Pages

Labels

Blog Archive

Popular Posts

Saturday 26 May 2012

మహానారాయణ తైలం , Mahanarayana Thailam



పండ్లు , కాయగూరలు ,గింజలు, పప్పులు , కందమూలాలు ,సుగంధద్రవ్యాలు మానవుడికి ప్రక్రుతి ప్రసాదించిన అపురూపమైన వరము .ఆయా సీజన్లలో పండే పండ్లను ఆరగించడం మనకు తరతరాలు గా తెలుసును . అన్నం తో కూడా ప్రకృతిసిద్ధమైన పండ్లు , కూరగాయలు ఇతర త్రునధన్యాలను ఆహారం గా ఆహారముగా తీసుకుని జీవించినట్లయితే శరీరానికి కావససిన అన్నిరకాల పోషకాలు లభిస్తాయి ... ఇదే అసలు ఉత్తమమైన జీవన విధానమని పకృతి వైద్యుల నమ్మకం.....ఆహారం జీవం ఉన్న ప్రతి జీవికి అత్యవసరమైనది. పిండిపదార్ధాలు, మాంసకృత్తులు, కొవ్వుపదార్ధాలు, ఖనిజలవణాలు, పీచుపదార్ధాలు, రోగనిరోధక శక్తికి కావలసిన విటమిన్లు మరియు శరీర పోషణకు రక్షణకు కావలసిన పదార్ధాలను కలిగిన పదార్దాలను ఆహారంగా పేర్కొనవచ్చు. ఇవి కాక శరీరానికి నూతన ఉత్సాహాన్నిచ్చే కాఫీ, టీ లాంటి వాటిని కూడా ఆహారపదార్ధాల కోవలోకి వస్తాయి. ఆహారం ఘన, ద్రవ రూపాలలో లభ్యం అవుతుంది.


ఈ తైలం తయారీలో 'శతావరి' అనే మూలికను ప్రధానంగా వాడతారు. శతావరికి నారాయణి అనే పర్యాయపదం ఉండడం వల్ల ఈ తైలాన్ని నారాయణ తైలమని, మహానారాయణ తైలమని పిలుస్తారు. చర్మంపైన అభ్యంగ (మసాజ్) రూపంలోగానీ, కడుపులోకి తీసుకోవడానికి గానీ ఈ తైలాన్ని వాడతారు. అయితే తాగడంలో ఇబ్బంది ఏమైనా ఉంటే వస్తి (ఎనిమా) రూపంలోనూ శరీరానికి అందించవచ్చు. చెవి, ముక్కు వ్యాధుల్లో, ఆ భాగాల్లో వేసే చుక్కల మందుగా కూడా ఈ తైలం వాడుకలో ఉంది.

తైలంలో...ఇందులోని అంశాలు మూడు రూపాల్లో ఉంటాయి .
  • కల్కాంశం :
దోష్టు, ఏలకులు, మంచిగంధం, బలా మూలాలు, జటామాంసీ, ఛఠీలా, సైందవ లవణం, అశ్వగంధ, వచా, రాస్నా, సోంపు, దేవదారు, సుగంధిపాల, పాఠా, మాషపర్ణీ, ముద్గపర్ణీ, తగర వీటన్నిటినీ పొడిచేసి, నీటితో కలిపి ముద్దగా (కల్కం) చేసి పెట్టుకోవాలి.
  • తైలాంశం:
తయారు చేసుకున్న ముద్ద తూకానికి నాలుగు రెట్లు నువ్వుల నూనె తీసుకోవాలి.
  • ద్రవాంశం:
అశ్వగంధ, బలామూలాలు, బిల్వమూలాలు, బృహతీద్వయం, పల్లేరు, సంబరేణు, పాఠామూలాలు, పునర్నవా, ముద్గ, రాస్నా, ఏరండమూలం, దేవదారు, ప్రసారణీ, అరణీ ఈ మూలికలకు నీళ్లు చేర్చి సిద్ధం చేసిన కషాయద్రవం ఒక భాగం, శతావరీ రసం ఒక భాగం, పాలు ఒక భాగం. ఇవన్నీ కలిపి తైలాంశానికి మళ్లీ నాలుగు రెట్లు తీసుకోవాలి. వీటన్నిటినీ ఒక పెద్ద పాత్రలో కలిపేసుకుని, ద్రవాంశం పోయి, తైలాంశం మాత్రమే మిగిలేలా పొయ్యి మీద ఉడికించాలి.
  • తైలగుణాలు:
తైలం తయారీలో ఉపయోగించిన ఈ మూలికలన్నీ శరీరంలో విషమించే వాతదోషాల్ని ఉపశమింపచేసేవి, శక్తిని ప్రసాదించేవి. మూలికల గుణాలను శరీరానికి అందించడంలో తైలం ఒక వాహకంలా పనిచేస్తుంది. ఈ తైలంతో చర్మం మీద మర్దన చేసినప్పుడు చేష్టానాడులు, రక్త వహి సిరా ధ మనులు, స్నాయు, పేశీకండరాలు ప్రేరణ పొంది మరింత శక్తివంతమవుతాయి.

బలహీనపడిన అవయవాలు బలపడి తమ విధులను శక్తివంతంగా నిర్వహిస్తాయి. మర్ధనలోని హస్తలాఘవం (మానిప్యుటేషన్ స్కిల్స్) ప్రభావంతోనే ఈ శరీర క్రియలు సాధ్యమవుతాయి. ఫిజియోథెరపీలో వివిధ తైలాలతో చేసే 'మసాజ్' ప్రాచుర్యానికి రావడానికి ఈ విధానమే కారణం.

ఈ మసాజ్‌కు నారాయణ తైలం కూడా తోడైతే ఫలితాలు మరింతగా పెరిగే అవకాశం ఉంటుంది. అవయవాల శక్తిసామర్థ్యాన్ని పెంచడంతో పాటు నొప్పులను త గ్గించడంలో నారాయణ తైలానికి ఒక ప్రత్యేక స్థానం ఉంది. కేవలం పైపూతగానే ఈ తైలం ఎక్కువగా వాడుకలో ఉంది.

అయితే ఈ తైలాన్ని కడుపులోకి తీసుకున్నప్పుడు ఇది నొప్పిని తగ్గించడానికి కూడా ఉపయోగపడుతుంది. అలాగే చెవిలో చుక్కలుగా వేయడం వల్ల చెవినొప్పి, ముక్కులో వేయడం వల్ల తలనొప్పి, తలకు సంబంధించిన మరికొన్ని ఇతర సమస్యలు కూడా తగ్గుతాయి. రోగి పక్షవాతం వంటి సమస్యలతో కదల్లేని స్థితిలో ఉన్నప్పుడు మర్ధన గానీ, కడుపులోకి ఇవ్వడం గానీ సాధ్యం కాకపోవచ్చు. అలాంటి స్థితిలో నారాయణ తైలాన్ని ఎనీమాగా పేగుల్లోకి ఎక్కించ వచ్చు.ఇలా చేయడం వల్ల పేగుల్లోని పొర (మ్యూకోజా) ద్వారా ఔషధ గుణాలు శరీరానికంతా వెళ్లే అవకాశం ఉంది.

  • ఏ వ్యాధులకు..?
వాత వ్యాధులకు, కీళ్లు, కండరాల నొప్పులను తగ్గించడంలో నారాయణ తైలానికి ప్ర«థమ స్థానం ఉంది. వీటితో పాటు పక్షవాతం, అర్థత వాతం (ఫేషియల్ పెరాలిసిస్), దవడ-మెడ పట్లు, భుజాలు పడిపోవడం (బ్రేకియల్ పాల్సీ) కటిశూల (డిస్క్, బ్యాక్‌పెయిన్) పార్శ్వశూల, కుంటడం, నడుము వంగిపోవడం, గృధసీ వాతం (సయాటికా) వంటి సమస్యలను తగ్గించడంలోనూ ఈ తైలం బాగా పనిచేస్తుంది.

వీటితో పాటు అవయవాలు ఎండిపోవడం, చెవినొప్పి, వినికిడి లోపం, వృషణాల నొప్పి, తలనొప్పి, కండరాలు పట్టేయడం వంటివి ఈ తైలంతో తగ్గుముఖం పడతాయి. సర్వైకల్, లుంబార్ స్పాండిలోసిస్ ఉన్నవారు మర్ధనంతో పాటు కడుపులోకి కూడా తీసుకుంటే మంచి ఫలితాలు ఉంటాయి. వస్తి (ఎనిమా) కూడా చేయించుకుంటే లామినెక్టమీ శస్త్ర చికిత్స అవసరమే లేకుండా పోతుంది.

పైన పేర్కొన్న అన్ని వ్యాధుల్లోనూ నారాయణ తైలంతో మర్ధన చేసి ఆ తరువాత వేడినీళ్లతో స్నానం చేయడం గానీ, నొప్పిగా ఉన్న చోట వేడినీళ్లతో కాపడం పెట్టడం చేయవచ్చు. ఇలా చేయడం వల్ల ఫలితం రెట్టింపుగా ఉంటుంది.


  • courtesy with : blossomera.blogspot.in/
  • =======================
Visit my Website - Dr.Seshagirirao...

Sunday 20 May 2012

Sun flower,సన్‌ ఫ్లవర్‌,పొద్దు తిరుగుడు పువ్వు



పండ్లు , కాయగూరలు ,గింజలు, పప్పులు , కందమూలాలు ,సుగంధద్రవ్యాలు మానవుడికి ప్రక్రుతి ప్రసాదించిన అపురూపమైన వరము .ఆయా సీజన్లలో పండే పండ్లను ఆరగించడం మనకు తరతరాలు గా తెలుసును . అన్నం తో కూడా ప్రకృతిసిద్ధమైన పండ్లు , కూరగాయలు ఇతర త్రునధన్యాలను ఆహారం గా ఆహారముగా తీసుకుని జీవించినట్లయితే శరీరానికి కావససిన అన్నిరకాల పోషకాలు లభిస్తాయి ... ఇదే అసలు ఉత్తమమైన జీవన విధానమని పకృతి వైద్యుల నమ్మకం.....ఆహారం జీవం ఉన్న ప్రతి జీవికి అత్యవసరమైనది. పిండిపదార్ధాలు, మాంసకృత్తులు, కొవ్వుపదార్ధాలు, ఖనిజలవణాలు, పీచుపదార్ధాలు, రోగనిరోధక శక్తికి కావలసిన విటమిన్లు మరియు శరీర పోషణకు రక్షణకు కావలసిన పదార్ధాలను కలిగిన పదార్దాలను ఆహారంగా పేర్కొనవచ్చు. ఇవి కాక శరీరానికి నూతన ఉత్సాహాన్నిచ్చే కాఫీ, టీ లాంటి వాటిని కూడా ఆహారపదార్ధాల కోవలోకి వస్తాయి. ఆహారం ఘన, ద్రవ రూపాలలో లభ్యం అవుతుంది.


