Pages

Labels

Blog Archive

Popular Posts

Monday 19 December 2011

ఆఫీసులో ఉద్యోగినులు-పోషకాహారం అవగాహన , Women employees-Nutritiona food Awareness


  • image : courtesy with Eenadu newspaper.

పండ్లు , కాయగూరలు ,గింజలు, పప్పులు , కందమూలాలు ,సుగంధద్రవ్యాలు మానవుడికి ప్రక్రుతి ప్రసాదించిన అపురూపమైన వరము .ఆయా సీజన్లలో పండే పండ్లను ఆరగించడం మనకు తరతరాలు గా తెలుసును . అన్నం తో కూడా ప్రకృతిసిద్ధమైన పండ్లు , కూరగాయలు ఇతర త్రునధన్యాలను ఆహారం గా ఆహారముగా తీసుకుని జీవించినట్లయితే శరీరానికి కావససిన అన్నిరకాల పోషకాలు లభిస్తాయి ... ఇదే అసలు ఉత్తమమైన జీవన విధానమని పకృతి వైద్యుల నమ్మకం.....ఆహారం జీవం ఉన్న ప్రతి జీవికి అత్యవసరమైనది. పిండిపదార్ధాలు, మాంసకృత్తులు, కొవ్వుపదార్ధాలు, ఖనిజలవణాలు, పీచుపదార్ధాలు, రోగనిరోధక శక్తికి కావలసిన విటమిన్లు మరియు శరీర పోషణకు రక్షణకు కావలసిన పదార్ధాలను కలిగిన పదార్దాలను ఆహారంగా పేర్కొనవచ్చు. ఇవి కాక శరీరానికి నూతన ఉత్సాహాన్నిచ్చే కాఫీ, టీ లాంటి వాటిని కూడా ఆహారపదార్ధాల కోవలోకి వస్తాయి. ఆహారం ఘన, ద్రవ రూపాలలో లభ్యం అవుతుంది.


ఆఫీసులో ఉద్యోగినులు-పోషకాహారం అవగాహన :

ఆఫీసులో పని కాస్త ఎక్కువయితే కాఫీలు, టీలు. కొద్దిపాటి విరామం దొరికితే సమోసాలు, బజ్జీలు. క్షణం తీరిక లేకుండా ఉంటే భోజన విషయం పక్కనపెట్టి పనిలో మునిగిపోవడం. ఉద్యోగినుల్లో ఎక్కువమంది పాటించే ఆహారపు అలవాట్లివి. బరువును పెంచి, ఉత్సాహాన్ని తగ్గించే ఈ అలవాట్లకు బదులుగా ఆఫీసులో ఉద్యోగినులు తీసుకోవాల్సిన పోషకాహారం గురించి నిపుణులు ఇలా వివరిస్తున్నారు.

ఆఫీసులో ఉన్నప్పుడు ఒకటికి నాలుగు సార్లు టీ, కాఫీలు సేవించడం.. శీతలపానీయాలు తాగడం అందుబాటులో ఉండే జంక్‌ఫుడ్‌ను లాగించేయడం చాలామందికి అలవాటు. ఇవి శరీరానికి నూతనోత్సాహాన్ని అందించడానికి బదులు శక్తిహీనంగా మార్చేస్తాయి. ఏకాగ్రతని దెబ్బతీస్తాయి. అందుకే ఈ అలవాట్లను నియంత్రించడం లేదా కాఫీ, టీలను ఆరోగ్యకర పానీయాలుగా మలుచుకోవడం చాలా అవసరం.

స్పానీటితో... శక్తినిచ్చే టీలు
స్పా వాటర్‌.. మినరల్‌ వాటర్‌ మాదిరిగానే ఈ మధ్యకాలంలో మార్కెట్‌లో ఈ నీళ్ల సీసాలు లభ్యమవుతున్నాయి. ఆరోగ్యకరమైన, ప్రత్యేకమైన ఖనిజ లవణాలని అందించే ఈ నీటిని జోడించి ఆఫీసులో సొంతంగా హెర్బల్‌ టీలు చేసుకోవచ్చు. పంచదార వాడకాన్ని తగ్గిస్తే కెలొరీలు తగ్గి అధిక బరువు సమస్య ఉండదు.

* దంచిన పుదీనా ఆకులు, అల్లం, నిమ్మ, బత్తాయి రసాలు వీటిలో ఏవి దొరికితే వాటిని గ్లాసుడు చల్లని స్పా నీటిలో కలిపి, చెంచా పంచదార వేసి టీ చేసుకోవచ్చు. దీని నుంచి 15 కెలొరీలు మాత్రమే అందుతాయి.

* స్పా నీటితో చేసిన బ్లాక్‌టీ, గ్రీన్‌టీ, డీకేఫ్‌ పానీయాలు(కెఫీన్‌ లేనివి) ఆరోగ్యదాయకం.

* దాల్చినచెక్క, వెనిల్లా టీలు పంచదార వేయకపోయినా రుచిగానే ఉంటాయి. మామూలు టీ, కాఫీలకు బదులు ఈ టీలు తాగడం వల్ల ఫ్లవనాయిడ్లు, యాంటీఆక్సిడెంట్లు సమృద్ధిగా అంది శరీరం నూతనోత్సాహం సంతరించుకొంటుంది. పనిపై ఏకాగ్రత పెరుగుతుంది.

కెలొరీలు లేని కాఫీలు
టీ కంటే కాఫీ తయారీలో పాలు ఎక్కువ పడతాయి. అందుకనుగుణంగా రుచికోసం వాడే క్రీం, పంచదార వినియోగమూ ఎక్కువే. ఫలితంగా కాఫీ అందించే కెలొరీలు ఎక్కువే! ఒక పెద్ద కప్పు కాఫీ నుంచి అందే కెలొరీలు 300 నుంచి 400 వరకు ఉంటాయి.

* ఒక చిన్న చెంచా పంచదారతో.. మీగడ లేని కాఫీ తాగడం వల్ల సమస్య ఉండదు.

అప్పటికప్పుడు అందుబాటులో పండ్లరసాలు
క్యాంటీన్‌కు వెళితే సోడా అధికంగా ఉండే శీతల పానీయాల వైపు మనసు మళ్లడం సాధారణమే! బదులుగా బజారులో దొరికే పండ్ల గుజ్జుని కొనిపెట్టుకొని అవసరం అయినప్పుడు చల్లని మినరల్‌ వాటర్‌ లేదా స్పా నీళ్లతో కలుపుకోవచ్చు. రెండు చెంచాల గుజ్జుకు గ్లాసుడు నీళ్లు కలపొచ్చు.

* కప్పు శీతలపానీయాల నుంచి 150 కెలొరీలు అందితే.. ఈ రకం పండ్లరసం నుంచి 18 కెలొరీలు మాత్రమే అందుతాయి.

తాజాగా ఫ్రూట్‌ కూలర్లు..
సూపర్‌మార్కెట్లలో తక్షణ శక్తినిచ్చే ఎనర్జీ డ్రింకులు దొరుకుతున్నాయి. కానీ వీటిల్లో ఉండే కెలొరీలు ఎక్కువే. బదులుగా కప్పు ఐసు, కప్పు మినరల్‌ వాటర్‌, కొద్దిగా స్టాబెర్రీలు వేసి మిక్సీలో ఒకసారి తిప్పాలి. గ్లాసులోకి తీసుకొని పుదీనాతో అలంకరించుకొని తాగేయండి. రుచితో పాటు శక్తి కూడా!

ఆరోగ్యకరంగా.. డెస్క్‌టాప్‌ పానీయాలు
కొన్ని రకాల విధి నిర్వహణల్లో భాగంగా రాత్రి షిఫ్టుల్లోనూ పనిచేయాల్సి ఉంటుంది. అటువంటి సందర్భంలో టీ, కాఫీలు, కోలాలకు బదులుగా పంచదార కలపని ఈ పానీయాలని ప్రయత్నించవచ్చు.

* కొవ్వు లేని పాలు
* కొవ్వులేని పాలతో చేసిన హాట్‌ చాక్లెట్‌ పానీయం.
* కొద్దిగా స్పావాటర్‌ వాడిన పండ్ల రసం.
* నెక్టర్‌ వాడి చేసిన పండ్లరసం. నెక్టర్‌ అంటే సహజసిద్ధంగా పూలు, పండ్లను నుంచి సేకరించిన చక్కెర పదార్థం.

ఆఫీసు బ్యాగులో పోషకాహారం
* సాయంకాలం ఉపాహారం తినే సమయంలో చాలా మంది ప్రాధాన్యం ఇచ్చేది సమోసా, పిజా, బర్గర్‌, చిప్స్‌ వంటి వాటికే! బదులుగా ఉప్పు తక్కువగా ఉండే సూప్‌లు లేదా గుప్పెడు వాల్‌నట్లు, బాదం వంటివి తీసుకోవచ్చు. వీటి వల్ల ఆరోగ్యానికి ఎంతో మేలు.

* మనకోసం మనం చేసుకొనే పదార్థాల్లో వేటి మోతాదు ఎంత మేరకు ఉంటే.. ఆరోగ్యదాయకమో మనకు బాగా తెలుస్తుంది. ఉద్యోగ పనుల్లో ఆరోగ్యం గురించి ఆలోచించడానికి క్షణం తీరిక లేదు అనుకొనేవారు ఒక రోజు ముందుగానే పండ్లని ముక్కలుగా తరిగి జిప్‌లాక్‌ బ్యాగులో వేసుకోవాలి. ఆఫీసుకెళ్లేటప్పుడు బాక్సులో తీసుకెళ్లిపోవచ్చు.

* ఆకలి వేసినప్పుడు ఏదో ఒకటి తినేద్దాంలే అనుకోకుండా ఉండాలంటే .. బేబీ క్యారట్‌, తృణధాన్యాలతో చేసిన బార్లు, మొలకలు వంటి వాటిని బ్యాగులో వేసుకొని వెళితే మేలు. కొంతవరకైనా జంక్‌ ఫుడ్‌కి దూరంగా ఉండగలుగుతారు.

* వంట చేయడాన్ని ఆస్వాదించేవారు తక్కువ సమయంలో అయిపోయే కార్న్‌చాట్‌, చపాతీ రోల్స్‌ వంటి వాటిని ఎంచుకోవచ్చు. వెంట తీసుకెళ్లవచ్చు. బజ్జీలు, సమోసాలకు బదులు పాప్‌కార్న్‌, బేల్‌పూరీలు మంచి ప్రత్యామ్నాయాలు.

* నలుగురితో కలిసి తినే బిస్కెట్లను తక్కువ అంచనావేయొద్దు. రెండు మూడు బిస్కెట్లలో కూడా బోలెడు కెలొరీలు, కొవ్వు, పంచదార ఉంటాయి.

* ఆఫీసులో పార్టీ అనగానే క్యాంటీన్‌లో కనిపించే చాక్లెట్లని తినేస్తుంటారు చాలామంది. సాధారణ చాక్లెట్‌కన్నా హాట్‌ చాక్లెట్‌ డ్రింక్‌ మంచి ప్రత్యామ్నాయం. ఎందుకంటే దీనిలో మూడు గ్రాముల కొవ్వు, 140 కెలొరీలు శక్తి మాత్రమే ఉంటే, చాక్లెట్‌ని నేరుగా తినడం వల్ల 230 కెలొరీల శక్తి, 13 గ్రాముల కొవ్వు చేరుతుంది.

ఎండుఫలాలు.. వేయించిన సెనగలు
ఇంటి నుంచి వస్తూ వస్తూ తాజా పోషకాహారాన్ని తెచ్చుకోవడానికి వీలుపడట్లేదు అనుకొనేవారు.. ఆఫీసులో భద్రపరుచుకొనే ఆహారాలివి.

ఒక డబ్బా నిండా ఎండు ఫలాలు, పీచు అధికంగా ఉండే పోషకాహార బిస్కెట్లు, ఇన్‌స్టంట్‌ భేల్‌పురీ, వేయించిన సెనగలు, బఠాణీలు, మరమరాలు ఉంచుకోవచ్చు.

పనివేళల్లో ఆహారం.. అప్రమత్తం
* 'పని ఎక్కువగా ఉంది' అని వేగంగా తినడం మంచి పద్ధతి కాదు. ఇలా అయితే అనుకొన్న దాని కంటే ఎక్కువగా తినేస్తారు. అలాగే చేయబోయే పని గురించి తీవ్రంగా ఆలోచిస్తూ ఆహారంపై దృష్టిపెట్టకపోయినా పెద్దగా ఫలితం ఉండదు. ఎంత పనిలో ఉన్నా సరే భోజనం తినేటప్పుడు కొంత విరామాన్ని తప్పక తీసుకోవాలి.
  • ====================================
Visit my Website - Dr.Seshagirirao...

Sunday 18 December 2011

Which cooking oil is good for health?,వంటనూనెలలో ఆరోగ్యానికి ఏది మంచిది?



పండ్లు , కాయగూరలు ,గింజలు, పప్పులు , కందమూలాలు ,సుగంధద్రవ్యాలు మానవుడికి ప్రక్రుతి ప్రసాదించిన అపురూపమైన వరము .ఆయా సీజన్లలో పండే పండ్లను ఆరగించడం మనకు తరతరాలు గా తెలుసును . అన్నం తో కూడా ప్రకృతిసిద్ధమైన పండ్లు , కూరగాయలు ఇతర త్రునధన్యాలను ఆహారం గా ఆహారముగా తీసుకుని జీవించినట్లయితే శరీరానికి కావససిన అన్నిరకాల పోషకాలు లభిస్తాయి ... ఇదే అసలు ఉత్తమమైన జీవన విధానమని పకృతి వైద్యుల నమ్మకం.....ఆహారం జీవం ఉన్న ప్రతి జీవికి అత్యవసరమైనది. పిండిపదార్ధాలు, మాంసకృత్తులు, కొవ్వుపదార్ధాలు, ఖనిజలవణాలు, పీచుపదార్ధాలు, రోగనిరోధక శక్తికి కావలసిన విటమిన్లు మరియు శరీర పోషణకు రక్షణకు కావలసిన పదార్ధాలను కలిగిన పదార్దాలను ఆహారంగా పేర్కొనవచ్చు. ఇవి కాక శరీరానికి నూతన ఉత్సాహాన్నిచ్చే కాఫీ, టీ లాంటి వాటిని కూడా ఆహారపదార్ధాల కోవలోకి వస్తాయి. ఆహారం ఘన, ద్రవ రూపాలలో లభ్యం అవుతుంది.

  • 'అన్ని నూనెలూ ఆరోగ్యానికి హాని చేస్తాయి.. కొవ్వు పెంచేస్తాయి..' వంటి భావనలు చాలామందిలో పేరుకుపోయాయి. నిజానికి ఇది పూర్తిగా వాస్తవం కాదు . నూనెల నుంచి లభించే అన్ని రకాల కొవ్వుపదార్థాలు అనారోగ్యం కలిగించవు. వాటిల్లో ఉపయోగపడేవీ ఉంటాయి. ఆ వివరాలు తెలుసుకుని, పరిమితంగా వాడితే రుచికి రుచి.. ఆరోగ్యానికి ఆరోగ్యం.

శరీర పనితీరు బాగుండాలంటే విటమిన్లు, ఖనిజాలు ఎలా తప్పనిసరో కొవ్వుల వాడకం కూడా అంతే ప్రధానం. ముఖ్యంగా ఎ, డి, ఇ, కె వంటి కీలక విటమిన్లు శరీరానికి నేరుగా అందాలంటే కొవ్వులని ఆహారంలో తప్పక తీసుకోవాలి. ఇవి మనం తినే పప్పుల నుంచీ, తృణధాన్యాల నుంచీ కొంతవరకు అందితే.. మరికొంత వంటల్లో వాడే నూనెల నుంచి అందుతాయి. ఇంకొంత శాతం శరీరమే స్వయంగా విడుదల చేస్తుంది.


  • కొవ్వుల నుంచి ప్రధానంగా విటమిన్‌ ఎ, డి, ఇ, కె వంటి విటమిన్లు లభిస్తాయి. వీటితో పాటు వాటికుండే రంగు, రుచి, వాసన, ఇతర పోషకాల కారణంగా నూనెలు ప్రత్యేకతలను సంతరించుకొంటాయి. ముఖ్యంగా వాటిలోని ఫ్యాటీ యాసిడ్ల మేళవింపు, మోతాదు కారణంగానే నూనెలు ఎంత వరకు ఆరోగ్యప్రదం అన్న విషయం తెలుస్తుంది. ఈ ఫ్యాటీ యాసిడ్లు మూడు రకాలుంటాయి. ఒకటి శాచురేటెడ్‌ అయితే తక్కినవి అన్‌శాచురేటెడ్‌ రకాలు. అన్‌శాచురేటెడ్ లో మోనో అన్‌శాచురేటెడ్‌ (మూఫా-MUFA), పాలీ అన్‌శాచురేటెడ్‌(పూఫా-PUFA) ఉంటాయి.

శాచురేటెడ్‌ కొవ్వులు సాధారణంగా గది ఉష్ణోగ్రత వద్ద ఘన రూపంలో ఉంటాయి. వాస్తవానికి శరీరం ఎప్పటికప్పుడు కావాల్సినంత శాచురేటెడ్‌ కొవ్వులని ఉత్పత్తి చేసుకొంటుంది. అయినా శాచురేటెడ్‌ కొవ్వులని బయట నుంచి అదనంగా వాడటం వల్ల గుండె జబ్బులు వచ్చే ప్రమాదం ఉంది. అలాని పూర్తిగా దూరంగా ఉండటం కూడా మంచిది కాదు. ఎందుకంటే శరీర పనితీరుకు ఈ కొవ్వులు తప్పనిసరిగా అవసరం అవుతాయి.

  • ఇక మోనో అన్‌శాచురేటెడ్‌, పాలీ అన్‌శాచురేటెడ్‌ కొవ్వులని కలిపి అన్‌శాచురేటెడ్‌ కొవ్వులుగా వ్యవహరిస్తారు.

మోనో అన్‌శాచురేటెడ్‌ అంటే, ఇవి గది ఉష్ణోగ్రత వద్ద ద్రవ రూపంలో ఉంటాయి. రిఫ్రిజిరేటర్‌లో పెట్టగానే ఘనరూపంలోకి వస్తాయి. ఆరోగ్యపరంగా కూరలు, వేపుళ్లలో ఉపయోగించడానికి మోనో అన్‌శాచురేటెడ్‌ కొవ్వులు చక్కగా ఉపయోగపడతాయి. వేరుసెనగ, నువ్వులు, కనోలా, ఆలివ్‌ నూనెలు ఈ కోవకు చెందుతాయి. ఆలివ్‌ నూనె తప్ప తక్కినవి అధిక ఉష్ణోగ్రతలకు గురిచేసినా కూడా వీటిల్లో పెద్దగా మార్పు ఉండకపోవడం విశేషం.


  • పూఫా అధికంగా ఉండే నూనెలు శరీరానికి మేలు చేస్తాయి. ముఖ్యంగా రక్తంలోని చక్కెర స్థాయులని నియంత్రిస్తాయి. టైప్‌ 2 మధుమేహం సమస్యని నియంత్రిస్తాయి. గుండెజబ్బులు, రొమ్ముక్యాన్సర్‌ రాకుండా అడ్డుకొంటాయి. సోయాబీన్‌ నూనె, సన్‌ఫ్లవర్‌ నూనెల్లో ఈ పూఫా అధికంగా లభ్యమవుతుంది.

కొలెస్ట్రాల్‌
  • శరీర పనితీరు చురుగ్గా ఉండటానికి, పాడయిన శరీర కణాలు కోలుకోవడానికి కొలెస్ట్రాల్‌ కొంతమేరకు అవసరమే. ఇది తగినంతగా లేకపోతే కుంగి పోవడం, నిరాశలోకి కూరుకుపోవడం, ఊపిరితిత్తుల సమస్యలు, కొన్నిసార్లు క్యాన్సర్ల బారినపడటం కూడా జరుగుతుంది. కొలెస్ట్రాల్‌ని సాధారణంగా గుడ్లు, మాంసం, ఇతర పాల ఉత్పత్తులన నుంచి పొందితే.. శరీరంలోని కాలేయం నుంచి కూడా కొంతవరకు అందుతుంది.

కొలెస్ట్రాల్‌లో రెండు రకాలుంటాయి. ఒకటి లో డెన్సిటీ లిపో ప్రొటీన్స్‌ ఉండే (ఎల్‌డీఎల్‌) రకం. ఇది చెడు కొలెస్ట్రాల్‌. శాచురేటెడ్‌ ఫ్యాట్లు అధికంగా ఉండే ఆహారం తినేవారిలో ఎల్‌డీఎల్‌ కొలెస్ట్రాల్‌ అధికంగా చేరుకొంటుంది. ఇవి గుండె జబ్బులు రావడానికి కారణం అవుతాయి. మరొకరకం కొవ్వు హెచ్‌డీఎల్‌.. దీన్నే హైడెన్సిటీ లిపోప్రొటీన్స్‌ అని కూడా అంటారు. ఇవి మంచి రకం కొవ్వులు.

