Pages

Labels

Popular Posts

Wednesday 30 November 2011

Tri Colored food good for health, త్రివర్ణ పదార్ధాలు ఆరోగ్యానికి మంచిది




పండ్లు , కాయగూరలు ,గింజలు, పప్పులు , కందమూలాలు ,సుగంధద్రవ్యాలు మానవుడికి ప్రక్రుతి ప్రసాదించిన అపురూపమైన వరము .ఆయా సీజన్లలో పండే పండ్లను ఆరగించడం మనకు తరతరాలు గా తెలుసును . అన్నం తో కూడా ప్రకృతిసిద్ధమైన పండ్లు , కూరగాయలు ఇతర త్రునధన్యాలను ఆహారం గా ఆహారముగా తీసుకుని జీవించినట్లయితే శరీరానికి కావససిన అన్నిరకాల పోషకాలు లభిస్తాయి ... ఇదే అసలు ఉత్తమమైన జీవన విధానమని పకృతి వైద్యుల నమ్మకం.....ఆహారం జీవం ఉన్న ప్రతి జీవికి అత్యవసరమైనది. పిండిపదార్ధాలు, మాంసకృత్తులు, కొవ్వుపదార్ధాలు, ఖనిజలవణాలు, పీచుపదార్ధాలు, రోగనిరోధక శక్తికి కావలసిన విటమిన్లు మరియు శరీర పోషణకు రక్షణకు కావలసిన పదార్ధాలను కలిగిన పదార్దాలను ఆహారంగా పేర్కొనవచ్చు. ఇవి కాక శరీరానికి నూతన ఉత్సాహాన్నిచ్చే కాఫీ, టీ లాంటి వాటిని కూడా ఆహారపదార్ధాల కోవలోకి వస్తాయి. ఆహారం ఘన, ద్రవ రూపాలలో లభ్యం అవుతుంది.



  • మూడురంగుల జెండా చూసినప్పుడల్ల ముచ్చటగా ఉంటుంది . అలాగే ఆ మూడు రంగుల పదార్ధాలు తినడము వల్ల మంకెంతో లాభము ఒనగూడుతుంది . ఏమిటా లింక్ అని నవ్వుకున్నా .... నారింజ , తెలుపు , ఆకుపచ్చ రంగుల పదార్ధాలు మన ఆరోగ్యానికి మంచిది .  

  • నారింజ రంగు : ఈ రంగులో ఉండే పండ్లు , కూరగాయల్లో బీటా-కెరటిన్‌ , విటమిన్‌ "సి" అత్యధికంగా లభిస్తాయి. వయసు రీత్యా లోపించే దృష్టి మెరుగవడానికి సహకరించే పోషకాలు వీటిలో ఉంటాయి. క్యాన్సర్ ను అడ్డుకోగలవు , కొలెస్టరాల్ , రక్తపోటు లను తగ్గించి కొలాజెన్‌ ఏర్పడడాన్ని మెరుగుపరుస్తాయి. ఆరోగ్యవంతమైన జాయింట్స్ కు దోహదపడతాయి.  



  • బొప్పాయి : ఫోలిక్ యాసిడ్ సమృద్ధిగా ఉంటుంది . ఇతర ప్రోటీన్లు , జీర్ణసంబంధిత ఎంజైములు, విటమిన్‌ " ఎ" , " ఇ " , లు పొటాషియం లభిస్తాయి. సహజసిద్ధమైన లాక్జేటివ్స్ కలిగి ఉంటాయి. 

  • కమలా, బత్తాయి :  వీటిలో విట్మిన్‌ " సి " సాంద్రత ఎక్కువ . యాంటి ఆక్షిడెంట్స ఉంటాయి. రోగనిరోధక వ్యవస్థ ను బలోపేతము చేస్తాయి. పీచు పదార్ధము ఎక్కువగా ఉంటుంది .

  • క్యారెట్లు : కంటి దృష్టికి మంచివి . విటమిన్‌ " ఎ, కె , సి , లు .. పొటాషియం , ఫైబర్ , మెగ్నీషియం , ఫాస్పరస్ , ఇతర పోషకాలు మెందుగా ఉంటాయి . 



  • తెలుపు రంగు : 

రోగనిరోధక వ్యవస్థను ఆందించే పోషకాలు తెల్లని పదార్ధాలలో ఉంటాయి . కొలెస్టరాల్ , రక్తపోతుస్థాయి సరిగా ఉంచుకునేందుకు సహకరిస్తాయి.తెలుపు రంగు గల కొన్ని పదార్ధాలు :

  • ఉల్లి , వెల్లుల్లి : సల్ఫైడ్ , ఎల్లిసిన్‌ అనే ఫైటోకెమికల్స్  అధికము గా ఉంటాయి. ట్యూమర్లకు వ్యతిరేకముగ్గా ఇవి పోరాడతాయి. ఇన్‌ఫ్లమేషన్‌ తగ్గించి , రక్తములో కొవ్వు , కొలెస్టరాల్ లను , బ్లడ్ సుగర్ ను తగ్గిస్తాయి. యాంటీ బ్యాక్టీరియల్ , యాంటి ఫంగల్ , యాంటి వైరల్ లక్షణాలు కలిగిఉంటాయి. ఇది రోగనిరోధక శక్తిని సమర్ధవంతం గా పెంచుతాయి. జలుబు పై పోరాడే మంచి ఆహారము . 

  • ముల్లంగి : ఎక్కువగా పీచు పదార్ధము , తేమ , సహజమైన లాక్జేటివ్స్ ఉన్నాయి . దీనిలోని అధిక తేమ చర్మానికి , కళ్ళకు ఎంతో మేలుచేస్తుంది . 

ఆకుపచ్చ :  ఈ రంగు పండ్లు , కూరలు ఆరోగ్యానికి మేలు చేస్తాయి . క్లోరొఫిల్ , పీచుపదార్ధము , ఫోలిక్ యాసిడ్ , కాల్సియం , విటమిన్‌ " సి " , బీటాకెరటిన్స్ లభిస్తాయి . ఈ రంగు పదార్ధాలలోని పోషకాలు క్యాన్సర్ రిస్కుల్ని తగ్గిస్తాయి . రక్తపోటు , క్లెస్టరల్ స్థాయిలను తగ్గిస్తాయి. జీర్ణక్రియకు దోహదపడి , కంటి ఆరోగ్యానికి , దృష్టికి సహకరిస్తాయి . ఫ్రీ రాడికల్స్ ను తగ్గించి రోగనిరోధ వ్యవస్థను మెరుగుపరుస్తాయి .

  • పాలకూర : ఐరన్‌ , ఫొలిక్ యాసిడ్ ,అధికం గా ఉంటాయి . పుట్టుకతో వచ్చిన లోపాల్ని  సరిచేయడానికి సహరిస్తుంది . దీనిలో అత్యధికంగా లభించే క్యాల్సియం , పీచు  జీర్ణక్రియకు , చర్మానికి మేలు కలిగిస్తాయి. 

  • బ్రకోలి : క్యాన్సర్ వ్యతిరేకగుణాలు  ఎక్కువ . యాంటీ ఆక్షిడెంట్స్ , ఖనిజాలు , ఏ, సి, విటమిన్లు  లభిస్తాయి. 

  • కివి : విటమిన్‌ "సి " ఎక్కువగా ఉంటుంది . పొటాషియం లభిస్తుంది . ఇది కంటి దృష్టి బ్లహీనతలనుండి కాపాడుతుంది . క్యాలరీలు తక్కువగా ఉంటాయి . మాయిశ్చర్ అధికముగా ఉంటుంది . చర్మానికి ఎటువంటి హాని జరుగుకుండా కాపాడుతుంది .





















  • ====================================

Visit my Website - Dr.Seshagirirao...

కుంకుడుకాయలు,Soap nuts



పండ్లు , కాయగూరలు ,గింజలు, పప్పులు , కందమూలాలు ,సుగంధద్రవ్యాలు మానవుడికి ప్రక్రుతి ప్రసాదించిన అపురూపమైన వరము .ఆయా సీజన్లలో పండే పండ్లను ఆరగించడం మనకు తరతరాలు గా తెలుసును . అన్నం తో కూడా ప్రకృతిసిద్ధమైన పండ్లు , కూరగాయలు ఇతర త్రునధన్యాలను ఆహారం గా ఆహారముగా తీసుకుని జీవించినట్లయితే శరీరానికి కావససిన అన్నిరకాల పోషకాలు లభిస్తాయి ... ఇదే అసలు ఉత్తమమైన జీవన విధానమని పకృతి వైద్యుల నమ్మకం.....ఆహారం జీవం ఉన్న ప్రతి జీవికి అత్యవసరమైనది. పిండిపదార్ధాలు, మాంసకృత్తులు, కొవ్వుపదార్ధాలు, ఖనిజలవణాలు, పీచుపదార్ధాలు, రోగనిరోధక శక్తికి కావలసిన విటమిన్లు మరియు శరీర పోషణకు రక్షణకు కావలసిన పదార్ధాలను కలిగిన పదార్దాలను ఆహారంగా పేర్కొనవచ్చు. ఇవి కాక శరీరానికి నూతన ఉత్సాహాన్నిచ్చే కాఫీ, టీ లాంటి వాటిని కూడా ఆహారపదార్ధాల కోవలోకి వస్తాయి. ఆహారం ఘన, ద్రవ రూపాలలో లభ్యం అవుతుంది.

ఆధునికత పెరిగే కొద్దీ ఆడంబరాలకు పోతూ మంచి ఆరోగ్య విధానాలకు సైతం మనం స్వస్తి చెబుతున్నాం. స్నానం చేసే సమయంలో ఖరీదైన షాంపూలు, సబ్బులను వాడకపోతే పరువు తక్కువ అని భావిస్తున్నాం. కాలగతిలో కుంకుడుకాయలు, శీకాకాయ, సున్నిపిండి వంటివి మరచిపోతున్నాం. అపార్టుమెంట్లలో ఉండేవారికి కుంకుడుకాయలు నలగగొట్టడానికి ఖాళీ స్థలమే కరువైంది. మార్బుల్, సిరామిక్ గచ్చులు పాడైపోతాయని కుంకుడు కాయల జోలికే వెళ్లడం లేదు. అందమైన సీసాలు, ఆకట్టుకునే ప్యాకింగ్‌ల్లో లభించే షాంపూల వైపే మొగ్గు చూపుతున్నాం. చౌకగా లభించే కుంకుళ్లవైపు కనె్నత్తి చూడం. ఖరీదైన వాటికోసం డబ్బు వదలించుకోవడం కన్నా కుంకుడు,శీకాయలతో కురుల అందాన్ని కాపాడుకోవచ్చన్న వాస్తవాన్ని విస్మరిస్తున్నాం.

