్కటి అవగాహన కలిగి, ఎంపికలో తగు జాగ్రత్తలు పాటిస్తే వందశాతం స్వచ్ఛమైన జలాన్ని స్వీకరించడం ఈ రోజుల్లో సాధ్యమనే చెప్పొచ్చు. ఆ దిశలో మార్గనిర్దేశం అందించే కథనమే ఇది.

బావి నీరు, కుళాయి నీరు.. స్వచ్ఛమైన తాగునీరు అని అన్ని సందర్భాల్లో అనుకోవడానికి లేదు. వివిధ కారణాల వల్ల వాటిల్లో జీవ సంబంధిత, రసాయనిక వ్యర్థాలు వచ్చి చేరతాయి. బావుల్లో చుట్టుపక్కల ఇంకిన మురుగు నీరు వచ్చి కలుస్తుంది. పొలాల్లో చల్లే పురుగు మందుల దుష్ప్రభావం ఉంటుంది. పరిశ్రమల నుంచి విడుదలయ్యే వ్యర్థాలు నీటిలో కలిసే అవకాశాలూ అధికమే. కార్పొరేషన్‌, మున్సిపాలిటీ నీళ్లు శుద్ధి అయి వస్తాయి కాబట్టి వీటిల్లో సాధారణంగా ఆర్సెనిక్‌ వంటి భారలోహాలు ఉండవు. కానీ పైపుల ద్వారా రావడం వల్ల గొట్టాల్లో ఉండే పాచి, తుప్పు వల్ల నీరు కలుషితం అవుతుంది. ఇవన్నీ పరిగణనలోకి తీసుకుని చూసినప్పుడు..ఈ రకమైన కలుషిత జలాలను నిత్యం ఎక్కువ కాలం స్వీకరించడం, ఆరోగ్యానికి మంచిది కాదు. ఒకప్పటితో పోలిస్తే ఈ వాస్తవాన్ని ప్రజలూ గ్రహిస్తున్నారు. అందుకే మెట్రోల్లోనే కాదు పట్టణాల్లోనూ వాటర్‌ ప్యూరిఫైయర్ల కొనుగోలు పట్ల ఆసక్తి కనబరుస్తున్నారు.

వాటితో ఏయే ఉపయోగాలు...


తాగే నీటికి చక్కటి రుచిని ఇవ్వడంతో పాటు నీటిలోని హానికారక వైరస్‌, ముఖ్యంగా జీర్ణాశయ వ్యాధులకు కారణమయ్యే బ్యాక్టీరియాలను నీటి శుద్ధి పరికరాలు సమర్థంగా నియంత్రిస్తాయి. ఈ ఒక్క చర్య కారణంగానే డయేరియా, కలరా, కామెర్లు వంటి వ్యాధులని అడ్డుకోవచ్చు. నీటిలో కరిగి ఉండే రసాయనాలని తొలగించి దీర్ఘకాలిక ఇబ్బందులు రాకుండా చూడటంలో వీటిది కీలక పాత్ర. బావి నీటిలో హానికారక క్యాడ్మియమ్‌, సీసం, మెగ్నీషియమ్‌, సిలికా, క్రోమియమ్‌ వంటి లోహాలు ఉంటే అవి శరీరానికి చేరకుండా నిరోధిస్తాయి. ఎముకల ఆరోగ్యాన్ని దెబ్బతీస్తూ.. మలబద్దకానికి కారణం అయ్యే ఇనుము, ఫ్లోరిన్‌లను తొలగిస్తాయి. నీటియొక్క పీహెచ్‌ సమతుల్యాన్ని ఇవి కాపాడతాయి. విలువైన ఖనిజాలని తాజాగా శరీరానికి అందిస్తాయి.

శుద్ధి విధానాలపై శ్రద్ధ...


నీటిని మరగకాచి చల్చార్చడం, క్యాండిళ్లున్న వాటర్‌ ఫిల్టర్లను వాడటం వంటి శుద్ధి విధానాలను ఇప్పటికీ పల్లెల్లో చాలాచోట్ల వాడుతున్నారు. అయితే వీటితో పోలిస్తే ఆధునిక తరహావి పలు విధాల మేలైనవి, అతి సూక్ష్మ క్రిములను సైతం నియంత్రించగలవన్న విశ్వసనీయతను సంపాదించాయి. ఇవి ప్రధానంగా యూవీ ప్యూరిఫికేషన్‌, రివర్స్‌ ఆస్మోసిస్‌ విధానం, యాక్టివేటెడ్‌ కార్బన్‌ ఫిల్టరింగ్‌, డిస్టిలేషన్‌, ఐయాన్‌ ఎక్స్‌ఛేంజ్‌, ఎలక్ట్రో డీఐయనైజేషన్‌ వంటి విధానాలతో లభ్యమవుతున్నాయి. ఇవి కలుషితాలను పరిహరించి, వ్యాధులకు కారణమయ్యే బ్యాక్టీరియా, వైరస్‌ వంటి సూక్ష్మజీవులని అరికడతాయి.

ఎటువంటి పరికరాలు కొనాలి..


ఒకసారి పరికరాన్ని కొనాలని నిర్ణయించుకొన్న తర్వాత ఎటువంటి వడపోత విధానం సరిపడుతుందనే దానిపై అవగాహన తెచ్చుకోవాలి. పైన చెప్పుకొన్నట్టు.. యాక్టివేటెడ్‌ కార్బన్‌ ఫిల్టరేషన్‌, యూవీ ప్యూరిఫికేషన్‌, రివర్స్‌ ఆస్మోసిస్‌... లేదా వీటి మేళవింపు పరిజ్ఞానంతో ప్రస్తుతం పరికరాలు అందుబాటులో ఉన్నాయి. ఇందులో ఏది మంచిది అని నిర్ణయించుకోవాలంటే ముందు తాగే నీటిలో టీడీఎస్‌ (టోటల్‌ డిసాల్వ్‌డ్‌ సాలిడ్స్‌) స్థాయులు ఎంత ఉంటున్నాయో చూసుకోవాలి. నీటిని దగ్గర్లోని ల్యాబులో పరీక్ష చేయించుకోవచ్చు. కేవలం మురికి, స్వల్ప కలుషితాలు మాత్రమే ఉంటే ఖరీదయిన పరికరాన్ని ఎంచుకోవాల్సిన అవసరం లేదు. అందుకు సాధారణ యాక్టివేటెడ్‌ కార్బన్‌ ఫిల్టర్‌ క్యాట్రిడ్జ్‌ను ఉపయోగించి శుభ్రం చేసుకోవచ్చు. కేవలం క్లోరిన్‌, అతినీలలోహిత కిరణాలతోనే ఈ ప్రక్రియ జరిగిపోతుంది. అలాగే మున్సిపాలిటీ వాళ్లందించే నీటిని శుద్ధి చేసుకోవడం కోసం 'యూఎఫ్‌ అల్ట్రా ఫిల్టరేషన్‌' పరిజ్ఞానం సరిపోతుంది. అయితే ఇవి నీటిని వడకట్టినా అందులో క్రిముల అవశేషాలు జీర్ణాశయంలో చేరి అలర్జీలు రావొచ్చు. గమనించుకొని సందర్భానుసారంగా ఎంచుకోవాలి.

వివిధ వడపోత దశలివి...