  • ట్రాన్స్‌ఫ్యాట్లతో.. అప్రమత్తం
నూనెలను రుచికోసం కొన్ని ప్రత్యేక పద్ధతుల్లో రసాయనిక చర్యలకు గురిచేసి ట్రాన్స్‌ ఫ్యాట్లుగా లేదా హైడ్రోజినేటెడ్‌ నూనెలుగా మారుస్తారు. బేకరీ, ప్యాక్‌ చేసిన పదార్థాల్లో.. రెస్టారెంట్లలో వీటిని ఉపయోగిస్తారు. సలాడ్‌ డ్రెస్సింగుల్లోనూ వాడతారు. ఇవి తక్కిన వాటితో పోలిస్తే చౌకగా ఉంటాయి. వనస్పతి ఈ కోవకి చెందినదే! ఇవి శరీరానికి హాని చేస్తాయి.

  • మేలు నూనెల గుర్తింపు ఎలా?
వంట నూనెల్లో.. ఇతరత్రా వంటకు పనికిరాని నూనెలని కలపడం ద్వారా వాటిని కల్తీకి గురిచేస్తారు. ఉదాహరణకి ఆముదం, ఆర్గీమోన్‌, మినరల్‌ నూనెలని వంటకు వాడే నూనెల్లో కలపడం ద్వారా కలుషితం చేసే వీలుంది. కొన్ని సందర్భాల్లో కాటన్‌సీడ్‌, పామోలీన్‌ వంటి చౌక నూనెలనూ ఇందుకు ఉపయోగిస్తారు. నూనెలు బాగా ముదురు రంగులో కనిపించినా, ముక్కవాసన వచ్చినట్టున్నా.. అప్పడాలు వంటివి వేయించిన వెంటనే రుచిలో తేడాగా ఉన్నా అది వాడేసిన నూనెగా గుర్తించాలి. ఒకసారి వాడిన నూనెలని మరోసారి మరిగిస్తే అవి అనేక అనారోగ్యాలకి దారి తీస్తాయి.

ఒకసారి వాడిన నూనెని, వాడని దానితో కలపకూడదు. దానివల్ల తాజా నూనె కూడా పాడయ్యే ప్రమాదం ఉంది. నూనెలని చల్లని, పొడి ప్రదేశాల్లో, సరైన మూత పెట్టి నిల్వ చెయ్యాలి. రిఫ్రిజిరేటర్‌లో పెట్టి తీస్తే గది ఉష్ణోగ్రతకు వచ్చిన తర్వాత వాడాలి.
  • సమాచారంతో అవగాహన
నూనెల్లో మూఫా, పూఫాల మేళవింపు ఎలా ఉందో చూసుకొని కొనుక్కొంటే ఆరోగ్యప్రదం. నూనెలో భారలోహాలు, హానిచేసే సూక్ష్మక్రిములు, ఇతరత్రా కలుషితాలు లేవని నిర్థారించుకోవాలి.
నూనె ప్యాకెట్‌ని కొన్నాక దానిపై ఏం రాసి ఉందని చదివితే.. ఉత్పత్తి పేరు, తయారైన స్థలం, సమయం, అందులోని పోషకాల వివరాలు, కాల వ్యవధి తెలుస్తాయి. నూనెలో సింథటిక్‌ యాంటీ ఆక్సిడెంట్లని కలిపి ఉంటే వాటి వివరాలు పొందు పరచాలని నిబంధనలు తెలియజేస్తున్నాయి. నూనెలపై 'ఫ్రీ ఫ్రమ్‌ ఆర్గీమోన్‌ ఆయిల్‌ ఆర్‌ ట్రాన్స్‌ ఫ్యాట్స్‌' అని రాసి ఉండటం తప్పనిసరి. ఎందుకంటే ట్రాన్స్‌ఫ్యాట్లు, ఆర్గీమోన్‌ నూనెలు అనేవి ఆరోగ్యానికి చేటు చేస్తాయి. అందుకే మీరు కొనే నూనెలో అవి లేవని నిర్ధారించుకోవాలి.

  • Source -- The Johns Hopkins Textbook of Dyslipidemia / 1. D. Paul Nicholls, MD, DSc, FRCP; 2. Ian S. Young, MD, FRCP, FRCPath

  • ==========================
Visit my Website - Dr.Seshagirirao...

Saturday 17 December 2011

Junk food , జంక్ ఫుడ్



పండ్లు , కాయగూరలు ,గింజలు, పప్పులు , కందమూలాలు ,సుగంధద్రవ్యాలు మానవుడికి ప్రక్రుతి ప్రసాదించిన అపురూపమైన వరము .ఆయా సీజన్లలో పండే పండ్లను ఆరగించడం మనకు తరతరాలు గా తెలుసును . అన్నం తో కూడా ప్రకృతిసిద్ధమైన పండ్లు , కూరగాయలు ఇతర త్రునధన్యాలను ఆహారం గా ఆహారముగా తీసుకుని జీవించినట్లయితే శరీరానికి కావససిన అన్నిరకాల పోషకాలు లభిస్తాయి ... ఇదే అసలు ఉత్తమమైన జీవన విధానమని పకృతి వైద్యుల నమ్మకం.....ఆహారం జీవం ఉన్న ప్రతి జీవికి అత్యవసరమైనది. పిండిపదార్ధాలు, మాంసకృత్తులు, కొవ్వుపదార్ధాలు, ఖనిజలవణాలు, పీచుపదార్ధాలు, రోగనిరోధక శక్తికి కావలసిన విటమిన్లు మరియు శరీర పోషణకు రక్షణకు కావలసిన పదార్ధాలను కలిగిన పదార్దాలను ఆహారంగా పేర్కొనవచ్చు. ఇవి కాక శరీరానికి నూతన ఉత్సాహాన్నిచ్చే కాఫీ, టీ లాంటి వాటిని కూడా ఆహారపదార్ధాల కోవలోకి వస్తాయి. ఆహారం ఘన, ద్రవ రూపాలలో లభ్యం అవుతుంది.


  • సరియైన నూట్రిషనల్ విలువలు లేని లేదా సరిపడు కేలరీలు లేని లేదా అనారోగ్యకరమైన అహారపదార్ధాలను జంక్ ఫుడ్స్ అంటారు . జంక్ ఫుడ్ తినడము వలన అనారోగ్యం నకు దారితీయును . ఈ పదము మొదట 1972 లో Michael Jacobson (director of the center for Science in the public interest). జంక్ ఫుడ్ లో ఎక్కువ పరిమాణములో సాచ్యురేటెడ్ కొవ్వులు, సాల్ట్ , సుగర్ ఉంటాయి. ఆరోగ్యకరమైన పండ్లు , కాయకూరలు , ఫైబర్ ఉన్న పదార్ధములు ఉండవు . సాధారణముగా ఉప్పు స్నాక్స్ అంటే చిప్స్ , కాండీ , తీపి ఉండలు , పంచదారపెట్తిన సీరల్స్ , ఫ్రైడ్ ఫాస్ట్ ఫుడ్స్ , కార్బొనేటెడ్ డ్రింక్స్ , రెడిమేడ్ కూల్ డ్రింక్స్ , మసలా చాట్ , పకోడీలు, బజ్జీలు వంటి స్నాక్ ఫుడ్‌,మిర్చి బజ్జీలు,ఫాస్ట్ ఫుడ్ టమోటో కెచప్, వెన్నతో కూడిన కేకులు, చాక్లెట్‌ డింగ్‌-డాంగ్స్‌, బేకన్‌, సాసేజ్‌ మున్నగునవి.బర్గర్, పిజా, ఫ్రెంచి ఫ్రైస్, కేక్స్, నూడిల్స్... పిల్లలకు నచ్చే జంక్ ఫుడ్. '

జంక్‌ ఫుడ్‌ తింటే స్థూలకాయం వస్తుంది. ఈ ఊబకాయం వలన చిన్న వయస్సులోనే బిపి, ఆపై షుగర్‌ వస్తుంది'. శాస్త్రవేత్తలు.'ధూమపానం, మత్తు మందుల మాదిరిగానే జంక్‌ ఫుడ్‌ తినడం కూడా వ్యసనంగా మారుతుందంటున్నారు. అంతే కాదు మనిషిపై మాదక ద్రవ్యంతో సమానంగా దుష్ప్రభావాన్ని సైతం చూపుతాయ'ని వీరు కనుగొన్నారు. అమెరికాలోని ఫ్లోరిడాకు చెందిన స్క్రిప్స్‌ రిసెర్చ్‌ ఇన్‌స్టిట్యూట్‌ శాస్త్రవేత్తలు మూడేళ్లపాటు పరిశోధనలు చేసి జంక్‌ ఫుడ్‌ కొకైన్‌ వంటి మాదక ద్రవ్యాలతో సమానమని తేల్చారు. జంక్‌ ఫుడ్‌కు అంటే బేకరి పదార్థాలకు అలవాటు పడితే అది ఊబకాయానికి దారి తీయడమే కాకుండా మెదడుకు కూడా హాని కలిగిస్తుందని కనుగొన్నారు. ఇందుకు కారణం బేకరీ పదార్థాల్లో కొవ్వు పదార్థం ఎక్కువగా ఉండటమేనని వెల్లడించారు. జంక్‌ ఫుడ్‌ వల్ల కలిగే ప్రభావాలు తెలుసుకునేందుకు వీరు ఎలుకలపై మూడేళ్ల పాటు పరిశోధనలు సాగించారు. అధిక కేలరీలు గల ఆహారం తీసుకోవడం వల్ల మెదడుకు ప్రమాదమని తేల్చారు.


  • ఫాస్ట్‌ఫుడ్‌కు ప్రత్యామ్నాయంగా...
ఫాస్ట్‌ ఫుడ్‌ ఆరోగ్యకరమైన ఆహారం కాదు...ఈ విషయం దాదాపు అందరికీ తెలిసిందే. కానీ ఫాస్ట్‌ఫుడ్‌ కనబడితే చాలామంది తినకుండా ఉండలేరు. ఏదో కొద్దిగా తింటే ఏమవుతుంది అని
ఫాస్ట్‌ ఫుడ్‌ తినడం మొదలు పెట్టి ఎక్కువగా తినేస్తారు. దీంతో ఆరోగ్యానికి హాని కలుగుతుంది. ఫాస్ట్ ఫుడ్స్ జంక్ పుడ్డులో ఓ రకం..అందుకని భేదాలు..విభేదాలు ఉండవు. రెండూ ఒకటే.


  • -ప్రతిరోజూ ఫాస్ట్‌ఫుడ్‌ను తింటే ఆరో గ్యానికి కలిగే హాని గురించి తరచూ వార్తా పత్రికలు, టివిలలో అందరూ చూస్తుంటారు. కానీ వీటిని తినడానికి మాత్రం వెనుకాడరు. ఈ విషయంలో న్యూట్రీషనిస్ట్‌ నమ్రతా దేశాయ్‌ మాట్లాడు తూ ‘ఫాస్ట్‌ ఫుడ్‌ వంటి జంక్‌ ఫుడ్‌కు ఆరోగ్యకరమైన ప్రత్యామ్నాయ ఆహారం ఏదీ లేదు. కానీ ఫాస్ట్‌ ఫుడ్‌ విషయంలో కొన్ని జాగ్రత్తలు తీసుకుంటేసరిపోతుంది. నేటి రోజుల్లో బ్యాలెన్స్‌డ్‌గా ఉండే ఆహారాన్ని తీసుకోవడం మేలు. ప్రతిరోజు మనం తీసుకునే ఆహారంలో కూరగాయ లు ఎక్కువగా ఉండేటట్లు చూసుకోవాలి. దీంతో పాటు రోజూ కొంతసేపు వ్యాయా మాలు చేయడం ఆరోగ్యానికి మంచిది. ఈ విషయాలను దృష్టిలో పెట్టుకొని ఎప్పుడైనా జంక్‌ ఫుడ్‌ తీసుకోవాలనుకున్నా పెద్దగా ఇబ్బంది ఉండదు. నేటి బిజీ జీవితంలో ప్రతి ఒక్కరూ ఆరోగ్యంపై ప్రత్యేక దృష్టిని కేంద్రీకరించాల్సిన అవసరం ఉంది’ అని ఆమె పేర్కొన్నారు. ఫాస్ట్‌ ఫుడ్‌కు ప్రత్యామ్నాయంగా బేక్‌డ్‌, గ్రిల్‌డ్‌, రోస్టెడ్‌ ఫుడ్‌ను తీసుకోవచ్చు. గ్రిల్‌ చేసిన చికెన్‌ బాగా ఫ్రై చేసిన చికెన్‌ కంటే రుచికరంగా ఉంటుంది. గ్రిల్‌డ్‌ సలాడ్స్‌తో కూడిన స్యాండ్‌విచ్‌, గ్రిల్‌డ్‌ సలాడ్స్‌తో కూడిన బర్గర్‌ ఆరోగ్యానికి మంచిది. సాధారణంగా ఉపయోగించే వెన్నకు బదులుగా తక్కువ కొవ్వు ఉండే వెన్నను వాడడం శ్రేయస్కరం. దీంతో రుచికరమైన ఆహారాన్ని తక్కువ క్యాలరీలతోనే పొందవచ్చు. ఆరోగ్యంగా ఉండాలంటే జంక్‌ ఫుడ్‌కు ప్రత్యామ్నాయ ఆహారాన్ని తీసుకోవడం మంచిది.

  • దేశంలో శరవేగంగా పెరిగిపోతున్న ఫాస్ట్‌ ఫుడ్‌ సంస్కృతి

దేశంలో ఫాస్ట్‌ ఫుడ్‌ సంస్కృతి శరవేగంగా పెరిగిపోతుంది. ఈ ఫుడ్‌ చాలా ఫాస్ట్‌ గురూ అని పిస్తోంది. దేశంలో గత కొన్ని సంవత్స రాలుగా ఫాస్ట్‌ ఫుడ్‌ పరిశ్రమ అనూ హ్యంగా అభివృద్ధి
చెందుతోంది. దేశం లోని ప్రజల జీవన విధానంలో సంభ వించిన అనేక మార్పులు, ఆదాయాలు భారీగా పెరిగిపోవడం, ఆహార అభిరు చుల్లో తరచుగా మార్పులు చేసుకోవడం లాంటి ఘటనలు ప్రజలు కొత్త కొత్త రుచులకు అలవాటు పడటానికి, ఫాస్ట్‌ ఫుడ్‌ సెంటర్‌లకు పరుగులు తీయ డానికి దోహదపడ్డాయి. దాంతో దేశంలోని ఫాస్ట్‌ ఫుడ్‌ పరిశ్రమ మూడు పువ్వులు ఆరు
కాయలుగా ముందుకు సాగుతోంది. భారతీయులు ఈ మధ్య కాలంలో తరచుగా విదేశాలను సందర్శించడంతో అక్కడి ఆహార అలవాట్లపై మోజు పెంచుకోవడం, జీవన విధానంలో మార్పులు చేసుకోవడం, తీసుకునే ఆహారంలో మార్పులు చేర్పులతో ప్రయోగాలు చేస్తున్నారని నిపుణులు చెపుతున్నారు. ఈ సందర్భగా భారత(ఉత్తర, తూర్పు ప్రాంతీయ) మెక్‌ డోనాల్డ్‌ మేనేజింగ్‌ డైరెక్టర్‌(ఎండి) విక్రమ్‌ బక్షీ మాట్లాడుతూ దేశం మొత్తం మేద ఫాస్ట్‌ ఫుడ్‌ మార్కెట్‌ వ్యాప్తి శరవేగంగా జరుగుతోందని, 2010 సంవత్సరంలో మెట్రోనగరాలలో దాదాపుగా ఫాస్ట్‌ ఫుడ్‌ అమ్మకాలు 20 శాతం మేరకు పెరిగిన్నట్లు అమ్మకాలను పరిశీలిస్తే తెలుస్తోందని చెప్పారు. అంతేకాక త్వరలో దేశవ్యాప్తంగా ఫాస్ట్‌ ఫుడ్‌ సెంటర్‌లను మరో 40 ప్రారంభించాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు ఆయన తెలిపారు. ఈ విధమైన సెంటర్‌లను దేశంలో మొట్ట మొదటి సారిగా 1996లో ఢిల్లీలోని బసంత్‌ లోక్‌లో మెక్‌డోనాల్డ్‌ ప్రారంభించిందని, ప్రస్తుతం మొత్తం 211 ఫాస్ట్‌ ఫుడ్‌ రెస్టారెంట్‌లలో భారత్‌లోని ఉత్తర, తూర్పు ప్రాంతాలలో 105, పశ్చిమ, దక్షిణ భారత్‌లో 106 రెస్టారెంట్‌లు వున్నాయని బక్షీ తెలిపారు. మెక్‌డోనాల్డ్‌ ఫాస్ట్‌ ఫుడ్‌ రెస్టారెంట్‌లు మెట్రో నగరాలతో పాటుగా మిగతా నగరాలలో కూడా త్వరితగతిన అభివృద్ధి చెందుతున్నాయని దానికి ఉదాహరణ హర్యానాలో 14, పంజాబ్‌లో 11, ఉత్తరప్రదేశ్‌లో 28 రెస్టారెంట్‌లు పనిచేస్తున్నాయని ఆయన వివరించారు. దేశంలో పెరిగిపోతున్న చిన్న కుటుంబాలు, మధ్య తరగతి ప్రజలకు తగినంత ఆదాయం రావడం, ఇళ్ళలో వంట చేసుకొనే సమయం లేకపోవడం లాంటి అంశాలతో ఫాస్ట్‌ ఫుడ్‌ రంగం త్వరిత గతిన పెరగటానికి కారణంగా కనిపిస్తోందని, భవిష్యత్‌లో కూడా ఈ రంగం అభివృద్ధి చెందుతుని భావిస్తున్నట్లు నిరులా, విపి మార్కెటింగ్‌ విభాగానికి చెందిన రీతూ చౌదరి చెప్పారు. నిరులా కంపెనీ దేశంలోని ఢిల్లీ, ఉత్తరప్రదేశ్‌, ఉత్తరాంచల్‌, హర్యా నా, రాజస్థాన్‌, పంజాబ్‌లలో మొత్తం 80 ఫాస్ట్‌ ఫుడ్‌ రెస్టారెంట్‌లను ప్రారంభించారు. 2012 నాటికి మరో 70 రెస్టా రెంట్‌లను ప్రారంభించాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. స్థానిక ప్రజలు ఫాస్ట్‌ ఫుడ్‌కు అలవాటు పడటంతో కంపెనీలు మంచి లాభాలు
గడిస్తున్నాయని, దేశంలో మొట్ట మొదటి సారిగా పిజ్జాను ప్రవేశపెట్టామని, అది ప్రస్తుతం స్థానిక వినియోగదారులను ఆకర్శించిందని, అంతేకాక కరహీ పన్నీరు, తీఖా పన్నీరు, కరిహీ చికెన్‌లను ఇంతకు ముందే రుచి చూపించామని అని ప్రస్తుతం అవి విజయవంతం అయ్యాయని, త్వరలో మరికొన్ని రుచికర పదార్ధాలను అదించనున్నట్లు ఫిజ్జా హట్‌ మేనేజర్‌ ఉమేష్‌ కుమార్‌ తెలిపారు.

బక్షీ మాట్లాడుతూ ఉత్తర భారతీయులు విభిన్న రుచులను ఎల్లప్పుడూ ఆదరిస్తారని, వీరిని దృష్టిలో పెట్టుకొని త్వరలో మెక్‌ఆలూ తిక్కీ బర్గర్‌, పిజ్జా మెక్‌పుఫ్‌, మెక్‌వెజ్‌లనే కొత్త రుచులను
ప్రవేశపెట్టనున్నట్లు ఆయన తెలిపారు. గడిచిన 2008, నుంచి 2010 మధ్య కాలంలో ఫాస్ట్‌ ఫుడ్‌ వినియోగం వార్షిక సగటు 7.8 శాతంగా పెరిగిందని, 2012 నాటికి సగటున 8.6 శాతానికి అభివృద్ధి చెందుతుందని ఒక నివేదిక తెలిపింది. ఈ సందర్భంగా బిపిఒలో పనిచేస్తున్న మోనా శర్మ(24) మాట్లాడుతూ తాము రాత్రులు కూడా పనిచేస్తుంటామని, పనిభారం కూడా వుంటుందని అందు వల్ల బయటకు వచ్చి తినటానికి సమయం లేదని, సహజంగా తమ కంపెనీలు కొంత మంది ఉద్యోగులు కలసి బయట రెస్టారెంట్ల నుంచి ఫుడ్‌ను తెప్పించుకొంటారని, పిజ్జాలు, బర్గర్‌లు వెంటనే తినటానికి వీలుగా వుంటాయి కనుక తమ సమయం వృధా కాకుండా వుంటుందని ఆమె తెలిపింది. ఫాస్ట్‌ ఫుడ్‌ సెంటర్‌లను కొన్ని వైవిధ్యమైన ప్రదేశాలలో స్థాపిస్తున్నారని, ప్రయాణంలో వున్న వారిని కూడా ఆకర్శించటానికి వీలుగా వ్యాపార కూడలల్లో, ఎయిర్‌పోర్టుల్లో, మెట్రో స్టేషన్‌లతో పాటుగా అనేక ప్రదేశాలలో ఈ
ఫుడ్‌ సెంటర్‌లను ప్రారంభించారు. దేశంలో ఫాస్ట్‌ ఫుడ్‌ సంస్కృతి పెరిగిపోతుందని చెప్పాటానికి ఈ పరిమాణాలే ఉదాహరణగా చెప్పావచ్చును.