  • ప్రకృతిలో జనిస్త్తున్న పుష్పాలు మానవాళిని కనువిందు చేస్తుంటాయి. అందులోనూ సూర్యుడితో పాటు తిరిగే పొద్దు తిరుగుడు పచ్చదనంతో పాటు భారీ తనం కూడా కంటికింపుగా ఉంటుంది.ఆర్నికా పుష్ప జాతికి చెందిన ఈ పొద్దు తిరుగుడు దాదాపు 30 ఉప జాతులుగా ప్రపంచ వ్యాప్తంగా విస్తరించి ఉంది. హెర్బాసియస్‌ ప్రజాతికి చెందితీ పుష్పాలు మృదువైన పూల రెక్కలతో పాటు వైవిధ్య భరితం గా కాస్త జుత్తు తగుతున్నట్లుంటే పత్రాలు కలిగి ఉండటం వీటి ప్రత్యేకత

సమశీతోష్ణ స్ధ్దితి ఉన్న దేశాలలో ఎక్కువగా దీనిని వాణిజ్య పంటగా పండిస్తున్నారు రైతులు. కేవలం నూనె తీసేందుకే కాకుండా వివిధ రసాయనిక ప్రయోగాలలో, మానవాళి వాడుతున్న మందుల్లోనూ వీటి వాడకం నిత్యం పెరుగుతండటంతో ఎక్కువ మంది వీటిని పండించేందుకు ఆసక్తి ప్రదర్శిస్తున్నారు.

  • బలమైన కాండాన్ని కలిగి ఉండి 10 నుండి 15 ఇంచ్‌ల పొడవాటి పుష్పాలు, పసుపు, నారింజ, రంగుల్లో దర్శనమిస్తాయి. ఆర్నికా జాతులు కొద్ది పాటి సువాసనలు మాత్రమే వెదజల్లిన తత్వాన్ని కలిగి ఉన్నా మానవాళికి ఉపయుక్తంగా ఉండే ఈ పొద్దు తిరుగుడు పుష్పాల మధ్యలో ఉండే వృత్తాకార భాగంనే వివిధ రకాలుగా వినియోగిస్తారు.

ఇక ఈ పొద్దు తిరుగుడు వెలువరించే వివిధ రసాయనాలు ఔషధ గుణాలు కలిగి ఉండటంతో ఆయు ర్వేద వైద్యంలో ప్రత్యేకత సంతరించుకుందనే చెప్పాలి. బెణుకులు, గాయాలు తగిలినపుడు మనం వాడుకునే లేపనాలు (ఆయింట్‌ మెంట్లు) తయారీలో సన్‌ ఫ్లవర్‌ని వినియోగిస్తున్నారు. ఈ మొక్కల వేళ్లలో ఉండే కినీకల్లీ సబ్కాటానియస్‌ రక్త కేశనాళాలపై తీవ్ర ప్రభావం చూపిస్తున్నట్లు పరిశోధనల్లో వెల్లడి కావటంతో దీనిని క్రీడా కారుల అలసట, నీరసించి పోవటాల నుండి సత్వర ఉపశమనానికి వాడుతున్నారు. అలాగే వివిధ రకాల నొప్పుల నివారణకి ప్రయోజనకారిగా ఉండటంతో అందుకు సంబంధించిన మందుల తయారీ ల్లోనూ దీని వాడకం ఎక్కువైంది.

  • హౌమియో మందుల్లోనూ పొద్దు తిరుగుడు తన ఔషధతత్వాన్ని చూపిస్తోంది. హౌమియోలో అత్యం త కీలక భూమిక పోషించే టించర్‌ చిక్కబడకుండా ఉండేందుకు పొద్దు తిరుగుడు నుండి తీసిన రసాయనాలే చూస్తుంటాయి. మానవ శరీరంలో అనేక ధోష పూరిత లవణాలను బైటకు పంపించడంలో ప్రత్యేక లక్షణాలు ఇది కలిగి ఉందని వైద్య శాస్త్రజ్ఞులు తెలుపుతున్నారు. ఈ సన్‌ ఫ్లవర్‌ ఎంత ఉపయుక్తంగా ఉంటుందో తగు రీతిన జాగ్రత్తలు వహించక పోతే అంతే ప్రమాదకారి కూడా.. ఈ పూలను, ఆకుల్ని తాగినపుడు ఎంత ఆహ్లాదక రంగా ఉంటుందో తదుపరి శరీరానికి చికాకు పుట్టి స్తుంది. పూలలోని చిన్న చిన్న విత్తనాలను పొరపాటున నోటిలో వేసుకుంటే అది విషతుల్యమై ఉండటంతో ఆజీర్ణం, కడుపులో గ్యాస్‌ పెరగటం, అంతర్గత రక్తస్రావాలకు దారి తీస్తుంది. కొన్ని ఉప జాతు లు విషతుల్యం కాకపో యినా.. జీర్ణ ప్రక్రియపై ప్రభావం చూపిస్తాయి.

  • Courtesy with - సత్యగోపాల్ ‌@ అంధ్రప్రభ దిన పత్రిక ఆదివారము అనుబందము .

  • =========================
Visit my Website - Dr.Seshagirirao...

ఆకు కూరలు-మన ఆరోగ్యము ,Green leafy vegetables and our health








పండ్లు , కాయగూరలు ,గింజలు, పప్పులు , కందమూలాలు ,సుగంధద్రవ్యాలు మానవుడికి ప్రక్రుతి ప్రసాదించిన అపురూపమైన వరము .ఆయా సీజన్లలో పండే పండ్లను ఆరగించడం మనకు తరతరాలు గా తెలుసును . అన్నం తో కూడా ప్రకృతిసిద్ధమైన పండ్లు , కూరగాయలు ఇతర త్రునధన్యాలను ఆహారం గా ఆహారముగా తీసుకుని జీవించినట్లయితే శరీరానికి కావససిన అన్నిరకాల పోషకాలు లభిస్తాయి ... ఇదే అసలు ఉత్తమమైన జీవన విధానమని పకృతి వైద్యుల నమ్మకం.....ఆహారం జీవం ఉన్న ప్రతి జీవికి అత్యవసరమైనది. పిండిపదార్ధాలు, మాంసకృత్తులు, కొవ్వుపదార్ధాలు, ఖనిజలవణాలు, పీచుపదార్ధాలు, రోగనిరోధక శక్తికి కావలసిన విటమిన్లు మరియు శరీర పోషణకు రక్షణకు కావలసిన పదార్ధాలను కలిగిన పదార్దాలను ఆహారంగా పేర్కొనవచ్చు. ఇవి కాక శరీరానికి నూతన ఉత్సాహాన్నిచ్చే కాఫీ, టీ లాంటి వాటిని కూడా ఆహారపదార్ధాల కోవలోకి వస్తాయి. ఆహారం ఘన, ద్రవ రూపాలలో లభ్యం అవుతుంది.





  • మనకి ప్రకృతి ఇచ్చిన ఆరోగ్యవరాలలో ఆకు కూరలు చేసే అద్భుతాలెన్నో.... శరీరానికి కావాల్సిన అనేక రకాల ఖనిజ లవణాలను ,విటమిన్లను ప్రోటీన్లను, అందిస్తూ... నిత్యం తమని ఏదో ఓరకంగా తీసుకునే వ్యక్తుల జీవనశైలినే మార్చేసే సత్తా ఆకుకూరలకు ఉంది. ఆకు కూరల్లో కొవ్వు తక్కువగా ఉండటమే కాకుండాతినే ఆహారాన్ని రుచి కరంగా చేసేదిగా ప్రత్యేక లక్షణాన్ని ఆకుకూరలు కలిగి ఉంటాయి. ఆకు కూరలు వండుకునే ముందు ఖచ్చితంగా ఒకటికిరెండు సార్లు కడగటం మంచిది. ఎందుకంటే వాటిలో చేరే చిన్న చిన్న పురుగులు, ధుమ్మూ,ధూళి మనఆరోగ్యానికి హాని కలిగించ వచ్చు. అవసరమైతే ఆకు కూరలు కడిగేప్పుడు గట్టిగా ఉండే భాగాలను ఏరివేయండి. వీలైతే పొటాషియం పర్మాంగనేట్‌తో ఆకు కూరలు శుభ్రం చేస్తే మంచి ఫలితా లుంటాయి.


ఉదాహరణ (for example) కొన్ని ఆకుకూరలు --



  • మెంతికూర,

  • కరివేపాకు,

  • కొత్తిమీర,

  • తోట కూర,

  • తులసి,

  • గోంగూర,

  • బచ్చలి


ఇలా పలు రకాల ఆకుకూరలు వండేముందు కాస్త ఉప్పువేసిన మంచి నీటిలొ ముంచితే వాటిపై ఉండే క్రిమికీటకాలు, గుడ్లు, నాశనమవుతాయి. ఇవి తొందరగా నలిగే గుణం ఉండ టం వల్ల సలాడ్‌, సూపులుగా, చట్నీలుగా తీసుకోవచ్చు. ముఖ్యంగాఆకు కూర లు వండే సమ యంలోమూతలు పెట్టి వండండి. వీలైనంతవరకు ప్రెజర్‌ కుక్కర్‌లోనే వండేందుకు యత్నిస్తే... వాటిలోనిపోషకాలు మనకి అందుతాయి. అలాగే ఆకుకూరలు ఉడక పెట్టాక ఆందులోనీటిని పారేయకండి. కాస్తనిమ్మరసం, ఉప్పు,కలిపి సూప్‌గా తీసు కుంటే ఆరోగ్యానికి మంచిది.