ఈరోజుల్లో అభ్యంగన స్నానానికి రకరకాల షాంపూలు, సబ్బులు మార్కెట్లో లభిస్తున్నాయి. వాటిని ఉపయోగించడం చాలా సులభం. పూర్వం తలస్నానానికి కుంకుడుకాయలను ఉపయోగించేవారు. కుంకుడుకాయలను వాడాలంటే కొంత శ్రమ ఉంటుంది. ఆ కాయలను చితక్కొట్టి, వాటిలో గింజలను తీసెయ్యాలి. వాటిని వేడి నీటిలో నానపెట్టి... ఆ రసంతో తలరుద్దుకునేవారు. ఆ తర్వాత శీకాకాయపొడి మార్కెట్లో లభించడం ఆరంభమయింది. ఆ పొడిని నీటిలో తడిపి, ఆ ముద్దతో తలరుద్దుకునేవారు. అయితే, ఈ రోజుల్లో శీకాకాయపొడి కాకుండా కుంకుడుపొడి కూడా లభిస్తోంది. చాలామంది, కుంకుడుకాయలను ఈ రోజుల్లో వాడటం లేదు. నిజానికి తలంటుకి కుంకుడుకాయలను వాడటమే మంచిది. దీనివల్ల వెంట్రుకలు ఆరోగ్యంగా ఉండటమే కాక పేలు, చుండ్రులాంటి సమస్యలు రావు.

వేసవిలో కుంకుడుకాయలను బాగా ఎండబెట్టి పొడిచేసుకుని నిల్వ చేయొచ్చు. దీనివల్ల తలస్నానం చేసిన ప్రతీసారీ కుంకుడుకాయలను కొట్టుకునే శ్రమ తప్పుతుంది. ఎండబెట్టిన కమలాతొక్కలు, నిమ్మతొక్కలు, మందారాకులు, మందారపూలు, మెంతులను పొడిచేసి కుంకుడు పొడిలో కలపవచ్చు. వీటన్నిటినీ కలిపిన పొడితో తలస్నానంచేస్తే వెంట్రుకలు నల్లగా ఉంటాయి. త్వరగా నెరవవు. జుట్టు ఊడదు. బిరుసెక్కకుండా మెత్తగా ఉంటుంది.

కుంకుడుకాయలతో తలస్నానం చేయడం వల్ల కేశాలు జిడ్డులేకుండా శుభ్రపడతాయి. పైగా వీటిలో ఎటువంటి రసాయనికాలు కలువవు. కనుక జుట్టు నల్లగా నిగనిగలాడుతుంది. కుంకుళ్ళు తలస్నానానికి కాక, చర్మ సౌందర్యానికీ, మృదుత్వానికీ, చర్మ ఆరోగ్యానికీ తోడ్పడతాయి. చర్మానికి ఏర్పడే దురదలను ఎలర్జీలను పోగొడ్తాయి. కుంకుడు రసంలో ఖరీదయిన పట్టుచీరలను నానపెట్టి ఉతికితే అవి ఎంతో మెరుస్తాయి. కుంకుడురసంలో బంగారు ఆభరణాలను నానబెట్టి, మెత్తని బ్రష్‌తో మృదువుగా రుద్దితే... అవి శుభ్రపడి ధగధగా మెరుస్తుంటాయి. బాణాలి, పెనంవంటి జిడ్డుపాత్రలను కుంకుడు పిప్పితో శుభ్రపరచవచ్చు. కుంకుడు కాయలే శ్రేష్ఠమని తెలుసుకోవాలి. మన సాంప్రదాయపు అలవాట్లలో కూడా కుంకుడు కాయలను వాడతారు. ప్రసవమయిన బాలింతరాలికి పదకొండో రోజు పురిటి స్నానం చేయించబోయేముందురోజు ఇరుగుపొరుగు వారికి కుంకుడుకాయలు, నూనె, సున్నిపిండి పసుపు, కుంకుమతో పాటు మిఠాయిని పంచుతారు. పూర్వపు రోజులలో పెళ్ళికి వచ్చిన వియ్యాలవారి విడిదిలో కుంకుడుకాయలు, కొబ్బరి నూనె, పౌడరు, అద్దం ఉంచడం సాంప్రదాయం. అందువల్ల, కుంకుడు కాయలకు ఎంతో ప్రాముఖ్యత ఉంది.
  • =========================
Visit my Website - Dr.Seshagirirao...

Thursday 24 November 2011

ఉప్పు , Salt






  • image : courtesy with Visalandhra News paper





  • పండ్లు , కాయగూరలు ,గింజలు, పప్పులు , కందమూలాలు ,సుగంధద్రవ్యాలు మానవుడికి ప్రక్రుతి ప్రసాదించిన అపురూపమైన వరము .ఆయా సీజన్లలో పండే పండ్లను ఆరగించడం మనకు తరతరాలు గా తెలుసును . అన్నం తో కూడా ప్రకృతిసిద్ధమైన పండ్లు , కూరగాయలు ఇతర త్రునధన్యాలను ఆహారం గా ఆహారముగా తీసుకుని జీవించినట్లయితే శరీరానికి కావససిన అన్నిరకాల పోషకాలు లభిస్తాయి ... ఇదే అసలు ఉత్తమమైన జీవన విధానమని పకృతి వైద్యుల నమ్మకం.....ఆహారం జీవం ఉన్న ప్రతి జీవికి అత్యవసరమైనది. పిండిపదార్ధాలు, మాంసకృత్తులు, కొవ్వుపదార్ధాలు, ఖనిజలవణాలు, పీచుపదార్ధాలు, రోగనిరోధక శక్తికి కావలసిన విటమిన్లు మరియు శరీర పోషణకు రక్షణకు కావలసిన పదార్ధాలను కలిగిన పదార్దాలను ఆహారంగా పేర్కొనవచ్చు. ఇవి కాక శరీరానికి నూతన ఉత్సాహాన్నిచ్చే కాఫీ, టీ లాంటి వాటిని కూడా ఆహారపదార్ధాల కోవలోకి వస్తాయి. ఆహారం ఘన, ద్రవ రూపాలలో లభ్యం అవుతుంది.


మన దేశంలో పట్టణ, గ్రామీణ ప్రాంతాల ప్రజల జీవనశైలి మారుతోంది. ప్యాకేజ్డ్‌, ప్రాసెస్‌ చేసిన, రెడిమేడ్‌గా దొరికే ఆహారాలను తీసుకోవడానికి అలవాటు పడుతున్నారు. ఇందులో సోడియం ఎక్కువ మోతాదులో ఉంటుంది. ప్రతీరోజు సగటున ఒక భారతీయుడు 30 గ్రాముల ఉప్పు వాడుతున్నాడు. ఇది జాతీయ పోషకాహార సంస్థ సిఫార్సు కన్నా చాలా ఎక్కువ. రోజుకు ఆరు గ్రాముల కన్నా ఎక్కువ ఉప్పు తీసుకూడదని సంస్థ సూచిస్తోంది. ఉప్పు ఎక్కువ తీసుకుంటే గుండె జబ్బులు, మూత్రపిండాల జబ్బులు, కడుపులో క్యాన్సర్‌, ఆస్టియోపోరొసిస్‌ కలుగుతాయి. సముద్రం నుంచి లభించే ఉప్పులో 40 శాతం సోడియం, 60 శాతం క్లోరైడ్‌ ఉంటాయి. మన శరీరంలో ఉప్పుమీద ఆధారపడని అవయవమంటూ ఏమీలేదంటే అతిశయోక్తి కాదు. మన శరీరంలో జరిగే రసాయనిక చర్యలు అన్నీ కూడా ఉప్పు మీదే ఆధారపడి ఉంటాయి. మనం తీసుకునే ఆహారంలో ఉప్పు ముఖ్యమైన పదార్థం. కండరాలు సంకోచించడంలో, నీటి నిల్వ ఉండటంలో కీలక పాత్ర వహిస్తుంది. అంతేకాక శరీరంలో జీర్ణవ్యవస్థకు అవసరమైన పోషకాలు ఉప్పులో ఉన్నాయి. శరీరంలో సోడియం తక్కువైతే డీహైడ్రేషన్‌ కలుగుతుంది. మరోవైపు సోడియం ఎక్కువ ఉండే ఉప్పు పదార్థాలు తీసుకుంటే అధిక రక్తపోటు ప్రమాదం పెరుగుతుంది. ఇక్కడో సందేహం కలుగుతుంది. మన శరీరానికి ఎంత ఉప్పు అవసరం? జాతీయ పోషకాహారం సంస్థ ప్రకారం ఒక వ్యక్తి రోజుకు ఆరు గ్రాములు మాత్రమే ఉప్పు తీసుకోవాలి. కానీ సగటున ఒక వ్యక్తి రోజులో 8 నుంచి 12 గ్రాముల ఉప్పు తీసుకుంటున్నాడు. ఉప్పు మన శరీరంలో నీటి సమతుల్యతను కాపాడుతుంది. శరీరంలోని ఆమ్ల క్షార నిష్పత్తిని క్రమబద్దీకరించే చర్యలో సోడియం ఒక ముఖ్య పాత్ర వహిస్తుంది. సోడియం శాతం పడిపోతే హార్మోనులు పంపే సంకేతాలు శరీరంలో సరిగా వ్యాప్తికావు. కండరాలు నీరసించి మనిషి తేలికగా అలసటకూ చికాకుకూ లోనవుతాడు.




  • బహు ప్రయోజనకారి


ఉప్పు నాడీ ప్రేరేపణ ప్రసారానికి తోడ్పడుతుంది. సరైన మోతాదులో శరీరంలో ద్రవాలు నిల్వ ఉంచడానికి సహకరిస్తుంది. కండరాలు సంకోచించడానికి, వ్యాకోచించడానికి సహాయపడుతుంది. ఉప్పులో ఉండే అయోడిన్‌ ఎదుగుదలకు తోడ్పడుతుంది. అయోడిన్‌ లోపం వల్ల థైరాయిడ్‌ సమస్యలు వస్తాయి. శరీరంలో సోడియం బాగా తగ్గితే 'లో బ్లడ్‌ ప్రెజర్‌ ' కలుగుతుంది. ఇది రక్తప్రసరణను తగ్గిస్తుంది. సోడియం ఎక్కువైతే శరీరానికి హానికరం. పాల ఉత్పత్తులు, కూరగాయలు, చేపలు, రొయ్యలు, గుడ్లలో సహజసిద్ధంగా సోడియం ఉంటుంది. ఉప్పు ఎక్కువ తీసుకున్నప్పుడు కిడ్నీలో రెనిన్‌ అనే పదార్థం ఉత్పత్తి/విడుదల అవుతుంది. రెనిన్‌ అల్డొస్టిరాన్‌ను సెక్రియేట్‌ చేస్తుంది. ఆల్డోస్టిరాన్‌ రక్తనాళాలను సంకోచింప చేస్తుంది. శరీరంలో సోడియం ఉండేలా చేస్తుంది. శరీరంలో ఎక్కువ సోడియం నిల్వ ఉంటే ద్రవాలు ఎక్కువైతాయి. రక్తనాళాలు సంకోచించినప్పుడు బిపి అధికమవుతుంది. రెనిన్‌, ఆల్డోస్టిరాన్‌ అనేది ముఖ్యమైన మెకానిజం. భోజనంలో ఉప్పు తగ్గించినప్పుడు రెనిన్‌ తక్కువ ఉత్పత్తి అవుతుంది. మందుల వల్ల రెనిన్‌ ఉత్పత్తిని తగ్గించొచ్చు. ఆల్డోస్టిరాన్‌ను బ్లాక్‌ చేయడానికి మందులు ఉన్నాయి.