=-========================

Visit my Website - Dr.Seshagirirao...

Sunday 11 December 2011

Apricot , అప్రికాట్



పండ్లు , కాయగూరలు ,గింజలు, పప్పులు , కందమూలాలు ,సుగంధద్రవ్యాలు మానవుడికి ప్రక్రుతి ప్రసాదించిన అపురూపమైన వరము .ఆయా సీజన్లలో పండే పండ్లను ఆరగించడం మనకు తరతరాలు గా తెలుసును . అన్నం తో కూడా ప్రకృతిసిద్ధమైన పండ్లు , కూరగాయలు ఇతర త్రునధన్యాలను ఆహారం గా ఆహారముగా తీసుకుని జీవించినట్లయితే శరీరానికి కావససిన అన్నిరకాల పోషకాలు లభిస్తాయి ... ఇదే అసలు ఉత్తమమైన జీవన విధానమని పకృతి వైద్యుల నమ్మకం.....ఆహారం జీవం ఉన్న ప్రతి జీవికి అత్యవసరమైనది. పిండిపదార్ధాలు, మాంసకృత్తులు, కొవ్వుపదార్ధాలు, ఖనిజలవణాలు, పీచుపదార్ధాలు, రోగనిరోధక శక్తికి కావలసిన విటమిన్లు మరియు శరీర పోషణకు రక్షణకు కావలసిన పదార్ధాలను కలిగిన పదార్దాలను ఆహారంగా పేర్కొనవచ్చు. ఇవి కాక శరీరానికి నూతన ఉత్సాహాన్నిచ్చే కాఫీ, టీ లాంటి వాటిని కూడా ఆహారపదార్ధాల కోవలోకి వస్తాయి. ఆహారం ఘన, ద్రవ రూపాలలో లభ్యం అవుతుంది.

ఆప్రికాట్ ఒక డ్రై ఫ్రూట్ , ఇతర డ్రైఫ్రూట్స్ తో పోలిస్తే దీనిలో క్యాలరీస్ తక్కువ . దీని శాస్త్రీయ నామము -Prunus armeniaca . ఇది సుమారు 8-10 మీ. ఎత్తు పెరిగే చెట్టు ,దీని మొదులు 40 సె.మీ వ్యాసము కలిగి పువ్వులు పింక్ రంగులోఉండును . పండ్లు 1.5 -2.5 సెం.మీ. ఉంది పసుపు లేదా ఆరెంజ్ రంగులో ఉండి ఒకే గింజ కలిగి ఉండును . మొదట ఇది ఆర్మేనియా దేశములో కనుగొనబడి క్రమేపీ ఇతర దేశాలకు వ్యాపించినది .

పచ్చి అప్రికాట్ పండులో పోషక పదార్ధములు 100 గ్రాములో:
  • శక్తి : 201 కేలరీస్ ,
  • కార్బోహైడ్రేట్లు : 11 గ్రా.
  • సుగర్స్ : 9 గ్రా .
  • ఫైబర్ : 2 గ్రా.
  • ఫాట్ : 0.4 గ్రా .
  • పోటీన్‌ : 1.4 గ్రా .
  • విటమిన్‌ ' ఎ ' : 12% ,
  • బీటాకెరటీన్‌ : 10% ,
  • విటమిన్‌ ' సి " : 12% ,
  • ఐరన్‌ : 3% ,
Apricots, dried Nutritional value per 100 g (3.5 oz)

  • Energy-------- 1,009 kJ (241 kcal)
  • Carbohydrates- 63 g
  • - Sugars------ 53 g
  • - Dietary fibre- 7 g
  • Fat------------ 0.5 g
  • Protein-------- 3.4 g
  • Vitamin A equiv-. 180 μg (23%)
  • - beta-carotene- 2163 μg (20%)
  • Vitamin C------- 1 mg (1%)
  • Iron------------ 2.7 mg (21%)

వైద్యములో దీని ఉపయోగాలు :

  • ఈ ఫలము మధుమేహ రోగులకు మేలుచేస్తుంది .
  • తీపిపదార్ధాలు తినాలనే కోఇకను తగ్గిస్తుంది .
  • దీనిలోని రసాయనాలు శరీరములో ఉన్నటువంటి చెక్కెరలను నియంత్రిస్తాయి .
  • అప్రికాట్ లోని బీటా కెరోటిన్‌ కంటికి , రోమాలకు, చర్మానికి , మేలుచేస్తుంది . ఒకటి , రెండు అప్రికాట్లను తింటే శరీరానికి కావాలసిన దినవారి విటమిన్‌ 'ఎ' సగము లభైస్తుంది .
  • గుండెసంబంధిత వ్యాధులను నిరోధిసంచే గుణము దీనిలో ఉంది.
  • మలబద్దకాన్ని ఆపుతుంది.
  • క్యాన్‌సర్ చికిత్స లో దీనిని వాడుదురు .
  • రక్తలేమితో బాధపడేవారికి ఇది మేలుచేస్తుంది.
  • కొవ్వులు లేని తక్కువస్థాయి పిండిపదార్ద్ధాలుకలిగీం ఈ ఫలము ఆరోగ్యానికి మంచిది .

  • ============================
Visit my Website - Dr.Seshagirirao...

ఎవో డైట్,Evo Diet








పండ్లు , కాయగూరలు ,గింజలు, పప్పులు , కందమూలాలు ,సుగంధద్రవ్యాలు మానవుడికి ప్రక్రుతి ప్రసాదించిన అపురూపమైన వరము .ఆయా సీజన్లలో పండే పండ్లను ఆరగించడం మనకు తరతరాలు గా తెలుసును . అన్నం తో కూడా ప్రకృతిసిద్ధమైన పండ్లు , కూరగాయలు ఇతర త్రునధన్యాలను ఆహారం గా ఆహారముగా తీసుకుని జీవించినట్లయితే శరీరానికి కావససిన అన్నిరకాల పోషకాలు లభిస్తాయి ... ఇదే అసలు ఉత్తమమైన జీవన విధానమని పకృతి వైద్యుల నమ్మకం.....ఆహారం జీవం ఉన్న ప్రతి జీవికి అత్యవసరమైనది.



పిండిపదార్ధాలు, మాంసకృత్తులు, కొవ్వుపదార్ధాలు, ఖనిజలవణాలు, పీచుపదార్ధాలు, రోగనిరోధక శక్తికి కావలసిన విటమిన్లు మరియు శరీర పోషణకు రక్షణకు కావలసిన పదార్ధాలను కలిగిన పదార్దాలను ఆహారంగా పేర్కొనవచ్చు. ఇవి కాక శరీరానికి నూతన ఉత్సాహాన్నిచ్చే కాఫీ, టీ లాంటి వాటిని కూడా ఆహారపదార్ధాల కోవలోకి వస్తాయి. ఆహారం ఘన, ద్రవ రూపాలలో లభ్యం అవుతుంది.





ఎవో డైట్,Evo Diet



‘‘ఎవో డైట్...
’’ అంటే- ఎవల్యూషనరీ డైట్ అన్నమాట.‘ఎవోడైట్’ అంటే అన్నీ పచ్చివే సుమా! ఆది మానవుడు ఏమి తినేవాడో , ఎలా ఆరోగ్యము గా ఉండే వాడో నేడు చాలా మంది నిపుణులు ఆలోచించారు . మానవులు కోతులు నుండి పుట్టేరని .. అవి ఏమితింటున్నయో పరిశీలించి ... ఆచరించడము వలన ఎన్నోరకాల వ్యాధులనుండి మానవుడు దూరముగా ఉండడము గమనించి దానికొక పేరు పెట్ట్టారు ఇంగ్లండ్ నిపుణులు . అదే ఎవో డైట్ .. ఎవో అంటే ఆంగ్లములో ప్రిమిటివ్ (పురాతన,ఆది , ఆరంభము )అని అర్ధము .


ఎవో డైట్ లో అరటి, అప్రికాట్, చెర్రీ, మామిడి, ద్రాక్ష, ఖర్జూరం, స్ట్రాబెర్రీ, రాస్‌బెర్రీ, పుచ్చ... వంటి పండ్లు--బ్రాకోలి, క్యాబేజీ, క్యారెట్లు, ముల్లంగి, బఠాణీ, ఉల్లిపాయ, టమాటో... తదితర కూరగాయలూ- -వేరుశెనగపప్పు, ఆలివ్ గింజలు, అక్రోట్లు, జీడిపప్పు... మొదలైన నట్స్, ప్రత్యేకంగా తేనె..ఉంటాయి. ఇవన్నీ ఎవోడైట్‌కిందే లెక్క. దాదాపు పాతిక రకాల పండ్లూ, కూరగాయల్ని ఎవోడైట్ కింద చేర్చారు ఆహారనిపుణులు.

ఇలాంటి పండ్లూ, కూరగాయలను రోజూ దఫదఫాలుగా తీసుకుంటే ఆరోగ్య సమస్యలు తలెత్తవని పరిశోధకులు తేల్చిచెబుతున్నారు. సుమారు అరవై లక్షల సంవత్సరాల నాటి మనిషి అంటే అప్పుడే కోతులనుంచి పరిణామం చెందిన ఆదిమ మానవుడు ఏం తిన్నాడో.. అదే ఇపుడు తింటే... ‘‘బరువు పెరగరు, ఇతరత్రా ఆరోగ్య సమస్యలు తలెత్తవు’’ అంటున్నారు. అధిక బరువు తెచ్చే తంటాలు అన్నీ ఇన్నీ కాదు. అలాంటి బరువును కోతులు తినే ఆహారాన్ని తింటే చాలు, దానంతట అదే బరువు తగ్గడం ఖాయం అంటున్నారు. కొలెస్ట్రాల్ కూడా బాగా తగ్గుతుందట. బీపీ సాధారణ స్థితిలో ఉంటుంది. మధుమేహ బాధితుల్లో ఇన్సులిన్ సమస్యలు సర్దుకుంటాయి. మొత్తంమీద ‘ఎవోడైట్’ తీసుకుంటే ఆరోగ్యంలో స్పష్టమైన తేడా కనిపిస్తుంది.



  • =====================================


Visit my Website - Dr.Seshagirirao...

Saturday 10 December 2011

పప్పులతో గ్యాస్‌, Gas production with dals



  • పండ్లు , కాయగూరలు ,గింజలు, పప్పులు , కందమూలాలు ,సుగంధద్రవ్యాలు మానవుడికి ప్రక్రుతి ప్రసాదించిన అపురూపమైన వరము .ఆయా సీజన్లలో పండే పండ్లను ఆరగించడం మనకు తరతరాలు గా తెలుసును . అన్నం తో కూడా ప్రకృతిసిద్ధమైన పండ్లు , కూరగాయలు ఇతర త్రునధన్యాలను ఆహారం గా ఆహారముగా తీసుకుని జీవించినట్లయితే శరీరానికి కావససిన అన్నిరకాల పోషకాలు లభిస్తాయి ... ఇదే అసలు ఉత్తమమైన జీవన విధానమని పకృతి వైద్యుల నమ్మకం.....ఆహారం జీవం ఉన్న ప్రతి జీవికి అత్యవసరమైనది. పిండిపదార్ధాలు, మాంసకృత్తులు, కొవ్వుపదార్ధాలు, ఖనిజలవణాలు, పీచుపదార్ధాలు, రోగనిరోధక శక్తికి కావలసిన విటమిన్లు మరియు శరీర పోషణకు రక్షణకు కావలసిన పదార్ధాలను కలిగిన పదార్దాలను ఆహారంగా పేర్కొనవచ్చు. ఇవి కాక శరీరానికి నూతన ఉత్సాహాన్నిచ్చే కాఫీ, టీ లాంటి వాటిని కూడా ఆహారపదార్ధాల కోవలోకి వస్తాయి. ఆహారం ఘన, ద్రవ రూపాలలో లభ్యం అవుతుంది.


బఠానీలు, అలసందలు, రాజ్మా, శెనగలు, కందుల వంటి వివిధ చిక్కుడు జాతి, పప్పు ధాన్యాలు తినటానికి చాలామంది వెనకాడుతుంటారు. వీటితో కడుపుబ్బరం, గ్యాస్‌ వంటి ఇబ్బందులుంటాయని భయపడుతుంటారు. కానీ వీటన్నింటితో గ్యాస్‌ సమస్యలుండవని పరిశోధకులు చెబుతున్నారు. గుండె ఆరోగ్యానికి ఎంతో మేలు చేసే ఈ చిక్కుడుజాతి గింజలు, పప్పులపై ప్రజలు లేనిపోని అపోహలు పెంచుకోవటం మంచిది కాదని హెచ్చరిస్తున్నారు కూడా.పప్పులతో గ్యాస్‌...అంతంతే


  • చిక్కుళ్లు, పప్పుల మూలంగా కడుపుబ్బటం, గ్యాస్‌ సమస్యల గురించి తాజాగా అమెరికాలో మూడు అధ్యయనాలు జరిగాయి. వీటిలో గుర్తించిన విషయం ఏమంటే- ఈ చిక్కుడు జాతి పప్పులు తీసుకున్న వారిలో 3-11% మంది మాత్రమే కడుపుబ్బరంతో బాధపడ్డారు. పైగా వీటిని తిన్న అందరిలోనూ ఎల్‌డీఎల్‌ కొలెస్ట్రాల్‌తో పాటు మొత్తం కొలెస్ట్రాల్‌లోనూ తగ్గుదల కనిపించటం విశేషం. ఈ రకంగా వీటితో గుండె జబ్బుల ముప్పు కూడా కొంత తగ్గుముఖం పడుతోంది. కాబట్టి చిక్కుడుజాతి గింజలు, పప్పులు తింటే తొలిదశలో కొందరికి కొంత గ్యాస్‌ సమస్య ఎదురైనా.. నెమ్మదిగా అదే సర్దుకుంటుందనే విషయాన్ని అందరూ గుర్తించాలని, గ్యాస్‌ సమస్యలను అతిగా వూహించుకోవద్దని ఈ అధ్యయన కర్తలు సూచిస్తున్నారు. నిజానికి ప్రోటీన్లు, పీచు, విటమిన్లు, ఖనిజాలు దండిగా ఉండే పప్పులను వారంలో నాలుగైదు మార్త్లెనా తీసుకోవాలని పోషకాహార నిపుణులు చెబుతున్నారు.


ఇంతకీ చిక్కుడు జాతి గింజలు ఎందుకు కడుపుబ్బరం కలిగిస్తాయి? వీటిల్లో పీచు, ఆర్లిగోసాక్రైడ్లు దండిగా ఉంటాయి. ఈ పిండి పదార్థాలు జీర్ణం కావటానికి పేగుల్లోని ఎంజైమ్‌లు సరిపోవు. పేగుల్లోని బ్యాక్టీరియా ఇవి పులిసిపోయేలా చేసి, జీర్ణం చేస్తుంది. ఈ ప్రక్రియలో భాగంగా కొంత గ్యాస్‌ ఉత్పత్తి అవుతుంది!


  • ఆహారం తీసుకోవడం లోనూ, ఆహార పదార్థాలను ఎన్నుకోవడంలోనూ సరైన అవగాహన వుంటే శారీరక సౌందర్యం, ఆరోగ్యం బాగుంటాయి. స్థూలకాయం ఏర్పడకుండా, పొట్ట ఎత్తుగా పెరగ కుండా, శరీరంలో కొవ్వు పేరుకోకుండా, తగిన ఆహారాన్ని తీసుకుంటూ, ఆహార విషయంలో జాగ్రత్తలు పాటించాలి. జీర్ణక్రియ సవ్యంగా జరగటానికి మేలైన ఆహార పదార్థాలను తీసుకోవటమే కాకుండా ప్రతి రోజూ కొంత సమయం వ్యాయామం కూడా చేయాలి. ఎక్కువగా ఉపవాసాలు చేయకూడదు. వారానికి ఒక్క రోజు ఘన పదార్థాలను మానేసి, ద్రవ పదార్థాలను తీసుకోవచ్చు. వారానికి ఒక పూట ఉపవాసం చేయవచ్చు.

ఉదరభాగంలో కొవ్వు చేరకుండా జాగ్రత్తపడాలి. తక్కువ కేలరీలు లభించే ఆహార పదార్థాలను తీసుకోవాలి. మలబద్దకం ఏర్పడకుండా చూసుకోవాలి. ఆహార పదార్థాల్లో వెల్లుల్లి, అల్లం, పిప్పరమెంటు లాంటివి వాడటం వల్ల ఉదరంలో గ్యాస్‌ ఏర్పడకుండా చేస్తుంది. కడుపు ఉబ్బరం ఏర్పడకుండా నివారిస్తుంది. ఆహారంలో తప్పనిసరిగా పీచు పదార్థాలు, ఆకుకూరలు వుండేలా చూసుకోవాలి. క్యాబేజీ, పచ్చి ఉల్లి పాయలు, బీన్స్‌, పచ్చి బఠాణీలు లాంటివి గ్యాస్‌ ఏర్పడేందుకు కారణమవుతాయి. అందువల్ల, వాటి వాడకాన్ని తగ్గించాలి. కాఫీ, టీ లాంటి పానీయాలను ఎక్కువ సార్లు తీసుకో కూడదు. అందువల్ల ఉదరంలో గ్యాస్‌ ఏర్పడటమేకాక ఆకలిని తగ్గిస్తుంది. శీతలపానీయాలు కూడా ఆరోగ్యానికి మంచిదికాదు.

  • ఆహార నియమాలను పాటించడం, సరైన ఆహార పదార్థాలను తీసుకోవడం, శారీరక శ్రమ చేయడం వల్ల అజీర్ణ సమస్య ఏర్పడదని తెలుసుకోవాలి. కొన్ని రకాల పప్పులు కూడా అజీర్ణ వ్యాధికి, గ్యాస్‌ ఉత్పత్తికి కారణమవుతాయి. వాటిని తక్కువగా తీసుకోవడమే మంచిది. సెనగపప్పు, సెనగ పిండి, వేరుశెనగ పప్పు లాంటివి ఆహార పదార్థాల్లో తగ్గించడం వల్ల అజీర్ణం అనే సమస్య ఏర్పడదు, గ్యాస్‌ ఉత్పత్తి అవదు .
  • ===============================
Visit my Website - Dr.Seshagirirao...

Wednesday 30 November 2011

Tri Colored food good for health, త్రివర్ణ పదార్ధాలు ఆరోగ్యానికి మంచిది




పండ్లు , కాయగూరలు ,గింజలు, పప్పులు , కందమూలాలు ,సుగంధద్రవ్యాలు మానవుడికి ప్రక్రుతి ప్రసాదించిన అపురూపమైన వరము .ఆయా సీజన్లలో పండే పండ్లను ఆరగించడం మనకు తరతరాలు గా తెలుసును . అన్నం తో కూడా ప్రకృతిసిద్ధమైన పండ్లు , కూరగాయలు ఇతర త్రునధన్యాలను ఆహారం గా ఆహారముగా తీసుకుని జీవించినట్లయితే శరీరానికి కావససిన అన్నిరకాల పోషకాలు లభిస్తాయి ... ఇదే అసలు ఉత్తమమైన జీవన విధానమని పకృతి వైద్యుల నమ్మకం.....ఆహారం జీవం ఉన్న ప్రతి జీవికి అత్యవసరమైనది. పిండిపదార్ధాలు, మాంసకృత్తులు, కొవ్వుపదార్ధాలు, ఖనిజలవణాలు, పీచుపదార్ధాలు, రోగనిరోధక శక్తికి కావలసిన విటమిన్లు మరియు శరీర పోషణకు రక్షణకు కావలసిన పదార్ధాలను కలిగిన పదార్దాలను ఆహారంగా పేర్కొనవచ్చు. ఇవి కాక శరీరానికి నూతన ఉత్సాహాన్నిచ్చే కాఫీ, టీ లాంటి వాటిని కూడా ఆహారపదార్ధాల కోవలోకి వస్తాయి. ఆహారం ఘన, ద్రవ రూపాలలో లభ్యం అవుతుంది.



  • మూడురంగుల జెండా చూసినప్పుడల్ల ముచ్చటగా ఉంటుంది . అలాగే ఆ మూడు రంగుల పదార్ధాలు తినడము వల్ల మంకెంతో లాభము ఒనగూడుతుంది . ఏమిటా లింక్ అని నవ్వుకున్నా .... నారింజ , తెలుపు , ఆకుపచ్చ రంగుల పదార్ధాలు మన ఆరోగ్యానికి మంచిది .  