బిందెకి ఒక వస్త్రం చుట్టి నీళ్లు పట్టడం తెలిసిందేగా! వాటర్‌ ప్యూరిఫైయర్‌లోనూ ఈ తీరును మనం ఊహించవచ్చు. ఇరవై మైక్రాన్లు, ఐదు మైక్రాన్లుండే అతి సూక్ష్మమైన రంధ్రాల ద్వారా నీరు పంపుతారు. ఫలితంగా మట్టి, మురికి, సూక్ష్మ క్రిములు అక్కడ నిలువరించబడతాయి. తరవాత మరిగించే ప్రక్రియ సాగుతుంది. అయితే నిర్ణీత కాలం తరవాత పరికరం తయారీదారు నిర్దేశించినట్టుగా వడపోత కాగితాలని మార్చాల్సి ఉంటుంది. బ్యాక్టీరియా వృద్ధి చెందే అవకాశం ఉంది. పరికరంలో యూవీ వాటర్‌ స్టెరిలైజింగ్‌ విధానం ఉంటే కనుక అది హానికారక బ్యాక్టీరియాతో పాటు వాటి క్రిముల సంతానోత్పత్తి సామర్థ్యాన్ని దెబ్బతీస్తుంది. ఫలితంగా 99 శాతం నీరు శుభ్రం అవుతుంది. మెంబ్రేన్‌ ఆధారిత వాటర్‌ ఫిల్టర్లు, యూఎఫ్‌ మెంబ్రేన్‌ ఆధారిత రకాలు కూడా ఈ ప్రక్రియని సమర్థంగా నిర్వహిస్తాయి. నీటిని శుభ్రపరచడంలో కీలక దశ రసాయనాలని తొలగించడం. బావినీటిలో, బోరునీటితో ఉండే భారలోహాలని తొలగించడానికి 'రివర్స్‌ ఆస్మోసిస్‌ విధానం' ఉన్న వాటర్‌ ప్యూరిఫైయర్లు బాగా ఉపయోగపడతాయి.

ఈ అంశాలనూ పరిగణనలోకి...


భారతీయ ప్రమాణాల బ్యూరో మార్గనిర్దేశాల ప్రకారం ప్రముఖ బ్రాండ్లలో, రివర్స్‌ ఆస్మోసిస్‌ పరికరాలకు ఆదరణ అధికమని చెప్పొచ్చు. వీటి తరవాత యూవీ వాటర్‌ ప్యూరిఫైయర్ల గురించి చెప్పుకోవాలి. నీటి శుద్ధి పరికరం కొనేప్పుడు జాతీయ పారిశుద్ధ్య ఫౌండేషన్‌, నీటినాణ్యత సంఘం నిర్ధారించినదై ఉండాలి. కాట్రిట్జ్‌ లేబుల్‌పైన వివరాలను పరిశీలించాలి. సామర్థ్యం, తయారైన ప్రదేశం, ఖరీదు గమనించాలి. వినియోగ సూచనల పుస్తకంలో కేర్‌ నంబర్‌తో పాటు ఉపయోగించే విధానం తెలుసుకొంటే సమస్య ఎదురయినప్పుడు తక్షణం సంప్రదించే వీలుంటుంది.



  • -Concert


(ఎ సెంటర్‌ ఫర్‌ కన్జూమర్‌ ఎడ్యుకేషన్‌, రీసెర్చ్‌ టీచింగ్‌ ట్రైనింగ్‌ అండ్‌ టెస్టింగ్‌) నివేదిక ఆధారంగా @Eenadu vasundara


  • =======================


 Visit my Website - Dr.Seshagirirao...

Tuesday 11 December 2012

Food items for better sperm count-మగవారిలో సంతనోత్పతి పెంచే ఆహారాలు








http://4.bp.blogspot.com/-f0nOrkbpM_4/ULwJeXsovmI/AAAAAAAADlY/h63BrTcZoVI/s1600/Eating+Fruits+with+outerfeels.jpg






  • పండ్లు , కాయగూరలు ,గింజలు, పప్పులు , కందమూలాలు ,సుగంధద్రవ్యాలు మానవుడికి ప్రక్రుతి ప్రసాదించిన అపురూపమైన వరము .ఆయా సీజన్లలో పండే పండ్లను ఆరగించడం మనకు తరతరాలు గా తెలుసును . అన్నం తో కూడా ప్రకృతిసిద్ధమైన పండ్లు , కూరగాయలు ఇతర త్రునధన్యాలను ఆహారం గా ఆహారముగా తీసుకుని జీవించినట్లయితే శరీరానికి కావససిన అన్నిరకాల పోషకాలు లభిస్తాయి ... ఇదే అసలు ఉత్తమమైన జీవన విధానమని పకృతి వైద్యుల నమ్మకం.....ఆహారం జీవం ఉన్న ప్రతి జీవికి అత్యవసరమైనది. పిండిపదార్ధాలు, మాంసకృత్తులు, కొవ్వుపదార్ధాలు, ఖనిజలవణాలు, పీచుపదార్ధాలు, రోగనిరోధక శక్తికి కావలసిన విటమిన్లు మరియు శరీర పోషణకు రక్షణకు కావలసిన పదార్ధాలను కలిగిన పదార్దాలను ఆహారంగా పేర్కొనవచ్చు. ఇవి కాక శరీరానికి నూతన ఉత్సాహాన్నిచ్చే కాఫీ, టీ లాంటి వాటిని కూడా ఆహారపదార్ధాల కోవలోకి వస్తాయి. ఆహారం ఘన, ద్రవ రూపాలలో లభ్యం అవుతుంది. 














బిడ్డలు పుట్టక పోవడానికి దోషం ఎవరిలో ఉంది? ఒకప్పుడయితే స్త్రీ గర్భం ధరించలేకపోతే దోషం ఆమెదని, ఆమె గొడ్రాలని, పనికి మాలినదని ముద్ర  వేసేవారు. మగవాడు పరిపూర్ణుడనే అపోహ ఉండేది. దంపతుల మధ్య నిస్సారతకు భార్యాభర్తల్లో ఎవరో ఒకరు కారణం కావచ్చు, లేదా ఇద్దరూ కావచ్చు. ఇంకా ఇతర కారణాలు కూడా ఉండొచ్చు.  దంపతులలో సంతానం కలగకపోవటానికి భార్యాభర్త లిరువురిలోనూ లోపాలుండవచ్చు, వైద్య పరిభాషలో  సంతానం కలగకపోవటానికి 40% వరకు ఆడవరిలో లోపాలుండవచ్చు, లేదా 30% వరకు మగవారిలో లోపాలుండవచ్చు, లేదా 20% వరకు ఇద్దరిలో  లోపాలుండవచ్చు, లేదా 10% వరకు దంపతులిద్దరిలోనూ ఇదమిద్దముగా చెప్పలేని కారణాలవల్ల సంతానం కలగకపోవచ్చు.  పెళ్లయి భార్యాభర్తలు కలిసి  జీవిస్తూ ఏ విధమైన సంతాన నిరోధకాలు వాడకుండా ఉన్నా మొదటి సంవత్సరంలోపు సంతానం కలగనట్లయితే వెంటనే సంతాన సాఫల్యతా నిపుణులను  సంప్రదించడం చాలా అవసరం.






  • సంతాన లేమికి మగవారిలో ఉండే కారణాలు :




1. వీర్యంలో వీర్య కణాల సంఖ్య తక్కువగా ఉండుట.

2. వీర్య కణాల కదలిక, సారూప్యంలో అధికముగా తేడాలుండుట.

3. వీర్యంలో వీర్య కణాలు లేకపోవటం.

4. వీర్య కణాలు ప్రయాణించే నాళం మూసుకుపోవటం.

5. హొర్మొన్ల శాతంలో తేడాలుండుట.

6. వీర్యకణాల అండాన్ని ఫలదీకరించే శక్తి తక్కువగా ఉండేందుకు ఎన్నో రకాల కారణాలు ఉండవచ్చు.