ఆకుకూరలు తో మధుమేహానికి చెక్ ,
ఆకుకూరలు తినండి.. మధుమేహానికి చెక్ పెట్టండి అంటున్నారు ఆరోగ్య నిపుణులు. ఆకుకూరలను తినడం వల్ల మధుమేహానికి దూరంగా ఉండవచ్చని శాస్త్రవేత్తల తాజా అధ్యయనంలో వెల్లడైంది.

అంతేకాదు, ఆకుకూరలే కాకుండా రోజూ పల్లీలు, ఇతర డ్రై ఫ్రూట్స్‌ తీసుకునే వారిలో కూడా మధుమేహంతోబాటు ఇతర గుండె జబ్బులు వచ్చే ప్రమాదం తక్కువగా ఉంటుందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు.

ప్రతిరోజూ పల్లీలు తినేవారిలో మధుమేహం వచ్చే ప్రమాదం ఇరవైవొక్క శాతం తగ్గుతుందని అధ్యయనంలో తేలింది. డ్రైఫ్రూట్స్‌ శరీరానికి అవసరమైన కొవ్వును అందిస్తూనే బరువును అదుపులో ఉంచుతాయని న్యూట్రీషన్లు అంటున్నారు.

ఆకుకూరల్లో కెలోరీలు, కార్బొహైడ్రేట్లు తక్కువగా ఉంటాయి. ప్రతిరోజూ ఏదో ఒక ఆకుకూర తీసుకొనే వారిలో మధుమేహం వచ్చే ప్రమాదాన్ని పధ్నాలుగు శాతాన్ని తగ్గించవచ్చంటున్నారు. కాబట్టి ఆహారం ఆకుకూరలు వారానికి మూడు సార్లు తీసుకుంటూ వుండండి. 


  • ========================


Visit my Website - Dr.Seshagirirao...

యూకలిప్ట్‌స్‌,నీలగిరి , Eucaliptus



పండ్లు , కాయగూరలు ,గింజలు, పప్పులు , కందమూలాలు ,సుగంధద్రవ్యాలు మానవుడికి ప్రక్రుతి ప్రసాదించిన అపురూపమైన వరము .ఆయా సీజన్లలో పండే పండ్లను ఆరగించడం మనకు తరతరాలు గా తెలుసును . అన్నం తో కూడా ప్రకృతిసిద్ధమైన పండ్లు , కూరగాయలు ఇతర త్రునధన్యాలను ఆహారం గా ఆహారముగా తీసుకుని జీవించినట్లయితే శరీరానికి కావససిన అన్నిరకాల పోషకాలు లభిస్తాయి ... ఇదే అసలు ఉత్తమమైన జీవన విధానమని పకృతి వైద్యుల నమ్మకం.....ఆహారం జీవం ఉన్న ప్రతి జీవికి అత్యవసరమైనది. పిండిపదార్ధాలు, మాంసకృత్తులు, కొవ్వుపదార్ధాలు, ఖనిజలవణాలు, పీచుపదార్ధాలు, రోగనిరోధక శక్తికి కావలసిన విటమిన్లు మరియు శరీర పోషణకు రక్షణకు కావలసిన పదార్ధాలను కలిగిన పదార్దాలను ఆహారంగా పేర్కొనవచ్చు. ఇవి కాక శరీరానికి నూతన ఉత్సాహాన్నిచ్చే కాఫీ, టీ లాంటి వాటిని కూడా ఆహారపదార్ధాల కోవలోకి వస్తాయి. ఆహారం ఘన, ద్రవ రూపాలలో లభ్యం అవుతుంది.


సాధారణ జనాలకి కూడా నీలగిరి తైలంగా చేరవైన యూకలిప్టస్‌ ఆయిల్‌ సహజ సిద్దం గా ప్రకృతి ప్రసాదించిన దివ్వ ఔషధంగా చెప్తా రు. శరీరంలోని అనేక రుగ్మతలను తగ్గించేఈ యూక లిప్టస్‌ ఆయిల్‌ మహిళలకు అందాలను కూడా ఇవ్వటంలోనూ ముందుంది.

  • యూకలిప్టస్‌ ఆయిల్‌ తో శరీరాన్ని మర్ధన చేయించుకుంటే శరీరాన్ని చల్లబరచి, వేడిమి ఎక్కువ కాకుండా చూస్తుంది.
  • అనేక రకాల బాక్టీరియాలను సంహరించటంలో ప్రత్యేకత చూపే ఈ ఆయిల్‌ వల్ల శరీరం తాజా దనాన్ని సంతరించుకోవటంతో కొత్త ఉత్సాహం పుట్టు కొస్తుంది.
  • సహజ సిద్దంగా మంచి సువాసనలు కలిగినది కావటంతో చర్మంపై వచ్చే పుళ్లు, యోని సంబంధిత దురద వ్యాధులకు ఉపయోగ పడుతుంది.
  • ఒళ్లునొప్పులతో బాధపడేవారు బకేట్‌ వేడి నీళ్లలో రెండు కప్పుల యూకలిప్టస్‌ ఆయిల్‌ వేసి స్నానం చేస్తే... కీళ్ల నొప్పు లు, శారీరక నొప్పులు కనుమరుగై హాయిగా నిద్ర పడుతుంది. భుజాలు, వీపు భాగాలలో యూకలిప్టస్‌ ఆయిల్‌కి కొద్దిగా విటమిన్‌ ఇని కలిపి మర్ధన చేస్తే ఫలితాలుంటాయి.
  • చర్మంపై మచ్చలు ఉండే వారు వాటిపై ఈ నూనెను రాస్తే... మచ్చలు పోవటంతో పాటు చర్మం కొత్త నిగారింపులు సంత రించుకుంటుంది.
  • పురుషులు ఆఫ్టర్‌ షేవ్‌ లోషన్‌గానూ దీనిని వాడుకొంటే ముఖంపై పడే గాట్లు నుండి రక్షణ పొందటమే కాకుండా ముఖం కొత్త అందాలు సంతరించుకుంటుంది.
  • శనగపిండిలో కొద్దిగా యూకలిప్టస్‌ ఆయుల్‌ వేసి శరీరానికి నలుగు పెట్టుకుంటే శరీరం పొడి బార కుండా ఉండటమే కాకుండా మెత్తగా, అందంగా తయార వుతుంది.

  • =======================
Visit my Website - Dr.Seshagirirao...

Saturday 19 May 2012

లిల్లీపువ్వులు,Lilly flowers



పండ్లు , కాయగూరలు ,గింజలు, పప్పులు , కందమూలాలు ,సుగంధద్రవ్యాలు మానవుడికి ప్రక్రుతి ప్రసాదించిన అపురూపమైన వరము .ఆయా సీజన్లలో పండే పండ్లను ఆరగించడం మనకు తరతరాలు గా తెలుసును . అన్నం తో కూడా ప్రకృతిసిద్ధమైన పండ్లు , కూరగాయలు ఇతర త్రునధన్యాలను ఆహారం గా ఆహారముగా తీసుకుని జీవించినట్లయితే శరీరానికి కావససిన అన్నిరకాల పోషకాలు లభిస్తాయి ... ఇదే అసలు ఉత్తమమైన జీవన విధానమని పకృతి వైద్యుల నమ్మకం.....ఆహారం జీవం ఉన్న ప్రతి జీవికి అత్యవసరమైనది. పిండిపదార్ధాలు, మాంసకృత్తులు, కొవ్వుపదార్ధాలు, ఖనిజలవణాలు, పీచుపదార్ధాలు, రోగనిరోధక శక్తికి కావలసిన విటమిన్లు మరియు శరీర పోషణకు రక్షణకు కావలసిన పదార్ధాలను కలిగిన పదార్దాలను ఆహారంగా పేర్కొనవచ్చు. ఇవి కాక శరీరానికి నూతన ఉత్సాహాన్నిచ్చే కాఫీ, టీ లాంటి వాటిని కూడా ఆహారపదార్ధాల కోవలోకి వస్తాయి. ఆహారం ఘన, ద్రవ రూపాలలో లభ్యం అవుతుంది.


  • పువ్వులు లేని ప్రకృతిని ఓ సారి కళ్లు మూసుకుని ఊహించుకోండి..... పసిపాపల బోసి నవ్వులు లేని ఇల్లంత భయకరంగా కనిపిస్తోందిగా... అదే మరి... ఆ పువ్వులలో స్వచ్ఛత, ప్రకృతికే కాదు సమస్త్త మానవాళి 'మనుగడ'కు దిక్సూచిలా నిలచే పుష్పాలలో లిల్లి కూడా ఒకటిగా చెప్పుకోవచ్చు.

లిలియేసి వృక్ష జాతికి చెందిన ఈ లిల్లీ పుష్పాలు ప్రపంచ వ్యాప్తంగా 110 రకాలుగా లభ్యమవుతున్నట్లు వృక్ష శాస్త్రనిపుణులు చెప్తున్నారు. గుభాళింపులతో మనసుని మైమరిపించే ఈ లిల్లీ ఉత్తర అర్ధగోళంలో ఎక్కువగా దర్శనమిస్తుంది. ముఖ్యంగా మన దేశంలో నీలగిరి పర్వత ప్రాం తంలో ఎక్కువగా సాగవుతోంది.

  • అలాగే ఫిలిప్పిన్స్‌, దక్షిణ జపాన్‌, ఆసియా, యూరప్‌, దక్షిణ కెనడా, యునైటెడ్‌ స్టేట్స్‌ దేశాలలో విస్తారంగా దొరికే ఈ పుష్పం కేవలం అటవీ ప్రాంతంలోనే కాకుండా సాధారణ నేలల్లోనూ కనిపిస్తుంది. సమ శీతోష్ట్ణస్ధితి ఉండే ప్రదేశంలో జీవించే ఈ లిల్లీ జాతులు వసంత ఋతువు ప్రారంభంలో ఎక్కువగా పూయటం ప్రారంభిస్తాయి. మరి కొన్ని జాతులు శీతాకాలం చివర్లో పుష్పించడం ప్రారంభించి చల్లని గాలులకు తోడుగా మంచి సువాసనలు వెదజల్లుతూ వాతావరణాన్ని ఆహ్లాదకరంగా మారుస్తుంటాయి.