  • నారింజ రంగు : ఈ రంగులో ఉండే పండ్లు , కూరగాయల్లో బీటా-కెరటిన్‌ , విటమిన్‌ "సి" అత్యధికంగా లభిస్తాయి. వయసు రీత్యా లోపించే దృష్టి మెరుగవడానికి సహకరించే పోషకాలు వీటిలో ఉంటాయి. క్యాన్సర్ ను అడ్డుకోగలవు , కొలెస్టరాల్ , రక్తపోటు లను తగ్గించి కొలాజెన్‌ ఏర్పడడాన్ని మెరుగుపరుస్తాయి. ఆరోగ్యవంతమైన జాయింట్స్ కు దోహదపడతాయి.  



  • బొప్పాయి : ఫోలిక్ యాసిడ్ సమృద్ధిగా ఉంటుంది . ఇతర ప్రోటీన్లు , జీర్ణసంబంధిత ఎంజైములు, విటమిన్‌ " ఎ" , " ఇ " , లు పొటాషియం లభిస్తాయి. సహజసిద్ధమైన లాక్జేటివ్స్ కలిగి ఉంటాయి. 

  • కమలా, బత్తాయి :  వీటిలో విట్మిన్‌ " సి " సాంద్రత ఎక్కువ . యాంటి ఆక్షిడెంట్స ఉంటాయి. రోగనిరోధక వ్యవస్థ ను బలోపేతము చేస్తాయి. పీచు పదార్ధము ఎక్కువగా ఉంటుంది .

  • క్యారెట్లు : కంటి దృష్టికి మంచివి . విటమిన్‌ " ఎ, కె , సి , లు .. పొటాషియం , ఫైబర్ , మెగ్నీషియం , ఫాస్పరస్ , ఇతర పోషకాలు మెందుగా ఉంటాయి . 



  • తెలుపు రంగు : 

రోగనిరోధక వ్యవస్థను ఆందించే పోషకాలు తెల్లని పదార్ధాలలో ఉంటాయి . కొలెస్టరాల్ , రక్తపోతుస్థాయి సరిగా ఉంచుకునేందుకు సహకరిస్తాయి.తెలుపు రంగు గల కొన్ని పదార్ధాలు :

  • ఉల్లి , వెల్లుల్లి : సల్ఫైడ్ , ఎల్లిసిన్‌ అనే ఫైటోకెమికల్స్  అధికము గా ఉంటాయి. ట్యూమర్లకు వ్యతిరేకముగ్గా ఇవి పోరాడతాయి. ఇన్‌ఫ్లమేషన్‌ తగ్గించి , రక్తములో కొవ్వు , కొలెస్టరాల్ లను , బ్లడ్ సుగర్ ను తగ్గిస్తాయి. యాంటీ బ్యాక్టీరియల్ , యాంటి ఫంగల్ , యాంటి వైరల్ లక్షణాలు కలిగిఉంటాయి. ఇది రోగనిరోధక శక్తిని సమర్ధవంతం గా పెంచుతాయి. జలుబు పై పోరాడే మంచి ఆహారము . 

  • ముల్లంగి : ఎక్కువగా పీచు పదార్ధము , తేమ , సహజమైన లాక్జేటివ్స్ ఉన్నాయి . దీనిలోని అధిక తేమ చర్మానికి , కళ్ళకు ఎంతో మేలుచేస్తుంది . 

ఆకుపచ్చ :  ఈ రంగు పండ్లు , కూరలు ఆరోగ్యానికి మేలు చేస్తాయి . క్లోరొఫిల్ , పీచుపదార్ధము , ఫోలిక్ యాసిడ్ , కాల్సియం , విటమిన్‌ " సి " , బీటాకెరటిన్స్ లభిస్తాయి . ఈ రంగు పదార్ధాలలోని పోషకాలు క్యాన్సర్ రిస్కుల్ని తగ్గిస్తాయి . రక్తపోటు , క్లెస్టరల్ స్థాయిలను తగ్గిస్తాయి. జీర్ణక్రియకు దోహదపడి , కంటి ఆరోగ్యానికి , దృష్టికి సహకరిస్తాయి . ఫ్రీ రాడికల్స్ ను తగ్గించి రోగనిరోధ వ్యవస్థను మెరుగుపరుస్తాయి .

  • పాలకూర : ఐరన్‌ , ఫొలిక్ యాసిడ్ ,అధికం గా ఉంటాయి . పుట్టుకతో వచ్చిన లోపాల్ని  సరిచేయడానికి సహరిస్తుంది . దీనిలో అత్యధికంగా లభించే క్యాల్సియం , పీచు  జీర్ణక్రియకు , చర్మానికి మేలు కలిగిస్తాయి. 

  • బ్రకోలి : క్యాన్సర్ వ్యతిరేకగుణాలు  ఎక్కువ . యాంటీ ఆక్షిడెంట్స్ , ఖనిజాలు , ఏ, సి, విటమిన్లు  లభిస్తాయి. 

  • కివి : విటమిన్‌ "సి " ఎక్కువగా ఉంటుంది . పొటాషియం లభిస్తుంది . ఇది కంటి దృష్టి బ్లహీనతలనుండి కాపాడుతుంది . క్యాలరీలు తక్కువగా ఉంటాయి . మాయిశ్చర్ అధికముగా ఉంటుంది . చర్మానికి ఎటువంటి హాని జరుగుకుండా కాపాడుతుంది .





















  • ====================================

Visit my Website - Dr.Seshagirirao...

కుంకుడుకాయలు,Soap nuts



పండ్లు , కాయగూరలు ,గింజలు, పప్పులు , కందమూలాలు ,సుగంధద్రవ్యాలు మానవుడికి ప్రక్రుతి ప్రసాదించిన అపురూపమైన వరము .ఆయా సీజన్లలో పండే పండ్లను ఆరగించడం మనకు తరతరాలు గా తెలుసును . అన్నం తో కూడా ప్రకృతిసిద్ధమైన పండ్లు , కూరగాయలు ఇతర త్రునధన్యాలను ఆహారం గా ఆహారముగా తీసుకుని జీవించినట్లయితే శరీరానికి కావససిన అన్నిరకాల పోషకాలు లభిస్తాయి ... ఇదే అసలు ఉత్తమమైన జీవన విధానమని పకృతి వైద్యుల నమ్మకం.....ఆహారం జీవం ఉన్న ప్రతి జీవికి అత్యవసరమైనది. పిండిపదార్ధాలు, మాంసకృత్తులు, కొవ్వుపదార్ధాలు, ఖనిజలవణాలు, పీచుపదార్ధాలు, రోగనిరోధక శక్తికి కావలసిన విటమిన్లు మరియు శరీర పోషణకు రక్షణకు కావలసిన పదార్ధాలను కలిగిన పదార్దాలను ఆహారంగా పేర్కొనవచ్చు. ఇవి కాక శరీరానికి నూతన ఉత్సాహాన్నిచ్చే కాఫీ, టీ లాంటి వాటిని కూడా ఆహారపదార్ధాల కోవలోకి వస్తాయి. ఆహారం ఘన, ద్రవ రూపాలలో లభ్యం అవుతుంది.

ఆధునికత పెరిగే కొద్దీ ఆడంబరాలకు పోతూ మంచి ఆరోగ్య విధానాలకు సైతం మనం స్వస్తి చెబుతున్నాం. స్నానం చేసే సమయంలో ఖరీదైన షాంపూలు, సబ్బులను వాడకపోతే పరువు తక్కువ అని భావిస్తున్నాం. కాలగతిలో కుంకుడుకాయలు, శీకాకాయ, సున్నిపిండి వంటివి మరచిపోతున్నాం. అపార్టుమెంట్లలో ఉండేవారికి కుంకుడుకాయలు నలగగొట్టడానికి ఖాళీ స్థలమే కరువైంది. మార్బుల్, సిరామిక్ గచ్చులు పాడైపోతాయని కుంకుడు కాయల జోలికే వెళ్లడం లేదు. అందమైన సీసాలు, ఆకట్టుకునే ప్యాకింగ్‌ల్లో లభించే షాంపూల వైపే మొగ్గు చూపుతున్నాం. చౌకగా లభించే కుంకుళ్లవైపు కనె్నత్తి చూడం. ఖరీదైన వాటికోసం డబ్బు వదలించుకోవడం కన్నా కుంకుడు,శీకాయలతో కురుల అందాన్ని కాపాడుకోవచ్చన్న వాస్తవాన్ని విస్మరిస్తున్నాం.

ఈరోజుల్లో అభ్యంగన స్నానానికి రకరకాల షాంపూలు, సబ్బులు మార్కెట్లో లభిస్తున్నాయి. వాటిని ఉపయోగించడం చాలా సులభం. పూర్వం తలస్నానానికి కుంకుడుకాయలను ఉపయోగించేవారు. కుంకుడుకాయలను వాడాలంటే కొంత శ్రమ ఉంటుంది. ఆ కాయలను చితక్కొట్టి, వాటిలో గింజలను తీసెయ్యాలి. వాటిని వేడి నీటిలో నానపెట్టి... ఆ రసంతో తలరుద్దుకునేవారు. ఆ తర్వాత శీకాకాయపొడి మార్కెట్లో లభించడం ఆరంభమయింది. ఆ పొడిని నీటిలో తడిపి, ఆ ముద్దతో తలరుద్దుకునేవారు. అయితే, ఈ రోజుల్లో శీకాకాయపొడి కాకుండా కుంకుడుపొడి కూడా లభిస్తోంది. చాలామంది, కుంకుడుకాయలను ఈ రోజుల్లో వాడటం లేదు. నిజానికి తలంటుకి కుంకుడుకాయలను వాడటమే మంచిది. దీనివల్ల వెంట్రుకలు ఆరోగ్యంగా ఉండటమే కాక పేలు, చుండ్రులాంటి సమస్యలు రావు.

వేసవిలో కుంకుడుకాయలను బాగా ఎండబెట్టి పొడిచేసుకుని నిల్వ చేయొచ్చు. దీనివల్ల తలస్నానం చేసిన ప్రతీసారీ కుంకుడుకాయలను కొట్టుకునే శ్రమ తప్పుతుంది. ఎండబెట్టిన కమలాతొక్కలు, నిమ్మతొక్కలు, మందారాకులు, మందారపూలు, మెంతులను పొడిచేసి కుంకుడు పొడిలో కలపవచ్చు. వీటన్నిటినీ కలిపిన పొడితో తలస్నానంచేస్తే వెంట్రుకలు నల్లగా ఉంటాయి. త్వరగా నెరవవు. జుట్టు ఊడదు. బిరుసెక్కకుండా మెత్తగా ఉంటుంది.

కుంకుడుకాయలతో తలస్నానం చేయడం వల్ల కేశాలు జిడ్డులేకుండా శుభ్రపడతాయి. పైగా వీటిలో ఎటువంటి రసాయనికాలు కలువవు. కనుక జుట్టు నల్లగా నిగనిగలాడుతుంది. కుంకుళ్ళు తలస్నానానికి కాక, చర్మ సౌందర్యానికీ, మృదుత్వానికీ, చర్మ ఆరోగ్యానికీ తోడ్పడతాయి. చర్మానికి ఏర్పడే దురదలను ఎలర్జీలను పోగొడ్తాయి. కుంకుడు రసంలో ఖరీదయిన పట్టుచీరలను నానపెట్టి ఉతికితే అవి ఎంతో మెరుస్తాయి. కుంకుడురసంలో బంగారు ఆభరణాలను నానబెట్టి, మెత్తని బ్రష్‌తో మృదువుగా రుద్దితే... అవి శుభ్రపడి ధగధగా మెరుస్తుంటాయి. బాణాలి, పెనంవంటి జిడ్డుపాత్రలను కుంకుడు పిప్పితో శుభ్రపరచవచ్చు. కుంకుడు కాయలే శ్రేష్ఠమని తెలుసుకోవాలి. మన సాంప్రదాయపు అలవాట్లలో కూడా కుంకుడు కాయలను వాడతారు. ప్రసవమయిన బాలింతరాలికి పదకొండో రోజు పురిటి స్నానం చేయించబోయేముందురోజు ఇరుగుపొరుగు వారికి కుంకుడుకాయలు, నూనె, సున్నిపిండి పసుపు, కుంకుమతో పాటు మిఠాయిని పంచుతారు. పూర్వపు రోజులలో పెళ్ళికి వచ్చిన వియ్యాలవారి విడిదిలో కుంకుడుకాయలు, కొబ్బరి నూనె, పౌడరు, అద్దం ఉంచడం సాంప్రదాయం. అందువల్ల, కుంకుడు కాయలకు ఎంతో ప్రాముఖ్యత ఉంది.
  • =========================
Visit my Website - Dr.Seshagirirao...

Thursday 24 November 2011

ఉప్పు , Salt






  • image : courtesy with Visalandhra News paper





  • పండ్లు , కాయగూరలు ,గింజలు, పప్పులు , కందమూలాలు ,సుగంధద్రవ్యాలు మానవుడికి ప్రక్రుతి ప్రసాదించిన అపురూపమైన వరము .ఆయా సీజన్లలో పండే పండ్లను ఆరగించడం మనకు తరతరాలు గా తెలుసును . అన్నం తో కూడా ప్రకృతిసిద్ధమైన పండ్లు , కూరగాయలు ఇతర త్రునధన్యాలను ఆహారం గా ఆహారముగా తీసుకుని జీవించినట్లయితే శరీరానికి కావససిన అన్నిరకాల పోషకాలు లభిస్తాయి ... ఇదే అసలు ఉత్తమమైన జీవన విధానమని పకృతి వైద్యుల నమ్మకం.....ఆహారం జీవం ఉన్న ప్రతి జీవికి అత్యవసరమైనది. పిండిపదార్ధాలు, మాంసకృత్తులు, కొవ్వుపదార్ధాలు, ఖనిజలవణాలు, పీచుపదార్ధాలు, రోగనిరోధక శక్తికి కావలసిన విటమిన్లు మరియు శరీర పోషణకు రక్షణకు కావలసిన పదార్ధాలను కలిగిన పదార్దాలను ఆహారంగా పేర్కొనవచ్చు. ఇవి కాక శరీరానికి నూతన ఉత్సాహాన్నిచ్చే కాఫీ, టీ లాంటి వాటిని కూడా ఆహారపదార్ధాల కోవలోకి వస్తాయి. ఆహారం ఘన, ద్రవ రూపాలలో లభ్యం అవుతుంది.


మన దేశంలో పట్టణ, గ్రామీణ ప్రాంతాల ప్రజల జీవనశైలి మారుతోంది. ప్యాకేజ్డ్‌, ప్రాసెస్‌ చేసిన, రెడిమేడ్‌గా దొరికే ఆహారాలను తీసుకోవడానికి అలవాటు పడుతున్నారు. ఇందులో సోడియం ఎక్కువ మోతాదులో ఉంటుంది. ప్రతీరోజు సగటున ఒక భారతీయుడు 30 గ్రాముల ఉప్పు వాడుతున్నాడు. ఇది జాతీయ పోషకాహార సంస్థ సిఫార్సు కన్నా చాలా ఎక్కువ. రోజుకు ఆరు గ్రాముల కన్నా ఎక్కువ ఉప్పు తీసుకూడదని సంస్థ సూచిస్తోంది. ఉప్పు ఎక్కువ తీసుకుంటే గుండె జబ్బులు, మూత్రపిండాల జబ్బులు, కడుపులో క్యాన్సర్‌, ఆస్టియోపోరొసిస్‌ కలుగుతాయి. సముద్రం నుంచి లభించే ఉప్పులో 40 శాతం సోడియం, 60 శాతం క్లోరైడ్‌ ఉంటాయి. మన శరీరంలో ఉప్పుమీద ఆధారపడని అవయవమంటూ ఏమీలేదంటే అతిశయోక్తి కాదు. మన శరీరంలో జరిగే రసాయనిక చర్యలు అన్నీ కూడా ఉప్పు మీదే ఆధారపడి ఉంటాయి. మనం తీసుకునే ఆహారంలో ఉప్పు ముఖ్యమైన పదార్థం. కండరాలు సంకోచించడంలో, నీటి నిల్వ ఉండటంలో కీలక పాత్ర వహిస్తుంది. అంతేకాక శరీరంలో జీర్ణవ్యవస్థకు అవసరమైన పోషకాలు ఉప్పులో ఉన్నాయి. శరీరంలో సోడియం తక్కువైతే డీహైడ్రేషన్‌ కలుగుతుంది. మరోవైపు సోడియం ఎక్కువ ఉండే ఉప్పు పదార్థాలు తీసుకుంటే అధిక రక్తపోటు ప్రమాదం పెరుగుతుంది. ఇక్కడో సందేహం కలుగుతుంది. మన శరీరానికి ఎంత ఉప్పు అవసరం? జాతీయ పోషకాహారం సంస్థ ప్రకారం ఒక వ్యక్తి రోజుకు ఆరు గ్రాములు మాత్రమే ఉప్పు తీసుకోవాలి. కానీ సగటున ఒక వ్యక్తి రోజులో 8 నుంచి 12 గ్రాముల ఉప్పు తీసుకుంటున్నాడు. ఉప్పు మన శరీరంలో నీటి సమతుల్యతను కాపాడుతుంది. శరీరంలోని ఆమ్ల క్షార నిష్పత్తిని క్రమబద్దీకరించే చర్యలో సోడియం ఒక ముఖ్య పాత్ర వహిస్తుంది. సోడియం శాతం పడిపోతే హార్మోనులు పంపే సంకేతాలు శరీరంలో సరిగా వ్యాప్తికావు. కండరాలు నీరసించి మనిషి తేలికగా అలసటకూ చికాకుకూ లోనవుతాడు.




  • బహు ప్రయోజనకారి


ఉప్పు నాడీ ప్రేరేపణ ప్రసారానికి తోడ్పడుతుంది. సరైన మోతాదులో శరీరంలో ద్రవాలు నిల్వ ఉంచడానికి సహకరిస్తుంది. కండరాలు సంకోచించడానికి, వ్యాకోచించడానికి సహాయపడుతుంది. ఉప్పులో ఉండే అయోడిన్‌ ఎదుగుదలకు తోడ్పడుతుంది. అయోడిన్‌ లోపం వల్ల థైరాయిడ్‌ సమస్యలు వస్తాయి. శరీరంలో సోడియం బాగా తగ్గితే 'లో బ్లడ్‌ ప్రెజర్‌ ' కలుగుతుంది. ఇది రక్తప్రసరణను తగ్గిస్తుంది. సోడియం ఎక్కువైతే శరీరానికి హానికరం. పాల ఉత్పత్తులు, కూరగాయలు, చేపలు, రొయ్యలు, గుడ్లలో సహజసిద్ధంగా సోడియం ఉంటుంది. ఉప్పు ఎక్కువ తీసుకున్నప్పుడు కిడ్నీలో రెనిన్‌ అనే పదార్థం ఉత్పత్తి/విడుదల అవుతుంది. రెనిన్‌ అల్డొస్టిరాన్‌ను సెక్రియేట్‌ చేస్తుంది. ఆల్డోస్టిరాన్‌ రక్తనాళాలను సంకోచింప చేస్తుంది. శరీరంలో సోడియం ఉండేలా చేస్తుంది. శరీరంలో ఎక్కువ సోడియం నిల్వ ఉంటే ద్రవాలు ఎక్కువైతాయి. రక్తనాళాలు సంకోచించినప్పుడు బిపి అధికమవుతుంది. రెనిన్‌, ఆల్డోస్టిరాన్‌ అనేది ముఖ్యమైన మెకానిజం. భోజనంలో ఉప్పు తగ్గించినప్పుడు రెనిన్‌ తక్కువ ఉత్పత్తి అవుతుంది. మందుల వల్ల రెనిన్‌ ఉత్పత్తిని తగ్గించొచ్చు. ఆల్డోస్టిరాన్‌ను బ్లాక్‌ చేయడానికి మందులు ఉన్నాయి.





  • ఎంత తీసుకోవాలి?


రోజూ ఆఫీసుకు బస్సులో ప్రయాణిస్తూ, అరమైలు దూరం నడక సాగించే సాధారణ వ్యక్తికి రోజుకు ఆరు గ్రాముల ఉప్పు అవసరం. కష్టపడి పనిచేసే కూలీకి, కార్మికునికి, క్రీడాకారునికి లేక ఇతరత్రా వ్యాయామాలు చేసే మనిషికి ఇంకాస్త ఎక్కువ అవసరం. చెమటలో 0.1 నుంచి 0.3 శాతం దాకా సోడియం క్లోరైడ్‌ ఉంటుంది. చలికాలంలో చెమట ద్వారా బయటికి పోయే ఉప్పు అంటూ ఏమీ ఉండదు. కానీ మంచి మండే వేసవిలో మాత్రం ఆఫీసుకు వెళ్లే వ్యక్తి రోజుకు 12.5 గ్రాముల దాకా ఉప్పును చమట ద్వారా విసర్జిస్తాడు. ఇదే రోజులో వ్యాయామాలు చేసినా లేక ఏడారి ప్రాంతాల్లో నివసించే వారిలో ఇది ఇంకా బాగా ఎక్కువగా ఉంటుంది. అయితే చెమట ద్వారా శరీరం ఉప్పు కంటే నీటిని ఎక్కువ కోల్పోతుంది. దీని వల్ల బాగా చెమటలు పట్టినప్పుడు రక్తంలో ఉండాల్సిన దానికంటే ఉప్పు ఎక్కువ శాతం గానూ నీరు తక్కువ శాతంగానూ ఉండి వాటి మధ్య నిష్పత్తి దెబ్బతింటుంది. దీన్ని పసిగట్టిన మెదడులోని దప్పిక కేంద్రం నీటిని ఎక్కువ తాగమంటూ నోటికి సందేశం పంపిస్తుంది. మనకు దప్పిక అయ్యేది ఈ సందర్భంలోనే.