7. వీర్యం ఉత్పత్తిలో లేదా పనితీరులో చోటు చేసుకునే అసాధరణత్వాలు,

8. సాధారణ ఆరోగ్యం, జీవనశైలి సంబంధిత అంశాలు,






  • ఆహారాలు :




చక్కని పాపాయి పుట్టాలంటే ఆడవారితో పాటు మగవారు కూడా మంచి ఆహారాలు తీసుకోవాలి. ఆడవారిలో ఫెర్టిలిటీ పెంచే ఆహారాలు ఎలాగైతే ఉన్నాయో  మగవారిలో స్పెర్ము కౌంట్ పెంచే ఆహారాలు కూడా ఉన్నాయి.




  •  వెల్లులి : ఇది ఆడవారిలో మరియు మగవారిలో ఫెర్టిలిటీ నీ పెంచే సూపర్ ఫుడ్. దీనిలో విటమిన్ బీ 6 ఎక్కువగా ఉంటుంది. 

  •  దానిమ్మ : దానిమ్మ గింజలు, రసం స్పెర్ము కౌంట్ ను, వాటి కదలికలను వాటి నాణ్యతను బాగా పెంచుతాయి. 

  •  అరటి : మంచి స్పెర్ము పెరగటానికి అపారమైన అన్ని కారకాలు మనం తీనే అరటిలో ఉన్నాయి. దీనిలో బీ 1 ,సి విటమిన్లు ప్రోటీన్ లు లబిస్తాయి. అరటిలో 

  • ఉండే బ్రోమోలేయిన్ శక్తి వంతమైన సెక్స్ హర్మోనేగా పనిచేస్తది.

  •  పాలకూర : ఫోలిక్ఆసిడ్ ఉంటుంది . ఇది మంచి వీర్య వృదికీ సహకరిస్తాది. పాలకురలో విటమిన్ సి, ఐరన్ కూడా లబిస్తాయి.

  •  మిరపకాయ : చాల మందికి మిరపకాయ గురించి తెలిదు కానీ ఇది ఒక సూపర్ ఫుడ్ అని ఇది మేల్ ఫెర్తిలిటిని పెంచడంలో బాగా సహకరిస్తాది. రోజు గనక మిరపని ఆహారంలో తీంటే ఎన్దోర్ఫిన్లను ఎక్కువ చేస్తాయి. దీని వలన మెదడు  బాగా విశ్రాంతి తీసుకుంటది. మిరపలో సి, బీ , ఈ.. విటమిన్లు సమ్రుదిగా లబిస్తాయి.

  •  టమాటో : అత్యంత సాదారణంగా వాడె ఈ కూరగాయలో కెరొటినోయిడ్స్(carotinoids),లైకోపాన్‌(Licopan) చక్కని వీర్య  శక్తి , మంచి ఆరోగ్యం  ఇస్తుంది. ప్రతిరోజూ ఆహారంలో ఎదో విదంగా దీనిని బాగం చేసుకోవాలి. 

  •   పుచ్చ : దేనిలో సమ్రుదిగా ఉండే  లీకోపాస్, నీటి శాతం మగవారి  ఫెర్టిలిటీ(male fertility) ని మెరుగుపరుస్తాయి. మంచి స్పెర్ము కౌంట్ ను  పెంచుతాయి. మగవారికి తమ శరీరం మంచి హైడ్రేషన్‌(hydration) ఉంచుకోవటం కోసం బాగా సహకరిస్తుంది. 

  • విటమిన్ సి : మేల్ ఫెర్టిలిటీ మెరుగుదలకు ఇది అత్యంత అవసరం. వీర్యంలో DNA ను ఇది కాపాడుతుంది.  ఫెర్టిలిటీ విషయంలో వీర్యాని కాపాడుతుంది. కాకపోతే పొగత్రాగడం వలన శరీరం లోని'సి' విటమిన్ హరిస్తుంది. కాబటి పిల్లలు కావాలి అనుకునే వారు పొగత్రాగటం మానివేయాలి. 

  • ఆపిల్ : దీనిలోగల ఎన్నో ప్రయోజనాలు మనకు తెలుసు కానీ మేల్ ఫెర్టిలిటీ నీ పెంచడం గురించి ఎవరికీ తెలిదు. స్పెర్ం కౌంట్ నీ గణనీయంగా పెంచుతుంది. 

  • జీడిపప్పు : బోజనాల్లో జీడిపప్పు తీనడం వలన కడుపు నిండి, బరువును కంట్రోల్ లో ఉంచడమే కాకా జింక్ శాతం పెంచుతుంది జింక్ ఫెర్టిలిటీ నీ  మెరుగుపరుస్తాయి.












  • =========================




Visit my Website - Dr.Seshagirirao... 

Tuesday 4 December 2012

Cluster Bean-గోరు చిక్కుడు




  • పండ్లు , కాయగూరలు ,గింజలు, పప్పులు , కందమూలాలు ,సుగంధద్రవ్యాలు మానవుడికి ప్రక్రుతి ప్రసాదించిన అపురూపమైన వరము .ఆయా సీజన్లలో పండే పండ్లను ఆరగించడం మనకు తరతరాలు గా తెలుసును . అన్నం తో కూడా ప్రకృతిసిద్ధమైన పండ్లు , కూరగాయలు ఇతర త్రునధన్యాలను ఆహారం గా ఆహారముగా తీసుకుని జీవించినట్లయితే శరీరానికి కావససిన అన్నిరకాల పోషకాలు లభిస్తాయి ... ఇదే అసలు ఉత్తమమైన జీవన విధానమని పకృతి వైద్యుల నమ్మకం.....ఆహారం జీవం ఉన్న ప్రతి జీవికి అత్యవసరమైనది. పిండిపదార్ధాలు, మాంసకృత్తులు, కొవ్వుపదార్ధాలు, ఖనిజలవణాలు, పీచుపదార్ధాలు, రోగనిరోధక శక్తికి కావలసిన విటమిన్లు మరియు శరీర పోషణకు రక్షణకు కావలసిన పదార్ధాలను కలిగిన పదార్దాలను ఆహారంగా పేర్కొనవచ్చు. ఇవి కాక శరీరానికి నూతన ఉత్సాహాన్నిచ్చే కాఫీ, టీ లాంటి వాటిని కూడా ఆహారపదార్ధాల కోవలోకి వస్తాయి. ఆహారం ఘన, ద్రవ రూపాలలో లభ్యం అవుతుంది. 








గోరు చిక్కుడు శాస్త్రీయ నామం... సైమాప్సిస్‌ టెట్రాగోనొలోబా. గింజల్లో సీడ్‌ కోట్‌ (పై పొర), ఎండోస్పెర్మ్‌ (లోపల పప్పు), జెర్మ్‌ అని మూడు భాగాలు ఉంటాయి. ఎండోస్పెర్మ్‌లో గెలాక్టోమెనన్‌ అనే పదార్థం ఉంటుంది. దీని నుంచే జిగురు తయారుచేస్తారు. జోధ్‌పూర్‌లోని సెంట్రల్‌ ఆరిడ్‌ జోనల్‌ రిసెర్చ్‌ ఇన్‌స్టిట్యూట్‌ (కాజ్రి) ఎక్కువ జిగురును ఇచ్చే గోరు చిక్కుడు రకాలపై పరిశోధనలు చేస్తోంది. గంగానగర్‌లోని  వ్యవసాయ విశ్వవిద్యాలయంలో పరిశోధనలు సాగుతున్నాయి. గుంటూరు, తిరుపతి నగరాల్లోని ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన కేంద్రాల్లోనూ అధ్యయనం జరుగుతోంది.



    మనం తినే కేకు, మనం రుద్దే పేస్టు, మనం వాడే షాంపూ, మనం పెట్టే కుక్కబిస్కెట్లూ... అన్నింట్లోనూ 'గోరుచిక్కుడు' ఉంది. డాలర్లదేశం ఆశగా భారత్‌ వైపు చూసేది, ఒక్క గోరుచిక్కుడు కోసమే! ఆ జిగురే కనుక అందకపోతే... అమెరికా చేతిచమురు వదుల్తుంది!