చిత్తడి నేలల్లో లిల్లీ జాతులు అంటు కట్టడం ద్వారా కొత్త మొక్కలు పుట్టుకొస్తాయి... చిన్న పాటి నీటి తుంపర్లకే తమని తాము అభివృద్ది పరచుకుంటూ విస్తారమవుతాయి. లాంగీ కాండియం, లాంగి కాటెబై జాతులకు చెందిన మొక్కలు వేసవిలోనూ పెరిగి వసంత ఋతువు నాటికి పుష్పించడం ప్రారంభించడం మరో విశేషం.


పసుపు, తెలుపు, నారింజ, ఎరుపు, గులాబీ, తదితర రంగుల్లో దర్శనమిచ్చే లిల్లి జాతులు చిన్న పాటి పుష్పంగానే కాకుండా పెద్ద సైజులోనూ ఉంటాయి. మనకి ఎక్కువగా కనిపించే జాతుల్లో ఫ్రిటిల్లేరియా, నోమోభారీస్‌, నధోలిరియన్‌ చిన్న మొక్కలే అయినా పుష్ప సంతతిని విస్తృతం పరిమిళింప చేస్తుంది. లిల్లీ జాతులలో కేవలం ఒకే రంగు పుష్పాలే కాకుండా రెండు వేర్వేరు రంగుల మేలు కలయికలోనూ పుష్పాలు మనకి కనిపిస్తాయి. వీటిలో ఓ రంగు పుష్పంపై మరో రంగు చుక్కచుక్కలుగా ఉండటమే కాకుండా బ్రెష్‌ స్ట్రోక్‌లు కూడా కనిపిస్తాయి.

  • ఉపయోగాలు :
  • సున్నితత్వానికి మారు పేరుగా ఉండే ఈ పుష్పాలు ఎక్కువగా సుగంధ ద్రవ్యాలలో వినియోగిస్తారు.
  • అలాగే మానవాళికి ఉపయోగ పడే ఔషధాల తయారీలోనూ లిల్లిలు తమ తరహా పాత్ర పోషిస్తున్నాయి.
  • ఇక లిల్లి మొక్కల వేరు భాగంలో ఉండే దుంపలు అత్యంత పోషక విలువలున్నవిగా జపాన్‌, జర్మనీ తదితర దేశాల్లో వినియోగిస్తుంటారు. క్యారెట్‌, బీట్‌రూట్‌ తరహాలో ఉండే ఈ దుంపలు దాదాపు బంగాళా దుంపల రుచిని కలిగి ఉంటాయని పాకశాస్త్ర నిపుణులు చెప్తున్నారు. ఈ దుంపలు మనిషి శరీరంలో ఉండే అంతర్గత వేడిని తగ్గు ముఖం పట్టించేందుకు దోహదకారిగా ఉండటమే కాకుండా... మెదడుకు చురుకు దనాన్ని కలుగ చేసే వివిధ విటమిన్లు, రసాయనాలు ఉంటాయని నిపుణులు చెప్తున్నారు.

  • శరీరానికి చల్ల దనాన్నిచ్చే తత్వం ఈ దుంపలు కలిగి ఉండటంతో చైనాలోని వివిధ వంటకాలలో వీటిని వాడుతున్నారు. వీటితో తయారు చేసే 'సూప్‌'కి అక్కడ డిమాండ్‌ అధికంగా ఉంది. బంగాళా దుంపలు మనిషి శరీరానికి ఇబ్బందులు కలుగ చేసేవి అయితే లిల్లి దుంపలు ఆరోగ్య ప్రదాయినిగా చైనీయులు పేర్కొంటుండటం ఓ విశేషం.

జపాన్‌లో వీటికి 'లిల్లీ రూట్‌' అని పేరు పెట్టి బలవర్ధకమైన ఆహార పదార్ధాల సరసన చేర్చడమే కాకుండా వీటి పిండి పదార్దాలతో ప్రత్యేక వంటకాలు, సాస్‌లు మార్కెట్‌లోకి దిగుమతి చేస్తున్నారు అక్కడి వాణిజ్యవేత్తలు. ఇలా కోట్లాది రూపాయల వర్తకానికి అవకాశం ఉన్న పుష్పంగా లిల్లీని చెప్పుకోవల్సిందే....


  • Courtesy with : ఆంధ్రప్రభ దినపత్రిక - ప్రకృతి - ఆదివారము అనుబంధం -Sun, 31 Jul 2011.

  • ======================
Visit my Website - Dr.Seshagirirao...

వత్సనాభి,Indian Aconite



పండ్లు , కాయగూరలు ,గింజలు, పప్పులు , కందమూలాలు ,సుగంధద్రవ్యాలు మానవుడికి ప్రక్రుతి ప్రసాదించిన అపురూపమైన వరము .ఆయా సీజన్లలో పండే పండ్లను ఆరగించడం మనకు తరతరాలు గా తెలుసును . అన్నం తో కూడా ప్రకృతిసిద్ధమైన పండ్లు , కూరగాయలు ఇతర త్రునధన్యాలను ఆహారం గా ఆహారముగా తీసుకుని జీవించినట్లయితే శరీరానికి కావససిన అన్నిరకాల పోషకాలు లభిస్తాయి ... ఇదే అసలు ఉత్తమమైన జీవన విధానమని పకృతి వైద్యుల నమ్మకం.....ఆహారం జీవం ఉన్న ప్రతి జీవికి అత్యవసరమైనది. పిండిపదార్ధాలు, మాంసకృత్తులు, కొవ్వుపదార్ధాలు, ఖనిజలవణాలు, పీచుపదార్ధాలు, రోగనిరోధక శక్తికి కావలసిన విటమిన్లు మరియు శరీర పోషణకు రక్షణకు కావలసిన పదార్ధాలను కలిగిన పదార్దాలను ఆహారంగా పేర్కొనవచ్చు. ఇవి కాక శరీరానికి నూతన ఉత్సాహాన్నిచ్చే కాఫీ, టీ లాంటి వాటిని కూడా ఆహారపదార్ధాల కోవలోకి వస్తాయి. ఆహారం ఘన, ద్రవ రూపాలలో లభ్యం అవుతుంది.

  • ప్రకృతి మనకు ప్రసాదించిన అనేక వర్గాల్లో ఒకటి ఔషధ మొక్కలు. సంపూర్ణ ఆరోగ్యానికి సహజమైన రీతిలో ఉత్తేజాన్ని అందించే ఔషధమొక్కల పట్ల ప్రతీవారూ కనీస విషయ పరిజ్ఞానాన్ని కలిగిఉండడం ఎంతైనా అవసరం. ఈ ఔషధమొక్కల సేవనం వల్ల శారీరక పుష్టిని, తద్వారా మానసికోల్లాసాన్ని సాధించడం ఎంతో సులువు. సక్రమ జీవనానికి మార్గాలైన శారీరక, మానసిక ఆరోగ్యాలకు మూలం... ప్రకృతి ప్రసాదించిన సహజసిద్ధమైన ఔషధమొక్కలు. ఆ కోవకి చెందిందే వత్సనాభి.

ఇది రానంకులేసీ కుటుంబానికి చెందింది. దీని శాస్త్రీయ నామం అకోనిటమ్‌ ఫెరొక్స వాల్‌. ఇది బహు వార్షిక గుల్మం. దీనిని ఒక్కొక్క భాషలో ఒక్కో రకంగా పిలుస్తారు. ఆంగ్లంలో ఇండియన్‌ అకోనైట్‌, హిందీలో మీటావిష్‌, బచ్నాగ్‌, మళయాళంలో వత్సనాభి, సంస్కృతంలో ప్రాణహర, హాలాహల అని పిలుస్తారు. 2000-3000 మీటర్ల ఎత్తైన ప్రాంతాలలోనూ వత్సనాభి పెరుగుతుంది. హిమాచల్‌ ప్రదేశ్‌, ఉత్తరాంచల్‌, జమ్మూకాశ్మీర్‌, సిక్కిం, పంజాబ్‌ రాష్ట్రాలలోని పర్వత ప్రాంతాలలో ఎక్కువగా పెరుగుతాయి. ఈ చెట్టు పొడవు 90 సెం.మీలు ఉంటుంది. ఆకులు అర్ధవర్తులాకారంలో ఉంటాయి. పువ్వులు నీలి రంగులో ఉంటాయి. వేర్లు గోధుమ వర్ణంలో ఉంటాయి. ఫిబ్రవరి - మార్చి నెలలు వీటిసాగుకు అనువైన కాలం.