  • గుండెను కబలిస్తుంది


సోడియం ఎక్కువగా తీసుకుంటే రక్తంలో ద్రవాలు ఎక్కువైతాయి. ఇది రక్తపోటును పెంచుతుంది. సాధారణంగా ఈ అదనపు నీటిని శరీరం నుంచి మూత్రపిండాలు బయటికి పంపిస్తాయి. కొన్నిసార్లు మూత్రపిండాలు సరిగ్గా పనిచేయకపోవచ్చు. ఈ సమయంలో అదనంగా ఉన్న నీటిని సమర్థవంతంగా బయటికి పంపించలేవు. దీంతో ద్రవాలు శరీరంలోనే ఉండిపోతాయి. ఇది రక్తం పరిమాణాన్ని పెంచుతుంది. ఈ రక్తం రక్తనాళాల ద్వారా పంప్‌ అవుతుంది. ఇది అధిక రక్తపోటుకు దారితీస్తుంది. ఇలా అదనంగా ఉన్న ద్రవాలతో కూడుకున్న రక్తాన్ని శరీరమంతా పంప్‌ చేయడానికి గుండె తన సైజును పెంచుకుంటుంది. ఈపరిస్థితిలో గుండెలోని కణాలు పనిచేయవు. ఎందుకంటే వీటికి అవసరమైనంత ఆక్సీజన్‌, పోషకాలు అందవు కాబట్టి. కొంతకాలానికి అదనపు రక్తపోటు వల్ల కలిగిన నష్టం తీవ్రరూపం దాల్చుతుంది. అప్పుడు ధమనులు పేలిపోవడం లేదా పూర్తిగా రక్తప్రసరణకు అడ్డుగా ఉంటాయి. ఇలాంటప్పుడు రక్తాన్ని స్వీకరించే గుండెలోని ఒక భాగం తనకు అవసరమైన ఆక్సీజన్‌, పోషకాలను పొందలేదు. దీంతో ఇది నషిస్తుంది. ఫలితంగా ఇది గుండెపోటుకు కారణం అవుతుంది. స్థూలకాయులు ఎక్కువగా ఉప్పు తింటే గుండె జబ్బుల ప్రమాదం పెరుగుతుంది. అధిక రక్తపోటు ఉన్నవాళ్లు ఉప్పు తగ్గించకపోతే కిడ్నీలు దెబ్బతినే ప్రమాదముంది.




  • రక్తపోటును పెంచుతుంది


శరీరంలోకి చేరుకున్న అదనపు ఉప్పును మూత్రపిండాలు విసర్జిస్తాయి. శరీరంలో నీటికంటే ఉప్పు ఎక్కువ ఉన్నప్పుడు మెదడులోని దప్పిక కేంద్రం ప్రేరేపణకు గురై మరిన్ని నీళ్లు తాగమంటూ ప్రోత్సహిస్తుంది. అయితే ఉప్పు శాతం అధికంగా వాడడం వల్ల మూత్రపిండాలు అధికంగా ఉన్న నీటి మొత్తాన్ని విసర్జించలేకపోతాయి. అప్పుడు శరీరంలోని రక్త పరిమాణం పెరుగుతుంది. ద్రవపరిణామం పెరిగి ద్రవాన్ని ఇముడ్చుకునే ఖాళీ పెరగకపోవడంతో ఆలోపల ఒత్తిడి అధికమవుతుంది. ఈ పెరిగిన ఒత్తిడినే మనం రక్తపోటు అంటాం. అంటే ఉప్పు ఎక్కువ తీసుకోవడం వల్ల బిపి పెరుగుతుందన్న మాట. రక్తం శరీరంలోని అన్ని అవయవాలకు సరఫరా అవ్వడానికి బ్లడ్‌ ప్రెజర్‌ (బిపి-రక్తపోటు) అవసరం. బిపి 120/80 ఉంటే నార్మల్‌ ఉందని అర్థం. పైన ఉన్న సంఖ్య (120) సిస్టాలిక్‌ అని, కింద ఉన్న సంఖ్య (80) డయాలిస్టిక్‌ అని అంటారు. రక్తపోటు వయసును బట్టి కొంత పెరుగుతుంది. కొన్ని సందర్భాల్లో మిగతా అలవాట్ల వల్ల, యాంగ్జైటీ, ఆందోళన, ఒత్తిడి, డిప్రెషన్‌ వల్ల బిపి పెరిగే అవకాశముంది. బిపి పెరిగినప్పుడు వెంటనే ఏమీ అవ్వకపోవచ్చు. అయితే నెమ్మది నెమ్మదిగా శరీరంలోని కీలక అవయవాలపై ప్రభావం చూపుతుంది. బిపి ఎక్కువైనప్పుడు మెదడు, కళ్లు, గుండె, మూత్రపిండాలు ఎక్కువ ప్రభావితం అవుతాయి. భోజనంలో ఉప్పు వల్ల బిపి పెరుగుతుంది. కొంత మందిలో ధూమపానం, ఆల్కహాలు అలవాట్లు, వ్యాయామం లేకపోవడం వల్ల కూడా బిపి పెరుగుతుంది. కొన్ని కొన్ని సందర్భాల్లో ఇతర కారణాల వల్ల కూడా బిపి పెరిగే అవకాశముంది. మూత్రపిండాలకు వెళ్లే రక్తనాళాలు సన్నగా ఉండడం వల్ల బిపి ఎక్కువైతుంది. కిడ్నీపైన ఉండే కొన్ని గ్రంథులు ఎక్కువగా పనిచేసినా కూడా బిపి పెరుగుతుంది. థైరాయిడ్‌ తక్కువైనా కూడా బిపి వస్తుంది. కొంత మంది గర్భం రాకుండా ఉండటానికి పిల్స్‌ తీసుకుంటారు. ఈ పిల్స్‌ వల్ల కలిగే దుష్ప్రభావాల్లో బిపి ఒకటి. పిల్స్‌తో వీరిలో బిపి పెరుగుతుంది. వేరే ఏ కారణాలు లేకుండా బిపి ఎక్కువుంటే ప్రైమరి హైపర్‌టెన్షన్‌ అంటారు. 95 శాతం మందిలో బిపికి కారణం ఏమిటనేది కనుక్కోలేం. ఇది జన్యుపరమైనవి కావొచ్చు, అలవాట్లు కావొచ్చు. తీసుకునే ఉప్పు వల్ల కూడా కావొచ్చు. ఒక్కోసారి అకస్మాత్తుగా హైబిపి వస్తుంది. ఇది చాలా ప్రమాదకరం. అకస్మాత్తుగా హైబిపి వచ్చినప్పుడు కళ్లు మసకగా కనిపించడం, కళ్లలోని నరాలు దెబ్బతినడం జరుగుతాయి. ఒక్కోసారి మెదడులోని నరాలు చిట్లే అవకాశముంది. దీన్ని సెరిబ్రల్‌ హెమరేజ్‌ అంటారు. ఈ పరిస్థితిలో మరణించే అవకాశాలెక్కువ. ఒత్తిడి వల్ల పెద్దలే కాక పిల్లల్లో కూడా బిపి వస్తోంది. ఒత్తిడి ఉన్నప్పుడు శరీరంలోని హార్మోన్లు పెరగుతాయి. మనం ఏదైనా విషయం గురించి ఆందోళన చెందినప్పుడు పల్స్‌రేటు ఎక్కువై బిపి పెరుగుతుంది. శరీరానికి మేలు చేసే హార్మోన్లు ఒత్తిడి వల్ల కీడు చేస్తాయి.




  • బిపికి జీవితాంతం మందులు


ఒక సారి రక్తపోటు వస్తే దీన్ని నయం చేయలేం. కేవలం నియంత్రిచే వీలుంది. దీని కోసం జీవితాంతం మందులు వాడాల్సి ఉంటుంది. ఎందుకంటే బిపి మన శరీరంలోని ప్రతీ అవయవం ప్రతీక్షణం ప్రభావితమవుతుంది. మన గుండె ఎన్నిసార్లు కొట్టుకుంటుందో అన్ని సార్లు రక్తం శరీరమంతా ప్రసరిస్తుంది. 25 ఏళ్లు వచ్చినవారు బిపిని చెక్‌ చేయించుకోవాలి. కనీసం ఆరు నెలలకోసారైనా. మందులు వాడుతున్నవారు మూడు నెలలకోసారి పరీక్ష చేయించుకోవాలి. ఏడాదికోసారి ఆరోగ్య పరీక్షలు చేయించుకోవాలి.బిపి ఉన్నప్పుడు వైద్యున్ని కలిసి అన్ని రకాల పరీక్షలు చేయించుకోవాలి. సూచించిన మందులను క్రమం తప్పకుండా జీవితాంతం వాడాలి. తరచూ బిపి చెకప్‌ చేయించకుంటూ ఉండాలి. బిపి వల్ల బ్రెయిన్‌ హెమరేజ్‌, పక్షవాతం, కళ్లలో సమస్యలు, దృష్టి దెబ్బతిని చూపుపోతుంది. గుండెపోటు, కిడ్నీ దెబ్బతినడం వల్ల కిడ్నీ సమస్యలు.




  • ఉప్పు ఎలా తగ్గించుకోవాలి ?


మనకు రోజుకు ఒక వ్యక్తికి 6 గ్రాముల ఉప్పు అవసరం. పళ్లు, కూరగాయల్లో సహజసిద్దంగా ఉప్పు ఉంటుంది. ఇది మన శరీరం పనిచేయడానికి తోడ్పడుతుంది. కొన్ని జాగ్రత్తలు పాటిస్తే ఉప్పును తగ్గించుకోవచ్చు.




  • * నిల్వ ఉన్న, బయట దొరికే ప్రాసెస్‌ ఫుడ్స్‌ పూర్తిగా మానాల్సి ఉంటుంది. ఎందుకంటే వీటిలో ఉప్పు ఎక్కువుంటుంది.

  • * ఆహారం తినే సమయంలో ఉప్పు డబ్బా పెట్టుకోకూడదు.

  • * ఉప్పుకు బుదులు రుచికలిగించేవి, సుగంధద్రవ్యాలు, నిమ్మరసం, వెనిగర్‌, మిరియాలపొడి, ఉల్లిపాయలు వాడాలి.

  • * డబ్బాల్లో నిల్వ ఉన్న పదార్థాలకు బదులుగా తాజా పళ్లు తీసుకోవాలి.

  • * ఉప్పుతో తయారు చేసిన స్నాక్స్‌, చిప్స్‌ను బాగా తగ్గించాలి.

  • * ఉప్పు కలుపుకోకుండా మజ్జిగ తీసుకోవాలి.

  • * పొటాషియం ఎక్కువుండే అరటిపళ్లను అధికంగా తీసుకోవాలి. ఇవి శరీరంలో సోడియం స్థాయిని సమతుల్యం చేస్తాయి.

  • * అధిక బరువు ఉన్నవారు తమ ఎత్తు, వయసుకు తగ్గ బరువుండాలి.

  • * ఆల్కహాలు, ధూమపానం మానాలి.

  • * ఆహార పదార్థాల మీద అదనంగా ఉప్పు చల్లుకోవడం మానాలి.

  • * కూల్‌డ్రింక్స్‌ మానాలి.


Udates :




  • ఆహారంలో ఉప్పు వాడకాన్ని తగ్గించాలంటూ కార్పొరేట్ ఆస్పత్రులు ఓ వైపు ప్రచారం చేస్తుండగా మరోవైపు డెన్నార్క్‌కు చెందిన శాస్తవ్రేత్తలు ఉప్పు పూర్తిగా తగ్గిస్తే గుండెకు సమస్యలు తప్పవని తేల్చి చెబుతున్నారు. వినడానికి వింతగా ఉన్నా, తాజా పరిశోధనలు ఉప్పు వినియోగాన్ని పూర్తిగా తగ్గించవద్దని ఘోషిస్తున్నాయి. తిండిలో లవణం లేకుండా చేస్తే గుండెకు చేటు కలుగుతుందని, ఫలితంగా హృద్రోగాలు తప్పవని డెన్మార్క్ పరిశోధకులు దండోరా వేస్తున్నారు. ఉప్పును బాగా తగ్గించడం వల్ల కొలెస్ట్రాల్‌లో 2.5 శాతం, రక్తం గడ్డ కట్టడానికి సహకరించే కొవ్వులో ఏడు శాతం పెరుగుదల సంభవించినట్లు వారు గుర్తించారు. ఉప్పు వినియోగం మానేస్తే అధిక రక్తపోటుకు కారణమయ్యే ‘అల్డోస్టెరాన్’ హార్మోన్లు శరీరంలో విడుదలవుతున్నట్లు పరిశోధకులు చెబుతున్నారు.



Salt History ,ఉప్పు చరిత్ర :




  • ఒకప్పుడు ఉప్పు విలువై వస్తువు... దేశాలను సంపన్నం చేసిన ధనం... సైనికులకి అదే జీతం..


అబ్బో... చెప్పుకోవాలంటే ఉప్పు గొప్ప ఒప్పుకోక తప్పనిదే! ఒకప్పుడు అది డబ్బుతో సమానం. ఇది దేశాల ఆర్థిక స్థితిగతులనే మార్చింది. 'జీతం' అనే పదం పుట్టడానికి కారణమయ్యింది. కొన్ని దేశాల్లో సైనికులకు ఉప్పునే జీతంగా ఇచ్చేవారు మరి! పురాతన కాలంలో 'తెల్ల బంగారం' అని పిలుచుకునే వారు. ఇక మన దేశంలో ఉప్పు సత్యాగ్రహం ఎంత ప్రాధాన్యత సంతరించుకుందో గుర్తుంది కదా? బ్రిటిష్‌వారు ఉప్పుపై విధించిన పన్నుకి వ్యతిరేకంగానే గాంధీజీ దీన్ని చేపట్టారు.

ఇంతకీ ఉప్పు వాడకం ఎప్పుడు మొదలైంది? రాతి యుగంలో ఆదిమానవులు పచ్చిమాంసం తినేవారు కాబట్టి ఉప్పు అవసరమే ఉండేది కాదు. పది వేల ఏళ్ల క్రితం వ్యవసాయం మొదలుపెట్టి వరి, గోధుమ లాంటి ఆహార ధాన్యాలు పండించడం మొదలుపెట్టగానే ఉప్పదనం కావల్సివచ్చింది. ఉప్పుని మొదట చైనాలో వాడినట్టు ఆధారాలు ఉన్నాయి. క్రీస్తు పూర్వం 6000లో చైనాలోని యుంచెంగ్‌ అనే ఉప్పునీటి సరస్సు నుంచి ఉప్పుని తయారు చేశారని చెబుతారు. ఆసియాలో క్రీస్తు పూర్వం 4,500 నుంచి వినియోగంలో ఉన్నట్టు అంచనా. ఈజిప్టువాసులు మమ్మీలను నిలవ ఉంచేందుకు వాడేవారు.

15వ శతాబ్దంలో పోలాండ్‌ ఉప్పు వల్లే అత్యంత ధనవంతమైన దేశంగా మారింది. ఉప్పు గనుల నుంచి ఇతర దేశాలకు సరఫరా చేసి బోలెడు డబ్బు దండుకునేది. తరువాత జర్మన్లు సముద్రపు ఉప్పుని తయారు చేయడంతో అందరికీ అందుబాటులోకి వచ్చింది. రోమన్‌ చక్రవర్తులైతే సైన్యానికి కొన్నాళ్ల పాటు ఉప్పునే నెల జీతంగా ఇచ్చారు. జీతానికి వాడే Salary పదం పుట్టుకకు కారణం ఉప్పే. Salarium అనే లాటిన్‌ పదం నుంచి ఇది వచ్చింది. ఆ పదానికి అర్థం Payment in Salt.




  • మీకు తెలుసా?


* ప్రపంచ వ్యాప్తంగా 210 మిలియన్‌ మెట్రిక్‌ టన్నుల ఉప్పు ఉత్పత్తి జరుగుతోంది.
* ఉత్పత్తిలో మొదటి నాలుగు స్థానాల్లో ఉన్న దేశాలు అమెరికా, చైనా, జర్మనీ, ఇండియా.
* మన దేశంలో ఏటా 14.5 మిలియన్‌ టన్నుల ఉప్పుని ఉత్పత్తి చేస్తున్నారు.




  • conclusion :


ఉప్పు తినాలా ? వద్దా? ....
ఉప్పు తప్పనిసరిగా ఆహారములో తీసుకోవాలి . నార్మల్ గా ఏ వ్యాధులు లేనివారు రోజుకి 6(ఆరు) గ్రాములు అన్నివిధాలా మొత్తము గా తీసుకోవాలి . గుండెజబ్బులు , బి.పి. ఉన్నవారు ఇందులో సగము ... సుమారు 2.5 - 3.0 గ్రాములు వాడాలి.




  • ఉప్పులో రకాలు :


ఉప్పులో సోడియం , క్లోరైడ్ అను రెండు పదార్ధాలు ఉంటాయి.



  • కామన్‌ సాల్ట్ :


ఇది మనము కిచెన్‌ లో వాడే రకము. సముద్రపు నీటినుండి తయారుచేసి శ్ర్భ్రము చేస్తారు . కొన్ని రసాయనాలు కలిపి ఫ్రీ గా పొడుము గా ఉండేలా చేస్తారు .



  • అయోడైజ్డ్ సాల్ట్ :


కామన్‌ సాల్ట్ కు అయోడిన్‌ కలుపుతారు . ఉప్పును శుభ్రము చేసినపుడు అయోడిన్‌ పోతుంది . అయోడిన్‌ వల్ల థైరాయిడ్ వ్యాధులు వస్తాయి. అందువల్ల ఉప్పుకు అయోడిన్‌ కలిపి తయారుచేస్తారు .



  • సీ సాల్ట్ :


సముద్రము నీటినుండి తయారుచేసే ఉప్పు స్పటికాలు . దీనిలో కొద్దిగా అయోడిన్‌ , పొటాషియం, మెగ్నీషియం ఉంటాయి. పూర్వము వంటలలో దీనినే వాడేవారు .



  • రాక్ సాల్ట్ :


Halite , commonly known as rock salt, is the mineral form of sodium chloride (NaCl). Halite forms isometric crystals.
గ్రే / పింక్ రంగులో ఉంటుంది . ఇది రిఫైన్‌ చేసింది కాదు . . కాబట్టి అన్ని మినరల్స్ యదాతదం గా ఉంటాయి . ఎసిడిటీని తగ్గిస్తుంది .



  • ఎప్సమ్‌ సాల్త్ : Magnesium sulfate


దీన్ని వంటకాలలో వాడరు . మందులషాపులలో దొరుకుతుంది . స్నానము చేసే నీటిలో కలిపి వాడితే శారీక నొప్పులు తగ్గుతాయి. కండరాలను సడలిస్తుంది . చర్మము పై మృతకణాలను తొలగిస్తుంది . containing magnesium, sulfur and oxygen, with the formula MgSO4. దీన్ని విరోచనకారిగా వాడుతారు (used as a saline laxative).




  • Salt and Herat failure ,ఉప్పు-హర్ట్ ఫెయిల్యూర్




అధిక రక్తపోటు వలన ధమనుల్లో ఆర్టీరియల్ ఒత్తిడి ఏర్పడి రక్తం సంచితమవుతుంది. దీని పరిణామంగా రక్తం వెనుకు పోటేసి గుండె పంపింగ్ సామర్ధ్యాన్ని దెబ్బతీస్తుంది. ఫలితంగా కొద్దిసేపు ఏదైనా పని చేస్తే శ్వాసవేగం పెరుగుతుంది.. పనితో సంబంధం లేకుండా విశ్రాంతి తీసుకుంటున్నపుడు కూడా ఆయాసం రావడం జరుగుతుంది. దీని ద్వారా హార్ట్ ఫెయిల్యూర్ లక్షణాలు కనిపిస్తాయి. ఉప్పు ఎంతవరకు అవసరం ? మన శరీరంలో సోడియం ఉత్పత్తికాదు, కాబట్టి దీనికి మనం తినే ఆహారం తాగే ద్రవ పధార్ధాలు, దుంపలు, ధాన్యాలు పప్పుదినుసులు, పండ్లు మాంసం, పాలు, మనం తినే నీటిలో కూడా సోడియం వుంటుంది. మనం వంటచేసేటపుడు కూరలతో ఉప్పు సరేసరి! వీటిని దృష్ఠిలో పెట్టుకుని ఆరోగ్య సంస్థ నిర్ధేశించిన ప్రమాణాల ప్రకారం రోజుకు 1 టీ స్పూన్ ఉప్పు మాత్రమే తీసుకోవాలి. రక్తపోటు, గుండెజబ్బులు, మూత్రపిండాల వ్యాధులున్న వారు ఉప్పు తక్కువ తినాలి. మోతాదుకు మించి ఉప్పును వాడటం మంచిదికాదు. 