  • ఎంత తీసుకోవాలి?


రోజూ ఆఫీసుకు బస్సులో ప్రయాణిస్తూ, అరమైలు దూరం నడక సాగించే సాధారణ వ్యక్తికి రోజుకు ఆరు గ్రాముల ఉప్పు అవసరం. కష్టపడి పనిచేసే కూలీకి, కార్మికునికి, క్రీడాకారునికి లేక ఇతరత్రా వ్యాయామాలు చేసే మనిషికి ఇంకాస్త ఎక్కువ అవసరం. చెమటలో 0.1 నుంచి 0.3 శాతం దాకా సోడియం క్లోరైడ్‌ ఉంటుంది. చలికాలంలో చెమట ద్వారా బయటికి పోయే ఉప్పు అంటూ ఏమీ ఉండదు. కానీ మంచి మండే వేసవిలో మాత్రం ఆఫీసుకు వెళ్లే వ్యక్తి రోజుకు 12.5 గ్రాముల దాకా ఉప్పును చమట ద్వారా విసర్జిస్తాడు. ఇదే రోజులో వ్యాయామాలు చేసినా లేక ఏడారి ప్రాంతాల్లో నివసించే వారిలో ఇది ఇంకా బాగా ఎక్కువగా ఉంటుంది. అయితే చెమట ద్వారా శరీరం ఉప్పు కంటే నీటిని ఎక్కువ కోల్పోతుంది. దీని వల్ల బాగా చెమటలు పట్టినప్పుడు రక్తంలో ఉండాల్సిన దానికంటే ఉప్పు ఎక్కువ శాతం గానూ నీరు తక్కువ శాతంగానూ ఉండి వాటి మధ్య నిష్పత్తి దెబ్బతింటుంది. దీన్ని పసిగట్టిన మెదడులోని దప్పిక కేంద్రం నీటిని ఎక్కువ తాగమంటూ నోటికి సందేశం పంపిస్తుంది. మనకు దప్పిక అయ్యేది ఈ సందర్భంలోనే.




  • గుండెను కబలిస్తుంది


సోడియం ఎక్కువగా తీసుకుంటే రక్తంలో ద్రవాలు ఎక్కువైతాయి. ఇది రక్తపోటును పెంచుతుంది. సాధారణంగా ఈ అదనపు నీటిని శరీరం నుంచి మూత్రపిండాలు బయటికి పంపిస్తాయి. కొన్నిసార్లు మూత్రపిండాలు సరిగ్గా పనిచేయకపోవచ్చు. ఈ సమయంలో అదనంగా ఉన్న నీటిని సమర్థవంతంగా బయటికి పంపించలేవు. దీంతో ద్రవాలు శరీరంలోనే ఉండిపోతాయి. ఇది రక్తం పరిమాణాన్ని పెంచుతుంది. ఈ రక్తం రక్తనాళాల ద్వారా పంప్‌ అవుతుంది. ఇది అధిక రక్తపోటుకు దారితీస్తుంది. ఇలా అదనంగా ఉన్న ద్రవాలతో కూడుకున్న రక్తాన్ని శరీరమంతా పంప్‌ చేయడానికి గుండె తన సైజును పెంచుకుంటుంది. ఈపరిస్థితిలో గుండెలోని కణాలు పనిచేయవు. ఎందుకంటే వీటికి అవసరమైనంత ఆక్సీజన్‌, పోషకాలు అందవు కాబట్టి. కొంతకాలానికి అదనపు రక్తపోటు వల్ల కలిగిన నష్టం తీవ్రరూపం దాల్చుతుంది. అప్పుడు ధమనులు పేలిపోవడం లేదా పూర్తిగా రక్తప్రసరణకు అడ్డుగా ఉంటాయి. ఇలాంటప్పుడు రక్తాన్ని స్వీకరించే గుండెలోని ఒక భాగం తనకు అవసరమైన ఆక్సీజన్‌, పోషకాలను పొందలేదు. దీంతో ఇది నషిస్తుంది. ఫలితంగా ఇది గుండెపోటుకు కారణం అవుతుంది. స్థూలకాయులు ఎక్కువగా ఉప్పు తింటే గుండె జబ్బుల ప్రమాదం పెరుగుతుంది. అధిక రక్తపోటు ఉన్నవాళ్లు ఉప్పు తగ్గించకపోతే కిడ్నీలు దెబ్బతినే ప్రమాదముంది.




  • రక్తపోటును పెంచుతుంది


శరీరంలోకి చేరుకున్న అదనపు ఉప్పును మూత్రపిండాలు విసర్జిస్తాయి. శరీరంలో నీటికంటే ఉప్పు ఎక్కువ ఉన్నప్పుడు మెదడులోని దప్పిక కేంద్రం ప్రేరేపణకు గురై మరిన్ని నీళ్లు తాగమంటూ ప్రోత్సహిస్తుంది. అయితే ఉప్పు శాతం అధికంగా వాడడం వల్ల మూత్రపిండాలు అధికంగా ఉన్న నీటి మొత్తాన్ని విసర్జించలేకపోతాయి. అప్పుడు శరీరంలోని రక్త పరిమాణం పెరుగుతుంది. ద్రవపరిణామం పెరిగి ద్రవాన్ని ఇముడ్చుకునే ఖాళీ పెరగకపోవడంతో ఆలోపల ఒత్తిడి అధికమవుతుంది. ఈ పెరిగిన ఒత్తిడినే మనం రక్తపోటు అంటాం. అంటే ఉప్పు ఎక్కువ తీసుకోవడం వల్ల బిపి పెరుగుతుందన్న మాట. రక్తం శరీరంలోని అన్ని అవయవాలకు సరఫరా అవ్వడానికి బ్లడ్‌ ప్రెజర్‌ (బిపి-రక్తపోటు) అవసరం. బిపి 120/80 ఉంటే నార్మల్‌ ఉందని అర్థం. పైన ఉన్న సంఖ్య (120) సిస్టాలిక్‌ అని, కింద ఉన్న సంఖ్య (80) డయాలిస్టిక్‌ అని అంటారు. రక్తపోటు వయసును బట్టి కొంత పెరుగుతుంది. కొన్ని సందర్భాల్లో మిగతా అలవాట్ల వల్ల, యాంగ్జైటీ, ఆందోళన, ఒత్తిడి, డిప్రెషన్‌ వల్ల బిపి పెరిగే అవకాశముంది. బిపి పెరిగినప్పుడు వెంటనే ఏమీ అవ్వకపోవచ్చు. అయితే నెమ్మది నెమ్మదిగా శరీరంలోని కీలక అవయవాలపై ప్రభావం చూపుతుంది. బిపి ఎక్కువైనప్పుడు మెదడు, కళ్లు, గుండె, మూత్రపిండాలు ఎక్కువ ప్రభావితం అవుతాయి. భోజనంలో ఉప్పు వల్ల బిపి పెరుగుతుంది. కొంత మందిలో ధూమపానం, ఆల్కహాలు అలవాట్లు, వ్యాయామం లేకపోవడం వల్ల కూడా బిపి పెరుగుతుంది. కొన్ని కొన్ని సందర్భాల్లో ఇతర కారణాల వల్ల కూడా బిపి పెరిగే అవకాశముంది. మూత్రపిండాలకు వెళ్లే రక్తనాళాలు సన్నగా ఉండడం వల్ల బిపి ఎక్కువైతుంది. కిడ్నీపైన ఉండే కొన్ని గ్రంథులు ఎక్కువగా పనిచేసినా కూడా బిపి పెరుగుతుంది. థైరాయిడ్‌ తక్కువైనా కూడా బిపి వస్తుంది. కొంత మంది గర్భం రాకుండా ఉండటానికి పిల్స్‌ తీసుకుంటారు. ఈ పిల్స్‌ వల్ల కలిగే దుష్ప్రభావాల్లో బిపి ఒకటి. పిల్స్‌తో వీరిలో బిపి పెరుగుతుంది. వేరే ఏ కారణాలు లేకుండా బిపి ఎక్కువుంటే ప్రైమరి హైపర్‌టెన్షన్‌ అంటారు. 95 శాతం మందిలో బిపికి కారణం ఏమిటనేది కనుక్కోలేం. ఇది జన్యుపరమైనవి కావొచ్చు, అలవాట్లు కావొచ్చు. తీసుకునే ఉప్పు వల్ల కూడా కావొచ్చు. ఒక్కోసారి అకస్మాత్తుగా హైబిపి వస్తుంది. ఇది చాలా ప్రమాదకరం. అకస్మాత్తుగా హైబిపి వచ్చినప్పుడు కళ్లు మసకగా కనిపించడం, కళ్లలోని నరాలు దెబ్బతినడం జరుగుతాయి. ఒక్కోసారి మెదడులోని నరాలు చిట్లే అవకాశముంది. దీన్ని సెరిబ్రల్‌ హెమరేజ్‌ అంటారు. ఈ పరిస్థితిలో మరణించే అవకాశాలెక్కువ. ఒత్తిడి వల్ల పెద్దలే కాక పిల్లల్లో కూడా బిపి వస్తోంది. ఒత్తిడి ఉన్నప్పుడు శరీరంలోని హార్మోన్లు పెరగుతాయి. మనం ఏదైనా విషయం గురించి ఆందోళన చెందినప్పుడు పల్స్‌రేటు ఎక్కువై బిపి పెరుగుతుంది. శరీరానికి మేలు చేసే హార్మోన్లు ఒత్తిడి వల్ల కీడు చేస్తాయి.