  • ఇందులో వివిధ రకాల ఆల్కాలైడ్స్‌ ఉన్నాయి. కస్మోవాకొనిటైన్‌, బిఖాకొనిటైన్‌, ఇండా కొనిటైన్‌, సూడో కొనిటైన్‌, బిఖా కొనైన్‌ టెట్రాసిటైల్‌ ఆల్కాలైడ్స్‌ ఇందులో మిళితమై ఉన్నాయి. ముఖ్యంగా వత్సనాభిమొక్కలో వేర్లు ప్రధాన పాత్ర పోషిస్తాయి.
  • దీని వేరు నుంచి తయారుచేసిన ఔషధం అల్సర్ల నివారణకు చక్కగా పనిచేస్తుంది.
  • అంతేకాకుండా ఈ వేరును నీళ్ళల్లో మరిగించి ఆ డికాక్షన్‌ను తాగితే జుట్టు రాలడం, తెల్లబడడం ఉండదు.
  • తెగిన గాయాలకు, దెబ్బలకు దీని వేరుతో తయారుచేసిన ఔషధాన్ని పైపూతగా వాడితే తక్షణ ఉపశమనం ఉంటుంది.
  • వేర్ల నుంచి తయారుచేసిన ఔషధాలు రక్తపోటును, డిస్‌పెప్‌సియా, అమెనోర్హియా, ఆర్ధరైటిస్‌, హెపటైటిస్‌, దగ్గు, అస్తమా లాంటి వ్యాధులకు మంచి దివ్యౌషధంగా పనిచేస్తుంది.
  • అంతేకాక చర్మ సంబంధ వ్యాధులను కూడా తగ్గిస్తుంది.
  • దీని వేర్లతో తయారుచేసిన పొడిని తేనెలో కలిపి తింటే అజీర్తి, కడుపునొప్పి తగ్గుతుంది.
  • దీని ఆకులను నీళ్ళల్లో బాగా మరగనిచ్చి డికాషన్‌లా తయారుచేసుకోవాలి. ఈ డికాషన్‌లో కొన్ని పాలు కలిపి తయారుచేసిన పానీయంతో తలనొప్పి, భుజాలు, పార్శ్శపు నొప్పులకు బాగా పనిచేస్తుంది.
  • దీని తైలం అన్ని అవయవాల నొప్పులకు పనిచేస్తుంది.
  • వత్సనాభితో తయారుచేసిన టానిక కండరాలలో శక్తిని, ఎముకలలో కాల్షియం శాతాన్ని పెంచడానికి, ఉపయోగపడుతుంది.
  • ఇది ఆయుర్వేదంలో బాగా ప్రాచుర్యం పొందిన ఔషధం. గుణ రస వీర్య కణాలను వృద్ధి చేస్తుంది. దీనితో తయారుచేసిన ఔషధాలు కొన్ని హైలాండ్స్‌ టానిక జ్వరానికి, అల్‌షోక జుట్టు రాలకుండా, చుండ్రును తొలగిస్తుంది.

ఎన్‌.సిహెచ్‌. మానస @Andhraprabha News paper.
  • ======================
Visit my Website - Dr.Seshagirirao...

మదనఫలం,Rendia Spinosa



పండ్లు , కాయగూరలు ,గింజలు, పప్పులు , కందమూలాలు ,సుగంధద్రవ్యాలు మానవుడికి ప్రక్రుతి ప్రసాదించిన అపురూపమైన వరము .ఆయా సీజన్లలో పండే పండ్లను ఆరగించడం మనకు తరతరాలు గా తెలుసును . అన్నం తో కూడా ప్రకృతిసిద్ధమైన పండ్లు , కూరగాయలు ఇతర త్రునధన్యాలను ఆహారం గా ఆహారముగా తీసుకుని జీవించినట్లయితే శరీరానికి కావససిన అన్నిరకాల పోషకాలు లభిస్తాయి ... ఇదే అసలు ఉత్తమమైన జీవన విధానమని పకృతి వైద్యుల నమ్మకం.....ఆహారం జీవం ఉన్న ప్రతి జీవికి అత్యవసరమైనది. పిండిపదార్ధాలు, మాంసకృత్తులు, కొవ్వుపదార్ధాలు, ఖనిజలవణాలు, పీచుపదార్ధాలు, రోగనిరోధక శక్తికి కావలసిన విటమిన్లు మరియు శరీర పోషణకు రక్షణకు కావలసిన పదార్ధాలను కలిగిన పదార్దాలను ఆహారంగా పేర్కొనవచ్చు. ఇవి కాక శరీరానికి నూతన ఉత్సాహాన్నిచ్చే కాఫీ, టీ లాంటి వాటిని కూడా ఆహారపదార్ధాల కోవలోకి వస్తాయి. ఆహారం ఘన, ద్రవ రూపాలలో లభ్యం అవుతుంది.


'పెరటిచెట్టు వైద్యానికి పనికి రాదు' అని ఆర్యో క్తిగా అంటారు. కానీ దాని అసలు అర్ధం, ఇం టిలో పెరిగే మొక్కలగానీ, చెట్లు గానీ పనికిరా వని కాదు...! వాటి విలువలు మనం గుర్తించ డం లేదని. ఇంటి పెరటిలో ముబ్బడి దిబ్బడిగా పెరిగే మొక్కలు కేవలం పిచ్చిమొక్కలనుకుంటే పొరపాటే. వాటి విలు వలు కనిపెట్టి పోషిస్తుంటే అవి మన ఆరోగ్యాన్ని సదా కాపాడుతూవుం టాయి. అలా పెరిగి ఉపయోగపడే మొక్కల్లో మదనఫలం చాలా మేలైనది. దీని శాస్త్రీయనా మం 'రెన్డియా స్పై నోసా'. ఇది రుబియాసి కు టుంబానికి చెందిన చెట్లు. ఈ మదనఫలంలో రస, గుణ, వీర్య, ప్రభావ దోషాలు నివారించే శక్తి ఎంతో ఉంది. ఈ చెట్టు పండు, కాయ, పువ్వులు, ఆకుల్లో ఆయుర్వేద గుణాలు సమృద్ధిగా ఉన్నాయి.

ఇక ఈ చెట్టు ఆకులు కొద్దిపాటి గుండ్రంగా ఉండి, ఒకదాని కొకటి ఎదురెదురుగా జామాకుల్లా పెరుగుతాయి. ఈ చెట్టు మధ్యమ స్థాయిలో నిటారుగా ఎదుగుతూ చిన్న పాటి శాఖలతో విస్తరిస్తుంది. పువ్వులు పసుపు రంగుతో కలిపిన తెల్లదనంతో చాలా అందంగా ఉంటాయి. దీని పండు గుండ్రంగా ఉండి పసుపు రంగులోగాని, ముదురు బూడిదరంగులో గానీ ఉం టుంది. ఇది పండుగా ఉన్నపడు మెత్తగా తియ్యగా ఉం టుంది. ఈ మదనఫలంలో 33% సపోనిన్‌ అనే రసాయన పదా ర్ధంతో పాటు 'వలేరినిక ఆసిడ్‌', మైనం ఉండి జిగురు పదార్ధం కూడా కలిగివుంటుంది. దీని గింజలో చమురు పదార్ధం కూడా ఉండటం చేత ఆరోగ్యానికి ఎంతగానో దోహదపడు తుంది. ఈ మదనఫలంతో తయారవుతున్న ఆయుర్వేద ఔషధాలు, కఫని సారిక - ఇది కఫాన్ని కరిగించి పలుచన చేస్తుంది. అందువలన కఫదోషాలు త్వరితగతిని నివారించబడ తాయి.

కృమిగ్న - ఇది మన శరీరంలో పెరిగే పరాన్నజీవుల్ని నిర్మూలి స్తుంది.

లేఖన - ఇది శరీరంలోని ఇతర మలినా లని తగ్గిస్తుంది.

రక్త షోడక - ఇది రక్తాన్ని శుద్ధిచేసి ఆరోగ్యంగా ఉంచుతుంది.

వమన - ఇది పంచకర్మలో వాంతిని కలిగిస్తుంది.

వేదన స్థపన - బాధని, నొపðల్ని నివారిస్తుంది.

విషజ్ఞ - ఇది విషానికి వ్యతిరేకంగా పనిచేస్తుంది.

వ్రణరోపణ - గాయాలు, దెబ్బలు మానడానికి దీనిని వాడతారు

బాహ్య ప్రయోజనాలు: వాంతిని కలిగించే గింజ పైతొక్క, వాపులవల్ల కలిగే నొపðల్ని తొలగిస్తుంది. అలాగే అల్సర్‌ని శుభ్రపరుస్తుంది. దీని నూనెతో మసాజ్‌ చేస్తే వాతం వల్ల ఏర్పడిన వాపులు నివారించబడి ఉపశమనం చేకూరుతుంది. కీళ్ళనొ పðలు, కీళ్ళవాతంతో బాధపడేవారు దీని గుజ్జుని లేపనం చేస్తే మంచి ఫలితం ఉంటుంది. కడుపునొప్పికి దీనితో చేసిన కషా యం బొడ్డు చూట్టూ లేపనం చేస్తే తక్షణ ఉపశమనం కలుగు తుంది. మదనఫలంపై తొక్కతో కషాయం చేసి తీసుకుంటే కఫం వల్ల కలిగే చికాకుల్నించి దూరంగా ఉంచుతుంది.

ఇలా ఎన్నో మన కళ్ళ ముందు కనిపించే రకరకాల మొక్కల్ని ఉన్నఫళాన పీకేయకుండా జాగ్రత్తగా పరిశీలించి దాని ఔషధగుణాలు అంచనావేసి శ్రద్ధగా పోషిస్తే, ఆ పెరటి చెట్టే ప్రాణవాయువుని, ఆరోగ్యాన్ని కూడా ప్రసాదిస్తుంది.

-వాడ్రేవు @ Andhraprabha news paper sunday magazine.
  • =======================
Visit my Website - Dr.Seshagirirao...

Friday 18 May 2012

ఈత పండు,Silver Date Fruit



పండ్లు , కాయగూరలు ,గింజలు, పప్పులు , కందమూలాలు ,సుగంధద్రవ్యాలు మానవుడికి ప్రక్రుతి ప్రసాదించిన అపురూపమైన వరము .ఆయా సీజన్లలో పండే పండ్లను ఆరగించడం మనకు తరతరాలు గా తెలుసును . అన్నం తో కూడా ప్రకృతిసిద్ధమైన పండ్లు , కూరగాయలు ఇతర త్రునధన్యాలను ఆహారం గా ఆహారముగా తీసుకుని జీవించినట్లయితే శరీరానికి కావససిన అన్నిరకాల పోషకాలు లభిస్తాయి ... ఇదే అసలు ఉత్తమమైన జీవన విధానమని పకృతి వైద్యుల నమ్మకం.....ఆహారం జీవం ఉన్న ప్రతి జీవికి అత్యవసరమైనది. పిండిపదార్ధాలు, మాంసకృత్తులు, కొవ్వుపదార్ధాలు, ఖనిజలవణాలు, పీచుపదార్ధాలు, రోగనిరోధక శక్తికి కావలసిన విటమిన్లు మరియు శరీర పోషణకు రక్షణకు కావలసిన పదార్ధాలను కలిగిన పదార్దాలను ఆహారంగా పేర్కొనవచ్చు. ఇవి కాక శరీరానికి నూతన ఉత్సాహాన్నిచ్చే కాఫీ, టీ లాంటి వాటిని కూడా ఆహారపదార్ధాల కోవలోకి వస్తాయి. ఆహారం ఘన, ద్రవ రూపాలలో లభ్యం అవుతుంది.