ఆహారంలో ఉప్పు మోతాదు తగ్గించాలనుకుంటున్నారా?  అధ్యయనాలు, పరిశోధనల ప్రకారం ఒక ఆరోగ్యకరమైన మనిషి రోజుకు 1500 మిల్లీగ్రాముల సోడియం చొప్పున వినియోగించాలి. దురదృష్టవశాత్తూ, చాలా మంది 3000 మిల్లీగ్రాముల కన్నా ఎక్కువ సోడియం వాడుతూ వుండడం వల్ల గుండె పోటు, స్ట్రోక్ లాంటి ఇతర రకాల గుండె జబ్బులు వస్తున్నాయి. కేవలం ఒక టీస్పూన్ ఉప్పులో సుమారు 2000 మిల్లీ గ్రాముల సోడియం వుంటుంది, అలాగే ఒక ఫాస్ట్ ఫుడ్ రెస్టారెంట్ లో దొరికే ఏ ఒక్క వస్తువులోనైనా తేలిగ్గా అంతే మోతాదు వుంటుంది. దీర్ఘ కాలం ఎక్కువ సోడియం వాడడం రక్త పోటు, ఇతర బలహీన పరచే పరిస్థితులకు సంబంధించినది కావడం వల్ల సోడియం వాడకాన్ని నియంత్రణ లో ఉంచుకునే మార్గాలు వెతకడం ఆరోగ్యానికి మంచిది. సోడియం వాడకం మితిమీరి ఎక్కువైతే అది వెంటనే కొన్ని వైద్య లక్షణాలు చూపిస్తుంది - పగిలిన, రక్తమోడుతున్న పెదాలు, కడుపులో తిప్పడం లాంటివే కాక, కొన్ని తీవ్ర సందర్భాల్లో మరణాన్ని కూడా కలిగిస్తుంది. మీరు మీ ఆహారంలో ఉప్పు మోతాదు తగ్గించాలనుకున్నా లేక తొలగించాలనుకున్నా, మీ ప్రయత్నంలో ఉపయోగపడేందుకు ఇదిగో ఈ క్రింది సూత్రాలు పాటించండి. : 1. మీ ఆహారాన్ని సహజ స్థితిలో లేదా ఉడికించిన స్థితి లో రుచి చూడడానికి అలవాటు పడ౦డి. మీ ఆహారాన్ని ఎప్పుడూ ఉప్పు కలపక ముందు రుచి చూడ౦డి. మీరు అలవాటు చొప్పున ఉప్పు వేసుకునే వారైతే, ఉప్పు కన్నా ముందు ఫోర్క్ తీసుకుని - ఉప్పు లేని ఆహారం రుచిని ఆస్వాదించడం మళ్ళీ నేర్చుకోండి. మొదట్లో చప్పగా వున్నట్టు అనిపించినా, ఆ భావన త్వరలోనే పోయి ఉప్పు ఆహార పదార్ధాల అసలు రుచిని ఎలా మరుగు పరుస్తుందో తెలుసుకుంటారు. మార్పు రావడానికి కొద్ది సమయం ఓపిక పట్టండి - ఓ రెండు మూడు నెలలకు గానీ మీ ఇంద్రియాలు ఉప్పు కోసం వెంపర్లాడడం మానవు. 2. ఆహార పదార్ధాల పై లేబుళ్ళు చదవండి, వెబ్ సైట్ లు చూసి మీరు రోజూ తినే ఆహారంలో సోడియం పరిమాణం ఎంత ఉందొ తెలుసుకోండి. మీరు తినే ఆహారంలో సోడియం పరిమాణం ఎంత వుందో తెలుసుకు౦టు౦టే ఉప్పు వాడకం తగ్గించాలని మీరు త్వరగా సమాధానపడతారు. వెచ్చాలు కొనేటప్పుడు సోడియం పరిమాణం ఎంత వుందో తెలుసుకోవడానికి లేబుళ్ళు చదవడం అలవాటు చేసుకోండి. ఇంట్లో వండుకుని తినడం 1. ఇంట్లో వంట చేసేటప్పుడు కూడా ఉప్పు వాడకం తగ్గించండి. అత్యవసరమైతే తప్ప ఉప్పు వేయడం మానేయండి. వంటకాల్లో సూచించిన దాంట్లో సగం ఉప్పే వేయండి, ఇంకా అలా సగం చేసుకుంటూ వెళ్ళండి. కుదిరితే, వంట చివర గానీ లేదా తినబోయే ముందు కానీ ఉప్పు వేయండి. ఇలా చేస్తే, ఉప్పుకి వంటకం లో కలవడానికి ఎక్కువ సమయం ఉండదు కాబట్టి కొంచెమే సరిపోతుంది. 2. తాలింపు కోసం వాడే వాటిలో సోడియం ఎంతుందో చూడండి. పంది మాంసపు ముక్కలు, రొమనో వెన్న, కొన్ని ఎంపిక చేసిన తాలింపు సామాను లాంటి చాలా పదార్ధాలు ఎక్కువగా ఉప్పుతో కూడి వుంటాయి కనుక సాధ్యమైనంత వరకు వాటిని వదిలేయండి (కెచప్, ఆవ పెట్టిన ఊరగాయ బదులు బర్గర్ మీద పాలకూర, ఉల్లి, టమాటో వాడండి). ప్రత్యేకమైన తాలింపు పాకెట్ వుండే వాటికి - ఆ పాకెట్ లో తక్కువ పరిమాణం వాడండి లేదా పూర్తిగా తగ్గించండి. ఐతే, కొద్దిగానే అయినా ఈ రుచులు, తాలింపు ఉప్పు కలపడమే నేరుగా ఉప్పు కలపడం కన్నా మంచిది. 3. ఉప్పు బదులు ఉప్పు లేని తాలింపు వాడండి. ఉప్పు నుంచి దూరంగా ఉండడానికి అనేక ఇతర ప్రత్యామ్నాయాల శ్రేణి వుంది. వాటిలో మూలికలు, సుగంధ ద్రవ్యాలు, నిమ్మకాయ, వెల్లుల్లి, తాజా కూరగాయలు, మాంసం, కూరల ఉప్పు ఒరేగానో, నిమ్మ రసం, మిరియప్పొడి, మిరపగుండ, కారపు సాస్ లేదా సాల్సా కూడా కొద్దిగా రుచిని జోడిస్తాయి. 4. ప్రాసెస్ చేసిన ఆహారాలు మానివేయండి. తాజాగా తయారైనవి, మాంసం, మంచినీటి చేప లాంటివి ఉప్పు లేకుండా వుంటాయి లేదా కొద్ది పాటి సోడియం ను కలిగి వుంటాయి, కాగా సూప్ లు, శీతలీకరించిన ఆహారం, ప్రాసెస్ చేసినవి, రెస్టారెంట్ లో తయారయ్యేవి సాధారణంగా సోడియం అధికంగా కలిగి వుంటాయి. మీకు తాజా కూరగాయలు అందుబాటులో లేకపోతే సోడియం అధికంగా వుండే కూరగాయల కన్నా సోడియం లేని, లేదా తక్కువగా వుండే డబ్బాల్లో వున్న కూరగాయలు వాడడం మంచిది. అందుకే సోడియం పరిమాణం ఎంతుందో తెలుసుకోవడానికి లేబుళ్ళు చదవడం అలవాటు చేసుకోండి. 5. ఆహార పదార్ధాల మీద నుంచి సోడియం తొలగించండి. ఉప్పు కలిసిన వాటి కన్నా పైన ఉప్పు చల్లిన పదార్ధాలు ఎంచుకోండి. ఉదాహరణకు సాల్టైన్ లు కొనేటప్పుడు ‘సాల్ట్ కలపని పైముక్కల' కొనుగోలు మానేయండి ఎందుకంటే వాటి పైన కాకుండా ఉప్పు లోపల కలిసిపోయి వుంటుంది - అందువల్ల దాన్ని తొలగించడం కుదరదు. "ఉప్పు పైన' వుండే ఉత్పత్తులు కొద్ది సోడియం పరిమాణానికి ఎక్కువ రుచిని అందిస్తాయి, కనుక ఆ కోణంలో చూసినా అవే మంచివి. 6. టేబుల్ దగ్గర కూర్చున్నపుడు మీ ఉప్పు వాడే అలవాట్లు మార్చుకోండి. సాల్ట్ షేకర్ ముట్టుకోకండి. తగ్గించేటప్పుడు కూడా మొత్తం ఒంపుకోకుండా ఒక్కసారి షేక్ చేయండి - ఇక నెమ్మదిగా ఈ అలవాటుకి దూరం జరగండి. మసాలా దినుసులతో జాగ్రత్త - సాస్ లు ఇతర టాపింగ్స్ లో ఎక్కువ పరిమాణం లో ఉప్పు ఉంటుంది. 7. ఆహారాల్లో వున్న సోడియంను తగ్గించండి. మీరు ఎక్కువ సోడియం వున్న సూప్ ల లాంటి పదార్ధాలు కొంటే దాన్ని పల్చగా తయారు చేయడం వల్ల సోడియం స్థాయి తగ్గుతుంది. ఉదాహరణకు, మీరు లేబుల్ మీద సూచించినట్టుగా సూప్ తయారు చేస్తే, దాంట్లో సోడియం పరిమాణం ఎక్కువగా వుంటుంది. దాని బదులు మీరు క్యాన్ చేసిన సూప్ ను తీసుకుని బంగాళా దుంపలు, ఆకుకూరలు, ఉల్లిపాయలు, కారెట్లు లాంటి తాజా కూరగాయలు కలపండి. అలా కాకుండా దాన్ని నేరుగా వడ్డి౦చడం వల్ల తినే ప్రతివారికీ ఎక్కువ పరిమాణంలో సోడియం అందుతుంది. 8. ఇంట్లో తినండి. వేరే వాళ్ళ ఇళ్ళలోనో, రెస్టారెంట్లలోనో తింటే ఇతరులు తయారు చేసిన పదార్ధాలలో సోడియం పరిమాణం నియంత్రించడం మనకు సాధ్యం కాకపోవచ్చు. ఇంట్లో తింటున్నాం అంటే మీ ఆహారంలో సోడియం పరిమాణం ఎంత వుందో మీకు ఖచ్చితంగా తెలుస్తుంది.





    నిత్యం అందుబాటులో ఉండే ఉప్పు వంటలకు రుచినివ్వడమే కాదు, మరెన్నో విధాలుగానూ ఉపయోగపడుతుంది.



రోజూ నీళ్లు పోయడం వల్ల ఫ్లవర్‌ వాజు లోపల గారపడుతుంది. అలాంటప్పుడు ఉప్పు నీటిని వాజులో నింపి అరగంట నాననివ్వాలి. ఆ తరవాత బాగా గిలక్కొట్టి సబ్బు నీటితో కడిగేస్తే గార వదులుతుంది. గుమ్మాలకు వేలాడదీసే ప్లాస్టిక్‌ పూల దండలూ, ఫ్లవర్‌ వాజులపై దుమ్ము పేరుకుంటుంది కదా! దాన్ని వదిలించడానికీ ఉప్పు ఉపయోగపడుతుంది. అందుకు ఏం చేయాలంటే... పెద్ద ప్లాస్టిక్‌ కవరులో గుప్పెడు ఉప్పు వేసి అందులో ప్లాస్టిక్‌ పువ్వుల్ని ఉంచి ముడి వేసి, కవరును బాగా కదపాలి. ఉప్పు నల్లబడిందంటే దుమ్ము పోయినట్లే.



* గదులు వూడ్చే మెత్తని చీపురుని కొనగానే వాడేయకండి. బకెట్‌ వేడి నీళ్లలో కప్పు ఉప్పు వేసి దాన్లో చీపురు మునిగేలా ఉంచండి. పావు గంటయ్యాక దాన్ని బయటకు తీసి ఎండలో ఉంచండి. ఇలా చేస్తే చీపురు ఎక్కువకాలం మన్నుతుంది.



* భోజనాల బల్లపై నీటి మరకలు ఎక్కువగా పడుతుంటాయి. వాటిని వదిలించాలంటే ఉప్పే పరిష్కారం. అరకప్పు ఉప్పులో కొద్దిగా నీళ్లు పోసి పేస్టులా చేయాలి. దీన్ని నీటి మరకలున్న చోట పూతలా రాసి కాసేపయ్యాక కడిగితే మరకలు సులువుగా పోతాయి.



* ఈ కాలంలో కిటికీ అద్దాలపై మంచు పేరుకుని మసగ్గా కనిపిస్తుంది. దానికీ ఉప్పు నీరే పరిష్కారం. ఉప్పు నీటిలో మెత్తని వస్త్రాన్ని ముంచి కిటికీ అద్దాలను తుడవాలి. ఆ వెంటనే మరో మెత్తని పొడి వస్త్రంతో తుడిస్తే సరిపోతుంది. ఇంట్లో చీమలు బారులు తీరి ఇబ్బంది పెడుతోంటే ఆ ప్రదేశంలో ఉప్పు చల్లితే, తక్కువ సమయంలో వాటి బెడద వదులుతుంది.



* చెత్త డబ్బాల్లో పేరుకున్న మురికీ దుర్వాసనా వదలాలంటే డబ్బా అంతటా అరకప్పు ఉప్పు చల్లండి. కాసేపయ్యాక చల్లని నీరు పోస్తూ కడిగేస్తే, మురికితో పాటూ దుర్వాసన కూడా పోతుంది.



courtesy with:eenadu sukhibhava




  • ===================================


Visit my Website - Dr.Seshagirirao...

వంటనూనెల ప్రత్యేకత్లు , Specialities of cooking oils








పండ్లు , కాయగూరలు ,గింజలు, పప్పులు , కందమూలాలు ,సుగంధద్రవ్యాలు మానవుడికి ప్రక్రుతి ప్రసాదించిన అపురూపమైన వరము .ఆయా సీజన్లలో పండే పండ్లను ఆరగించడం మనకు తరతరాలు గా తెలుసును . అన్నం తో కూడా ప్రకృతిసిద్ధమైన పండ్లు , కూరగాయలు ఇతర త్రునధన్యాలను ఆహారం గా ఆహారముగా తీసుకుని జీవించినట్లయితే శరీరానికి కావససిన అన్నిరకాల పోషకాలు లభిస్తాయి ... ఇదే అసలు ఉత్తమమైన జీవన విధానమని పకృతి వైద్యుల నమ్మకం.....ఆహారం జీవం ఉన్న ప్రతి జీవికి అత్యవసరమైనది. పిండిపదార్ధాలు, మాంసకృత్తులు, కొవ్వుపదార్ధాలు, ఖనిజలవణాలు, పీచుపదార్ధాలు, రోగనిరోధక శక్తికి కావలసిన విటమిన్లు మరియు శరీర పోషణకు రక్షణకు కావలసిన పదార్ధాలను కలిగిన పదార్దాలను ఆహారంగా పేర్కొనవచ్చు. ఇవి కాక శరీరానికి నూతన ఉత్సాహాన్నిచ్చే కాఫీ, టీ లాంటి వాటిని కూడా ఆహారపదార్ధాల కోవలోకి వస్తాయి. ఆహారం ఘన, ద్రవ రూపాలలో లభ్యం అవుతుంది.



  • వంట నూనెలు :


వంటకాల తయారీకి కూక్కరు ఒక్కో తరహ నూనెలు వాడుతుంతారు. ప్రాంతాన్నిబట్టి , కుటుంబ అలవాటునుబట్టి వాడే నూనెలు మారుతాయి . ఒక్కొక్క నూనెకు ఒక్కొ ప్రత్యేకత ఉంది . ఆరోగ్యానికి మంచి , చెడు చేస్తాయి.

నూనెలు మరియు కొవ్వులు వృక్ష, జంతు సంబందిత ఉత్పత్తులు. ఇవి నీటిలో కరగవు. నూనెలను/కొవ్వులను ఫ్యాటి ఆమ్లముల గ్లిసెరొల్ ఇస్టరులు (Glycerol esters of fatty acids) అంటారు. లేదా 'triglyceredes'లేదా 'Triacylglycerols' అంటారు.

సాధారణ పరిసర ఉక్ష్ణోగ్రతవద్ద ఘన(solid)లేదా అర్దఘన(semi solid) రూపములో వున్నచో కొవ్వులని (fats),ద్రవరూపంలో వున్నచో నూనెలని(oils)అనిఅంటారు.

మూడుఫ్యాటి ఆమ్లముల ఆణువులు, ఒక గ్లిసెరొల్ అణువు సంయోగం చెందటం వలన ఓక నూనె/కొవ్వు అణువు (Triglyceride molecule) మరియు మూడు నీటి అణూవులు ఏర్పడును. కొవ్వుఆమ్లాలు,గ్లిసెరొల్‌ సంయోగంచెంది,నూనెగా ఎర్పడటం.మిశ్రమ ట్రైగ్లిసెరైడ్




  • కొవ్వులలో (fats) లో సంతృప్త ఫ్యాటి ఆసిడ్ లు ఏక్కువ వుండటం మూలాన అవి ఘన రూపం లో వుంటాయు. నూనెలలో అసంతృప్త ఫ్యాటిఆసిడ్లు ఎక్కువ % లో వుండును. మనం వాడే వంటనూనెలలో సంతృప్త (సాచురెటెడ్) మరియు అసంతృప్త (అన్‌సాచురెటెడ్) ఫ్యాటి అమ్లములు వివిధ రేషియోలలో వుండును. ఆరోగ్యరీత్యా అసంతృప్త ఫ్యాటి ఆసిడ్ లు వున్న నూనెలను ఉపయోగించడం మంచిది. మిరిస్టిక్, లారిక్, పామిటిక్ మరియు స్టియరిక్ ఆసిడ్ లు సంతృప్త ఫ్యాటిఆసిడ్లు. ఒలిక్, లినొలిక్ మరియు లినొలెనిక్ ఆసిడ్లు అసంతృప్త ఫ్యాటి ఆమ్లములు. ఒలిక్ ఆసిడ్ లో ఒక ద్విబంధము, లినొలిక్ ఆసిడ్ లో రెండు ద్విబంధాలు మరియు లినొలెనిక్ ఆసిడ్ లో మూడు ద్విబంధాలు వుండును. ఒకటికన్న ఎక్కువ ద్విబంధాలున్న ఫ్యాటి ఆమ్లములను పాలి అన్‌సాచురెటెడ్ ఫ్యాటి ఆసిడ్లు (ప్యూఫా) అంటారు.


కొన్ని వంట నూనెలు :




 రక్తపోటుకు 'నూనెల' కళ్లెం!


  • గుండె ఆరోగ్యంలో ఆహారం కీలక పాత్ర పోషిస్తుందని మరోసారి రుజువైంది. నువ్వులనూనె, తవుడునూనె కలిపి వాడితే అధిక రక్తపోటు తగ్గుతున్నట్టు మనదేశంలో చేసిన అధ్యయనంలో వెల్లడైంది. అధిక రక్తపోటు బాధితులకు పక్షవాతం, గుండెజబ్బు ముప్పు ఎక్కువన్నది తెలిసిందే. అధిక రక్తపోటుతో బాధపడేవారు రోజువారీ ఆహారంలో భాగంగా సుమారు 40 గ్రాముల మేరకు నువ్వులనూనె, తవుడునూనె కలిపి తీసుకుంటే.. రక్తపోటు తగ్గుతున్నట్టు పరిశోధకులు గుర్తించారు. ఈ తగ్గుదల రక్తపోటు తగ్గటానికి వేసుకునే మందులతో (క్యాల్షియం ఛానెల్‌ బ్లాకర్స్‌) సమానంగా ఉండటం గమనార్హం. కేవలం మందులు వేసుకునేవారితో పోలిస్తే.. మందులతో పాటు నూనెల మిశ్రమాన్ని వాడినవారిలో రక్తపోటు రెండు రెట్లు తగ్గటం విశేషం. ఈ నూనెల మిశ్రమంతో చెడ్డ (ఎల్‌డీఎల్‌) కొలెస్ట్రాల్‌ తగ్గటంతో పాటు మంచి (హెచ్‌డీఎల్‌) కొలెస్ట్రాల్‌ పెరుగుతోందనీ పరిశోధకులు చెబుతున్నారు. నువ్వుల నూనె రక్తపోటుపై గణనీయమైన ప్రభావం చూపుతుందని, ఇది కూడా క్యాల్షియం ఛానెల్‌ బ్లాకర్‌ మందుల్లా ప్రభావం చూపుతుందని గతంలో తేలిందని అధ్యయనానికి నేతృత్వం వహించిన డాక్టర్‌ దేవరాజన్‌ శంకర్‌ పేర్కొంటున్నారు. అయితే దీనికి తవుడు నూనె కూడా తోడైతే మరింత మంచి ఫలితం కనబడుతోంది. నువ్వులనూనెలోని సీసమిన్‌, సీసమోల్‌, సీసమోలిన్‌.. తవుడునూనెలోని ఓరీజనోల్‌ అనే యాంటీఆక్సిడెంట్లు ఇందుకు దోహదం చేస్తున్నాయని పరిశోధకులు భావిస్తున్నారు. ఈ రెండు నూనెలూ అసంతృప్త కొవ్వు ఆమ్లాలు (మంచి కొవ్వులు) కలిగున్నాయంటున్నారు.