గోరుచిక్కుడుతో కూర వండుకోవచ్చు. సాంబార్లో వేసుకోవచ్చు. నచ్చితే రోటిపచ్చడీ చేసుకోవచ్చు. రొట్టెలోకైనా అన్నంలోకైనా బాగానే ఉంటుంది. మొత్తంగా ఇదో 'మినిమమ్‌ గ్యారెంటీ' కూర! అద్భుతమన్న ప్రశంసలు రావు. చండాలంగా ఉందన్న విమర్శలూ ఉండవు. వేడివేడిగా వడ్డిస్తే కిక్కురుమనకుండా తినేస్తారు.



ఇదో మెట్టపంట. వర్షాభావ పరిస్థితుల్ని తట్టుకుంటుంది. ఇసుక నేలల్లో, ప్రతికూల వాతావరణంలో కష్టాల సాగు చేస్తున్న రాజస్థానీ రైతుల జీవితాల్లో  మెరుపులు మెరిపిస్తోంది. నిన్నమొన్నటిదాకా సైకిళ్లకే దిక్కులేని గ్రామాల్లో ఆడి, బీఎండబ్ల్యూ, టొయోటా-ఫార్చూనర్‌ కార్లు కనిపిస్తున్నాయంటే...అంతా  గోరుచిక్కుడు మహత్యమే! రాజస్థానీలను రాజాలుగా మార్చిన ఆ పంట...ఆంధ్రప్రదేశ్‌ రైతులనూ ఆకట్టుకుంటోంది. వివిధ జిల్లాల్లో ఉత్సాహంగా సాగు చేస్తున్నారు.



గోరుచిక్కుడు మనకు తెలిసిన కూరగాయే..! రాష్ట్రంలోని చాలా ప్రాంతాల్లో పండుతుంది. తెలంగాణాలో దీన్ని 'గోకరకాయ' అని పిలుస్తారు. హిందీలో గౌర్‌ అనీ, ఇంగ్లిష్‌లో క్లస్టర్‌ బీన్‌ అనీ అంటారు. ఈ మొక్క తరాల క్రితమే ఆఫ్రికా నుంచి మన దేశానికి వచ్చిందని నిపుణులు చెబుతారు. ప్రస్తుతం  దక్షిణాసియాలోనే అధికంగా పండుతోంది. భారత్‌లో మరీ ఎక్కువ. ప్రపంచంలో ఉత్పత్తయ్యే గోరుచిక్కుడులో 80 శాతం వాటా మనదే. తర్వాతి స్థానాల్లో  పాకిస్థాన్‌, అమెరికా ఉన్నాయి. దక్షిణాఫ్రికా, మలావి, జైర్‌, సూడాన్‌లలోనూ వాణిజ్య ప్రాతిపదికన సాగు చేస్తున్నారు. మొదట్లో రాజస్థాన్‌ వంటి రాష్ట్రాల్లో   అయితే, ఒంటెలకూ పశువులకూ మేత కోసమే ఎక్కువగా పండించేవారు. గోరుచిక్కుడు జిగురులోని పారిశ్రామిక ప్రయోజనాలు తెలియడంతో...ఆ పంట దిశ  మారింది. రైతన్న దశా మారింది. జోధ్‌పూర్‌, బికనీర్‌, గంగానగర్‌, జైపూర్‌, ఆల్వార్‌ ప్రధాన మార్కెట్లుగా అవతరించాయి. గుజరాత్‌, హర్యానా, మధ్యప్రదేశ్‌ రైతులు పోటీపడి పండిస్తున్నారు. కుబేరులూ కార్పొరేట్లూ కూడా గోరుచిక్కుడు పంట మీద ఆసక్తి చూపుతున్నారు.



గోరుచిక్కుడు పంట చేతికి రాగానే బాగా ఎండబెట్టి, గింజల పొట్టు తీస్తారు. వాటిని పప్పుగా చేస్తారు. ఆ పొడిలో నీళ్లు కలిపితే జిగటజిగటగా మారుతుంది.  ప్రత్యేకంగా జిగురు కోసమే పండించే గోరుచిక్కుడును 'గమ్‌గౌర్‌' అని వ్యవహరిస్తారు. ఐస్‌క్రీమ్‌లు, సాఫ్ట్‌ డ్రింకులు, పుడ్డింగ్స్‌, చాకొలెట్‌ మిల్క్‌, ఫ్లేవర్డ్‌ మిల్క్‌,  జామ్‌, జెల్లీ, బ్రెడ్‌, బిస్కెట్‌, సాస్‌, కెచప్‌, చీజ్‌, క్యాన్డ్‌ ఫిష్‌, క్యాన్డ్‌ మీట్‌, నూడుల్స్‌, పాస్తా...ఇలా రకరకాల ఆహార పదార్థాల్లో వాడతారు. గోరుచిక్కుడు  జిగురులో కేలరీలు ఉండవు. జీర్ణవ్యవస్థ శుద్ధికి ఉపయోగపడుతుంది. కొద్దిగా తీసుకున్నా పొట్ట నిండినట్టు అనిపిస్తుంది. దీంతో బరువు తగ్గాలనుకునేవారి  కోసం ప్రత్యేకంగా తయారు చేసే ఆహార పదార్థాల్లో గోరుచిక్కుడు జిగురును విరివిగా వాడుతున్నారు. పోషకాహారాల తయారీలో, చర్మ సౌందర్యానికి వాడే  లోషన్లలో దీన్ని వినియోగిస్తారు.



వస్త్ర పరిశ్రమ, ముద్రణ, అగ్నిమాపక పదార్థాల తయారీ, సిరామిక్స్‌, దోమల నివారిణులు, కాగితం, వాటర్‌ పెయింట్లు, చమురు బావుల తవ్వకాలు, మైనింగ్‌,  పేలుడు పదార్థాల తయారీలో...గోరుచిక్కుడు జిగురు చాలా కీలకం. చమురు-గ్యాస్‌ బావులకైతే జిగురు లేకపోతే పనే నడవదు. అమెరికా షేల్‌ ఆయిల్‌, షేల్‌  గ్యాస్‌ వెలికితీతపై దృష్టి పెట్టడంతో...మన దేశంలో గోరుచిక్కుడు జిగురు ధరకు  రెక్కలొచ్చాయి. గతంలో క్వింటాలుకు రెండువేల నుంచి నాలుగువేల మధ్య  ఉన్న గింజల ధర గత ఏడాది ముప్పై అయిదువేలు పలికింది. జిగురు ధర లక్షా పదివేల పైమాటే. గోరుచిక్కుడు జిగురుకు అంతర్జాతీయ మార్కెట్లో గొప్ప గిరాకీ ఉంది. అమెరికా తన చమురు పరిశ్రమ అవసరాల కోసం భారత్‌ జిగురుపైనే ఆధారపడుతోంది.