ఈత (Silver Date Palm or Sugar Date Palm), చెట్టు పుష్పించే మొక్కలలో పామే కుటుంబానికి సంబంధించినది. దీని శాస్త్రీయ నామము 'ఫీనిక్స్ సిల్వెస్ట్రిస్'. దీనిని పండ్లు కోసం పెంచుతారు. వీటి నుండి కల్లు తీస్తారు. ఇది భారత ఉపఖండానికి చెందిన పండ్ల చెట్టు.

ఈత పళ్ళు ఖర్జూరం పండ్ల లా కనిపించినా వాటి మధ్య చాలా తేడా ఉంటుంది . వీటిని జీర్ణము చేసుకోవడము కష్టము . ఎక్కువ తింటే కడుపు నొప్పి వస్తుంది. వీటి పిక్కలు పెద్దవిగా ఉండి తినే పదార్ధము తక్కువ ఉంటుంది .

  • ఉపయోగాలు

* ఈతచెట్టు నుండి రుచికరమైన ఈతపండ్లు లభిస్తాయి.
* ఈతచెట్టు కాండంకు కోతపెట్టి ఈత కల్లు సేకరిస్తారు.
* ఈ పండ్ల నుండి తాండ్ర తయారుచేస్తారు. బెంగాల్ లో వీటినుండి బెల్లం తయారౌతుంది.



  • పోషక విలువలు, ప్రతి 100 గ్రాములకు
  • శక్తి ------------------------- 980 kJ
  • పిండిపదార్థాలు--------------- 65 g
  • - చక్కెరలు ------------------53 g
  • - పీచుపదార్థాలు --------------6 g
  • కొవ్వు పదార్థాలు 0.4 g
  • మాంసకృత్తులు -------------2.5 g
  • నీరు -------------21 g
  • విటమిన్ సి -----------------0.4 mg
  • =====================
Visit my Website - Dr.Seshagirirao...

Wednesday 16 May 2012

వేగంగా బరువు తగ్గించే డ్రింకులు,Easy Drinks Quick Weight Loss



పండ్లు , కాయగూరలు ,గింజలు, పప్పులు , కందమూలాలు ,సుగంధద్రవ్యాలు మానవుడికి ప్రక్రుతి ప్రసాదించిన అపురూపమైన వరము .ఆయా సీజన్లలో పండే పండ్లను ఆరగించడం మనకు తరతరాలు గా తెలుసును . అన్నం తో కూడా ప్రకృతిసిద్ధమైన పండ్లు , కూరగాయలు ఇతర త్రునధన్యాలను ఆహారం గా ఆహారముగా తీసుకుని జీవించినట్లయితే శరీరానికి కావససిన అన్నిరకాల పోషకాలు లభిస్తాయి ... ఇదే అసలు ఉత్తమమైన జీవన విధానమని పకృతి వైద్యుల నమ్మకం.....ఆహారం జీవం ఉన్న ప్రతి జీవికి అత్యవసరమైనది. పిండిపదార్ధాలు, మాంసకృత్తులు, కొవ్వుపదార్ధాలు, ఖనిజలవణాలు, పీచుపదార్ధాలు, రోగనిరోధక శక్తికి కావలసిన విటమిన్లు మరియు శరీర పోషణకు రక్షణకు కావలసిన పదార్ధాలను కలిగిన పదార్దాలను ఆహారంగా పేర్కొనవచ్చు. ఇవి కాక శరీరానికి నూతన ఉత్సాహాన్నిచ్చే కాఫీ, టీ లాంటి వాటిని కూడా ఆహారపదార్ధాల కోవలోకి వస్తాయి. ఆహారం ఘన, ద్రవ రూపాలలో లభ్యం అవుతుంది.


  • మీ డైట్ ప్రణాళిక, జిమ్ వర్కవుట్లూ ఆచరిస్తూనే, మీ శరీరంలోని అధిక బరువును తగ్గించటానికి గాను నాలుగే నాలుగు పానీయాలను సిఫార్సు చేస్తున్నాం. వీటి తయారు కష్టమూ కాదు. తాగటం అంతకంటే కష్టం కాదు. అవేమిటో పరిశీలించి ఆచరించండి. అద్భుతమైన ఫలితాలను వేగవంతంగా పొందండి. ఇంటిలోనే తయారు చేసుకోగల ఈ పానీయాలతో మీ పొట్ట కొవ్వును అతి తేలికగా కరిగించి శారీరక లావణ్యాన్ని పొందండి.

  • నిమ్మరసం -
నిమ్మ, ఆరెంజ్, బెర్రీ మొదలైన రసాలు, ద్రాక్ష రసం కొవ్వును బాగా కరిగిస్తాయి. వీటిలో పీచు అధికం. అనేక పోషకాలు, కార్బోహైడ్రేట్లు వుండి కేలరీలు, కొవ్వు అతి తక్కువగా వుంటాయి. కనుక ప్రతిరోజూ ఒక గ్లాసు క్రమం తప్పకుండా తాగండి. ఈ రసాలలో షుగర్ కలపకండితీపికోసము జీరో పౌడర్ (సుగర్ ఫ్రీ) కలపంది .. నిమ్మరసం అయితే వేడి నీటితో కలిపి కొద్దిపాటి సాల్ట్ వేసి తాగవచ్చు.

  • కాఫీ
- మితంగా తాగితే ఇది బరువు తగ్గేటందుకు అమోఘమైన ఔషధం. కేఫైన్ పొందాలంటే, కోకో, కాఫీ, కోలా, టీ మొదలైవి తీసుకోవాలి. మితిమీరితే శరీరంలో డీహైడ్రేషన్ కలిగిస్తుంది. కాఫీలో షుగర్ కలపకండి.తీపికోసము జీరో పౌడర్ (సుగర్ ఫ్రీ) కలపంది .

  • యాపిల్ సైడర్ వినేగర్
- దీనిని చల్లని నీరు, తేనెతో కలిపి భోజనం ముందు తాగండి. ఆకలిని నియంత్రించి తక్కువ ఆహారం తీసుకునేలా చేస్తుంది. జీర్ణక్రియ పెంచి శరీర మలినాలు తొలగిస్తుంది. బరువు తగ్గటానికి తోడ్పడుతుంది.

  • గ్రీన్ టీ

- శరీరానికి, చర్మానికి, జుట్టుకు ఎంతో ఆరోగ్యాన్నిస్తుంది. దీనిని ఇంటిలోనే తయారు చేసుకోవచ్చు. పొట్టకొవ్వు అతి తేలికగా మాయం అవుతుంది. గ్రీన్ టీ ఆకులు నీటిలో నానపెట్టండి. దానికి కొద్ది చుక్కలు నిమ్మరసం వేయండి. రాత్రంతా అలానే వుంచి ఉదయమే ఖాళీ కడుపుతో తాగండి. గ్రీన్ టీ మీలోని మెటబాలిజం పెంచుతుంది. రోజంతా చురుకుగా వుండేట్లు చేస్తుంది. ఆకలిని కనీసం రెండు నుండి 4 గంటలు అదుపు చేస్తుంది.


  • Courtesy with : telugu.boldsky.com/health/diet-fitness/


  • ==========================
Visit my Website - Dr.Seshagirirao...

కష్టంగా జీర్ణం అయ్యే కొన్ని ఆహారాలు,Some foods are hard to digest.


  • food & food items


పండ్లు , కాయగూరలు ,గింజలు, పప్పులు , కందమూలాలు ,సుగంధద్రవ్యాలు మానవుడికి ప్రక్రుతి ప్రసాదించిన అపురూపమైన వరము .ఆయా సీజన్లలో పండే పండ్లను ఆరగించడం మనకు తరతరాలు గా తెలుసును . అన్నం తో కూడా ప్రకృతిసిద్ధమైన పండ్లు , కూరగాయలు ఇతర త్రునధన్యాలను ఆహారం గా ఆహారముగా తీసుకుని జీవించినట్లయితే శరీరానికి కావససిన అన్నిరకాల పోషకాలు లభిస్తాయి ... ఇదే అసలు ఉత్తమమైన జీవన విధానమని పకృతి వైద్యుల నమ్మకం.....ఆహారం జీవం ఉన్న ప్రతి జీవికి అత్యవసరమైనది. పిండిపదార్ధాలు, మాంసకృత్తులు, కొవ్వుపదార్ధాలు, ఖనిజలవణాలు, పీచుపదార్ధాలు, రోగనిరోధక శక్తికి కావలసిన విటమిన్లు మరియు శరీర పోషణకు రక్షణకు కావలసిన పదార్ధాలను కలిగిన పదార్దాలను ఆహారంగా పేర్కొనవచ్చు. ఇవి కాక శరీరానికి నూతన ఉత్సాహాన్నిచ్చే కాఫీ, టీ లాంటి వాటిని కూడా ఆహారపదార్ధాల కోవలోకి వస్తాయి. ఆహారం ఘన, ద్రవ రూపాలలో లభ్యం అవుతుంది.

  • తినే ఆహారాలు మెల్లగా లేదా కష్టంగా జీర్ణం అయ్యేవిగా వుంటే అవి మీలో గుండె మంటలను కలిగిస్తాయి. అలాగని అన్ని ఆహారాలు మంటను కలిగించవు, బరువుగాను వుండవు. అయితే, చిన్నపాటి చాక్లెట్ లేదా ఐస్ క్రీమ్ వంటివి కూడా అజీర్ణం కలిగించవచ్చు. చాలాసార్లు, మనం అసలు అజీర్ణం ఎలా కలుగుతోందో చెప్పలేము. కొన్నిసార్లు ఆహారాలు తినవలసిన విధంగా తినకపోయినా అజీర్ణం ఏర్పడుతుంది. కొన్ని ఆహారాలు కష్టంగా జీర్ణం అవటం, గుండె మంటను కలిగించటం చేస్తాయి. వాటిని పరిశీలిద్దాం.