  • బిపికి జీవితాంతం మందులు


ఒక సారి రక్తపోటు వస్తే దీన్ని నయం చేయలేం. కేవలం నియంత్రిచే వీలుంది. దీని కోసం జీవితాంతం మందులు వాడాల్సి ఉంటుంది. ఎందుకంటే బిపి మన శరీరంలోని ప్రతీ అవయవం ప్రతీక్షణం ప్రభావితమవుతుంది. మన గుండె ఎన్నిసార్లు కొట్టుకుంటుందో అన్ని సార్లు రక్తం శరీరమంతా ప్రసరిస్తుంది. 25 ఏళ్లు వచ్చినవారు బిపిని చెక్‌ చేయించుకోవాలి. కనీసం ఆరు నెలలకోసారైనా. మందులు వాడుతున్నవారు మూడు నెలలకోసారి పరీక్ష చేయించుకోవాలి. ఏడాదికోసారి ఆరోగ్య పరీక్షలు చేయించుకోవాలి.బిపి ఉన్నప్పుడు వైద్యున్ని కలిసి అన్ని రకాల పరీక్షలు చేయించుకోవాలి. సూచించిన మందులను క్రమం తప్పకుండా జీవితాంతం వాడాలి. తరచూ బిపి చెకప్‌ చేయించకుంటూ ఉండాలి. బిపి వల్ల బ్రెయిన్‌ హెమరేజ్‌, పక్షవాతం, కళ్లలో సమస్యలు, దృష్టి దెబ్బతిని చూపుపోతుంది. గుండెపోటు, కిడ్నీ దెబ్బతినడం వల్ల కిడ్నీ సమస్యలు.




  • ఉప్పు ఎలా తగ్గించుకోవాలి ?


మనకు రోజుకు ఒక వ్యక్తికి 6 గ్రాముల ఉప్పు అవసరం. పళ్లు, కూరగాయల్లో సహజసిద్దంగా ఉప్పు ఉంటుంది. ఇది మన శరీరం పనిచేయడానికి తోడ్పడుతుంది. కొన్ని జాగ్రత్తలు పాటిస్తే ఉప్పును తగ్గించుకోవచ్చు.




  • * నిల్వ ఉన్న, బయట దొరికే ప్రాసెస్‌ ఫుడ్స్‌ పూర్తిగా మానాల్సి ఉంటుంది. ఎందుకంటే వీటిలో ఉప్పు ఎక్కువుంటుంది.

  • * ఆహారం తినే సమయంలో ఉప్పు డబ్బా పెట్టుకోకూడదు.

  • * ఉప్పుకు బుదులు రుచికలిగించేవి, సుగంధద్రవ్యాలు, నిమ్మరసం, వెనిగర్‌, మిరియాలపొడి, ఉల్లిపాయలు వాడాలి.

  • * డబ్బాల్లో నిల్వ ఉన్న పదార్థాలకు బదులుగా తాజా పళ్లు తీసుకోవాలి.

  • * ఉప్పుతో తయారు చేసిన స్నాక్స్‌, చిప్స్‌ను బాగా తగ్గించాలి.

  • * ఉప్పు కలుపుకోకుండా మజ్జిగ తీసుకోవాలి.

  • * పొటాషియం ఎక్కువుండే అరటిపళ్లను అధికంగా తీసుకోవాలి. ఇవి శరీరంలో సోడియం స్థాయిని సమతుల్యం చేస్తాయి.

  • * అధిక బరువు ఉన్నవారు తమ ఎత్తు, వయసుకు తగ్గ బరువుండాలి.

  • * ఆల్కహాలు, ధూమపానం మానాలి.

  • * ఆహార పదార్థాల మీద అదనంగా ఉప్పు చల్లుకోవడం మానాలి.

  • * కూల్‌డ్రింక్స్‌ మానాలి.


Udates :




  • ఆహారంలో ఉప్పు వాడకాన్ని తగ్గించాలంటూ కార్పొరేట్ ఆస్పత్రులు ఓ వైపు ప్రచారం చేస్తుండగా మరోవైపు డెన్నార్క్‌కు చెందిన శాస్తవ్రేత్తలు ఉప్పు పూర్తిగా తగ్గిస్తే గుండెకు సమస్యలు తప్పవని తేల్చి చెబుతున్నారు. వినడానికి వింతగా ఉన్నా, తాజా పరిశోధనలు ఉప్పు వినియోగాన్ని పూర్తిగా తగ్గించవద్దని ఘోషిస్తున్నాయి. తిండిలో లవణం లేకుండా చేస్తే గుండెకు చేటు కలుగుతుందని, ఫలితంగా హృద్రోగాలు తప్పవని డెన్మార్క్ పరిశోధకులు దండోరా వేస్తున్నారు. ఉప్పును బాగా తగ్గించడం వల్ల కొలెస్ట్రాల్‌లో 2.5 శాతం, రక్తం గడ్డ కట్టడానికి సహకరించే కొవ్వులో ఏడు శాతం పెరుగుదల సంభవించినట్లు వారు గుర్తించారు. ఉప్పు వినియోగం మానేస్తే అధిక రక్తపోటుకు కారణమయ్యే ‘అల్డోస్టెరాన్’ హార్మోన్లు శరీరంలో విడుదలవుతున్నట్లు పరిశోధకులు చెబుతున్నారు.



Salt History ,ఉప్పు చరిత్ర :




  • ఒకప్పుడు ఉప్పు విలువై వస్తువు... దేశాలను సంపన్నం చేసిన ధనం... సైనికులకి అదే జీతం..


అబ్బో... చెప్పుకోవాలంటే ఉప్పు గొప్ప ఒప్పుకోక తప్పనిదే! ఒకప్పుడు అది డబ్బుతో సమానం. ఇది దేశాల ఆర్థిక స్థితిగతులనే మార్చింది. 'జీతం' అనే పదం పుట్టడానికి కారణమయ్యింది. కొన్ని దేశాల్లో సైనికులకు ఉప్పునే జీతంగా ఇచ్చేవారు మరి! పురాతన కాలంలో 'తెల్ల బంగారం' అని పిలుచుకునే వారు. ఇక మన దేశంలో ఉప్పు సత్యాగ్రహం ఎంత ప్రాధాన్యత సంతరించుకుందో గుర్తుంది కదా? బ్రిటిష్‌వారు ఉప్పుపై విధించిన పన్నుకి వ్యతిరేకంగానే గాంధీజీ దీన్ని చేపట్టారు.

ఇంతకీ ఉప్పు వాడకం ఎప్పుడు మొదలైంది? రాతి యుగంలో ఆదిమానవులు పచ్చిమాంసం తినేవారు కాబట్టి ఉప్పు అవసరమే ఉండేది కాదు. పది వేల ఏళ్ల క్రితం వ్యవసాయం మొదలుపెట్టి వరి, గోధుమ లాంటి ఆహార ధాన్యాలు పండించడం మొదలుపెట్టగానే ఉప్పదనం కావల్సివచ్చింది. ఉప్పుని మొదట చైనాలో వాడినట్టు ఆధారాలు ఉన్నాయి. క్రీస్తు పూర్వం 6000లో చైనాలోని యుంచెంగ్‌ అనే ఉప్పునీటి సరస్సు నుంచి ఉప్పుని తయారు చేశారని చెబుతారు. ఆసియాలో క్రీస్తు పూర్వం 4,500 నుంచి వినియోగంలో ఉన్నట్టు అంచనా. ఈజిప్టువాసులు మమ్మీలను నిలవ ఉంచేందుకు వాడేవారు.

15వ శతాబ్దంలో పోలాండ్‌ ఉప్పు వల్లే అత్యంత ధనవంతమైన దేశంగా మారింది. ఉప్పు గనుల నుంచి ఇతర దేశాలకు సరఫరా చేసి బోలెడు డబ్బు దండుకునేది. తరువాత జర్మన్లు సముద్రపు ఉప్పుని తయారు చేయడంతో అందరికీ అందుబాటులోకి వచ్చింది. రోమన్‌ చక్రవర్తులైతే సైన్యానికి కొన్నాళ్ల పాటు ఉప్పునే నెల జీతంగా ఇచ్చారు. జీతానికి వాడే Salary పదం పుట్టుకకు కారణం ఉప్పే. Salarium అనే లాటిన్‌ పదం నుంచి ఇది వచ్చింది. ఆ పదానికి అర్థం Payment in Salt.




  • మీకు తెలుసా?


* ప్రపంచ వ్యాప్తంగా 210 మిలియన్‌ మెట్రిక్‌ టన్నుల ఉప్పు ఉత్పత్తి జరుగుతోంది.
* ఉత్పత్తిలో మొదటి నాలుగు స్థానాల్లో ఉన్న దేశాలు అమెరికా, చైనా, జర్మనీ, ఇండియా.
* మన దేశంలో ఏటా 14.5 మిలియన్‌ టన్నుల ఉప్పుని ఉత్పత్తి చేస్తున్నారు.




  • conclusion :


ఉప్పు తినాలా ? వద్దా? ....
ఉప్పు తప్పనిసరిగా ఆహారములో తీసుకోవాలి . నార్మల్ గా ఏ వ్యాధులు లేనివారు రోజుకి 6(ఆరు) గ్రాములు అన్నివిధాలా మొత్తము గా తీసుకోవాలి . గుండెజబ్బులు , బి.పి. ఉన్నవారు ఇందులో సగము ... సుమారు 2.5 - 3.0 గ్రాములు వాడాలి.




  • ఉప్పులో రకాలు :


ఉప్పులో సోడియం , క్లోరైడ్ అను రెండు పదార్ధాలు ఉంటాయి.



  • కామన్‌ సాల్ట్ :


ఇది మనము కిచెన్‌ లో వాడే రకము. సముద్రపు నీటినుండి తయారుచేసి శ్ర్భ్రము చేస్తారు . కొన్ని రసాయనాలు కలిపి ఫ్రీ గా పొడుము గా ఉండేలా చేస్తారు .



  • అయోడైజ్డ్ సాల్ట్ :


కామన్‌ సాల్ట్ కు అయోడిన్‌ కలుపుతారు . ఉప్పును శుభ్రము చేసినపుడు అయోడిన్‌ పోతుంది . అయోడిన్‌ వల్ల థైరాయిడ్ వ్యాధులు వస్తాయి. అందువల్ల ఉప్పుకు అయోడిన్‌ కలిపి తయారుచేస్తారు .



  • సీ సాల్ట్ :


సముద్రము నీటినుండి తయారుచేసే ఉప్పు స్పటికాలు . దీనిలో కొద్దిగా అయోడిన్‌ , పొటాషియం, మెగ్నీషియం ఉంటాయి. పూర్వము వంటలలో దీనినే వాడేవారు .



  • రాక్ సాల్ట్ :


Halite , commonly known as rock salt, is the mineral form of sodium chloride (NaCl). Halite forms isometric crystals.
గ్రే / పింక్ రంగులో ఉంటుంది . ఇది రిఫైన్‌ చేసింది కాదు . . కాబట్టి అన్ని మినరల్స్ యదాతదం గా ఉంటాయి . ఎసిడిటీని తగ్గిస్తుంది .