షేల్‌గ్యాస్‌ లేదా నూనె వెలికితీసే 'ఫ్రాకింగ్‌' ప్రక్రియలో ఇది కీలకమైంది. ఇంతకీ షేల్‌ గ్యాస్‌/ఆయిల్‌ అంటే ఏమిటి? ఫ్రాకింగ్‌లో ఏం చేస్తారూ  అంటే..సాధారణంగా సహజవాయువూ చమురూ భూమిలోని రాతి పొరల్లో నిక్షిప్తమై ఉంటాయి. భూమి లోపలికంటా తవ్వి బావుల నుంచి వెలికి తీయాలి.  సాధారణంగా ఇసుకరాయి (శాండ్‌ స్టోన్‌), సున్నపురాయి (లైమ్‌ స్టోన్‌) పొరల్లో నిక్షేపాలు ఉంటాయి. ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా 90 శాతం  సహజవాయువూ చమురూ ఈ రెండురకాల రాళ్ల నుంచే వస్తోంది. ఇసుకరాయిలో రేణువుకీ రేణువుకీ మధ్య, సున్నపురాయిలో లైమ్‌స్టోన్‌లో పొరల మధ్య  ఉన్న ఖాళీలలో గ్యాస్‌, ఆయిల్‌ ఉంటాయి. సంప్రదాయ విధానంలో శిలల్ని బుల్లెట్‌తో పేలుస్తారు. కొన్నిసార్లు రసాయనాలూ పంపిస్తారు. అప్పుడు రాళ్లల్లో  నిక్షిప్తమైన గ్యాస్‌, ఆయిల్‌ బావుల్లోకి వచ్చేస్తుంది. ఇక షేల్‌ గ్యాస్‌నూ షేల్‌ ఆయిల్‌నూ వెలికితీయడం కొంత భిన్నమైన విధానం. భూమి లోపల బంకమట్టి  గట్టిపడగా ఏర్పడిన రాళ్లనే 'షేల్‌' అంటారు. ఈ రాళ్లలో చాలా పలుచని పొరలు ఉంటాయి. భూమి లోపలికి వెళ్లేకొద్దీ ప్రతి 100 మీటర్లకూ మూడు డిగ్రీల  చొప్పున ఉష్ణోగ్రత పెరుగుతూ ఉంటుంది. అత్యధిక ఉష్ణోగ్రత, ఒత్తిడి తదితర కారణాల వల్ల... కాలక్రమంలో బంకమట్టి గట్టిపడి 'హార్డ్‌రాక్‌'గా మారుతుంది. ఈ  ప్రక్రియలో మట్టిలో ఉండే నీరు, చమురు వంటివి చాలా వరకూ బయటికెళ్లిపోతాయి. ఇంకా కొంత గ్యాస్‌, ఆయిల్‌ రాతి పొరల మధ్యలో చిక్కుకుపోయి  ఉంటుంది. దీన్ని బయటికి తీయాలంటే రాతిని ముక్కలు చేయాలి. పగుళ్లు సృష్టించాలి. పొరలమధ్య దూరాన్ని పెంచాలి. షేల్‌ గ్యాస్‌/ఆయిల్‌ కోసం భూమి  లోపలి వరకు నిట్టనిలువుగా తవ్వకాలు (డ్రిల్లింగ్‌) జరుపుతారు. మట్టిపొరలు తగిలాక భూమిలోపల సమాంతరంగా తవ్వకాలు చేస్తారు, నీటిలో వివిధ  రసాయనాల్ని కలిపి ఎక్కువ పీడనంతో భూమి లోపలికి పంపుతారు. మట్టి రేణువుల మధ్య ఖాళీ ఏర్పడేలా చేస్తారు. అప్పుడే దాన్లోని చమురు గ్యాస్‌  బావిలోకి చేరుతుంది. భారీగా నీటిని వాడతారు కాబట్టి ఈ ప్రక్రియను హైడ్రో ఫ్రాక్చరింగ్‌ అనీ ఫ్రాకింగ్‌ అనీ పిలుస్తారు. ఇలా భూమి లోపలికి పంపించే  పదార్థాన్ని ప్రొపొనెంట్‌ అంటారు. 'షేల్‌' బావుల్లోకి పంపే ప్రొపొనెంట్స్‌లో ఎక్కువ శాతం గోరుచిక్కుడు జిగురు ఉంటుంది. ఆ పదార్థం లేకుండా షేల్‌ గ్యాస్‌  తవ్వకాలు అసాధ్యం. అమెరికాలో ప్రస్తుతం 30 శాతం వరకు గ్యాస్‌ 'షేల్‌' నుంచే వస్తోంది. మనం జిగురు సరఫరా చేయకపోతే ఆ బావులన్నీ  మూతపడినట్టే. అందుకే మరి, మన దగ్గర గోరుచిక్కుడు ఉత్పత్తి తగ్గితే అమెరికాకు చెమటలు! షేల్‌ గ్యాస్‌ వెలికి తీయడం కొంత సంక్లిష్టమైన ప్రక్రియే అయినా, చాలా దేశాలు దీనిపై దృష్టి సారిస్తున్నాయి. సంప్రదాయ ఇంధన వనరులు క్రమంగా  తగ్గుముఖం పడుతుండటంతో ప్రత్యామ్నాయాలు వెతుక్కోవడం తప్పనిసరి అవుతోంది. పైగా సహజవాయువుల కోసం, చమురు కోసం పూర్తిగా  దిగుమతులపైనే ఆధారపడటం ఎప్పటికైనా ప్రమాదమే. ప్రపంచంలోని చాలా దేశాల్లో షేల్‌ గ్యాస్‌/ఆయిల్‌ నిల్వలు ఉన్నట్టు గుర్తించారు. ప్రస్తుతానికి, కొన్ని  దేశాలు మాత్రం వెలికి తీస్తున్నాయి. భారత్‌ కూడా షేల్‌ గ్యాస్‌ ప్రాధాన్యాన్ని గుర్తించింది. మన దగ్గరే కాదు, పొరుగు దేశాల్లోనూ లీజుల ద్వారా తవ్వకాలు  జరుపుతామని పెట్రోలియం, సహజ వాయువుల మంత్రిత్వశాఖ ప్రకటించింది. ఆ ప్రక్రియ ఇప్పటికే మొదలైంది కూడా. అమెరికాలో అయితే ఎప్పుడో  2004లోనే ఈ కార్యక్రమం వూపందుకుంది. ప్రస్తుతం అక్కడ 30 శాతం సహజవాయువు షేల్‌ నుంచే వస్తోంది. మనం కూడా షేల్‌ గ్యాస్‌ వంటి  ప్రత్యామ్నాయాల్ని వెతకాల్సిన అవసరం చాలా ఉంది. భారత్‌లో చాలా చోట్ల 'షేల్‌' ఉన్నా, గ్యాస్‌/ఆయిల్‌ నిక్షేపాలు కలిగిన షేల్‌ కొన్ని చోట్లే ఉంటుందని  చమురు రంగ నిపుణులు చెబుతున్నారు. ప్రస్తుతం మన అవసరాలకు 176 మిలియన్‌ మెట్రిక్‌ టన్నుల చమురు అవసరమైతే, 2011-12లో 48  మిలియన్‌ మెట్రిక్‌ టన్నులే ఉత్పత్తి చేయగలిగాం. గ్యాస్‌ 64 బీసీఎం (బిలియన్‌ క్యూబిక్‌ మీటర్లు) అవసరమైతే గత సంవత్సరం 52 బీసీఎం ఉత్పత్తి  చేయగలిగాం. మిగిలింది అంతా, విదేశాల నుంచే దిగుమతి  సుకుంటున్నాం. భవిష్యత్‌తో షేల్‌ ప్రాధాన్యం మరింత పెరగడం ఖాయం. దాంతోపాటే...  గోరుచిక్కుడు మార్కెట్‌ కూడా!