1. బాగా వేయించిన ఆహారాలు :
  • - బాగా వేయించిన వేపుడు పదార్ధాలు అజీర్ణం కలిగిస్తాయి. నూనెలో వేయించిన ఆహారాలు చాలా కష్టంగా జీర్ణం అవుతాయి. ఎందుకంటే వాటిలో అధిక నూనె వుంటుంది. అంతేకాక బయట తినే బజ్జీల వంటివి వేయించేటపుడు, వారు అనారోగ్య నూనె లేదా బాగా మరిగిన నూనె అనేక మార్లు ఉపయోగించటం చేస్తారు. అది మీ జీర్ణక్రియకు హాని కలిగిస్తుంది.

2. మసాలా ఆహారాలు :
- పచ్చి మిరపకాయలు, మిరియాల వంటివాటిలో యాంటీ ఆక్సిడెంట్లు అధికం. కనుక ఆరోగ్యానికి మంచివే. కాని అవి కూడా అజీర్ణం కలిగిస్తాయి. నాలిక మండించే ఈ ఆహారాలు మీ ఆహార గొట్టాన్ని కూడా మండించి గుండెమంట కలిగిస్తాయి.

  • 3. పాలలోని షుగర్ పడకపోవటం :
  • - లాక్టోస్ అనేది పాలలో వుండే ఒక రకమైన షుగర్. ఇది పాల ఉత్పత్తి. సాధారణంగా 70 శాతం పెద్ద వారికి ఎంతో కొంత లాక్టోస్ సరిపడకపోవటం వుంటుంది లేదా లాక్టోస్ కల ఆహారాలు జీర్ణించుకోలేరు. ఎందుకంటే లాక్టోస్ జీర్ణం చేయగల ఎంజైములు వారిలో లేకపోవటం లేదా అతి తక్కువగా ఉత్పత్తి అవటం జరుగుతుంది.

4. ఆకు కూరలు -

కేబేజి, బ్రక్కోలి, ముల్లంగి వంటివి బరువైన ఆహారాలు. ఎందుకంటే, అవి త్వరగా జీర్నం కావు. వీటిలో ఆలిగో సచ్చరైడ్స్ అనే పదార్ధం వుంటుంది. ఈ రకమైన ఆహారాలు జీర్ణం చేయటానికి అవసరమైన లాక్టేస్ మానవులలో వుండదు. అందుకని, ఈ ఆహారాలు తింటే అవి జీర్ణం కాకుండానే చిన్న పేగులలోకి వెళ్ళిపోతాయి. అక్కడ గ్యాస్ తయారై అజీర్ణ ఆహారంతో బాక్టీరియా బలపడుతుంది.

  • 5. గింజ ధాన్యాలు
  • - పప్పులు, రాజ్మా, కిడ్నీ బీన్స్, గింజలు వంటివి పొట్టకు బరువే. వీటిలో కూడా ఆలిగో సచ్చరైడ్స్ అనే పదార్ధం వుంటుంది.

6. సిట్రస్ పండ్ల రసాలు -
సిట్రస్ పండ్ల రసాలు కూడా అజీర్ణం కలిగిస్తాయి. ఆహార గొట్టం కణాలను ఇబ్బందిపెట్టి ఆహారం వెలుపలికి వచ్చేలా చేస్తాయి. ప్రత్యేకించి వీటిని సరైన సమయంలోనే తీసుకోవాలి. ఉదాహరణకు ఖాళీ పొట్టతో సిట్రస్ పండ్లు లేదా రసాలు తీసుకోరాదు.

  • 7. విత్తన ఆహారాలు -
  • విత్తనాల ఆహారాలు ఏవైనప్పటికి పొట్టకు బరువే. విత్తనాలకంటే కూడా ముందుగానే ఆహారం జీర్నం అయిపోతుంది. టమాటా, వంకాయ, పచ్చిమిరప వంటివాటి గింజలు లోపల జీర్ణం కాకుండానే పేగుల ద్వారా ప్రయాణించి మలంలో బయటకు విసర్జించబడటం చూస్తూనే వుంటాము.

8.రాగి అంబలి / రాగి రొట్టెలు
- ఇందులో కాల్సియం , ఐరన్‌ .. ఎక్కువగా ఉండడము చేత కడుపులో బరువుగా అనిపిస్తుంది . ఆలస్యముగా జీర్ణమవుతుంది . ఇది మధుమేహ వ్యాధి గ్రస్తులకు చాలా మంచిది .

  • ఈ ఆహారాలు కష్టంగా జీర్ణం అవుతాయి. కాని అవి తినటం మానరాదు. ఎందుకంటే మీ ఆరోగ్యానికి అవికూడా అవసరమే. అయితే, గుండెకు మంట కలుగకనుండా వాటిని తక్కువ మొత్తాలలో తినండి
  • ==============================
Visit my Website - Dr.Seshagirirao...

Sunday 13 May 2012

Fat Burning Foods for Weight reduction,శరీరము బరువు తగ్గాలంటే ఫ్యాట్ లెస్ ఆహరం తినాల్సిందే









  •  


పండ్లు , కాయగూరలు ,గింజలు, పప్పులు , కందమూలాలు ,సుగంధద్రవ్యాలు మానవుడికి ప్రక్రుతి ప్రసాదించిన అపురూపమైన వరము .ఆయా సీజన్లలో పండే పండ్లను ఆరగించడం మనకు తరతరాలు గా తెలుసును . అన్నం తో కూడా ప్రకృతిసిద్ధమైన పండ్లు , కూరగాయలు ఇతర త్రునధన్యాలను ఆహారం గా ఆహారముగా తీసుకుని జీవించినట్లయితే శరీరానికి కావససిన అన్నిరకాల పోషకాలు లభిస్తాయి ... ఇదే అసలు ఉత్తమమైన జీవన విధానమని పకృతి వైద్యుల నమ్మకం.....ఆహారం జీవం ఉన్న ప్రతి జీవికి అత్యవసరమైనది. పిండిపదార్ధాలు, మాంసకృత్తులు, కొవ్వుపదార్ధాలు, ఖనిజలవణాలు, పీచుపదార్ధాలు, రోగనిరోధక శక్తికి కావలసిన విటమిన్లు మరియు శరీర పోషణకు రక్షణకు కావలసిన పదార్ధాలను కలిగిన పదార్దాలను ఆహారంగా పేర్కొనవచ్చు. ఇవి కాక శరీరానికి నూతన ఉత్సాహాన్నిచ్చే కాఫీ, టీ లాంటి వాటిని కూడా ఆహారపదార్ధాల కోవలోకి వస్తాయి. ఆహారం ఘన, ద్రవ రూపాలలో లభ్యం అవుతుంది.


వ్యాయామంతోపాటు..పదార్థాల ఎంపికలోనూ కొన్ని మార్పులు చేసుకోవాలి. అప్పుడే శరీరంలో పేరుకొన్న అధిక కొవ్వు తగ్గుతుంది. అదనంగా ఆరోగ్యానికి మేలు జరుగుతుంది. చూడచక్కని రూపం మన సొంతమవుతుంది.

 



 భోజనం చేసేప్పుడు పావువంతు కడుపును ఖాళీగా ఉంచుకోవాలని పెద్దలు చెబుతుంటారు. కడుపునిండా మెక్కితే ఆహారం సరిగా జీర్ణం కాకపోవటంతో పాటు ఒంట్లో కొవ్వు మోతాదూ పెరుగుతుందనేది అందులోని పరమార్థం. మరి అలా కొవ్వు పెరగకుండా చూసుకోవాలంటే ఆహారంలో వీటినీ భాగంగా చేసుకొని చూడండి.
 


తేనె:





పంచదారతో పోలిస్తే తేనెలో కెలొరీలు అధికంగా ఉన్నా..వేడినీటితో కలిపి తీసుకోవడం వల్ల శరీరంలో పేరుకొన్న కొవ్వు కరుగుతుంది. క్రమంగా బరువూ తగ్గుతాం. అలాగే తేనె, నిమ్మరసం, దాల్చిన చెక్క...కలిపి తీసుకోవడం వల్ల శరీర బరువులో ఎంతో తేడా ఉంటుంది. ఊబకాయం ఉన్నవారు వంటకాల్లో బెల్లం, పంచదారకు బదులు తేనెను వాడితే మంచిది. అందుకు గ్లాసు గోరువెచ్చటి నీటిలో చెంచా తేనె, కలిపి పరకడుపున తీసుకుంటే ఎంతో మార్పు ఉంటుంది.

 



గుడ్లు:





శరీరానికి అవసరైన పోషకాలే కాదు..ఇందులోని విటమిన్ బి12’ కొవ్వు కారకాలతో పోరాడుతుంది. ఫలితంగా కొవ్వు కరిగిస్తుంది.



 గ్రీన్ టీ:





అధికబరువు తగ్గేందుకు ఆహారాన్ని జాగ్రత్తగా ఎంచుకునేవారు గ్రీన్ టీ తప్పనిసరిగా తాగాలి. ఇందులో యాంటీఆక్సిడెంట్లు సమృద్దిగా ఉంటాయి. శరీరంలో అధికకెలోరీలను తగ్గించడమే కాదు. దృడమైన ఆరోగ్యాన్నీ అందిస్తుంది ఈ గ్రీన్ టీ.

మొలకెత్తిన పెసలు: వీటిలో ఎ, బి, సి, ఇ, విటమిన్లు ఖనిజ లవణాలు, క్యాల్షియం, ఇనుము, పొటాషియం..మాంసకృత్తులు, పీచు..వంటివెన్నో పోషకాలు లభిస్తాయి. కొవ్వును కరిగించడంతోపాటు..శరీర బరువును అదుపులో ఉంచుతాయి. అలాగే చాలా త్వరగా జీర్ణమవుతాయి కూడా. పైగా వీటిలో కొవ్వుశాతం చాలా తక్కువగా ఉంటుంది. కొలెస్ట్రాల్ శాతం అదుపులో ఉంటుంది. అందుకే వీటిని రోజూ తీసుకోవాలి.