  • =================================


Visit my Website - Dr.Seshagirirao...

Monday 21 November 2011

వ్యాయామం తర్వాత ఎంతసేపటికి తినాలి, ఏం తినాలి?



పండ్లు , కాయగూరలు ,గింజలు, పప్పులు , కందమూలాలు ,సుగంధద్రవ్యాలు మానవుడికి ప్రక్రుతి ప్రసాదించిన అపురూపమైన వరము .ఆయా సీజన్లలో పండే పండ్లను ఆరగించడం మనకు తరతరాలు గా తెలుసును . అన్నం తో కూడా ప్రకృతిసిద్ధమైన పండ్లు , కూరగాయలు ఇతర త్రునధన్యాలను ఆహారం గా ఆహారముగా తీసుకుని జీవించినట్లయితే శరీరానికి కావససిన అన్నిరకాల పోషకాలు లభిస్తాయి ... ఇదే అసలు ఉత్తమమైన జీవన విధానమని పకృతి వైద్యుల నమ్మకం.....ఆహారం జీవం ఉన్న ప్రతి జీవికి అత్యవసరమైనది. పిండిపదార్ధాలు, మాంసకృత్తులు, కొవ్వుపదార్ధాలు, ఖనిజలవణాలు, పీచుపదార్ధాలు, రోగనిరోధక శక్తికి కావలసిన విటమిన్లు మరియు శరీర పోషణకు రక్షణకు కావలసిన పదార్ధాలను కలిగిన పదార్దాలను ఆహారంగా పేర్కొనవచ్చు. ఇవి కాక శరీరానికి నూతన ఉత్సాహాన్నిచ్చే కాఫీ, టీ లాంటి వాటిని కూడా ఆహారపదార్ధాల కోవలోకి వస్తాయి. ఆహారం ఘన, ద్రవ రూపాలలో లభ్యం అవుతుంది.

వ్యాయామం తర్వాత ఎంతసేపటికి తినాలి, ఏం తినాలి... ఇది చాలామందిని తొలిచేప్రశ్న. బ్రిస్క్‌వాక్‌ లాంటి వ్యాయామాలు ఆకలిని తగ్గిస్తే, ఈత ఆకలిని పెంచుతుంది. ఆకలివేసినా వేయకపోయినా వ్యాయామం చేసిన పావుగంటకు ఏదైనా తినడం అవసరమని చెబుతున్నారు నిపుణులు. ఎందుకంటే వ్యాయామంతో కండరాల్లోని ఇంధనం(గ్త్లెకోజెన్‌) ఖర్చయిపోతుంది. ఆ నిల్వల్ని పూర్తిచేయడానికి వ్యాయామం చేసిన 15 నిమిషాలకే శరీరం సిద్ధమవుతుంది. ఆ సమయానికి మనం ఏమీ తినకపోతే కాసేపటికి అలసట అనిపిస్తుంది. అందుకనీ ఆ సమయంలో కమలారసం, శాండ్‌విచ్‌, వేరుశెనగ చక్కీ, ఉడకబెట్టిన గుడ్డు, రెండు మూడు చికెన్‌ ముక్కలు ఏదో ఒకటి తీసుకోవడం మంచిదంటున్నారు నిపుణులు. ఇవేమీ దొరక్కుంటే, కనీసం మంచినీళ్లయినా తీసుకోవాలట.
  • =================================
Visit my Website - Dr.Seshagirirao...

Sunday 13 November 2011

బత్తాయి,sweat orange





పండ్లు , కాయగూరలు ,గింజలు, పప్పులు , కందమూలాలు ,సుగంధద్రవ్యాలు మానవుడికి ప్రక్రుతి ప్రసాదించిన అపురూపమైన వరము .ఆయా సీజన్లలో పండే పండ్లను ఆరగించడం మనకు తరతరాలు గా తెలుసును . అన్నం తో కూడా ప్రకృతిసిద్ధమైన పండ్లు , కూరగాయలు ఇతర త్రునధన్యాలను ఆహారం గా ఆహారముగా తీసుకుని జీవించినట్లయితే శరీరానికి కావససిన అన్నిరకాల పోషకాలు లభిస్తాయి ... ఇదే అసలు ఉత్తమమైన జీవన విధానమని పకృతి వైద్యుల నమ్మకం.....ఆహారం జీవం ఉన్న ప్రతి జీవికి అత్యవసరమైనది. పిండిపదార్ధాలు, మాంసకృత్తులు, కొవ్వుపదార్ధాలు, ఖనిజలవణాలు, పీచుపదార్ధాలు, రోగనిరోధక శక్తికి కావలసిన విటమిన్లు మరియు శరీర పోషణకు రక్షణకు కావలసిన పదార్ధాలను కలిగిన పదార్దాలను ఆహారంగా పేర్కొనవచ్చు. ఇవి కాక శరీరానికి నూతన ఉత్సాహాన్నిచ్చే కాఫీ, టీ లాంటి వాటిని కూడా ఆహారపదార్ధాల కోవలోకి వస్తాయి. ఆహారం ఘన, ద్రవ రూపాలలో లభ్యం అవుతుంది.


బత్తాయి ఒక తియ్యని రూటేసి కుటుంబం కు సంబంధించిన పండ్ల చెట్టు. చూడ్డానికి పెద్దసైజు నిమ్మపండులా ఉండే బత్తాయిపండు రుచిలో మాత్రం పుల్లగా కాకుండా తీయగా ఉంటుంది. అందుకే దీన్ని స్వీట్‌ లైమ్‌ అని పిలుస్తారు. పండిన బత్తాయి గుజ్జు లేత పసుపురంగులో ఉంటుంది. చాలామంది ఒలుచుకుని తిన్నప్పటికీ జ్యూస్‌ రూపంలోనే దీనికి వాడుక ఎక్కువ. అందుకే పండ్లరసం అనగానే అందరికీ ఈ పండ్లే గుర్తుకొస్తాయి.

ఆగ్నేయాసియా, దక్షిణ ఆసియా, మధ్యధరా ప్రాంతాల్లో ఎక్కువగా పెరిగే ఈ పండ్ల చెట్లని ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా పెంచుతున్నారు. పుట్టింది ఆసియాదేశాల్లోనే అయినా క్రమంగా ఇటలీ, మధ్యధరా ప్రాంతంలో ఎక్కువగా పండించడంతో ఇటాలియన్‌ లైమ్‌, మెడిటెర్రేనియన్‌ లైమ్‌ అని కూడా పిలుస్తుంటారు. ఇరానీయులైతే తీపి నిమ్మ అంటారు.

రుచిలో ఒకేరకంగా ఉన్నప్పటికీ మధ్యధరా, వెురాకోల్లో పెరిగే బత్తాయిలు రూపంలో మాత్రం కాస్త భిన్నంగా ఉంటాయి. వెురాకో రకం తొక్క పలుచగా ఉండి పసుపుతో కూడిన నారింజవర్ణంలో మంచి వాసన కలిగి ఉంటే మధ్యధరా ప్రాంతంలో పెరిగేవి మాత్రం పులుపన్నదే లేకుండా తియ్యగా ఉంటాయి. ఇటీవల పుల్లని నారింజనీ తియ్యని బత్తాయినీ సంకరీకరించి సిట్రస్‌ బెర్గామియా అనే కొత్త రకాన్ని రూపొందించారు. ఇది తీపి-పులుపు రుచితో చూడ్డానికి నారింజపండులా ఉంటుంది.



పోషక విలువలతోపాటు ఔషధపరంగా కూడా బత్తాయిలో అనేక లాభాలున్నాయి. జలుబు, జ్వరం వంటివి వచ్చినప్పుడు త్వరగా కోలుకోవడానికి ఈ పండ్లరసాన్నే అందిస్తారు.

* విటమిన్‌-సి లోపంతో వచ్చే స్కర్వీ వ్యాధిని అరికట్టడంలో ఈ పండుని మించింది లేదు. రుచికి తియ్యగానే ఉన్నా ఇందులో విటమిన్‌-సి ఎక్కువపాళ్లలో దొరుకుతుంది.

* ఈ పండుకున్న తీపివాసన లాలాజలగ్రంథుల్ని ప్రేరేపించి లాలాజలం అధికంగా వూరేందుకు కారణమవుతుంది. ఇందులోని ఫ్లేవనాయిడ్‌లు పిత్తరసంతోపాటు ఇతర జీర్ణరసాలూ ఆమ్లాలూ విడుదలయ్యేందుకు దోహదపడతాయి. అందువల్ల తీసుకున్న ఆహారం త్వరగా జీర్ణమవుతుంది. అంతేకాదు, ఈ రసం త్వరగా జీర్ణమై రక్తంలో వెంటనే కలిసిపోతుంది. అందుకే బెడ్‌మీద ఉన్న రోగులు కోలుకునేందుకు బత్తాయిరసాన్నే ఇస్తుంటారు. ఉదయాన్నే యోగా, జాగింగ్‌, వాకింగ్‌ చేసి వచ్చాక ఓ గ్లాసు తాజా బత్తాయిరసం తాగితే చాలు... అలసిన శరీరం వెంటనే శక్తిమంతం అవుతుంది. బ్రేక్‌ఫాస్ట్‌లో భాగంగా ఓ గ్లాసు బత్తాయిరసం తీసుకోవడం ఎంతో మంచిదని పోషకనిపుణులు సూచించేదీ ఇందుకే.

* ఇది మలబద్ధకాన్ని నివారిస్తుంది. ఇందులోని ఆమ్లాలు పేగుల్లోని విషపూరిత పదార్థాల్ని పారదోలతాయి. అందువల్ల అజీర్తితో బాధపడేవాళ్లకి కూడా బత్తాయిరసం ఎంతో మంచిది. ఇందులో ఎక్కువగా ఉండే పొటాషియం డయేరియా, డీసెంట్రీ... వంటి వ్యాధుల్ని వెంటనే తగ్గేలా చేయడంతోబాటు బాధితులు త్వరగా కోలుకునేలా చేస్తుంది. ముఖ్యంగా కామెర్లు వచ్చినవాళ్లకు ఈ జ్యూస్‌ ఎంతో మంచిది. బత్తాయిపండు రుచి వాంతుల్ని అరికట్టి తలతిరగడాన్ని తగ్గిస్తుంది.

* ఈ జ్యూస్‌ తాగడంవల్ల చిగుళ్లనొప్పులు, గొంతుసంబంధ ఇన్ఫెక్షన్లూ త్వరగా తగ్గుముఖం పడతాయి. ప్రతిరోజూ ఈ జ్యూస్‌ తాగడంవల్ల గుండె పనితీరు మెరుగుపడుతుంది. దాంతో రక్తప్రసారం చక్కగా ఉండి రోగనిరోధకశక్తి పెరుగుతుంది. కంటిచూపు కూడా బాగుంటుంది. ఇందులోని లివోనాయిడ్‌లు వూపిరితిత్తుల్ని శుభ్రంచేయడంలోనూ రక్షించడంలోనూ కీలకపాత్ర వహిస్తాయి.

* చర్మానికీ మంచిదే. క్రమం తప్పక తీసుకోవడంవల్ల మచ్చల్ని మాయం చేసి చర్మం మెరుపుని సంతరించుకునేలా చేస్తుంది.

ఆటలాడి వచ్చిన పిల్లలకు కూడా రాగానే తాజా బత్తాయిరసాన్ని ఇస్తే దాహం తీరి స్థిమితపడతారు. దాహాన్ని తీర్చడంలో తాజా బత్తాయిరసాన్ని మించింది లేదు. చూశారుగా, ఇంకా ఆలస్యమెందుకు... అసలే ఇది బత్తాయిలు ఎక్కువగా వచ్చే సీజన్‌. రసం తీసేయండి మరి!



  • ================================
Visit my Website - Dr.Seshagirirao...

Friday 11 November 2011

దవనం,మాచీ పత్రం,Artemisia indica


  • image : courtesy with Andhraprabha sunday paper

పండ్లు , కాయగూరలు ,గింజలు, పప్పులు , కందమూలాలు ,సుగంధద్రవ్యాలు మానవుడికి ప్రక్రుతి ప్రసాదించిన అపురూపమైన వరము .ఆయా సీజన్లలో పండే పండ్లను ఆరగించడం మనకు తరతరాలు గా తెలుసును . అన్నం తో కూడా ప్రకృతిసిద్ధమైన పండ్లు , కూరగాయలు ఇతర త్రునధన్యాలను ఆహారం గా ఆహారముగా తీసుకుని జీవించినట్లయితే శరీరానికి కావససిన అన్నిరకాల పోషకాలు లభిస్తాయి ... ఇదే అసలు ఉత్తమమైన జీవన విధానమని పకృతి వైద్యుల నమ్మకం.....ఆహారం జీవం ఉన్న ప్రతి జీవికి అత్యవసరమైనది. పిండిపదార్ధాలు, మాంసకృత్తులు, కొవ్వుపదార్ధాలు, ఖనిజలవణాలు, పీచుపదార్ధాలు, రోగనిరోధక శక్తికి కావలసిన విటమిన్లు మరియు శరీర పోషణకు రక్షణకు కావలసిన పదార్ధాలను కలిగిన పదార్దాలను ఆహారంగా పేర్కొనవచ్చు. ఇవి కాక శరీరానికి నూతన ఉత్సాహాన్నిచ్చే కాఫీ, టీ లాంటి వాటిని కూడా ఆహారపదార్ధాల కోవలోకి వస్తాయి. ఆహారం ఘన, ద్రవ రూపాలలో లభ్యం అవుతుంది.


  • ప్రకృతి మనకిచ్చిన అనేక దివ్య ఔషధాలలో ఆకు కూరలు, పళ్లు, గింజలు ఇలా అనేకం ఉన్నాయి. వీటి సరసన సుగంధ పరిమళాలు కలిగిన వృక్ష సంతతి తన ప్రత్యేకతల్ని నిలుపుకుంటూనే వస్తు న్నాయి. వీటిలో నిత్య జీవితంలో ఎక్కువగా కనిపించే 'దవనం' ...వృక్ష శాస్త్ర ప్రకారం - ఆర్టిమిసికా ఇండికా వృక్ష జాతికి చెందిని. ఆస్టరేసియా కుటుంబానికి చెందిన సంతతి మొక్కలు మన నిత్య జీవనంలో మాచీ పత్రంగా పిలుస్తున్నాం. తెలుగులో దవనంగా పిలిచే ఈ మొక్కలు హిందూ సాంప్రదాయ పండగలలో ప్రత్యేక ప్రాధాన్యత కలిగి ఉన్నాయనే చెప్పాలి. ఇక పూల అలంక రణలో గుభాళింపుల కోసం దవనం వాడుతుంటారు.

దీని ఆకులు, లేత గింజలు పచ్చివిగానీ, వంటకాల్లో గానీ విరివిగా ఉపయోగిస్తారు. అంతేకాక వీటిని ఉడికించి సలాడ్‌ల్లోను, సూప్‌లోను వేసుకుని కూడా తీసు కుంటారు. వీటి లేత ఆకులు ఉడికించి మెత్తగా ఉడుకుతున్న అన్నంలో కలిపితే మంచి రుచిగాను, సువాసనతోను అన్నం బాగుంటుంది. ఇతర దేశాల్లో ముఖ్యంగా చైనాలో ఈ రకమైన వినియోగానికి ప్రతి షాపులోను అందుబాటులో ఉంటుంది. జీర్ణశక్తిని పెంపొందించడంలో దీనికి ఇదే సాటి.

  • చైనా, జపాన్‌, కొరియా, వియత్నాం, టిబెట్‌, మంగోలియా దేశాల్లో సాంప్ర దాయ వైద్యవిధానాల్లో వీటిని వినియోగిస్తు అనేక పరిశోధనలు చేస్తున్నారు. దీనిని సాంబ్రాణి మాదిరిగా పొగ వేయటం వల్ల, దీని ఆకులతో తయారు చేసిన కషాయం వల్ల రొమ్ము కాన్సర్‌ నిర్ధిష్ట పరిమాణంలో ఉన్నప్పటికీ ఇంక పెరగకుండా ఉంటుం దని, ఈ మొక్కకి అంతటి సామర్ధ్యం ఉందని పరిశోధకులు అంచనా వేస్తూ మరిన్ని పరిశోధనలు చేస్తున్నారు.

  • అలాగే ఒత్తిడికి సంబంధించి నరాలకి తగిన పోషణనిచ్చి ఉపశమనం ఇచ్చింది.
  • పూర్తిగా దక్షణ భారత దేశంలోనే విస్తారంగా పండే ఈ మొక్కలకు ఆయు ర్వద వైద్యంలోనూ సౌందర్య సాధనాల తయారీలోనూ ప్రత్యేక స్ధానం ఉంది.
  • వివిధ రకాల సెంటెడ్‌ స్ప్రేల తయారీ లోనూ, పొగాకు ఉత్పత్తులకు గుభాళింపులు అద్దే క్రమంలోనూ దవళంని వినియోగిస్తుంటారు. ఇక దవళంతో తయారు చేసిన తైలం ఆయుర్వేద వైద్యంలో ఓ ప్రత్యేక సువాసన లతో గుర్తింపు తెచ్చుకుందనే చెప్పాలి.
  • దవళం నూనెని శరీపై వచ్చే చిన్న చిన్న దద్దుర్లు, పుళ్లపై రాస్తే త్వరగా తగ్గి పోతాయి.
  • కొందరి స్త్రీలలో కాన్పుల తరువాత పొట్టపై వచ్చే గీతలను తొలగించేందుకు దవళం నూనెను వాడితే ఫలితం ఉంటుంది. స్త్రీలలో ఋతుక్రమం సరిగా రాక పోయినా.. తిన్న పదార్ధం సరిగా జీర్ణం కాక పోయినా దవనం నూనె పొట్టపై మర్ధన చేసే మెరుగైన ఫలితాలు పొందుతారు.
  • కండరాల నొప్పితో బాధ పడేవారు ఈ నూనెతో మర్ధన చేయించుకుంటే మంచిది.
  • మానసిక ఆందోళనలకు, వత్తిళ్లకు లోనవు తున్న వారు ఈ తైలంతో మర్ధన చేసుకుంటే ప్రశాంతత నెలకొని ఆందోళన తగ్గు తుంది.
  • వేడి నీళ్లలో కొద్దిగా దవనం నూనె వేసి ఆవిరి పడితే ఊపరి తిత్తులకున్న సమస్యలు తగ్గుముఖం పడతాయి.
  • ఇందులో సుగర్‌ వ్యాధుల్ని తగ్గించే అనేక ఔషధ గుణాలుండటంతో దవనంని సుగర్‌ నివారణ మందులలో వాడుతున్నారు.
  • ఎప్పటికపðడు శరీరానికి నూతన ఉత్సా హాన్ని అందించే ఈ దవనం చెవినొప్పి, జీర్ణ కోశ వ్యాధులను నివా రించడమే కాకుండా ధాతువర్ధకంగా, శక్తివర్ధకంగా ఉపయోగపడుతూ మానవాళికి సాయం అందిస్తోంది.

  • ==========================
Visit my Website - Dr.Seshagirirao...MBBS

Saturday 29 October 2011

వంగ-వంకాయ , Brinjal








పండ్లు , కాయగూరలు ,గింజలు, పప్పులు , కందమూలాలు ,సుగంధద్రవ్యాలు మానవుడికి ప్రక్రుతి ప్రసాదించిన అపురూపమైన వరము .ఆయా సీజన్లలో పండే పండ్లను ఆరగించడం మనకు తరతరాలు గా తెలుసును . అన్నం తో కూడా ప్రకృతిసిద్ధమైన పండ్లు , కూరగాయలు ఇతర త్రునధన్యాలను ఆహారం గా ఆహారముగా తీసుకుని జీవించినట్లయితే శరీరానికి కావససిన అన్నిరకాల పోషకాలు లభిస్తాయి ... ఇదే అసలు ఉత్తమమైన జీవన విధానమని పకృతి వైద్యుల నమ్మకం.....ఆహారం జీవం ఉన్న ప్రతి జీవికి అత్యవసరమైనది. పిండిపదార్ధాలు, మాంసకృత్తులు, కొవ్వుపదార్ధాలు, ఖనిజలవణాలు, పీచుపదార్ధాలు, రోగనిరోధక శక్తికి కావలసిన విటమిన్లు మరియు శరీర పోషణకు రక్షణకు కావలసిన పదార్ధాలను కలిగిన పదార్దాలను ఆహారంగా పేర్కొనవచ్చు. ఇవి కాక శరీరానికి నూతన ఉత్సాహాన్నిచ్చే కాఫీ, టీ లాంటి వాటిని కూడా ఆహారపదార్ధాల కోవలోకి వస్తాయి. ఆహారం ఘన, ద్రవ రూపాలలో లభ్యం అవుతుంది.