దేశంలో ఉత్పత్తి అవుతున్న గోరుచిక్కుడు జిగురులో 75 శాతం వరకు రాజస్థాన్‌ నుంచే వస్తోంది. ఈ పరిశ్రమలకు జోధ్‌పూర్‌ ప్రధాన కేంద్రం. గంగానగర్‌లో  ఓ పరిశోధన కేంద్రం కూడా ఉంది. రాజస్థాన్‌లో వర్షాలు అంతంతమాత్రమే కావడంతో కాలం కలిసొస్తే నాలుగు గింజలు రాలేవి. రైతుకు నాలుగు రాళ్లు  వచ్చేవి. ధరలూ తక్కువే కావడంతో గోరుచిక్కుడు సేద్యం లాభదాయకంగా ఉండేది కాదు. దళారుల దోపిడీ సరేసరి. వ్యాపారులు, పరిశ్రమల యజమానులు  మాత్రం బాగుపడేవారు. గత సంవత్సరం పరిస్థితి మారిపోయింది. ఉత్తర అమెరికాలో షేల్‌ గ్యాస్‌ బూమ్‌తో గోరుచిక్కుడు జిగురుకు ఒక్కసారిగా గిరాకీ  పెరిగింది. ధరలు నింగినంటాయి. వూహించని డబ్బు వచ్చిపడటంతో రాజస్థాన్‌ రైతులు ఉబ్బితబ్బిబ్బయ్యారు. ప్రజల జీవనశైలే మారిపోయింది. అప్పటి  వరకు గుడిసెల్లో బతుకీడుస్తున్నవారు పక్కా ఇళ్లు కట్టుకున్నారు. టీవీ, ఫ్రిజ్‌ వంటి గృహోపకరణాలు సమకూర్చుకున్నారు. ట్రాక్టర్లు కొనుక్కున్నారు.  ఆమధ్య గంగానగర్‌కు చెందిన 70 ఏళ్ల బీర్బల్‌ 20 క్వింటాళ్ల గింజల్ని దాదాపు ఐదున్నర లక్షలకు విక్రయించాడు. విత్తనాల కోసం క్వింటాలు గింజల్ని  దాచుకున్నాడు. వాటిని దొంగలు ఎత్తుకెళ్లకుండా గట్టి కాపలా ఏర్పాటు చేసుకున్నాడట. వ్యాపారి రాధేశ్యామ్‌ గోరుచిక్కుడులో సంపాదించిన లాభాలతో 

హాంకాంగ్‌లో స్థిరాస్తి వ్యాపారం చేయాలని ఉవ్విళ్లూరుతున్నాడట. సేద్యానికి  ట్టుబడి సమస్యే లేదు. రైతులు వ్యాపారుల దగ్గరకు వెళ్లడం కాదు...  వ్యాపారులే రైతుల దగ్గరకు వచ్చి బయానా సమర్పిస్తున్నారు. విత్తనాలూ గట్రా సరఫరా చేస్తున్నారు. రైతేరాజు అన్నమాట రాజస్థాన్‌ రైతన్నల విషయంలో  నిజమవుతోంది! గోరుచిక్కుడు పంటలోనూ, గోరుచిక్కుడు జిగురు ఎగుమతిలోనూ మనదేశం అగ్రగామిగా ఉంది. అంతర్జాతీయ పారిశ్రామిక అవసరాల్లో ఎనభై శాతం దాకా  ఇక్కడి నుంచే వెళ్తోంది. భారత్‌లో గోరుచిక్కుడు గింజల సగటు ఉత్పత్తి 10-11 లక్షల టన్నులు. దేశం నుంచి 1-1.5 లక్షల టన్నుల జిగురు ఏటా  ఎగుమతి అవుతోంది. మరో 20 నుంచి 30 వేల టన్నుల జిగురును దేశీయంగా వినియోగిస్తున్నాం. మన దేశం నుంచి ఎగుమతి అవుతున్న ఆహార  పదార్థాల్లో బాస్మతి బియ్యం తర్వాతి స్థానం గోరుచిక్కుడుదే. అయితే, భారత్‌ నుంచి గింజల రూపంలో గోరు చిక్కుడు ఎగుమతుల్లేవు. దీనిపై నిషేధం  విధించారు. పప్పు లేదా జిగురు రూపంలోనే పంపాలి. ధరలు అదుపు తప్పడంతో ఫ్యూచర్స్‌ ట్రేడింగ్‌ను కూడా నిలిపేశారు. ఉత్తర భారతంలో దీన్ని ఖరీఫ్‌ 

పంటగా వేస్తారు. గత సీజన్‌లో అక్కడ 12 లక్షల టన్నుల గింజలు పండించారు. ఈ సంవత్సరం 15 నుంచి 18 లక్షల టన్నుల దాకా చేతికొస్తుందని  భావిస్తున్నారు. ప్రస్తుతానికైతే, గోరుచిక్కుడు ధరలు తగ్గాయి. అయినా క్వింటాలుకు రూ.8 వేల దాకా పలుకుతోంది.



కూరగాయ గోరుచిక్కుడుకీ జిగురు గోరు చిక్కుడుకీ కొంత తేడా ఉంది. కూరగాయగా పండించడం అన్నది, రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో ఉంది. గత ఏడాది  ఒక్కసారిగా డిమాండ్‌ పెరగడంతో కూరగాయగా పండించిన గోరుచిక్కుడునే కొందరు రైతులు జిగురు కోసం విక్రయించారు. ఇప్పుడు రాజస్థాన్‌, గుజరాత్‌ల  నుంచి విత్తనాలు తెచ్చుకుని వాణిజ్య ప్రాతిపదికన సాగు చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. అనంతపురం జిల్లా వంటి వర్షాభావ ప్రాంతాల్లో ఇప్పటికే  ప్రభుత్వ ప్రోత్సాహంతో సాగు చేస్తుండగా...ఇప్పుడు గుంటూరు, ప్రకాశం, కృష్ణా జిల్లాల్లోను పెద్ద ఎత్తున సాగు చేయాలని భావిస్తున్నారు. మన రాష్ట్రం  నెలనెలా 200 టన్నుల జిగురును ఉత్తరభారతం నుంచి దిగుమతి చేసుకుంటోంది. ఇందులో 50 టన్నుల వరకు మస్కిటో కాయిల్స్‌ తయారీకే  వాడుతున్నారు. గోరుచిక్కుడులో రెండు రకాలు... 80-90 రోజుల్లో కోతకు వచ్చేవి ఉన్నాయి, 120-125 రోజుల్లో కోతకు వచ్చేవీ ఉన్నాయి. పెద్దగా తెగుళ్లు  లేకపోవడం, వర్షాభావ పరిస్థితుల్ని తట్టుకునే గుణం ఉండటం, పెట్టుబడి తక్కువ కావడం, గిరాకీ బాగుండటం... తదితర కారణాల వల్ల రైతులు మక్కువ  చూపుతున్నారు. పత్తి, మిరప దెబ్బతీస్తుండటంతో గోరు చిక్కుడు ఆశాకిరణంలా కనిపిస్తోంది. అలా అని, అనాలోచితంగా అడుగు ముందుకేయడమూ 

ఇబ్బందే. దీనిపై ఇంకా కొంత అధ్యయనం జరగాల్సి ఉంది. అన్ని కాలాల్లో, అన్ని నేలల్లో, వివిధ వాతావరణ పరిస్థితుల్లో పండించి చూసిన తర్వాత కానీ ఒక  నిర్ణయానికి రావడం కష్టమంటున్నారు అనుభవజ్ఞులు.