  • ఎప్సమ్‌ సాల్త్ : Magnesium sulfate


దీన్ని వంటకాలలో వాడరు . మందులషాపులలో దొరుకుతుంది . స్నానము చేసే నీటిలో కలిపి వాడితే శారీక నొప్పులు తగ్గుతాయి. కండరాలను సడలిస్తుంది . చర్మము పై మృతకణాలను తొలగిస్తుంది . containing magnesium, sulfur and oxygen, with the formula MgSO4. దీన్ని విరోచనకారిగా వాడుతారు (used as a saline laxative).




  • Salt and Herat failure ,ఉప్పు-హర్ట్ ఫెయిల్యూర్




అధిక రక్తపోటు వలన ధమనుల్లో ఆర్టీరియల్ ఒత్తిడి ఏర్పడి రక్తం సంచితమవుతుంది. దీని పరిణామంగా రక్తం వెనుకు పోటేసి గుండె పంపింగ్ సామర్ధ్యాన్ని దెబ్బతీస్తుంది. ఫలితంగా కొద్దిసేపు ఏదైనా పని చేస్తే శ్వాసవేగం పెరుగుతుంది.. పనితో సంబంధం లేకుండా విశ్రాంతి తీసుకుంటున్నపుడు కూడా ఆయాసం రావడం జరుగుతుంది. దీని ద్వారా హార్ట్ ఫెయిల్యూర్ లక్షణాలు కనిపిస్తాయి. ఉప్పు ఎంతవరకు అవసరం ? మన శరీరంలో సోడియం ఉత్పత్తికాదు, కాబట్టి దీనికి మనం తినే ఆహారం తాగే ద్రవ పధార్ధాలు, దుంపలు, ధాన్యాలు పప్పుదినుసులు, పండ్లు మాంసం, పాలు, మనం తినే నీటిలో కూడా సోడియం వుంటుంది. మనం వంటచేసేటపుడు కూరలతో ఉప్పు సరేసరి! వీటిని దృష్ఠిలో పెట్టుకుని ఆరోగ్య సంస్థ నిర్ధేశించిన ప్రమాణాల ప్రకారం రోజుకు 1 టీ స్పూన్ ఉప్పు మాత్రమే తీసుకోవాలి. రక్తపోటు, గుండెజబ్బులు, మూత్రపిండాల వ్యాధులున్న వారు ఉప్పు తక్కువ తినాలి. మోతాదుకు మించి ఉప్పును వాడటం మంచిదికాదు. 



ఆహారంలో ఉప్పు మోతాదు తగ్గించాలనుకుంటున్నారా?  అధ్యయనాలు, పరిశోధనల ప్రకారం ఒక ఆరోగ్యకరమైన మనిషి రోజుకు 1500 మిల్లీగ్రాముల సోడియం చొప్పున వినియోగించాలి. దురదృష్టవశాత్తూ, చాలా మంది 3000 మిల్లీగ్రాముల కన్నా ఎక్కువ సోడియం వాడుతూ వుండడం వల్ల గుండె పోటు, స్ట్రోక్ లాంటి ఇతర రకాల గుండె జబ్బులు వస్తున్నాయి. కేవలం ఒక టీస్పూన్ ఉప్పులో సుమారు 2000 మిల్లీ గ్రాముల సోడియం వుంటుంది, అలాగే ఒక ఫాస్ట్ ఫుడ్ రెస్టారెంట్ లో దొరికే ఏ ఒక్క వస్తువులోనైనా తేలిగ్గా అంతే మోతాదు వుంటుంది. దీర్ఘ కాలం ఎక్కువ సోడియం వాడడం రక్త పోటు, ఇతర బలహీన పరచే పరిస్థితులకు సంబంధించినది కావడం వల్ల సోడియం వాడకాన్ని నియంత్రణ లో ఉంచుకునే మార్గాలు వెతకడం ఆరోగ్యానికి మంచిది. సోడియం వాడకం మితిమీరి ఎక్కువైతే అది వెంటనే కొన్ని వైద్య లక్షణాలు చూపిస్తుంది - పగిలిన, రక్తమోడుతున్న పెదాలు, కడుపులో తిప్పడం లాంటివే కాక, కొన్ని తీవ్ర సందర్భాల్లో మరణాన్ని కూడా కలిగిస్తుంది. మీరు మీ ఆహారంలో ఉప్పు మోతాదు తగ్గించాలనుకున్నా లేక తొలగించాలనుకున్నా, మీ ప్రయత్నంలో ఉపయోగపడేందుకు ఇదిగో ఈ క్రింది సూత్రాలు పాటించండి. : 1. మీ ఆహారాన్ని సహజ స్థితిలో లేదా ఉడికించిన స్థితి లో రుచి చూడడానికి అలవాటు పడ౦డి. మీ ఆహారాన్ని ఎప్పుడూ ఉప్పు కలపక ముందు రుచి చూడ౦డి. మీరు అలవాటు చొప్పున ఉప్పు వేసుకునే వారైతే, ఉప్పు కన్నా ముందు ఫోర్క్ తీసుకుని - ఉప్పు లేని ఆహారం రుచిని ఆస్వాదించడం మళ్ళీ నేర్చుకోండి. మొదట్లో చప్పగా వున్నట్టు అనిపించినా, ఆ భావన త్వరలోనే పోయి ఉప్పు ఆహార పదార్ధాల అసలు రుచిని ఎలా మరుగు పరుస్తుందో తెలుసుకుంటారు. మార్పు రావడానికి కొద్ది సమయం ఓపిక పట్టండి - ఓ రెండు మూడు నెలలకు గానీ మీ ఇంద్రియాలు ఉప్పు కోసం వెంపర్లాడడం మానవు. 2. ఆహార పదార్ధాల పై లేబుళ్ళు చదవండి, వెబ్ సైట్ లు చూసి మీరు రోజూ తినే ఆహారంలో సోడియం పరిమాణం ఎంత ఉందొ తెలుసుకోండి. మీరు తినే ఆహారంలో సోడియం పరిమాణం ఎంత వుందో తెలుసుకు౦టు౦టే ఉప్పు వాడకం తగ్గించాలని మీరు త్వరగా సమాధానపడతారు. వెచ్చాలు కొనేటప్పుడు సోడియం పరిమాణం ఎంత వుందో తెలుసుకోవడానికి లేబుళ్ళు చదవడం అలవాటు చేసుకోండి. ఇంట్లో వండుకుని తినడం 1. ఇంట్లో వంట చేసేటప్పుడు కూడా ఉప్పు వాడకం తగ్గించండి. అత్యవసరమైతే తప్ప ఉప్పు వేయడం మానేయండి. వంటకాల్లో సూచించిన దాంట్లో సగం ఉప్పే వేయండి, ఇంకా అలా సగం చేసుకుంటూ వెళ్ళండి. కుదిరితే, వంట చివర గానీ లేదా తినబోయే ముందు కానీ ఉప్పు వేయండి. ఇలా చేస్తే, ఉప్పుకి వంటకం లో కలవడానికి ఎక్కువ సమయం ఉండదు కాబట్టి కొంచెమే సరిపోతుంది. 2. తాలింపు కోసం వాడే వాటిలో సోడియం ఎంతుందో చూడండి. పంది మాంసపు ముక్కలు, రొమనో వెన్న, కొన్ని ఎంపిక చేసిన తాలింపు సామాను లాంటి చాలా పదార్ధాలు ఎక్కువగా ఉప్పుతో కూడి వుంటాయి కనుక సాధ్యమైనంత వరకు వాటిని వదిలేయండి (కెచప్, ఆవ పెట్టిన ఊరగాయ బదులు బర్గర్ మీద పాలకూర, ఉల్లి, టమాటో వాడండి). ప్రత్యేకమైన తాలింపు పాకెట్ వుండే వాటికి - ఆ పాకెట్ లో తక్కువ పరిమాణం వాడండి లేదా పూర్తిగా తగ్గించండి. ఐతే, కొద్దిగానే అయినా ఈ రుచులు, తాలింపు ఉప్పు కలపడమే నేరుగా ఉప్పు కలపడం కన్నా మంచిది. 3. ఉప్పు బదులు ఉప్పు లేని తాలింపు వాడండి. ఉప్పు నుంచి దూరంగా ఉండడానికి అనేక ఇతర ప్రత్యామ్నాయాల శ్రేణి వుంది. వాటిలో మూలికలు, సుగంధ ద్రవ్యాలు, నిమ్మకాయ, వెల్లుల్లి, తాజా కూరగాయలు, మాంసం, కూరల ఉప్పు ఒరేగానో, నిమ్మ రసం, మిరియప్పొడి, మిరపగుండ, కారపు సాస్ లేదా సాల్సా కూడా కొద్దిగా రుచిని జోడిస్తాయి. 4. ప్రాసెస్ చేసిన ఆహారాలు మానివేయండి. తాజాగా తయారైనవి, మాంసం, మంచినీటి చేప లాంటివి ఉప్పు లేకుండా వుంటాయి లేదా కొద్ది పాటి సోడియం ను కలిగి వుంటాయి, కాగా సూప్ లు, శీతలీకరించిన ఆహారం, ప్రాసెస్ చేసినవి, రెస్టారెంట్ లో తయారయ్యేవి సాధారణంగా సోడియం అధికంగా కలిగి వుంటాయి. మీకు తాజా కూరగాయలు అందుబాటులో లేకపోతే సోడియం అధికంగా వుండే కూరగాయల కన్నా సోడియం లేని, లేదా తక్కువగా వుండే డబ్బాల్లో వున్న కూరగాయలు వాడడం మంచిది. అందుకే సోడియం పరిమాణం ఎంతుందో తెలుసుకోవడానికి లేబుళ్ళు చదవడం అలవాటు చేసుకోండి. 5. ఆహార పదార్ధాల మీద నుంచి సోడియం తొలగించండి. ఉప్పు కలిసిన వాటి కన్నా పైన ఉప్పు చల్లిన పదార్ధాలు ఎంచుకోండి. ఉదాహరణకు సాల్టైన్ లు కొనేటప్పుడు ‘సాల్ట్ కలపని పైముక్కల' కొనుగోలు మానేయండి ఎందుకంటే వాటి పైన కాకుండా ఉప్పు లోపల కలిసిపోయి వుంటుంది - అందువల్ల దాన్ని తొలగించడం కుదరదు. "ఉప్పు పైన' వుండే ఉత్పత్తులు కొద్ది సోడియం పరిమాణానికి ఎక్కువ రుచిని అందిస్తాయి, కనుక ఆ కోణంలో చూసినా అవే మంచివి. 6. టేబుల్ దగ్గర కూర్చున్నపుడు మీ ఉప్పు వాడే అలవాట్లు మార్చుకోండి. సాల్ట్ షేకర్ ముట్టుకోకండి. తగ్గించేటప్పుడు కూడా మొత్తం ఒంపుకోకుండా ఒక్కసారి షేక్ చేయండి - ఇక నెమ్మదిగా ఈ అలవాటుకి దూరం జరగండి. మసాలా దినుసులతో జాగ్రత్త - సాస్ లు ఇతర టాపింగ్స్ లో ఎక్కువ పరిమాణం లో ఉప్పు ఉంటుంది. 7. ఆహారాల్లో వున్న సోడియంను తగ్గించండి. మీరు ఎక్కువ సోడియం వున్న సూప్ ల లాంటి పదార్ధాలు కొంటే దాన్ని పల్చగా తయారు చేయడం వల్ల సోడియం స్థాయి తగ్గుతుంది. ఉదాహరణకు, మీరు లేబుల్ మీద సూచించినట్టుగా సూప్ తయారు చేస్తే, దాంట్లో సోడియం పరిమాణం ఎక్కువగా వుంటుంది. దాని బదులు మీరు క్యాన్ చేసిన సూప్ ను తీసుకుని బంగాళా దుంపలు, ఆకుకూరలు, ఉల్లిపాయలు, కారెట్లు లాంటి తాజా కూరగాయలు కలపండి. అలా కాకుండా దాన్ని నేరుగా వడ్డి౦చడం వల్ల తినే ప్రతివారికీ ఎక్కువ పరిమాణంలో సోడియం అందుతుంది. 8. ఇంట్లో తినండి. వేరే వాళ్ళ ఇళ్ళలోనో, రెస్టారెంట్లలోనో తింటే ఇతరులు తయారు చేసిన పదార్ధాలలో సోడియం పరిమాణం నియంత్రించడం మనకు సాధ్యం కాకపోవచ్చు. ఇంట్లో తింటున్నాం అంటే మీ ఆహారంలో సోడియం పరిమాణం ఎంత వుందో మీకు ఖచ్చితంగా తెలుస్తుంది.