వంగ - వంకాయ (Brinjal) - తెలుగు దేశములో చాలా ప్రముఖమైన, విరివిగా పెంచబడుతున్న కూరగాయల రకాలలో ఒకటి. దీని చరిత్ర సరిగ్గా తెలీదు, కానీ హిందూ మత శ్రాద్ధ కర్మలందు దీనిని కూడా నిషేధించి ఉన్నందువల్ల దీనిని భారతదేశమునకు ఇతర దేశములకు వచ్చినదిగా భావింపబడుతున్నది, కానీ ఎప్పుడు ఎలా భారతదేశమునకు వచ్చినదో సరిగ్గా తెలీదు. వంకాయలు రకరకాలుగా - చిన్న వంకాయలు, పొడుగు వంకాయలు, తెల్ల వంకాయలు, ఎర్ర వంకాయలు, గుత్తి వంకాయలు - లభిస్తున్నాయి.

ఆరోగ్యకరమైన ఉపయోగాలు :
వంకాయలో ఎక్కువగగా పొటాషియం ఉంటుంది . బి.పి.తగ్గందేందు ఉపయోగపడును .
Nutritional Value of Brinjal, Medicinal value of brinjal
A 100 grams of brinjal contains the following nutritional value




  • * Total Carbohydrates – 17.8g

  • * Protein – 8g

  • * Saturated Fat – 5.2g

  • * Dietary Fiber – 4.9g

  • * Total Fat – 27.5g

  • * Cholesterol – 16mg

  • * Sugars – 11.4g

  • * Iron – 6mg

  • * Vitamin A – 6.4 mg

  • * Calcium – 525 mg

  • * Sodium – 62mg

  • * Potassium – 618mg



  • స్ప్లీన్‌ వాపు(spleenomegaly)లో వంకాయ అమోఘముగా పనిచేస్తుంది . పచ్చి వంకాయ పేస్టు కి పంచదార కలిపి పరగడుపున తినాలి .

  • వంకాయ కొలెస్టిరాల్ తగ్గించేందుకు సహకరిస్తుంది ,

  • వంకాయ , టమటోలు కలిపి వండుకొని కూర గాతింటే అజీర్ణము తగ్గి ఆకలి బాగా పుట్టించును.

  • వంకాయ ను రోస్టు చేసి తొక్కను తీసేసి కొద్దిగ ఉప్పు తో తింటే " గాస్ ట్రబుల్ , ఎసిడిటీ , కఫము తగ్గుతాయి.

  • వంకాయ ఉడకబెట్టి ... తేనె తో కలిపి సాయంతము తింటే మంచి నిద్ర వస్తుంది . నిద్రలేమితో బాధపడేవారికి ఇది మంచి ఆహారవైధ్యము .

  • వంకాయ సూప్ , ఇంగువ , వెళ్ళుల్లి తో తయారుచేసి క్రమము తప్పకుండా తీసుకుంటే కడుపుబ్బరము (flatulence) జబ్బు నయమగును .

  • మధుమేహం ఉన్నవారు వంకాయ వలన అన్నము కొద్దిక తినడము వలం , దీనిలోని పీచుపదార్దము మూలాన చెక్కెర స్థాయిలు అదుపులో ఉండును .

  • కొన్ని ఆఫ్రికా దేశాలలో ఫిట్స్ వ్యాది తగ్గడానికి వాడుతున్నారు .

  • వంకాయ రసము నుండి తయారుచేసిన ఆయింట్ మెంట్లు, టించర్లు , మూలవ్యాధి(Haemorrhoids) నివారణలో వాడుతారు .

  • దీన్ని పేదవారి పోటీన్‌ (మాంసము ) గా నూట్రిషనిస్టులు భావిస్తారు .


జాగ్రత్తలు :



  • ఎసిడిటీ , కడుపులో పుండు (అల్సర్ ) ఉన్నవారు వంకాయ తినకూడదు ,

  • గర్భిణీ స్త్రీలు వంకాయ తినడము మంచిది కాదు ..ఎలర్జీలకు దారితీయును.

  • వంకాయ చాలా మందికి దురద , ఎలర్జీ ని కలిగించును .

  • శరీరముపైన పుల్లు , చర్మ వ్యాధులు ఉన్నవారు వంకాయ తినరాదు .


వంటకములు
వంకాయ వంతి కూర, పంకజం వంటి భార్య, భారతం వంటి కధ ఉండవని ఒక నానుడి. అల్లాగే వంకాయ తో వెయ్యి రకాలు అని కూడా ఒక నానుడి. వంకాయలను చప్పిడి కూరగకానీ, పులుసుపెట్టి కానీ వండి తినవచ్చును. ముదురుకాయలును, గిజరుకాయలను కారము పులుసుపెట్టి వండిననేగాని తిన బాగుండవు. ఇటువంటి కాయలను ముందు ఉడుకబెట్టి వార్చి వేసినచో అందలి గిజరు మరికొంత తగ్గును. లేత కాయలను ముందు ఉడకబెట్టకుండ పోపులోనూనెవేసి మ్రగ్గనీయవచ్చును. లేక చమురులో వేచి పైన మసాలాపొడి చల్లవచ్చును. నిడివిగనుండు నీటివంకాయలను ముచికవద్ద కొంతభాగము విడిచి క్రింది భాగమును నాలుగు లేక ఆరు చీలికలుగ దరిగి యందు మసాలా పొదిని కూరి మువ్వలేక గుత్తివంకాయగ కూడ వండి తినవచ్చును. గుండ్రని మెట్ట వంకాయను కాల్చి అల్లమును చెఏర్చి యిగురు పచ్చడిగగానీ, పులుసు పచ్చడిగ గానీ పెరుగుపచ్చడిగగానీ చేయవచ్చును. వంకాయ ముక్కలను సామాన్యపు పులుసులోనూ, మజ్జిగ పులుసులోనూ కూడ తరచు వేయుచుందురు. వంకాయ ముక్కలను వాంగీభాత్‌ మొదలను చిత్రాన్నములలో కూడా ఉపయోగింతురు. బంగాళాదుంప మొదలగు ఇతర కూరలతో కలిపి వండుటయు కలదు. వంకాయ ముక్కలను పలుచని బిళ్ళలుగ తరిగి సెనగవగైరా పిండితో చేసిన చోవిలో ముంచి చమురులో వేచి బజ్జీలుగ చేయవచ్చు.


మరింత వివరమైన వంకాయ వంటకాల కోసం ఈ క్రింది వివరములు చూడండి.

1. వంకాయ వేపుడు కూర
2. వంకాయ కారం పెట్టి కూర
3. వంకాయ పఛ్ఛి కారం కూర
4. వంకాయ ముద్ద
5. గుత్తి వంకాయ కూర
6. వంకాయ ఇగురు
7. వంకాయ పఛ్ఛి పఛ్ఛడి
8. వంకాయ బండ పఛ్ఛడి
9. వంకాయ పులుసు పఛ్చడి
10. వంకాయ టమాటో కూర
11. సాంబారు
12. వాంగీభాత్‌
13. వంకాయ పచ్చడి
14. మజ్జిగ పులుసు
15. వంకాయ బజ్జీ

ఇలా చాలా రకాలు ఛెయ్యవచ్చు.

"Brinjal ni హిందీలో 'బైంగన్' అంటారు. దాని మూలం 'బేగుణ్'- 'ఎలాంటి మంచి గుణాలూ లేనిది' అని దాని అర్థం! నిజంగానే ఆయుర్వేదం ప్రకారం వంకాయలో మనిషికి హాని చేసే గుణాలున్నై గాని, మంచి గుణం ఒక్కటీ లేదు. వంకాయ పై పరిశోధనలు చేసి, దానిలో మనకు హాని చేసేవి ఏవీ లేవని తేలితే తప్ప, నిజానికి మనం‌ ఎవ్వరమూ వంకాయను తిననే కూడదు!




  •  మూలము : English articles from --http://www.nutrition-and-you.com/




  • ============================


Visit my Website - Dr.Seshagirirao...

Saturday 15 October 2011

లక్ష్మణఫలం , Lakshmana phal Fruit








పండ్లు , కాయగూరలు ,గింజలు, పప్పులు , కందమూలాలు ,సుగంధద్రవ్యాలు మానవుడికి ప్రక్రుతి ప్రసాదించిన అపురూపమైన వరము .ఆయా సీజన్లలో పండే పండ్లను ఆరగించడం మనకు తరతరాలు గా తెలుసును . అన్నం తో కూడా ప్రకృతిసిద్ధమైన పండ్లు , కూరగాయలు ఇతర త్రునధన్యాలను ఆహారం గా ఆహారముగా తీసుకుని జీవించినట్లయితే శరీరానికి కావససిన అన్నిరకాల పోషకాలు లభిస్తాయి ... ఇదే అసలు ఉత్తమమైన జీవన విధానమని పకృతి వైద్యుల నమ్మకం.....ఆహారం జీవం ఉన్న ప్రతి జీవికి అత్యవసరమైనది. పిండిపదార్ధాలు, మాంసకృత్తులు, కొవ్వుపదార్ధాలు, ఖనిజలవణాలు, పీచుపదార్ధాలు, రోగనిరోధక శక్తికి కావలసిన విటమిన్లు మరియు శరీర పోషణకు రక్షణకు కావలసిన పదార్ధాలను కలిగిన పదార్దాలను ఆహారంగా పేర్కొనవచ్చు. ఇవి కాక శరీరానికి నూతన ఉత్సాహాన్నిచ్చే కాఫీ, టీ లాంటి వాటిని కూడా ఆహారపదార్ధాల కోవలోకి వస్తాయి. ఆహారం ఘన, ద్రవ రూపాలలో లభ్యం అవుతుంది. సీజన్‌ వస్తోందంటే చాలు... కొన్ని పండ్ల రుచి పదే పదే గుర్తొచ్చేస్తుంటుంది. మార్కెట్లో అవి ఎప్పుడెప్పుడు కనిపిస్తాయా అన్నట్లు ఎదురుచూసేలా చేస్తుంది. ఆ కోవకే చెందుతాయి సీతాఫలం, రామాఫలం, లక్ష్మణఫలాలు. ఈపేర్లు చూస్తే మన పురాణ పురుషులకు ఇష్టమైన పండ్లేవో అనిపించకమానదు. అంతేకాదు, ఇవి అచ్చంగా మనకి మాత్రమే ప్రత్యేకమైన పండ్లేనేవో అనిపిస్తుంది. కానీ వీటి స్వస్థలం మనదేశం కాదు. దక్షిణ అమెరికా, ఐరోపా, ఆఫ్రికన్‌ దేశాల్లో పెరిగే ఈ వెుక్కల్ని మనదేశానికి తొలిసారిగా పోర్చుగీసువాళ్లు పదహారో శతాబ్దంలో తీసుకొచ్చారట. ఆ తరవాత వీటికా పేర్లు ఎవరు పెట్టారో తెలియదుకానీ మనందరికీ ఇష్టమైన రాముడు, సీత, లక్ష్మణ పేర్లు పెట్టేసి తమ భక్తిని చాటుకున్నారు. మనరాష్ట్రంలో ఎక్కువగా పండే సీతాఫలాలతోనే మనకి అనుబంధం ఎక్కువ. కానీ ఉత్తరాంధ్ర, కొన్ని తెలంగాణా జిల్లాల్లోనూ కర్ణాటక, తమిళనాడు, కేరళ, ఛత్తీస్‌గఢ్‌ రాష్ట్రాల్లోనూ రామాఫలాలు, లక్ష్మణఫలాలు ఎక్కువగా పండుతాయి. సూపర్‌మార్కెట్ల పుణ్యమా అని ఇప్పుడిప్పుడు ఇవి అన్ని మార్కెట్లిలోనూ కనిపిస్తున్నాయి.





లక్ష్మణఫలం : దీన్నే కొన్ని ప్రాంతాల్లో హనుమాన్‌ ఫలం అనీ పిలుస్తారు. పనసకాయలకు ఉన్నట్లుగా ముళ్లు ఉండటంతో ముళ్ల సీతాఫలం అనీ అంటారు. పండిన తరవాత కాస్త పుల్లని రుచి కలిగి ఉండటంతో పుల్లపండు అనీ అంటారు. అయితే పూర్తిగా పండిన తరవాత పైనాపిల్‌, స్ట్రాబెర్రీ రుచులతో కూడిన అరటిపండు రుచిని తలపిస్తుంది. గింజలు తక్కువ, గుజ్జు ఎక్కువ ఉండే ఈ పండ్లని జ్యూసులు, చాక్లెట్లు, ఐస్‌క్రీముల తయారీలో ఎక్కువగా వాడతారు. రామాఫలం మాదిరిగానే ఇవి కూడా కరీబియన్‌, మధ్య అమెరికా దేశాల్లోనే ఎక్కువగా పండుతాయి. మనదేశంలో ఆంధ్రప్రదేశ్‌, కేరళ, అసోంలలో ఇవి ఎక్కువ. స్థానికులు వీటి ఆకుల్నీ, గింజల్నీ కూడా అనేక రోగాల చికిత్సలో వాడుతుంటారు. ఈ చెట్టు ఆకుల నుంచి తయారుచేసిన ట్రియామెజాన్‌ అనే మందును అనేక మార్కెట్లలో లైసెన్స్‌ లేకుండానే విక్రయిస్తున్నారు. ఇది కాన్యర్‌కు బాగా పనిచేస్తుందని అనేకమంది నిపుణులు పరిశోధన పత్రాల్నీ రూపొందించారు. అందుకే అమెజాన్‌ అడవుల్లో నివసించేవాళ్లు దీన్ని మిరకిల్‌ ట్రీ అని పిలుస్తారు. ముఖ్యంగా పొట్టలోని నులిపురుగుల నివారణకు ఈ పండు అద్భుతంగా పనిచేస్తుందట. బెరడు, వేళ్లతోచేసే ఈ టీ తాగితే డిప్రెషన్‌ తగ్గుతుందనీ చెబుతారు.


  • పోషకాలు: 100 గ్రా. గుజ్జునుంచి

  • 140 క్యాలరీల శక్తి,

  • 39 గ్రా. పిండిపదార్థాలు,

  • 7.5 గ్రా. పీచు,

  • 2.5గ్రా. ప్రొటీన్లూ లభిస్తాయి. విటమిన్‌-సి, విటమిన్‌ బి1, బి2, పొటాషియం కూడా ఎక్కువగా ఉంటాయి.


ఏడాదిపొడవునా దొరికితే బాగుండు అనిపించే మధురమైన రుచి... ఆపై అద్భుత పోషకాలు... అందుకే ఈ ఫలాలు అమృతఫలాలు!


  • ===========================


Visit my Website - Dr.Seshagirirao

రామాఫలం, Rama phal Fruit



పండ్లు , కాయగూరలు ,గింజలు, పప్పులు , కందమూలాలు ,సుగంధద్రవ్యాలు మానవుడికి ప్రక్రుతి ప్రసాదించిన అపురూపమైన వరము .ఆయా సీజన్లలో పండే పండ్లను ఆరగించడం మనకు తరతరాలు గా తెలుసును . అన్నం తో కూడా ప్రకృతిసిద్ధమైన పండ్లు , కూరగాయలు ఇతర త్రునధన్యాలను ఆహారం గా ఆహారముగా తీసుకుని జీవించినట్లయితే శరీరానికి కావససిన అన్నిరకాల పోషకాలు లభిస్తాయి ... ఇదే అసలు ఉత్తమమైన జీవన విధానమని పకృతి వైద్యుల నమ్మకం.....ఆహారం జీవం ఉన్న ప్రతి జీవికి అత్యవసరమైనది. పిండిపదార్ధాలు, మాంసకృత్తులు, కొవ్వుపదార్ధాలు, ఖనిజలవణాలు, పీచుపదార్ధాలు, రోగనిరోధక శక్తికి కావలసిన విటమిన్లు మరియు శరీర పోషణకు రక్షణకు కావలసిన పదార్ధాలను కలిగిన పదార్దాలను ఆహారంగా పేర్కొనవచ్చు. ఇవి కాక శరీరానికి నూతన ఉత్సాహాన్నిచ్చే కాఫీ, టీ లాంటి వాటిని కూడా ఆహారపదార్ధాల కోవలోకి వస్తాయి. ఆహారం ఘన, ద్రవ రూపాలలో లభ్యం అవుతుంది.


సీజన్‌ వస్తోందంటే చాలు... కొన్ని పండ్ల రుచి పదే పదే గుర్తొచ్చేస్తుంటుంది. మార్కెట్లో అవి ఎప్పుడెప్పుడు కనిపిస్తాయా అన్నట్లు ఎదురుచూసేలా చేస్తుంది. ఆ కోవకే చెందుతాయి సీతాఫలం, రామాఫలం, లక్ష్మణఫలాలు.

ఈపేర్లు చూస్తే మన పురాణ పురుషులకు ఇష్టమైన పండ్లేవో అనిపించకమానదు. అంతేకాదు, ఇవి అచ్చంగా మనకి మాత్రమే ప్రత్యేకమైన పండ్లేనేవో అనిపిస్తుంది. కానీ వీటి స్వస్థలం మనదేశం కాదు. దక్షిణ అమెరికా, ఐరోపా, ఆఫ్రికన్‌ దేశాల్లో పెరిగే ఈ వెుక్కల్ని మనదేశానికి తొలిసారిగా పోర్చుగీసువాళ్లు పదహారో శతాబ్దంలో తీసుకొచ్చారట.

ఆ తరవాత వీటికా పేర్లు ఎవరు పెట్టారో తెలియదుకానీ మనందరికీ ఇష్టమైన రాముడు, సీత, లక్ష్మణ పేర్లు పెట్టేసి తమ భక్తిని చాటుకున్నారు.

మనరాష్ట్రంలో ఎక్కువగా పండే సీతాఫలాలతోనే మనకి అనుబంధం ఎక్కువ. కానీ ఉత్తరాంధ్ర, కొన్ని తెలంగాణా జిల్లాల్లోనూ కర్ణాటక, తమిళనాడు, కేరళ, ఛత్తీస్‌గఢ్‌ రాష్ట్రాల్లోనూ రామాఫలాలు, లక్ష్మణఫలాలు ఎక్కువగా పండుతాయి. సూపర్‌మార్కెట్ల పుణ్యమా అని ఇప్పుడిప్పుడు ఇవి అన్ని మార్కెట్లిలోనూ కనిపిస్తున్నాయి.

రామాఫలం :
గుండ్రంగా హృదయాకారంలో ఎరుపురంగులో ఉండే ఈ పండ్ల తొక్క సీతాఫలంకన్నా నునుపుగా ఉంటుంది. దీన్ని నెట్టెడ్‌ కస్టర్డ్‌ యాపిల్‌, బుల్లక్‌ హార్ట్‌, బుల్‌ హార్ట్‌ అని కూడా పిలుస్తారు. తియ్యని వాసనతో మధురమైన రుచిని కలిగి ఉండే ఈ పండు మధ్య అమెరికా, ఐరోపా దేశాల్లో ఎక్కువగా పండుతుంది. సీతాఫలంతో పోలిస్తే ఇందులో గింజలు తక్కువ. అలసిన శరీరాన్ని ఉత్తేజితం చేస్తుంది ఈ జ్యూస్‌. మిగిలినవాటితో పోలిస్తే ఇందులో యాంటీ ఆక్సిడెంట్లు ఎక్కువగా ఉంటాయి. మలేరియా, క్యాన్సర్‌ వ్యాధులకు కారణమైన కణాలను నివారించే గుణం కూడా ఈ పండుకి ఎక్కువే.

పోషకాలు: వంద గ్రా. రామాఫలం నుంచి 75 క్యాలరీల శక్తి, 17.7గ్రా. కార్బొహైడ్రేట్లు, 1.5గ్రా. ప్రొటీన్లు, 3గ్రా. పీచూ లభ్యమవుతాయి. మిగిలినవాటితో పోలిస్తే ఇందులో విటమిన్ల శాతం ఎక్కువ. సి- విటమిన్‌తో పాటు బి-కాంప్లెక్స్‌లోని పైరిడాక్సిన్‌ ఇందులో సమృద్ధిగా ఉంటుంది. ఈ పైరిడాక్సిన్‌ మెదడు కణాలకు అవసరమైన రసాయనాల్ని స్థిరంగా ఉంచేందుకు దోహదపడుతుంది. నరాల వ్యాధులు, తలనొప్పి వంటివి రాకుండా కాపాడేందుకు తోడ్పడుతుంది.



  • ============================================
Visit my Website - Dr.Seshagirirao