ఆంధ్రప్రదేశ్‌లో మొదలైన హంగామా ... రాజస్థాన్‌, గుజరాత్‌ వ్యాపారులను ఆకర్షిస్తోంది. పల్లెల్లో ప్రత్యక్షమైపోయి, క్వింటాలుకి రూ.10-12 వేలు  ఇస్తామంటూ రైతులతో ఒప్పందం చేసుకునే ప్రయత్నాలు చేస్తున్నారు. కానీ మన రైతుల్లో చాలా మంది ముందస్తు ఒప్పందానికి సిద్ధంగా లేరు. సీజన్‌లో  మంచి ధరలు వస్తాయన్న ఆశ వారిలో కనిపిస్తోంది. ''ముప్పై ఏళ్ల నుంచీ గోరు చిక్కుడు పండిస్తున్నా. ఇది వరకు పంటలో పనికిరాని విత్తనాల్ని జిగురు  కోసం పంపించేవాళ్లం. ఇప్పుడు గిరాకీ పెరగడంతో 10 ఎకరాల్లో కేవలం జిగురు గోరుచిక్కుడునే పండించాలని అనుకుంటున్నా. ఎకరానికి రూ.10 వేల  వరకూ పెట్టుబడి అవుతుంది. తెగుళ్లు తక్కువ. క్వింటాలుకి రూ.8 వేలు ధర వచ్చినా కూడా, మిగతా అన్ని పంటల కంటే ఇది లాభదాయకంగా ఉంటుంది''  అంటారు గుంటూరు జిల్లా కాకుమానుకు చెందిన జెట్టి రత్తయ్య. ఈ పంట మన రాష్ట్రానికి చాలా అనుకూలమని, ప్రస్తుతం మంచి గిరాకీ ఉన్నందున రైతులు  సాగు చేయవచ్చునని విశ్రాంత వ్యవసాయ శాస్త్రవేత్త ఆలపాటి సత్యనారాయణ అభిప్రాయపడుతున్నారు. మన రాష్ట్రంలో ఈ ఖరీఫ్‌లో 6645 ఎకరాల్లో  జిగురు గోరుచిక్కుడును సాగు చేస్తున్నారు. ఒక్క అనంతపురం జిల్లాలోనే 3500 ఎకరాల్లో సాగు ఉంది. ఏది ఎలా ఉన్నా, మార్కెట్‌ పరిస్థితుల్ని దృష్టిలో  ఉంచుకుని పంట వేయాలని వ్యవసాయ నిపుణులు సూచిస్తున్నారు. అందరూ వేలం వెర్రిగా ఇదే పంట వేసినా, సరఫరా పెరిగి ధరలు పడిపోతే నష్టపోవాల్సి  వస్తుందని హెచ్చరిస్తున్నారు. అంతర్జాతీయంగా మాత్రం పరిస్థితులు ఆశాజనకంగానే ఉన్నాయి. ప్రస్తుతం షేల్‌ గ్యాస్‌ ఎక్కువగా అమెరికాలోనే వెలికి తీస్తున్నారు. చైనాలో కూడా భారీ  నిల్వలు ఉన్నట్టు అంచనా. మరికొన్ని దేశాలు త్వరలో షేల్‌ గ్యాస్‌ వెలికితీయడంపై దృష్టి పెట్టనున్న నేపథ్యంలో భవిష్యత్‌ బంగారమే అన్న సంకేతాలు కనిపిస్తున్నాయి. రైతన్న గోరుచిక్కుడుపై కొండంత ఆశే పెట్టుకున్నాడు. గోరుచిక్కుడు జిగురుకు ఔషధగుణాలున్నాయి. కొలెస్ట్రాల్‌ను నియంత్రించడంలో ఉపయోగపడుతుంది. ఇందులో ఫైబర్‌ అధికంగా ఉంటుంది. టన్ను నాణ్యమైన గోరుచిక్కుడుతో 300 కిలోల జిగురు తయారవుతుంది. సాధారణ జిగురుతో పోలిస్తే... ఆయిల్‌, గ్రీజు వంటి వాటిని కూడా తట్టుకుని నిలిచే శక్తి ఉంది. వర్షాభావ పరిస్థితుల వల్ల అనంతపురం జిల్లాలో వేరుసెనగ పంటకు తీవ్ర నష్టం వాటిల్లుతోంది. దీంతో ప్రత్యామ్నాయాలపై అధ్యయనం చేసేందుకు 'ఆపరేషన్‌  అనంత' పేరుతో ఓ కార్యక్రమాన్ని చేపట్టారు. భారత వ్యవసాయ పరిశోధన మండలి (ఐసీఏఆర్‌)  శాస్త్రవేత్తల బృందం అనంతపురం వెళ్లి అధ్యయనం చేసింది.  వివిధ ప్రత్యామ్నాయ పంటలు సూచించింది. వాటిలో గోరుచిక్కుడు ఒకటి. సాగు లాభదాయకంగా అనిపించడంతో రైతులు మొగ్గు చూపుతున్నారు.  అనంతపురం రైతులకు  ఇచ్చేందుకు విత్తనాలు కావాలంటూ రాజస్థాన్‌ విత్తనాభివృద్ధి సంస్థను మన ప్రభుత్వం కోరింది. కానీ వాళ్లు చేతులెత్తేశారు. దీంతో జోధ్‌పూర్‌ కేంద్రంగా  నిచేస్తున్న ఓ ప్రైవేటు పరిశ్రమ పంటను తిరిగి కొంటామంటూ ఉచితంగా విత్తనాలు అందజేసింది. ఒకటిరెండు పంటలు బాగా వస్తే... సాగు పుంజుకునే అవకాశం ఉంది.





Courtesy with--జె.కళ్యాణ్‌బాబు, ఈనాడు, గుంటూరు @Eenadu sunday magazine


  • =========================


Visit my Website - Dr.Seshagirirao...

Sunday 2 December 2012

Nutrients of outerfeel of fruits & vegetables-పండ్లు.కాయల తొక్కల్లో పోషకాలు




  •  image : courtesy with Eenadu vasundara paper







పండ్లు , కాయగూరలు ,గింజలు, పప్పులు , కందమూలాలు ,సుగంధద్రవ్యాలు మానవుడికి ప్రక్రుతి ప్రసాదించిన అపురూపమైన వరము .ఆయా సీజన్లలో పండే పండ్లను ఆరగించడం మనకు తరతరాలు గా తెలుసును . అన్నం తో కూడా ప్రకృతిసిద్ధమైన పండ్లు , కూరగాయలు ఇతర త్రునధన్యాలను ఆహారం గా ఆహారముగా తీసుకుని జీవించినట్లయితే శరీరానికి కావససిన అన్నిరకాల పోషకాలు లభిస్తాయి ... ఇదే అసలు ఉత్తమమైన జీవన విధానమని పకృతి వైద్యుల నమ్మకం.....ఆహారం జీవం ఉన్న ప్రతి జీవికి అత్యవసరమైనది. పిండిపదార్ధాలు, మాంసకృత్తులు, కొవ్వుపదార్ధాలు, ఖనిజలవణాలు, పీచుపదార్ధాలు, రోగనిరోధక శక్తికి కావలసిన విటమిన్లు మరియు శరీర పోషణకు రక్షణకు కావలసిన పదార్ధాలను కలిగిన పదార్దాలను ఆహారంగా పేర్కొనవచ్చు. ఇవి కాక శరీరానికి నూతన ఉత్సాహాన్నిచ్చే కాఫీ, టీ లాంటి వాటిని కూడా ఆహారపదార్ధాల కోవలోకి వస్తాయి. ఆహారం ఘన, ద్రవ రూపాలలో లభ్యం అవుతుంది.





    అరటిపండు తింటూ తొక్కనీ, దోసకాయ వండుతూ చెక్కునీ తీసి పారేయడం అలవాటు. కానీ అసలు విషయమంతా వాటిల్లోనే ఉంది అంటున్నారు పోషకాహార నిపుణులు. పండ్లలో అసలు కంటే కొసరుగా ఉండే చెక్కులోనే ఎక్కువ పోషకాలు ఉంటాయని అధ్యయనాలూ వెల్లడించాయి. తీసి పారేయొద్దు... తింటేనే మేలు!  ఆ వివరాలు తెలుసుకుంటే, తీసి పారేసే వాటితో విభిన్న వంటకాలను ప్రయత్నించొచ్చు. పోషకాలనూ పొందవచ్చు.