    నిత్యం అందుబాటులో ఉండే ఉప్పు వంటలకు రుచినివ్వడమే కాదు, మరెన్నో విధాలుగానూ ఉపయోగపడుతుంది.



రోజూ నీళ్లు పోయడం వల్ల ఫ్లవర్‌ వాజు లోపల గారపడుతుంది. అలాంటప్పుడు ఉప్పు నీటిని వాజులో నింపి అరగంట నాననివ్వాలి. ఆ తరవాత బాగా గిలక్కొట్టి సబ్బు నీటితో కడిగేస్తే గార వదులుతుంది. గుమ్మాలకు వేలాడదీసే ప్లాస్టిక్‌ పూల దండలూ, ఫ్లవర్‌ వాజులపై దుమ్ము పేరుకుంటుంది కదా! దాన్ని వదిలించడానికీ ఉప్పు ఉపయోగపడుతుంది. అందుకు ఏం చేయాలంటే... పెద్ద ప్లాస్టిక్‌ కవరులో గుప్పెడు ఉప్పు వేసి అందులో ప్లాస్టిక్‌ పువ్వుల్ని ఉంచి ముడి వేసి, కవరును బాగా కదపాలి. ఉప్పు నల్లబడిందంటే దుమ్ము పోయినట్లే.



* గదులు వూడ్చే మెత్తని చీపురుని కొనగానే వాడేయకండి. బకెట్‌ వేడి నీళ్లలో కప్పు ఉప్పు వేసి దాన్లో చీపురు మునిగేలా ఉంచండి. పావు గంటయ్యాక దాన్ని బయటకు తీసి ఎండలో ఉంచండి. ఇలా చేస్తే చీపురు ఎక్కువకాలం మన్నుతుంది.



* భోజనాల బల్లపై నీటి మరకలు ఎక్కువగా పడుతుంటాయి. వాటిని వదిలించాలంటే ఉప్పే పరిష్కారం. అరకప్పు ఉప్పులో కొద్దిగా నీళ్లు పోసి పేస్టులా చేయాలి. దీన్ని నీటి మరకలున్న చోట పూతలా రాసి కాసేపయ్యాక కడిగితే మరకలు సులువుగా పోతాయి.



* ఈ కాలంలో కిటికీ అద్దాలపై మంచు పేరుకుని మసగ్గా కనిపిస్తుంది. దానికీ ఉప్పు నీరే పరిష్కారం. ఉప్పు నీటిలో మెత్తని వస్త్రాన్ని ముంచి కిటికీ అద్దాలను తుడవాలి. ఆ వెంటనే మరో మెత్తని పొడి వస్త్రంతో తుడిస్తే సరిపోతుంది. ఇంట్లో చీమలు బారులు తీరి ఇబ్బంది పెడుతోంటే ఆ ప్రదేశంలో ఉప్పు చల్లితే, తక్కువ సమయంలో వాటి బెడద వదులుతుంది.



* చెత్త డబ్బాల్లో పేరుకున్న మురికీ దుర్వాసనా వదలాలంటే డబ్బా అంతటా అరకప్పు ఉప్పు చల్లండి. కాసేపయ్యాక చల్లని నీరు పోస్తూ కడిగేస్తే, మురికితో పాటూ దుర్వాసన కూడా పోతుంది.



courtesy with:eenadu sukhibhava




  • ===================================


Visit my Website - Dr.Seshagirirao...

వంటనూనెల ప్రత్యేకత్లు , Specialities of cooking oils








పండ్లు , కాయగూరలు ,గింజలు, పప్పులు , కందమూలాలు ,సుగంధద్రవ్యాలు మానవుడికి ప్రక్రుతి ప్రసాదించిన అపురూపమైన వరము .ఆయా సీజన్లలో పండే పండ్లను ఆరగించడం మనకు తరతరాలు గా తెలుసును . అన్నం తో కూడా ప్రకృతిసిద్ధమైన పండ్లు , కూరగాయలు ఇతర త్రునధన్యాలను ఆహారం గా ఆహారముగా తీసుకుని జీవించినట్లయితే శరీరానికి కావససిన అన్నిరకాల పోషకాలు లభిస్తాయి ... ఇదే అసలు ఉత్తమమైన జీవన విధానమని పకృతి వైద్యుల నమ్మకం.....ఆహారం జీవం ఉన్న ప్రతి జీవికి అత్యవసరమైనది. పిండిపదార్ధాలు, మాంసకృత్తులు, కొవ్వుపదార్ధాలు, ఖనిజలవణాలు, పీచుపదార్ధాలు, రోగనిరోధక శక్తికి కావలసిన విటమిన్లు మరియు శరీర పోషణకు రక్షణకు కావలసిన పదార్ధాలను కలిగిన పదార్దాలను ఆహారంగా పేర్కొనవచ్చు. ఇవి కాక శరీరానికి నూతన ఉత్సాహాన్నిచ్చే కాఫీ, టీ లాంటి వాటిని కూడా ఆహారపదార్ధాల కోవలోకి వస్తాయి. ఆహారం ఘన, ద్రవ రూపాలలో లభ్యం అవుతుంది.



  • వంట నూనెలు :


వంటకాల తయారీకి కూక్కరు ఒక్కో తరహ నూనెలు వాడుతుంతారు. ప్రాంతాన్నిబట్టి , కుటుంబ అలవాటునుబట్టి వాడే నూనెలు మారుతాయి . ఒక్కొక్క నూనెకు ఒక్కొ ప్రత్యేకత ఉంది . ఆరోగ్యానికి మంచి , చెడు చేస్తాయి.

నూనెలు మరియు కొవ్వులు వృక్ష, జంతు సంబందిత ఉత్పత్తులు. ఇవి నీటిలో కరగవు. నూనెలను/కొవ్వులను ఫ్యాటి ఆమ్లముల గ్లిసెరొల్ ఇస్టరులు (Glycerol esters of fatty acids) అంటారు. లేదా 'triglyceredes'లేదా 'Triacylglycerols' అంటారు.

సాధారణ పరిసర ఉక్ష్ణోగ్రతవద్ద ఘన(solid)లేదా అర్దఘన(semi solid) రూపములో వున్నచో కొవ్వులని (fats),ద్రవరూపంలో వున్నచో నూనెలని(oils)అనిఅంటారు.

మూడుఫ్యాటి ఆమ్లముల ఆణువులు, ఒక గ్లిసెరొల్ అణువు సంయోగం చెందటం వలన ఓక నూనె/కొవ్వు అణువు (Triglyceride molecule) మరియు మూడు నీటి అణూవులు ఏర్పడును. కొవ్వుఆమ్లాలు,గ్లిసెరొల్‌ సంయోగంచెంది,నూనెగా ఎర్పడటం.మిశ్రమ ట్రైగ్లిసెరైడ్




  • కొవ్వులలో (fats) లో సంతృప్త ఫ్యాటి ఆసిడ్ లు ఏక్కువ వుండటం మూలాన అవి ఘన రూపం లో వుంటాయు. నూనెలలో అసంతృప్త ఫ్యాటిఆసిడ్లు ఎక్కువ % లో వుండును. మనం వాడే వంటనూనెలలో సంతృప్త (సాచురెటెడ్) మరియు అసంతృప్త (అన్‌సాచురెటెడ్) ఫ్యాటి అమ్లములు వివిధ రేషియోలలో వుండును. ఆరోగ్యరీత్యా అసంతృప్త ఫ్యాటి ఆసిడ్ లు వున్న నూనెలను ఉపయోగించడం మంచిది. మిరిస్టిక్, లారిక్, పామిటిక్ మరియు స్టియరిక్ ఆసిడ్ లు సంతృప్త ఫ్యాటిఆసిడ్లు. ఒలిక్, లినొలిక్ మరియు లినొలెనిక్ ఆసిడ్లు అసంతృప్త ఫ్యాటి ఆమ్లములు. ఒలిక్ ఆసిడ్ లో ఒక ద్విబంధము, లినొలిక్ ఆసిడ్ లో రెండు ద్విబంధాలు మరియు లినొలెనిక్ ఆసిడ్ లో మూడు ద్విబంధాలు వుండును. ఒకటికన్న ఎక్కువ ద్విబంధాలున్న ఫ్యాటి ఆమ్లములను పాలి అన్‌సాచురెటెడ్ ఫ్యాటి ఆసిడ్లు (ప్యూఫా) అంటారు.


కొన్ని వంట నూనెలు :




 రక్తపోటుకు 'నూనెల' కళ్లెం!