 క్యాబేజీ:





ఉడికించిన క్యాబేజీలో కొవ్వుశాతం చాలా తక్కువగా ఉంటుంది. తరచూ క్యాబేజీ తినడం వల్ల శరీరంలో ఫ్రీరాడికల్స్ చేరవు. కొన్ని రకాల క్యాన్సర్ల ప్రమాదమూ తగ్గుతుంది. కండరాల దృఢత్వమూ పొంతమవుతుంది. రక్తాన్నీ శుద్దిచేయడం..కొలెస్ట్రాల్ ను అదుపులో ఉంచడం..ఇలా శరీరానికి ఎన్నో విధాల మేలు చేస్తుందీ క్యాబేజీ.



 క్యారెట్:






క్యారెట్ శరీరంలోని చెడుకొవ్వునిల్వలను తగ్గించడంలో కీలకపాత్ర పోషిస్తుంది. కొలెస్ట్రాల్ శాతం అదుపులో ఉంచుతుంది. పీచుపదార్థాన్ని అందించే ఈ కాయగూరను వారంలో ఎక్కువసార్తు తీసుకోవాలి. సాధ్యమైనంత వరకు నేరుగా తినే ప్రయత్నం చేయాలి.

 



కరివేపాకు:






కొవ్వు శాతాన్ని తగ్గించడమే కాదు..అదనంగా పేరుకోకుండా చేసే శక్తి కరివేపాకు రెమ్మల సొంతం. శరీరంలోని వ్యర్థాలనూ బయటకు పంపివేస్తుంది. చెడు కొలెస్ట్రాల్ నూ కరిగిస్తుంది. అందుకే ఊబకాయంతో బాధపడేవారు రోజు కరివేపాకును ఏదో ఒక రూపంలో తప్పనిసరిగా తీసుకోవాలి.

 



పసుపు:






వంటకాల్లో ప్రతి నిత్యం వేసే చిటికెడు పసుపుతో కలిగే మేలు అంతా ఇంతా కాదు. యాంటీబ్యాక్టీరియల్ సుగుణాలున్న పసుపుతో శరీరంలో నిల్వ ఉన్న వ్యర్థ కొవ్వు కరుగుతుంది. అదనంగా కొన్ని రకాల క్యాన్సర్ల తీవ్రతను తగ్గించే గుణం పసుపుకే సొంతం. కాలేయంలో చేరిన వ్యర్దపదార్థాలను వెలుపలికి పంపించివేస్తుంది. రక్తనాళాల్లో రక్తప్రసరణ వేగవంతం అయ్యేందుకు తోడ్పడుతుంది. దాంతో గుండె ఆరోగ్యానికీ మేలు జరుగుతుంది.



 వెన్న తీసిన పాలు: 




ఇందులో ప్రోటీన్‌, క్యాల్షియం దండిగా ఉంటాయి. వెన్న తీసినప్పటికీ ఈ పాలు తాగినప్పుడు కడుపు నిండిన భావన కలిగిస్తాయి. ఆలస్యంగా జీర్ణమవుతాయి. ఇవి బరువు తగ్గటాన్ని ముఖ్యంగా నడుం వద్ద కొవ్వు పేరుకుపోవటాన్ని తగ్గిస్తాయి.



పుచ్చపండు: 




ఇందులో నీరు అధికంగా ఉంటుంది. కొద్దిగా తిన్నా కడుపు నిండినట్టు అనిపిస్తుంది. కేలరీలూ తక్కువే. పైగా ఇందులో లైకోపేన్‌ అనే యాంటీఆక్సిడెంట్‌ దండిగా ఉంటుంది. ఏ, సి విటమిన్లూ లభిస్తాయి.



చిక్కుళ్లు: 




బీన్స్‌, గోరుచిక్కుడు, చిక్కుడు వంటి కూరగాయల్లో ప్రోటీన్లు, పీచు దండిగా ఉంటాయి. తక్కువ కేలరీలతోనే చాలాసేపు కడుపు నిండిన భావన కలిగిస్తాయి.



గింజ పప్పులు: 




బాదంపప్పు, జీడిపప్పు వంటి గింజపప్పులు (నట్స్‌) త్వరగా ఆకలి వేయకుండా చూస్తాయి. వీటిల్లో ప్రోటీన్‌, పీచు, గుండెకు మేలు చేసే కొవ్వులు ఉంటాయి. అయితే వీటిని పరిమితంగానే తినాలని గుర్తుంచుకోవాలి. అప్పుడే ఇవి బరువు తగ్గటానికి, కొలెస్ట్రాల్‌ స్థాయులు అదుపులో ఉండేందుకు దోహదం చేస్తాయి.



పీర్స్‌, యాపిల్స్‌: 


  •  


 













వీటిని పొట్టుతీయకుండా తింటే పీచు మరింత ఎక్కువగా లభిస్తుంది. త్వరగా కడుపునిండిన భావన కలిగిస్తాయి. చాలాసేపు ఆకలి వేయకుండా చూస్తాయి. నమిలి తినటం వల్ల కేలరీలూ ఖర్చవుతాయి.






బెర్రీలు: 


  •  




















స్ట్రాబెర్రీ, బ్లూబెర్రీ వంటి పండ్లలోనూ పీచు, నీరు అధికంగా ఉంటాయి. పైగా ఇవి తీయగా ఉండటం వల్ల తిన్న తృప్తీ కలుగుతుంది. బెర్రీల్లో యాంటీఆక్సిడెంట్లూ దండిగానే ఉంటాయి


  • =======================


Visit my Website - Dr.Seshagirirao...

Friday 11 May 2012

పుల్లటి పండ్లు పక్షవాతం నుంచి కాపాడు, Sour(citrus)Fruits protect from paralysis



పండ్లు , కాయగూరలు ,గింజలు, పప్పులు , కందమూలాలు ,సుగంధద్రవ్యాలు మానవుడికి ప్రక్రుతి ప్రసాదించిన అపురూపమైన వరము .ఆయా సీజన్లలో పండే పండ్లను ఆరగించడం మనకు తరతరాలు గా తెలుసును . అన్నం తో కూడా ప్రకృతిసిద్ధమైన పండ్లు , కూరగాయలు ఇతర త్రునధన్యాలను ఆహారం గా ఆహారముగా తీసుకుని జీవించినట్లయితే శరీరానికి కావససిన అన్నిరకాల పోషకాలు లభిస్తాయి ... ఇదే అసలు ఉత్తమమైన జీవన విధానమని పకృతి వైద్యుల నమ్మకం.....ఆహారం జీవం ఉన్న ప్రతి జీవికి అత్యవసరమైనది. పిండిపదార్ధాలు, మాంసకృత్తులు, కొవ్వుపదార్ధాలు, ఖనిజలవణాలు, పీచుపదార్ధాలు, రోగనిరోధక శక్తికి కావలసిన విటమిన్లు మరియు శరీర పోషణకు రక్షణకు కావలసిన పదార్ధాలను కలిగిన పదార్దాలను ఆహారంగా పేర్కొనవచ్చు. ఇవి కాక శరీరానికి నూతన ఉత్సాహాన్నిచ్చే కాఫీ, టీ లాంటి వాటిని కూడా ఆహారపదార్ధాల కోవలోకి వస్తాయి. ఆహారం ఘన, ద్రవ రూపాలలో లభ్యం అవుతుంది.


పండ్లు, కూరగాయలు ఎక్కువగా తీసుకోవటం ఆరోగ్యానికి అన్నివిధాలా మంచిదన్నది తెలిసిందే. అయితే పండ్లు.. ముఖ్యంగా నారింజ వంటి పుల్లటి పండ్లు చేసే మేలు గురించి కొత్త సంగతి బయటపడింది. వీటిని ఎక్కువగా తీసుకుంటున్నవారికి పక్షవాతం ముప్పు తక్కువగా ఉంటున్నట్టు తాజా అధ్యయనంలో వెల్లడైంది. నిజానికి పండ్లు, కూరగాయలు ఎక్కువగా తినేవారికి గుండెజబ్బులు, పక్షవాతం ముప్పు తక్కువన్నది పాత విషయమే. అయితే దీనికి కారణమవుతున్నవేంటో అనేది కచ్చితంగా బయటపడలేదు. ఇంగ్లాడులోని ఈస్ట్‌ యాంజ్లియా విశ్వవిద్యాలయం పరిశోధకులు దీనిపైనే దృష్టిపెట్టి అధ్యయనం చేశారు. పుల్లటి పండ్లల్లో రకరకాల ఫ్లావనాయిడ్లు ఉంటాయి. ఈ ఫ్లావనాయిడ్లలో ఒకరకమైన ఫ్లావనోన్లు.. రక్తనాళాల్లో రక్తం గడ్డకట్టటం మూలంగా వచ్చే పక్షవాతం ముప్పును తగ్గిస్తున్నట్టు పరిశోధకులు గుర్తించారు. ఇవి రక్తనాళాల పనితీరును మెరుగుపరుస్తాయి. వాపును తగ్గిస్తాయి. అందువల్లే పక్షవాతం ముప్పును తగ్గించగలుగుతున్నాయని చెబుతున్నారు. అయితే వీటి ప్రయోజనాలను పూర్తిగా పొందాలంటే పండ్ల రసాన్ని తాగటం కన్నా నేరుగా పండ్లనే తినటం మంచిదని సూచిస్తున్నారు. మామూలు బరువుగల నారింజ పండులో సుమారు 50 మిల్లీగ్రాముల ఫ్లావనోన్లు ఉంటాయని అధ్యయనానికి నేతృత్వం వహించిన ఏడిన్‌ క్యాసిడీ అంటున్నారు. పండ్లు, కూరగాయలు ఎక్కువగా తినటంతో పాటు పొగ మానెయ్యటం, వ్యాయామం చెయ్యటమూ ముఖ్యమేనని వివరించారు. మొత్తమ్మీద పండ్లు, కూరగాయలు ఎక్కువగా తినటం ఆరోగ్యానికి ఎంతో అవసరమని ఈ అధ్యయనం మరోసారి రుజువు చేసింది.
  • ===================
Visit my Website - Dr.Seshagirirao...