  • బీరకాయ తొక్క :


మనందరికీ గుర్తుండే ఉంటుంది, చిన్నప్పుడు బీరకాయలని అమ్మ పప్పుతో కలిపి వండేది. అంతటితో సరిపెట్టుకొనేది కాదు, బీర చెక్కుని పారేయకుండా దానితో తీయగా, పుల్లగా ఉండే పచ్చడి చేసి పెట్టేది. బీరకాయలతో పోలిస్తే, దాని పొట్టులో పోషకాలు అధికం. దాన్నుంచి లభించే పీచు మలబద్దకాన్ని తగ్గించేందుకు దోహదం చేస్తుంది. అధిక కెలొరీలు, చక్కెరలు, కొవ్వుల ప్రమాదం ఉండదు. సొరకాయలు, లేత అరటి కాయల పొట్టుతోనూ పచ్చళ్లు చేసుకోవచ్చు. అవీ ఆరోగ్యానికి ఉపకరించేవే. దోసకాయ పప్పు, కూరలు చేసేప్పుడు సాధారణంగా చెక్కు తీసేస్తారు. దోస ఆవకాయకి మాత్రం ఉంచుతాం. దోస చెక్కులో పీచు అపారం. చక్కటి కంటిచూపునకు ఉపయోగపడే విటమిన్‌ 'ఎ', బీటా కెరొటిన్‌ దీన్నుంచి లభ్యమవుతాయి. చిలగడ దుంపల్ని ఉడకబెట్టినప్పుడు పై పొట్టు తీసేసి తినడం చాలామందికి అలవాటు. కానీ ఈ తీసేసే వాటిల్లో రక్తహీనతను తగ్గించే ఇనుము, వ్యాధి నిరోధక శక్తిని పెంచే జింక్‌ పోషకాలుంటాయి.




  • యాపిల్ తొక్క లో యాంటీ ఆక్సిడెంట్లు అధికం..


రోజుకో ఆపిల్‌ తింటే వైద్యుడిని కలవాల్సిన అవసరం లేదని చెబుతారు. అందుకేగా, యాపిల్‌తో చేసిన డ్రింక్‌లూ, జ్యూస్‌లూ తాగుతున్నాం అనకండి! అందరూ అనుకొనేట్టు యాపిల్‌ గుజ్జులో ఎక్కువ యాంటీ ఆక్సిడెంట్లు ఉండవు. గుజ్జులో కంటే తొక్కలో ఐదురెట్లు ఎక్కువ శక్తివంతమైన యాంటీ ఆక్సిడెంట్లు ఉంటాయని అధ్యయనాలు తెలిపాయి. జర్నల్‌ ఆఫ్‌ అగ్రికల్చర్‌ అండ్‌ ఫుడ్‌ కెమిస్ట్రీ అధ్యయనం ప్రకారం, యాపిల్‌ తొక్కులో రొమ్ము, కాలేయం, పెద్ద పేగు క్యాన్సర్లను నయం చేసే శక్తి ఉంది. జ్యూస్‌ తాగడం కన్నా యాపిల్‌ని కొరుక్కు తినడం వల్లే ఎక్కువ మేలు. చర్మం నిగనిగకు, చిగుళ్ల సంరక్షణకు ఉపయోగపడే శక్తివంతమైన పాలీఫినాల్స్‌ ఎక్కువగా పొందగలం కూడా.



ఇక, పుల్లని నల్ల ద్రాక్షల విషయానికొస్తే, చాలామంది యథాతథంగా తినకుండా చక్కెర కలిపిన జ్యూస్‌గా తాగుతారు. రుచి బాగుంటుంది. కానీ రసం తీసి వడ కట్టినప్పుడు పుష్కలంగా యాంటీ ఆక్సిడెంట్లు ఉండే చెక్కులో పాతిక శాతం వినియోగించుకోలేకపోతాం. దాంతో కొలెస్ట్రాల్‌ నిరోధక గుణాలనీ కోల్పోతాం. జామకాయలు మరీ పచ్చిగా ఉన్నా, పూర్తిగా పండినా ఏం చేస్తాం... ముక్కలుగా కోసం మధ్యలో ఉండే మెత్తని గుజ్జుని తినేస్తాం. కానీ ఇది సరికాదు. దీనివల్ల యాంతోసియానిన్‌ అనే క్యాన్సర్‌ నియంత్రణ కారకాన్ని పొందలేము.



కేక్‌లు, సలాడ్లలో నిమ్మపొడి...

నోటికి ఏ రుచీ సహించనప్పుడూ నిమ్మకాయ, చింతకాయ పచ్చళ్లు తినాలనిపిస్తుంది. రుచికంటే వీటికుండే వాసనే సగం సాంత్వన కలిగిస్తుంది. నిమ్మ, నారింజ చెక్కులో ఉండే మోనోటెర్‌పాన్స్‌ నూనెలు ప్రత్యేక వాసనలని వెదజల్లుతాయి. వీటికి చర్మ, కాలేయ, గర్భాశయ, వూపిరితిత్తుల క్యాన్సర్లని నివారించే శక్తి ఉంది. పచ్చళ్ల రూపంలో ఇప్పటికే వీటిని తింటున్నాం. పచ్చళ్లు వద్దనుకునే వాళ్లు నిమ్మతొక్కలతో చేసిన చాయ్‌కి హాయ్‌ చెప్పేయచ్చు. కేకులు, సలాడ్లలో లెమన్‌ పీల్‌ పొడిని చల్లుకొన్నా రుచిగానే ఉంటుంది. పదార్థాలని బేక్‌ చేసేటప్పుడూ, మఫిన్స్‌, బిస్కట్లలో కూడా ఈ పౌడర్‌ని ఎక్కువగా వాడుతుంటారు.



తెల్లని గుజ్జుని వదలొద్దు...

పుచ్చకాయ ముక్కలు అంటే ఎర్రని గుజ్జే అనుకుంటాం. కానీ అడుగున ఉండే తెల్లని పదార్థంలో పోషకాలు పుష్కలం. దాన్లో సిట్రులిన్‌ అనే పోషక పదార్థం ఉంటుంది. వ్యాధి నిరోధక శక్తిని పెంచే అమినోయాసిడ్లు, విటమిన్‌ సి, విటమిన్‌ 'ఎ', థయామిన్‌, రైబోఫ్లెవిన్‌... రక్తహీనత రాకుండా చూసే ఇనుము, మెగ్నీషియమ్‌, ఎముకల బలానికి తోడ్పడే క్యాల్షియం ఉంటాయి. పోషకాలు అపారం కాబట్టి జ్యూస్‌ తయారు చేసేప్పుడు కాస్త లోతుగా కట్‌ చేయడం వల్ల తెలుపు రంగు పదార్థాన్నీ మిక్సీలో వేయొచ్చు.



దానిమ్మ టీ...

ఎర్రెర్రని దానిమ్మ గింజల్లో కంటే దాని పొట్టులో రెండు రెట్లు ఎక్కువగా శక్తివంతమైన పోషకాలుంటాయి. కానీ దానిని తినడం మనవల్ల అయ్యే పనికాదుగా. అందుకే దానిని ఎండబెట్టి పొడి చేసుకొని టీ చేసుకోవచ్చు.



* తీపి గుమ్మడి పులుసు పెట్టినప్పుడు చెక్కు తీయడం ఎందుకు? దానిలో ఇన్‌ఫెక్షన్ల బారిన పడకుండా చేసే యాంటీ బ్యాక్టీరియల్‌ గుణాలు అధికం.



* ఆలూ దుంపలపై ఉండే పొరలో విటమిన్‌సి, బి6, పొటాషియం, మాంగనీస్‌ పోషకాలు ఉంటాయి. అందుకే ఆలూ పరాటా చేసినప్పుడు పొట్టు తీయకుండా ఉంటే సరిపోతుంది



 -- courtesy with Eenadu Telugu daily news paper


  • =======================


 Visit my Website - Dr.Seshagirirao.../