  • గుండె ఆరోగ్యంలో ఆహారం కీలక పాత్ర పోషిస్తుందని మరోసారి రుజువైంది. నువ్వులనూనె, తవుడునూనె కలిపి వాడితే అధిక రక్తపోటు తగ్గుతున్నట్టు మనదేశంలో చేసిన అధ్యయనంలో వెల్లడైంది. అధిక రక్తపోటు బాధితులకు పక్షవాతం, గుండెజబ్బు ముప్పు ఎక్కువన్నది తెలిసిందే. అధిక రక్తపోటుతో బాధపడేవారు రోజువారీ ఆహారంలో భాగంగా సుమారు 40 గ్రాముల మేరకు నువ్వులనూనె, తవుడునూనె కలిపి తీసుకుంటే.. రక్తపోటు తగ్గుతున్నట్టు పరిశోధకులు గుర్తించారు. ఈ తగ్గుదల రక్తపోటు తగ్గటానికి వేసుకునే మందులతో (క్యాల్షియం ఛానెల్‌ బ్లాకర్స్‌) సమానంగా ఉండటం గమనార్హం. కేవలం మందులు వేసుకునేవారితో పోలిస్తే.. మందులతో పాటు నూనెల మిశ్రమాన్ని వాడినవారిలో రక్తపోటు రెండు రెట్లు తగ్గటం విశేషం. ఈ నూనెల మిశ్రమంతో చెడ్డ (ఎల్‌డీఎల్‌) కొలెస్ట్రాల్‌ తగ్గటంతో పాటు మంచి (హెచ్‌డీఎల్‌) కొలెస్ట్రాల్‌ పెరుగుతోందనీ పరిశోధకులు చెబుతున్నారు. నువ్వుల నూనె రక్తపోటుపై గణనీయమైన ప్రభావం చూపుతుందని, ఇది కూడా క్యాల్షియం ఛానెల్‌ బ్లాకర్‌ మందుల్లా ప్రభావం చూపుతుందని గతంలో తేలిందని అధ్యయనానికి నేతృత్వం వహించిన డాక్టర్‌ దేవరాజన్‌ శంకర్‌ పేర్కొంటున్నారు. అయితే దీనికి తవుడు నూనె కూడా తోడైతే మరింత మంచి ఫలితం కనబడుతోంది. నువ్వులనూనెలోని సీసమిన్‌, సీసమోల్‌, సీసమోలిన్‌.. తవుడునూనెలోని ఓరీజనోల్‌ అనే యాంటీఆక్సిడెంట్లు ఇందుకు దోహదం చేస్తున్నాయని పరిశోధకులు భావిస్తున్నారు. ఈ రెండు నూనెలూ అసంతృప్త కొవ్వు ఆమ్లాలు (మంచి కొవ్వులు) కలిగున్నాయంటున్నారు.





  • =================================


Visit my Website - Dr.Seshagirirao...

Monday 21 November 2011

వ్యాయామం తర్వాత ఎంతసేపటికి తినాలి, ఏం తినాలి?



పండ్లు , కాయగూరలు ,గింజలు, పప్పులు , కందమూలాలు ,సుగంధద్రవ్యాలు మానవుడికి ప్రక్రుతి ప్రసాదించిన అపురూపమైన వరము .ఆయా సీజన్లలో పండే పండ్లను ఆరగించడం మనకు తరతరాలు గా తెలుసును . అన్నం తో కూడా ప్రకృతిసిద్ధమైన పండ్లు , కూరగాయలు ఇతర త్రునధన్యాలను ఆహారం గా ఆహారముగా తీసుకుని జీవించినట్లయితే శరీరానికి కావససిన అన్నిరకాల పోషకాలు లభిస్తాయి ... ఇదే అసలు ఉత్తమమైన జీవన విధానమని పకృతి వైద్యుల నమ్మకం.....ఆహారం జీవం ఉన్న ప్రతి జీవికి అత్యవసరమైనది. పిండిపదార్ధాలు, మాంసకృత్తులు, కొవ్వుపదార్ధాలు, ఖనిజలవణాలు, పీచుపదార్ధాలు, రోగనిరోధక శక్తికి కావలసిన విటమిన్లు మరియు శరీర పోషణకు రక్షణకు కావలసిన పదార్ధాలను కలిగిన పదార్దాలను ఆహారంగా పేర్కొనవచ్చు. ఇవి కాక శరీరానికి నూతన ఉత్సాహాన్నిచ్చే కాఫీ, టీ లాంటి వాటిని కూడా ఆహారపదార్ధాల కోవలోకి వస్తాయి. ఆహారం ఘన, ద్రవ రూపాలలో లభ్యం అవుతుంది.

వ్యాయామం తర్వాత ఎంతసేపటికి తినాలి, ఏం తినాలి... ఇది చాలామందిని తొలిచేప్రశ్న. బ్రిస్క్‌వాక్‌ లాంటి వ్యాయామాలు ఆకలిని తగ్గిస్తే, ఈత ఆకలిని పెంచుతుంది. ఆకలివేసినా వేయకపోయినా వ్యాయామం చేసిన పావుగంటకు ఏదైనా తినడం అవసరమని చెబుతున్నారు నిపుణులు. ఎందుకంటే వ్యాయామంతో కండరాల్లోని ఇంధనం(గ్త్లెకోజెన్‌) ఖర్చయిపోతుంది. ఆ నిల్వల్ని పూర్తిచేయడానికి వ్యాయామం చేసిన 15 నిమిషాలకే శరీరం సిద్ధమవుతుంది. ఆ సమయానికి మనం ఏమీ తినకపోతే కాసేపటికి అలసట అనిపిస్తుంది. అందుకనీ ఆ సమయంలో కమలారసం, శాండ్‌విచ్‌, వేరుశెనగ చక్కీ, ఉడకబెట్టిన గుడ్డు, రెండు మూడు చికెన్‌ ముక్కలు ఏదో ఒకటి తీసుకోవడం మంచిదంటున్నారు నిపుణులు. ఇవేమీ దొరక్కుంటే, కనీసం మంచినీళ్లయినా తీసుకోవాలట.
  • =================================
Visit my Website - Dr.Seshagirirao...

Sunday 13 November 2011

బత్తాయి,sweat orange





పండ్లు , కాయగూరలు ,గింజలు, పప్పులు , కందమూలాలు ,సుగంధద్రవ్యాలు మానవుడికి ప్రక్రుతి ప్రసాదించిన అపురూపమైన వరము .ఆయా సీజన్లలో పండే పండ్లను ఆరగించడం మనకు తరతరాలు గా తెలుసును . అన్నం తో కూడా ప్రకృతిసిద్ధమైన పండ్లు , కూరగాయలు ఇతర త్రునధన్యాలను ఆహారం గా ఆహారముగా తీసుకుని జీవించినట్లయితే శరీరానికి కావససిన అన్నిరకాల పోషకాలు లభిస్తాయి ... ఇదే అసలు ఉత్తమమైన జీవన విధానమని పకృతి వైద్యుల నమ్మకం.....ఆహారం జీవం ఉన్న ప్రతి జీవికి అత్యవసరమైనది. పిండిపదార్ధాలు, మాంసకృత్తులు, కొవ్వుపదార్ధాలు, ఖనిజలవణాలు, పీచుపదార్ధాలు, రోగనిరోధక శక్తికి కావలసిన విటమిన్లు మరియు శరీర పోషణకు రక్షణకు కావలసిన పదార్ధాలను కలిగిన పదార్దాలను ఆహారంగా పేర్కొనవచ్చు. ఇవి కాక శరీరానికి నూతన ఉత్సాహాన్నిచ్చే కాఫీ, టీ లాంటి వాటిని కూడా ఆహారపదార్ధాల కోవలోకి వస్తాయి. ఆహారం ఘన, ద్రవ రూపాలలో లభ్యం అవుతుంది.


బత్తాయి ఒక తియ్యని రూటేసి కుటుంబం కు సంబంధించిన పండ్ల చెట్టు. చూడ్డానికి పెద్దసైజు నిమ్మపండులా ఉండే బత్తాయిపండు రుచిలో మాత్రం పుల్లగా కాకుండా తీయగా ఉంటుంది. అందుకే దీన్ని స్వీట్‌ లైమ్‌ అని పిలుస్తారు. పండిన బత్తాయి గుజ్జు లేత పసుపురంగులో ఉంటుంది. చాలామంది ఒలుచుకుని తిన్నప్పటికీ జ్యూస్‌ రూపంలోనే దీనికి వాడుక ఎక్కువ. అందుకే పండ్లరసం అనగానే అందరికీ ఈ పండ్లే గుర్తుకొస్తాయి.

ఆగ్నేయాసియా, దక్షిణ ఆసియా, మధ్యధరా ప్రాంతాల్లో ఎక్కువగా పెరిగే ఈ పండ్ల చెట్లని ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా పెంచుతున్నారు. పుట్టింది ఆసియాదేశాల్లోనే అయినా క్రమంగా ఇటలీ, మధ్యధరా ప్రాంతంలో ఎక్కువగా పండించడంతో ఇటాలియన్‌ లైమ్‌, మెడిటెర్రేనియన్‌ లైమ్‌ అని కూడా పిలుస్తుంటారు. ఇరానీయులైతే తీపి నిమ్మ అంటారు.

రుచిలో ఒకేరకంగా ఉన్నప్పటికీ మధ్యధరా, వెురాకోల్లో పెరిగే బత్తాయిలు రూపంలో మాత్రం కాస్త భిన్నంగా ఉంటాయి. వెురాకో రకం తొక్క పలుచగా ఉండి పసుపుతో కూడిన నారింజవర్ణంలో మంచి వాసన కలిగి ఉంటే మధ్యధరా ప్రాంతంలో పెరిగేవి మాత్రం పులుపన్నదే లేకుండా తియ్యగా ఉంటాయి. ఇటీవల పుల్లని నారింజనీ తియ్యని బత్తాయినీ సంకరీకరించి సిట్రస్‌ బెర్గామియా అనే కొత్త రకాన్ని రూపొందించారు. ఇది తీపి-పులుపు రుచితో చూడ్డానికి నారింజపండులా ఉంటుంది.



పోషక విలువలతోపాటు ఔషధపరంగా కూడా బత్తాయిలో అనేక లాభాలున్నాయి. జలుబు, జ్వరం వంటివి వచ్చినప్పుడు త్వరగా కోలుకోవడానికి ఈ పండ్లరసాన్నే అందిస్తారు.

* విటమిన్‌-సి లోపంతో వచ్చే స్కర్వీ వ్యాధిని అరికట్టడంలో ఈ పండుని మించింది లేదు. రుచికి తియ్యగానే ఉన్నా ఇందులో విటమిన్‌-సి ఎక్కువపాళ్లలో దొరుకుతుంది.

* ఈ పండుకున్న తీపివాసన లాలాజలగ్రంథుల్ని ప్రేరేపించి లాలాజలం అధికంగా వూరేందుకు కారణమవుతుంది. ఇందులోని ఫ్లేవనాయిడ్‌లు పిత్తరసంతోపాటు ఇతర జీర్ణరసాలూ ఆమ్లాలూ విడుదలయ్యేందుకు దోహదపడతాయి. అందువల్ల తీసుకున్న ఆహారం త్వరగా జీర్ణమవుతుంది. అంతేకాదు, ఈ రసం త్వరగా జీర్ణమై రక్తంలో వెంటనే కలిసిపోతుంది. అందుకే బెడ్‌మీద ఉన్న రోగులు కోలుకునేందుకు బత్తాయిరసాన్నే ఇస్తుంటారు. ఉదయాన్నే యోగా, జాగింగ్‌, వాకింగ్‌ చేసి వచ్చాక ఓ గ్లాసు తాజా బత్తాయిరసం తాగితే చాలు... అలసిన శరీరం వెంటనే శక్తిమంతం అవుతుంది. బ్రేక్‌ఫాస్ట్‌లో భాగంగా ఓ గ్లాసు బత్తాయిరసం తీసుకోవడం ఎంతో మంచిదని పోషకనిపుణులు సూచించేదీ ఇందుకే.

* ఇది మలబద్ధకాన్ని నివారిస్తుంది. ఇందులోని ఆమ్లాలు పేగుల్లోని విషపూరిత పదార్థాల్ని పారదోలతాయి. అందువల్ల అజీర్తితో బాధపడేవాళ్లకి కూడా బత్తాయిరసం ఎంతో మంచిది. ఇందులో ఎక్కువగా ఉండే పొటాషియం డయేరియా, డీసెంట్రీ... వంటి వ్యాధుల్ని వెంటనే తగ్గేలా చేయడంతోబాటు బాధితులు త్వరగా కోలుకునేలా చేస్తుంది. ముఖ్యంగా కామెర్లు వచ్చినవాళ్లకు ఈ జ్యూస్‌ ఎంతో మంచిది. బత్తాయిపండు రుచి వాంతుల్ని అరికట్టి తలతిరగడాన్ని తగ్గిస్తుంది.

* ఈ జ్యూస్‌ తాగడంవల్ల చిగుళ్లనొప్పులు, గొంతుసంబంధ ఇన్ఫెక్షన్లూ త్వరగా తగ్గుముఖం పడతాయి. ప్రతిరోజూ ఈ జ్యూస్‌ తాగడంవల్ల గుండె పనితీరు మెరుగుపడుతుంది. దాంతో రక్తప్రసారం చక్కగా ఉండి రోగనిరోధకశక్తి పెరుగుతుంది. కంటిచూపు కూడా బాగుంటుంది. ఇందులోని లివోనాయిడ్‌లు వూపిరితిత్తుల్ని శుభ్రంచేయడంలోనూ రక్షించడంలోనూ కీలకపాత్ర వహిస్తాయి.

* చర్మానికీ మంచిదే. క్రమం తప్పక తీసుకోవడంవల్ల మచ్చల్ని మాయం చేసి చర్మం మెరుపుని సంతరించుకునేలా చేస్తుంది.

ఆటలాడి వచ్చిన పిల్లలకు కూడా రాగానే తాజా బత్తాయిరసాన్ని ఇస్తే దాహం తీరి స్థిమితపడతారు. దాహాన్ని తీర్చడంలో తాజా బత్తాయిరసాన్ని మించింది లేదు. చూశారుగా, ఇంకా ఆలస్యమెందుకు... అసలే ఇది బత్తాయిలు ఎక్కువగా వచ్చే సీజన్‌. రసం తీసేయండి మరి!



  • ================================
Visit my Website - Dr.Seshagirirao...

Friday 11 November 2011

దవనం,మాచీ పత్రం,Artemisia indica


  • image : courtesy with Andhraprabha sunday paper

పండ్లు , కాయగూరలు ,గింజలు, పప్పులు , కందమూలాలు ,సుగంధద్రవ్యాలు మానవుడికి ప్రక్రుతి ప్రసాదించిన అపురూపమైన వరము .ఆయా సీజన్లలో పండే పండ్లను ఆరగించడం మనకు తరతరాలు గా తెలుసును . అన్నం తో కూడా ప్రకృతిసిద్ధమైన పండ్లు , కూరగాయలు ఇతర త్రునధన్యాలను ఆహారం గా ఆహారముగా తీసుకుని జీవించినట్లయితే శరీరానికి కావససిన అన్నిరకాల పోషకాలు లభిస్తాయి ... ఇదే అసలు ఉత్తమమైన జీవన విధానమని పకృతి వైద్యుల నమ్మకం.....ఆహారం జీవం ఉన్న ప్రతి జీవికి అత్యవసరమైనది. పిండిపదార్ధాలు, మాంసకృత్తులు, కొవ్వుపదార్ధాలు, ఖనిజలవణాలు, పీచుపదార్ధాలు, రోగనిరోధక శక్తికి కావలసిన విటమిన్లు మరియు శరీర పోషణకు రక్షణకు కావలసిన పదార్ధాలను కలిగిన పదార్దాలను ఆహారంగా పేర్కొనవచ్చు. ఇవి కాక శరీరానికి నూతన ఉత్సాహాన్నిచ్చే కాఫీ, టీ లాంటి వాటిని కూడా ఆహారపదార్ధాల కోవలోకి వస్తాయి. ఆహారం ఘన, ద్రవ రూపాలలో లభ్యం అవుతుంది.


  • ప్రకృతి మనకిచ్చిన అనేక దివ్య ఔషధాలలో ఆకు కూరలు, పళ్లు, గింజలు ఇలా అనేకం ఉన్నాయి. వీటి సరసన సుగంధ పరిమళాలు కలిగిన వృక్ష సంతతి తన ప్రత్యేకతల్ని నిలుపుకుంటూనే వస్తు న్నాయి. వీటిలో నిత్య జీవితంలో ఎక్కువగా కనిపించే 'దవనం' ...వృక్ష శాస్త్ర ప్రకారం - ఆర్టిమిసికా ఇండికా వృక్ష జాతికి చెందిని. ఆస్టరేసియా కుటుంబానికి చెందిన సంతతి మొక్కలు మన నిత్య జీవనంలో మాచీ పత్రంగా పిలుస్తున్నాం. తెలుగులో దవనంగా పిలిచే ఈ మొక్కలు హిందూ సాంప్రదాయ పండగలలో ప్రత్యేక ప్రాధాన్యత కలిగి ఉన్నాయనే చెప్పాలి. ఇక పూల అలంక రణలో గుభాళింపుల కోసం దవనం వాడుతుంటారు.

దీని ఆకులు, లేత గింజలు పచ్చివిగానీ, వంటకాల్లో గానీ విరివిగా ఉపయోగిస్తారు. అంతేకాక వీటిని ఉడికించి సలాడ్‌ల్లోను, సూప్‌లోను వేసుకుని కూడా తీసు కుంటారు. వీటి లేత ఆకులు ఉడికించి మెత్తగా ఉడుకుతున్న అన్నంలో కలిపితే మంచి రుచిగాను, సువాసనతోను అన్నం బాగుంటుంది. ఇతర దేశాల్లో ముఖ్యంగా చైనాలో ఈ రకమైన వినియోగానికి ప్రతి షాపులోను అందుబాటులో ఉంటుంది. జీర్ణశక్తిని పెంపొందించడంలో దీనికి ఇదే సాటి.

  • చైనా, జపాన్‌, కొరియా, వియత్నాం, టిబెట్‌, మంగోలియా దేశాల్లో సాంప్ర దాయ వైద్యవిధానాల్లో వీటిని వినియోగిస్తు అనేక పరిశోధనలు చేస్తున్నారు. దీనిని సాంబ్రాణి మాదిరిగా పొగ వేయటం వల్ల, దీని ఆకులతో తయారు చేసిన కషాయం వల్ల రొమ్ము కాన్సర్‌ నిర్ధిష్ట పరిమాణంలో ఉన్నప్పటికీ ఇంక పెరగకుండా ఉంటుం దని, ఈ మొక్కకి అంతటి సామర్ధ్యం ఉందని పరిశోధకులు అంచనా వేస్తూ మరిన్ని పరిశోధనలు చేస్తున్నారు.

  • అలాగే ఒత్తిడికి సంబంధించి నరాలకి తగిన పోషణనిచ్చి ఉపశమనం ఇచ్చింది.
  • పూర్తిగా దక్షణ భారత దేశంలోనే విస్తారంగా పండే ఈ మొక్కలకు ఆయు ర్వద వైద్యంలోనూ సౌందర్య సాధనాల తయారీలోనూ ప్రత్యేక స్ధానం ఉంది.
  • వివిధ రకాల సెంటెడ్‌ స్ప్రేల తయారీ లోనూ, పొగాకు ఉత్పత్తులకు గుభాళింపులు అద్దే క్రమంలోనూ దవళంని వినియోగిస్తుంటారు. ఇక దవళంతో తయారు చేసిన తైలం ఆయుర్వేద వైద్యంలో ఓ ప్రత్యేక సువాసన లతో గుర్తింపు తెచ్చుకుందనే చెప్పాలి.
  • దవళం నూనెని శరీపై వచ్చే చిన్న చిన్న దద్దుర్లు, పుళ్లపై రాస్తే త్వరగా తగ్గి పోతాయి.
  • కొందరి స్త్రీలలో కాన్పుల తరువాత పొట్టపై వచ్చే గీతలను తొలగించేందుకు దవళం నూనెను వాడితే ఫలితం ఉంటుంది. స్త్రీలలో ఋతుక్రమం సరిగా రాక పోయినా.. తిన్న పదార్ధం సరిగా జీర్ణం కాక పోయినా దవనం నూనె పొట్టపై మర్ధన చేసే మెరుగైన ఫలితాలు పొందుతారు.
  • కండరాల నొప్పితో బాధ పడేవారు ఈ నూనెతో మర్ధన చేయించుకుంటే మంచిది.
  • మానసిక ఆందోళనలకు, వత్తిళ్లకు లోనవు తున్న వారు ఈ తైలంతో మర్ధన చేసుకుంటే ప్రశాంతత నెలకొని ఆందోళన తగ్గు తుంది.
  • వేడి నీళ్లలో కొద్దిగా దవనం నూనె వేసి ఆవిరి పడితే ఊపరి తిత్తులకున్న సమస్యలు తగ్గుముఖం పడతాయి.
  • ఇందులో సుగర్‌ వ్యాధుల్ని తగ్గించే అనేక ఔషధ గుణాలుండటంతో దవనంని సుగర్‌ నివారణ మందులలో వాడుతున్నారు.
  • ఎప్పటికపðడు శరీరానికి నూతన ఉత్సా హాన్ని అందించే ఈ దవనం చెవినొప్పి, జీర్ణ కోశ వ్యాధులను నివా రించడమే కాకుండా ధాతువర్ధకంగా, శక్తివర్ధకంగా ఉపయోగపడుతూ మానవాళికి సాయం అందిస్తోంది.

  • ==========================
Visit my Website - Dr.Seshagirirao...MBBS